బాలికపై సామూహిక అత్యాచారం | Blade batch anarchy on girl in East Godavari district | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Published Sun, Jul 19 2020 5:00 AM | Last Updated on Sun, Jul 19 2020 6:39 AM

Blade batch anarchy on girl in East Godavari district - Sakshi

రాజమహేంద్రవరం క్రైం: ఆవారాగా తిరుగుతూ దోపిడీలు చేసే బ్లేడ్‌ బ్యాచ్‌ ఓ బాలికను బంధించి, చిత్ర హింసలకు గురిచేస్తూ నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన తూర్పుగోదావరిలో జరిగింది. శనివారం రాజమహేంద్రవరం నార్త్‌జోన్‌ డీఎస్పీ టీఎస్‌ఎన్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం.. 

► కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు. 
► టెన్త్‌ పాసయిన రెండో కుమార్తెకు రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని స్థానికంగా ఉండే అనిత ఈ నెల 12న తీసుకెళ్లింది. సాయంత్రం అనిత మాత్రమే తిరిగిరావడంతో తన కుమార్తె గురించి తల్లి ఆరా తీసింది. 
► తనకు తెలియదని అనిత చెప్పడంతో ఆ తల్లి కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 16వ తేదీ రాత్రి బాలిక ఆచూకీ గుర్తించారు. 
► అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. 
► కోలుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన ఘటనను వివరించింది. 
► మత్తు మందుకు అలవాటు పడ్డ అనితకు క్వారీ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన బ్లేడ్‌ బ్యాచ్‌తో పరిచయాలు ఉన్నాయి.
► బాలికను ఆ బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులకు అప్పగించింది. 
► రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌ వద్ద ఓ రూమ్‌కు బాలికను తీసుకుని వెళ్లిన ఆ బ్యాచ్‌ యువకులు బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా చిత్రహింసలకు గురి చేసినట్లు బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
► అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎంతమంది ఉన్నా అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. 

(ప్రేమకు లాక్‌డౌన్‌ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement