బస్సులో అగ్నిప్రమాదం..20 మంది మృతి | Bus fire kills 20 migrants in Thailand | Sakshi
Sakshi News home page

బస్సులో అగ్నిప్రమాదం..20 మంది మృతి

Mar 30 2018 7:54 AM | Updated on Apr 3 2019 8:03 PM

Bus fire kills 20 migrants in Thailand  - Sakshi

అగ్నిప్రమాదానికి గురైన బస్సు

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ సరిహద్దు నుంచి రాజధాని బ్యాంకాక్‌ వైపు వెళ్తున్న ఓ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతి కాగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొంత మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున 1.25 గంటలకు వాయివ్య టాక్‌ ప్రావిన్స్‌లో జరిగింది.

చీకటిగా ఉండటం వల్లే గందరగోళంలో ప్రయాణికులకు బస్సులో నుంచి బయటపడటం కష్టంగా మారిందని, దానివల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. మృతులంతా మయన్మార్‌ వలస కార్మికులే. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి బస్సును నడిపినట్లు డ్రైవర్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement