mayanmar
-
అండమాన్లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
శరదృతువులో అక్కడ పడవలతో పండుగ సందడి..ఏకంగా..!
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది. మయాన్మార్ చాంద్రమాన కేలండర్లోని ఏడో నెల అయిన థాడింగ్యుట్ నెలలో శుక్లపక్షం మొదటి రోజు నుంచి బహుళపక్షం మూడో రోజు వరకు జరిగే ఈ పండుగలో లక్షలాది మంది జనాలు పాల్గొంటారు. ఈసారి ఈ పండుగ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై, 20 వరకు జరుగుతోంది. మయాన్మార్లోని మైనారిటీ తెగలకు చెందిన ‘ఇంథా’, ‘పావో’ తెగలవారు ఈ పండుగలో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. పండుగ జరిగే పద్దెనిమిది రోజుల్లోనూ ఇన్లే సరస్సులో పడవల మీద ఊరేగింపుగా వెళ్లి ‘ఫాంగ్ డా వూ’ పగోడాకు చేరుకుంటారు. పగోడాలో బంగారుపూతతో కొలువుదీరిన ఐదు బుద్ధప్రతిమలను భక్తిగా తాకి, వాటికి బంగారు రేకులను అతికిస్తారు. విగ్రహాలు మరీ బరువుగా మారడం వల్ల పగోడా నిర్వాహకులు విగ్రహాలకు భక్తులు బంగారు రేకులను అతికే ప్రక్రియపై 2019 నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ఈ విగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ఇన్లే సరస్సు తీరంలోని గ్రామాల్లో ఈ పద్దెనిమిది రోజులూ పండుగ కోలాహలం అట్టహాసంగా కనిపిస్తుంది. పడవల ఊరేగింపు జరిగినన్ని రోజులూ హంస ఆకారంలో ఉన్న రాచపడవను అనుసరించి వందలాది పడవలు ‘ఫాంగ్ డా వూ’ పగోడా తీరం వరకు ప్రయాణిస్తాయి.(చదవండి: అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!) -
‘100 శాతం నిజం.. ఆ దేశం నుంచి మణిపూర్లోకి కుకీ మిలిటెంట్లు’
ఇంఫాల్: మణిపూర్లో జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో మణిపూర్ భద్రతా సలహాదారు కూల్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి మణిపూర్కు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు 900 కుకీ మిలిటెంట్లు ప్రవేశించారని తెలిపారు. ఆ మిలిటెంట్లు ఆయుధాలతో కూడిన డ్రోన్ల వినియోగించటంలో శిక్షణ పొందినవారనే సమాచారం ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా అందినట్లు నిర్ధారించారు. ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించిన విషయాలు 100 శాతం నిజం. ఆ నివేదిక తప్పు అని నిరూపించేవరకు మేము నమ్ముతాం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ 100 శాతం నిజంగానే ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఆ నివేదిక నిజం కాకపోయినా. అన్ని రకాలుగా మా ప్రయత్నాలు ఆపకుండా ఉంటాం. ఇంటెలిజెన్స్ నివేదికను మేము ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోము’’ అని అన్నారు.దక్షిణ మణిపూర్లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు జిల్లాల్లోని అన్ని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ఇంటెలిజెన్స్ రిపోర్టు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం పంపిన ఈ నివేదికలో.. డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు అమర్చటం, గెలిల్లా యుద్ధంలో కొత్తగా శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుండి మణిపూర్లోకి ప్రవేశించారు’’ అని స్పష్టం చేసినట్లు మణిపూర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. కుకి మిలిటెంట్లు 30 మంది సభ్యులతో కూడిన యూనిట్లతో గ్రూప్లుగా ఉంటారని, మణిపూర్లో పలు ప్రాంతాల్లో విస్తరించిన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ కుకీ మిలిటెంట్లు సెప్టెంబర్ చివరి వారంలో మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికలు ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.చదవండి: సినిమా రేంజ్లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ -
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్
హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేశారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి మయన్మార్ నిందితులు అక్రమంగా భారత్లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది. -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
10 వేల మందికి క్షమాభిక్ష!
బ్యాంకాక్: మయన్మార్లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 వేల మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలున్నదీ లేనిదీ వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తామంటూ దేశ మిలటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హెలయింగ్ తెలిపినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే, పదవీచ్యుత నేత అంగ్ సాన్ సుకీ(78) పేరు ఈ జాబితాలో ఉన్న సూచనల్లేవని పరిశీలకులు అంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. ఖైదీల విడుదల గురువారం మొదలై కొన్ని రోజులపాటు సాగుతుందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25 వేల మందికి పైగా నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఇవి చదవండి: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు -
మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!
ఇంఫాల్: మణిపూర్-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్. బైరెన్ సింగ్ సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అత్యంత అవసరం.. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం గురించి కేంద్రాన్ని కోరగా 60 కి.మీ. వరకు కంచెను వేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సీఎం బైరెన్ సింగ్. ఆదివారం సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర హోంశాఖతోనూ జరిగిన చర్చల్లో ఈ కంచెను నిర్మించే విషయమై ఒక నిర్ణయానికి వచ్చామని అక్రమ చొరబాట్ల తోపాటు మాదకద్రవ్యాల రవాణా కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో 70 కి.మీ. మేర కంచె నిర్మాణం ఇప్పుడు అత్యంత ఆవసరమని తెలిపారు. స్వేచ్చాయుత రాకపోకలు.. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని అత్యధికులు అభిప్రాయపడుతున్న కారణంగా ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం. స్వేచ్చాయుత రాకపోకల నిబంధన ప్రకారం ఇటు వారు అటువైపు గానీ అటు వారు ఇటువైపు గానీ 16 కిలోమీటర్లు వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. తప్పనిసరి.. మయన్మార్ దేశం భారతదేశం సరిహద్దులో 1600 కి.మీ. సరిహద్దును పంచుకుంటుండగా అందులో మణిపూర్లోని ఐదు జిల్లాలు మయన్మార్తో మొత్తంగా 390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చు తోపాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేనికారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమైతే ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే మొదటి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం ఆవసరమని నిర్ణయించారు. Held a meeting with the officials of BRO and deliberated the plan to begin construction of an additional 70 km of border fencing along the Indo-Myanmar border. I was joined by Chief Secretary, DGP & officials from the Home Department. In view of the rise in illegal immigration… pic.twitter.com/cZWO00k3as — N.Biren Singh (@NBirenSingh) September 24, 2023 ఇది కూడా చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! -
మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం. మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం. కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా.. -
తల నరికేసే ఊరిలో.. రెండు దేశాల బార్డర్!
దేశాల మధ్య సరిహద్దులు అంటే.. కంచెలు, హద్దు రాళ్లు గుర్తుకువస్తుంటాయి. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు దగ్గరగా సరిహద్దులు ఉంటుంటాయి. గ్రామాల మధ్యలోంచి కూడా దేశాల సరిహద్దులు వెళ్లే ప్రాంతాలూ కొన్ని ఉన్నాయి. అలా భారత్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న గ్రామమే.. లోంగ్వా. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. రెండు దేశాల బార్డర్! భారత్, మయన్మార్ దేశాల మధ్య నాగాలాండ్ రాష్ట్రంలో లోంగ్వా గ్రామం ఉంది. కొన్యాక్ గిరిజనులు నివసించే ఈ గ్రామం ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఈ గ్రామ పెద్ద ఇంటి మీదుగానే అంతర్జాతీయ సరిహద్దు వెళ్తుంది. ‘మేం భారత్లో తింటాం. మయన్మార్లో నిద్రపోతాం’ అని గ్రామ పెద్ద సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ గ్రామ పెద్దను ‘ఆంఘ్’ లేదా ‘చీఫ్టేన్’ అని పిలుచుకుంటారు. కొన్యాక్ తెగకు చెందినవారు 5 వేల మందికిపైగా ఉంటారని అంచనా. వారందరికీ ‘ఆంఘ్’ రాజు. ఆయనకు 60 మంది భార్యలు అని.. చుట్టూ ఇటు భారత్, అటు మయన్మార్లో ఉన్న 60 గ్రామాలను పాలిస్తుంటారని చెబుతారు. ఈ పరపతి కారణంగానే.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే ముందే లోంగ్వా గ్రామానికి 4జీ మొబైల్ నెట్వర్క్ వచి్చందని అంటుంటారు. తల నరికేసే యోధులు! రెండు దేశాల్లోనూ పౌరసత్వం కొన్యాక్ తెగలో ఓ ఆచారం ఉంది. ఈ తెగ యువకులు ప్రత్యర్థి తెగలవారితో తలపడి తల తెగనరికి తీసుకువస్తే యుద్ధవీరుడిగా గుర్తింపు ఇస్తారు. తలపై ఇత్తడి కిరీటాన్ని, మెడలో ఇత్తడి బిళ్లలతో కూడి దండను ధరిస్తారు. ఎంత మంది తలలు నరికితే అన్ని ఇత్తడి బిళ్లలు వేసుకుంటారు. ప్రభుత్వం 1960లో ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది. అయినా ఇప్పటికీ తమ మెడలో ‘హెడ్ హంటర్స్’కు గుర్తుగా దండలను ధరిస్తారు. ఇక వారి తెగ సాంప్రదాయాన్ని, తమ హోదాను బట్టి ముఖంపై వివిధ ఆకారాల్లో పచ్చబొట్లు వేసుకుంటారు. తర్వాతి కాలంలో ఈ తెగకు చెందినవారు చాలా మంది క్రిస్టియనిటీ స్వీకరించారు. అయినా తమ ఆచారాలను కొనసాగిస్తుంటారు. భారత్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న లోంగ్వా గ్రామస్తులకు అధికారికంగానే ఇరు దేశాల పౌరసత్వం ఉంది. మన దేశంలో ఇలాంటి పౌరసత్వం ఉన్న ఏకైక గిరిజన తెగ వీరిదేనని చెబుతారు. గ్రామస్తులు చాలా మంది రెండు దేశాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు. కొందరు మయన్మార్ ఆరీ్మలోనూ పనిచేస్తున్నారు. లోంగ్వా గ్రామం, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవు. భారత్ వైపు రెండు, మయన్మార్ వైపు మరో రెండు చిన్న నదులు, షిలోయ్ అనే ఓ సరస్సు ఉన్నాయి. దీనికితోడు కొన్యాక్ తెగవారి ప్రత్యేకతలు, ఆచారాలను చూడటానికి ఇటీవలికాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు లోంగ్వాకు వెళుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ (చదవండి: జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పు పై ఉత్కంఠ) -
Aung San Suu Kyi: మయన్మార్లో సంచలనం.. సూకీకి జైలు శిక్ష
Aung San Suu Kyi: భారత్ పొరుగు దేశం మయన్మార్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం మయన్మార్లో సైనిక ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, సైనిక ప్రభుత్వం.. సూకిపై 11 అవినీతి కేసులను మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం.. జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లను నగదు, 11.4 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు కావడం విశేషం. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే.. ఆమె మరింత శిక్షపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్గా ఉన్న ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మయన్మార్లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేసింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. A court in military-ruled #Myanmar sentenced deposed leader Aung San Suu Kyi to five years in jail after finding her guilty in the first of 11 corruption cases against her, according to a source with knowledge of proceedings. pic.twitter.com/IhkfM6Jmrt — Alpha7News (@Alpha7News) April 27, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్కు చైనా గట్టి వార్నింగ్ -
విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
Myanmar jad Mine Landslide: ఉత్తర మయన్మార్లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అత్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని. నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్లో జాడే మైనింగ్ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. (చదవండి: అతి పెద్ద విడాకుల సెటిల్మెంట్..రూ. 5, 500 కోట్ల భరణం!) -
అమెరికా జర్నలిస్ట్కి 11 ఏళ్లు జైలు శిక్ష
మయన్మార్: మయన్మార్ జుంటా కోర్టు అమెరికన్ జర్నలిస్ట్ డానీ ఫెన్స్టర్కు చట్టవిరుద్ధమైన పనులు, మిలిటరీని రెచ్చగొట్టేల చేయడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో 11 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. గత ఫిబ్రవరి నుంచి మయన్మార్ మిలటరీ బలాగాలు తిరుగాబాటు ధోరణితో డజన్ల కొద్దీ జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రెస్ని అణిచివేస్తుందన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అయితే డానీ ఫెన్స్టర్ స్థానిక మయన్మార్లోని అవుట్లెట్ ఫ్రాంటియర్ పత్రికలో ఒక ఏడాది నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన కుటుంబాన్ని చూడటానికై దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మయన్మార్ మిలటరీ అతన్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఫ్రాంటియర్ పత్రిక తమ సంస్థలో మేనేజింగ్ ఎడిటర్గా పనిచేసిన డానీ ఫెన్స్టర్ను ఇలా మూడు ఆరోపణలతో దోషిగా నిర్ధారించి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫెన్స్టర్ నిర్భందించినప్పటి నుంచి జీవితాంతం జైలు శిక్ష విధించేలా దేశద్రోహం, తీవ్రవాదం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడంటూ పేర్కొంది. అంతేకాదు తాము ఫెన్స్టర్ వీలైనంత త్వరగా విడుదలై తమ కుటుంబాన్ని చూడటానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఫ్రాంటియర్ మయన్మార్ తెలిపింది. ఈ మేరకు క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ హార్సీ మిలటరీ చేస్తున్న ఈ పనిని "దౌర్జన్యం"గా అభివర్ణించారు. ఈ సంఘటన వాస్తవిక పరిస్థితులు గురించి వివరిస్తే ఇలానే చాలా ఏళ్లు జైలు శిక్ష విధించడం జరుగుతుందనేలా అంతర్జాతీయ జర్నలిస్టులకు మాత్రమే కాక మయన్మార్ జర్నలిస్టులకు కూడా పరోక్షంగా సందేశాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు ఫెన్స్టర్ని విడుదల చేసేందుకు అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ పేర్కొన్నారు. ఈ సమస్య కచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతుందంటూ రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాడు..అంతే చివరికి!!) -
ఉగ్రదాడి.. ఏడుగురు రోహింగ్యా వలసదారుల మృతి
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులోని రోహింగ్యా శరణార్థి శిబిరంలోని శిక్షణ సంస్థపై ముష్కరులు జరిపిన దాడుల్లో సుమారు ఏడుగురి చనిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ముష్కరులు కొంతమందిని చంపేసి మరికొంత మంది పై కత్తులతో దాడి చేసినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. మూడు వారాల క్రితం రోహింగ్యా కమ్యూనిటీ నాయకుడిని అతని పై కాల్పుల జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) అయితే ఈ నేపథ్యంలోనే మయన్మార్ నుండి వచ్చిన దాదాపు 9 లక్షల మందికి పైగా ఉన్న శరణార్థుల శిభిరాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి జరిగినపుడు నలుగురు వెంటనే చనిపోగా మిగతా ముగ్గురు బాలుఖాలి క్యాంప్లోని ఆసుపత్రిలో మరణించారని అన్నారు. ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సాయుధ బలగాల బెటాలియన్ ప్రాంతీయ చీఫ్ శిహాబ్ కైసర్ ఖాన్ తెలిపారు. (చదవండి: మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’) -
రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్ పట్టివేత
గౌహతి: కోహిమాలోని ఖుజమాలో నార్కోటిక్ చెక్ పాయింట్ వద్ద చేసిన తనిఖీలలో సుమారు 48 కిలోల బంగారం, రూ. 29 కోట్ల ఖరీదు చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజులగా నార్కోటిక్ చెక్ పాయింట్లలో నిర్వహించిన తనిఖీలో ఇవి వెలుగు చూశాయి అని చెప్పారు. (చదవండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!) ఈ సందర్భంగా నాగాలాండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ ఎం తమ్గాడ్గే మాట్లాడుతూ...."రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా స్మగ్లింగ్ కోహిమాలోని ఖుజమా-ఇంఫాల్ జాతీయ రహదారిలోనే ఎక్కువగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ నిందుతులైన సౌరభ్ సింగ్, పవన్ కుమార్లకు సంబంధించిన వాహనంలోని గేర్లో 29 ప్యాకెట్లో రూ.22 కోట్లు ఖరీదు చేసే 10 బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నాం. దాదాపు ఆరు కోట్లు ఖరీదు చేసే హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం" అని చెప్పారు. మయాన్మార్ నుంచి సరిహద్దు ప్రాంతాలైన ఈశాన్యా ప్రాంతాలకు తరుచుగా మాదక ద్రవ్యాలు, ఆయుధ సామాగ్రీని అక్రమంగా తరలిస్తున్నారని అస్సాం రైఫిల్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు వెల్లడించారు. (చదవండి: మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్) -
Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి
మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్.. జుంటా సైనిక నియంత పాలకులపై సమర శంఖాన్ని పూరించారు! జన్మభూమి విముక్తి కోసం మరణానికైనా తను సిద్ధమేనని ప్రకటించారు. మూడున్నర నెలల క్రితం మయన్మార్ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాక మొదలైన తిరుగుబాటు ప్రదర్శనల్లో ఇప్పటివరకు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాకూదని అంటూ.. సైన్యంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధం కమ్మని యువతకు పిలుపునిస్తున్నారు హటటున్. మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్ 1992లో పుట్టే నాటికే ముప్పై ఏళ్లుగా ఆ దేశం సైనిక పాలనలో ఉంది. పుట్టాక కూడా మరో ఇరవై ఏళ్లు మయన్మార్ సైనిక పాలనలోనే ఉంది. మధ్యలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలన తర్వాత మళ్లీ ఇప్పుడు సైనిక పాలన! ఈ మధ్యలోని పదేళ్లలో హటటున్ బి.టెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. మోడల్ అయ్యారు. సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్లో కనిపించారు. మిస్ మయన్మార్ అయ్యారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచారు. జిమ్నాస్టిక్స్ ఇన్స్ట్రక్టర్గా పని చేస్తున్నారు. ఇప్పుడు ‘మిలిటెంట్’ అయ్యారు! దేశమాత స్వేచ్ఛ కోసం తుపాకీని చేతికి అందుకున్నారు. ఇందుకు ఆమెను ప్రేరేపించిన పరిణామాలు ప్రపంచం అంతటికీ తెలిసినవే. నిత్యం ప్రపంచం కళ్లబడుతున్నవే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలెన్నుకున్న నేత ఆంగ్సాంగ్ సూకీని అరెస్ట్ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజలెవరూ ప్రశ్నించడానికి, నిరసన ప్రదర్శనలు చేయడానికి వీధుల్లోకి రాకుండా యుద్ధట్యాంకుల్ని కవాతు చేయించింది. గగనతలంపై నుంచి బాంబులు జారవిడిచింది. సైన్యం కుట్రకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసింది. గర్జించిన గళాలను అణిచివేసింది. ఇప్పటికి 800 మందికి పైగా ప్రదర్శనకారులు నియంత సైన్యం ‘జుంటా’ కాల్పుల్లో అమరులయ్యారు. బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తూ తదిశ్వాస విడిచారు. ఈ ఘటనలన్నీ హటటున్ను కలచివేశాయి. ఆగ్రహోదగ్రురాలిని చేశాయి. అందాలరాణి కిరీటాన్ని పక్కనపెట్టి తుపాకీని చేతబట్టేలా ఆమెను ప్రేరేపించాయి. తనకు జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేకపోతే తన జన్మే వృథా అనే ఆలోచనను ఆమెలో కలిగించాయి. ఇన్నాళ్లూ హటటున్ను ఒక అందాలరాణిగా మాత్రమే చూసిన మయన్మార్ యువత అత్యవసర సమయంలో ఆమెనొక పీపుల్స్ సోల్జర్గా చూసి సైనిక నియంతలపై తమ తిరుగుబాటుకు ఒక దివ్యాస్త్రం దొరికినట్లుగా భావిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న యుద్ధంలో హటటున్ ఇచ్చిన పిలుపు వారిలో ధైర్యాన్ని, సమరోత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘తిప్పికొట్టేందుకు సమయం ఆసన్నమైంది. మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఏమిటన్నది కాదు. కలం, కీబోర్డు, ప్రజాస్వామ్య ఉద్యమానికి విరాళాలు ఇవ్వడం.. ఏదైనా సరే. అది ఆయుధమే. విప్లవం విజయం సాధించడానికి ఎవరి వంతుగా వారు పోరాడాలి’’ అని హటటున్ సోషల్ మీడియాలో విప్లవ నినాదం చేశారు. ఆ వెంటనే మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆమెపై నిఘాపెట్టింది. ఆమె ఏ ప్రదేశం నుంచి తిరుగుబాటును రాజేస్తున్నదీ ఇప్పటికే సైన్యం కనిపెట్టిందనీ, ఏ క్షణమైనా ఆమెను రహస్య నిర్బంధంలోకి తీసుకోవచ్చనీ ఐక్యరాజ్యసమితికి వర్తమానం అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి! అయితే సైన్యం బూట్లచప్పుడుకు బెదిరేది లేదని హటటున్ అంటున్నారు. ‘‘నా దేశం కోసం నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించడానికైనా నేను సిద్ధమే. ‘విప్లవం అనేది చెట్టుపైనే మగ్గి రాలిపడే ఆపిల్ పండు కాదు. ఆ పండును నువ్వే చెట్టుపై నుంచి రాలిపడేలా చెయ్యాలి’ అని చే గువేరా అన్నారు. ఆయన మాటల్ని మదిలో ఉంచుకుంటే మనం విజయం సాధించినట్లే..’’ అని మే 11న ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇచ్చిన ఒక పోస్టుతో యువతరంలో విప్లవస్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు హటటున్. ∙∙ మయన్మార్లోని ప్రధాన నగరం యాంగూన్లో ఉండేవారు హటటున్. గత ఏప్రిల్లో అక్కడి నుంచి తన ఫ్రెండ్తో కలిసి అజ్ఞాత ప్రదేశానికి తరలి వెళ్లారు. అక్కడ కారెన్ నేషనల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ డిఫెన్స్ ఫోర్స్లతో కలిసి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. నెలా పదిరోజులు ఆమె ఆ శిక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్లను బట్టి తెలుస్తోంది. -
మయన్మార్లో నరమేథం
మయన్మార్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని రెండునెలల క్రితం కుట్రపూరితంగా కూల్చి పాలన చేజి క్కించుకున్న సైనిక నియంతలు ఉన్నకొద్దీ ఉన్మాదులుగా మారుతున్నారు. అర్థరాత్రుళ్లు ఇళ్లపైబడి రాళ్లదాడి చేయటం, కాల్పులు సాగిస్తూ బీభత్సం సృష్టించటం, తలుపులు తెరవకపోతే వాహనాలతో ఢీకొట్టి పగలకొట్టడం నిత్యకృత్యమైంది. ఆ తర్వాత తమకు ‘కావలసిన’ వ్యక్తులు దొరికితే సంకెళ్లువేసి తీసుకుపోతున్నారు. రోజులు, వారాలు గడుస్తున్నా తమవారి ఆచూకీ తెలియక కుటుం బాలు రోదిస్తున్నాయి. చాలా సందర్భాల్లో శవాలను తిరిగి అప్పగిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు సాయుధ దళాల గౌరవార్థం శనివారం జరిగిన దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రజానీకంపై కాల్పులు జరిపి 114మందిని కాల్చిచంపారు. తాజాగా జనావాసాలపై విమానదాడులు కూడా మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటినుంచీ సైన్యం చేతుల్లో 450మంది మరణించగా, దాదాపు 3,000మంది అరెస్టయ్యారు. వందలాదిమంది జాడ తెలియడం లేదని ఆగ్నేయాసియా పార్లమెంటేరియన్ల బృందం చెబుతోంది. వీధుల్లోకి ఎవరూ రాకూడదని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులున్నాయని సైన్యం ప్రతిరోజూ ప్రకటిస్తున్నా నిరసనలు ఆగకపోవటం ఆ దేశ పౌరుల స్వేచ్ఛా పిపాసకు అద్దం పడుతోంది. ఇదే సైన్యానికి కంటగింపుగా వుంది. మయన్మార్ సైన్యానికి జనం నాడి తెలియనిదేమీ కాదు. అర్థ శతాబ్దికిపైగా ఆ దేశాన్ని గుప్పిట బంధించినప్పుడు వారికి నిరంతరం ఛీత్కారాలే ఎదురయ్యాయి. ఇలా ఎల్లకాలమూ మనుగడ సాగించటం సాధ్యంకాదని 2015లో ఎన్నికలకు సిద్ధపడింది. అయితే తమ పెత్తనం యధావిధిగా సాగించేందుకు వీలుగా పార్లమెంటులో 25 శాతం స్థానాలను ఏకపక్షంగా తనకు తాను రిజర్వ్ చేసుకుంది. తన వ్యూహానికి ఇది సరిపోకపోవచ్చన్న ఉద్దేశంతో మాజీ సైనికాధికారులతో యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ) పేరిట ఒక పార్టీని కూడా నెలకొల్పింది. గత నవంబర్ ఎన్నికల్లో ఈ వ్యూహం అక్కరకు రాకుండాపోయి ఆంగ్సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)కే మెజారిటీ లభించటంతో దానికి కాళ్లూ చేతులూ ఆడలేదు. అందుకే మరోసారి సైనిక నియంతృత్వానికి తెగబడింది. మయన్మార్ బహుళ జాతుల నిలయం. ఈ జాతులన్నిటి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక ప్రజాస్వామిక వేదిక అవసరం. ఇది లేని కారణంగానే యాభైయ్యేళ్లపాటు దాదాపు అన్ని జాతులూ తమ ప్రయోజనాల పరిరక్షణకు ఘర్షణనే మార్గంగా ఎంచుకున్నాయి. ఇవి ఉన్నకొద్దీ ముదిరి, పాలన అదుపు తప్పటం సైన్యానికి తలనొప్పిగా పరిణమించింది. ఈ అనుభవాల తర్వాతే మయన్మార్ సైన్యం కనీసం ప్రత్యక్షంగా పాలించే విధానానికైనా దూరంగా వుండాలని 2015లో నిర్ణయించుకుంది. కానీ గత అయిదారేళ్లుగా అది ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విషాదమేమంటే ఉద్యమ నేత ఆంగ్సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ సైతం ఆ స్పృహలో లేకపోవటం. మయన్మార్లో ప్రజాస్వామ్యం మళ్లీ మొగ్గ తొడిగే సమయానికి సాయుధ పోరాటబాట పట్టిన 15 ముఖ్యమైన జాతుల్లో ఏడెనిమిది జాతులు ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రోహింగ్యా ముస్లింలు అందులో లేరు. అనంతరం వచ్చిన ఎన్ఎల్డీ ప్రభుత్వం వారిని కూడా శాంతిప్రక్రియలో భాగం చేసివుంటే, బుద్ధిస్ట్ మిలిటెంట్లను కట్టడి చేస్తే పరిస్థితి వేరుగా వుండేది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా, రోహింగ్యాలపై దమనకాండ అమలు చేసిన సైన్యం తీరును చూసీచూడనట్టు వూరుకుంది. సరిగదా...అంతర్జాతీయ వేదికపై సాక్షాత్తూ సూకీయే సైన్యాన్ని సమర్థించారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయటం ఆమెకు ఏమాత్రం అన్యాయం అనిపించలేదు. దాని పర్యవసానాలేమిటో ఇప్పుడామెకు అర్ధమైవుండాలి. ప్రజాస్వామ్యమంటే సైన్యం నుంచి తన పార్టీకి అధికారమార్పిడి జరగటం కాదు. ప్రజాస్వామ్య సంస్కృతి సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ నెలకొనటం. గత అయిదేళ్లలో అలాంటి సంస్కృతి వేళ్లూనుకుంటే సైన్యం మళ్లీ అధికారం హస్తగతం చేసుకోవటం ఇంత సులభమయ్యేది కాదు. మయన్మార్ సైన్యం ఆగడాలపై ఆలస్యంగానైనా ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. 12 దేశాల సైనిక చీఫ్లు నిరాయుధ పౌరులపై కాల్పులు జరపటాన్ని, బాంబుదాడులు చేయటాన్ని ఖండించారు. అయితే ఒకపక్క సైన్యం ప్రజలను పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తుంటే సైనిక దినోత్సవంలో మన దౌత్యకార్యాలయ ప్రతినిధితోపాటు రష్యా, చైనా, పాకిస్తాన్ తదితర ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుంది. మయన్మార్తో మనకు 1,600 కిలోమీటర్ల సరిహద్దు వుంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ ఆ పొడవునే వున్నాయి. మయన్మార్లో సైన్యం దారుణాలు పెచ్చరిల్లాక ఒక్క మిజోరంకే దాదాపు 1,500మంది ఆ దేశ పౌరులు కుటుంబాలతోసహా ప్రాణభయంతో వచ్చారు. వీరిలో మయన్మార్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వున్నారు. ఉన్నకొద్దీ ఇది పెరుగుతుందే తప్ప తగ్గదు. కనుక మయన్మార్ అల్లకల్లోలంగా ఉన్నంతకాలమూ అది మన దేశంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. అందుకే సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తగిన చర్యలు తీసుకోమని మయన్మార్ సైన్యానికి చెప్పాల్సిన బాధ్యత మనపై వుంది. -
మయన్మార్ మిలటరీ ఫేస్బుక్ పేజీ తొలగింపు
యాంగాన్: మయన్మార్లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించడం పట్ల ఫేస్బుక్ యాజ మాన్యం విచారం వ్యక్తం చేసింది. మయన్మార్ మిలటరీ ప్రధాన పేజీని ఫేస్బుక్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. తాము పాటిస్తున్న ప్రమాణాల ప్రకారం హింసను రెచ్చగొట్టే అంశాలను కచ్చితంగా తొలగిస్తామని వెల్ల్లడించింది. మయన్మార్ సైన్యం తాత్మదా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీమ్ పేరిట ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తోంది. ఆ పేజీ ఇప్పుడు కనిపిం చడం లేదు. కాగా, పోలీసు దమనకాండను ఖండిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఫిబ్రవరి 9న పోలీసుల కాల్పుల్లో గాయపడిన 19 ఏళ్ల మయా థ్వెట్ ఖీనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆదివారం యాంగాన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొన్నారు. -
సూకీపై కొత్తగా అక్రమ వాకీటాకీల కేసు
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీపై పోలీసులు కొత్త ఆరోపణలు ప్రారంభించారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయని, ఈ కేసులో ఆమెను ఫిబ్రవరి 15దాకా నిర్బంధంలో ఉంచుతామన్నారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ కాని వాకీటాకీలను సూకీ భద్రతా సిబ్బంది వాడారని పేర్కొన్నారు. మయన్మార్లో సోమవారం కొత్త ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వాకీటాకీల దిగుమతి కేసులో సూకీకి గరిష్టంగా రెండేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బిగిసిన ఒక చిట్టి పిడికిలి
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాని ఆ అమ్మాయి కళ్లల్లో గూడు కట్టి ఉన్న కన్నీరు ఆ అమ్మాయి కథంతా చెబుతోంది. ఈ ఫొటో 2017 నవంబర్లో ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ తీసినది. బంగ్లాదేశ్లోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరాలలో తల దాచుకున్న రోహింగ్యా ముస్లింలను ఆ సంస్థ ఇంటర్వ్యూ చేసినప్పుడు మొత్తం 27 మంది స్త్రీలు తమ కళ్లు మాత్రమే కనపడేలా మాట్లాడారు. వారంతా తమపై సైన్యం అత్యాచారం చేసిందని చెప్పారు. ఈ ఫొటోలోని అమ్మాయి బంగ్లాదేశ్ చేరుకునేలోపు జూన్లో ఒకసారి, తిరిగి సెప్టెంబర్లో ఒకసారి అత్యాచారానికి గురైంది. 2017 ఆగస్టులో మయన్మార్లోని మైనార్టీ వర్గమైన రోహింగ్యా ముస్లింలపై సైన్యం తెగబడింది. ఊళ్లను తగులబెట్టింది. ఖాళీ చేయించింది. దేశం బయటకు తరిమికొట్టింది. వందలాది మరణాలు, లెక్కకు మించిన అత్యాచారాలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని సొంత నేలను వదిలి బంగ్లాదేశ్కు చేరుకున్నారు. ఈ మానవ హననం పట్ల ప్రపంచంలోని చాలా కొద్ది దేశాలు మాత్రమే నిరసన వ్యక్తం చేశాయి. అన్నింటి కంటే గట్టిగా కెనెడా దేశం తన పార్లమెంట్లో ‘మయన్మార్లో జరిగినది జాతి హననం’ అని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మయన్మార్ సైన్యం మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని ఆ దేశ మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే కెనెడా కేవలం ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ఫిర్యాదు మాత్రమే చేయగలిగింది. కాని ఇప్పుడు మయన్మార్ను పశ్చిమాసియాలోని అతి చిన్న దేశమైన గాంబియా బోనులో నిలబెట్టింది. మయన్మార్లో ముస్లిం మైనారిటీల పట్ల సైన్యం చేసిన అత్యాచారాలను విచారించాల్సిందిగా నిన్న (నవంబర్ 11, 2019)న ఫిర్యాదు చేసింది. ఆ దేశం తరపున కొందరు న్యాయవాదుల బృందం నెదర్లాండ్స్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ‘మా దేశం చాలా చిన్నదే కావచ్చు. కాని న్యాయం పట్ల మేమెత్తిన గొంతు పెద్దది’ అని గాంబియా దేశ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిస్పందనలు చూసినప్పుడు బాధితులకు అండగా నిలిచేవారు ఎప్పుడూ ఉంటారని అనిపిస్తుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. -
2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ
కుటుపలోంగ్: మయన్మార్ బలగాల దాడుల నుంచి తప్పించుకుని పారిపోయి రెండేళ్లయిన సందర్భంగా బంగ్లాదేశ్లోని కుటుపలోంగ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడే ర్యాలీ చేపట్టారు. 2017 ఆగస్టులో మయన్మార్లోని రఖినే రాష్ట్రం నుంచి 7.4 లక్షల మంది రోహింగ్యాలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందే మయన్మార్ నుంచి వచ్చిన మరో 2 లక్షల మంది రోహింగ్యాలు ఆగ్నేయ బంగ్లాదేశ్లోని శిబిరాల్లో ఉంటున్నారు. వారికి ఈ 7.4 లక్షల మంది కూడా జతకలిశారు. ఆదివారం జరిగిన ర్యాలీలో హత్యాకాండ దినం సందర్భంగా చిన్నారులు, మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేవుడు గొప్పవాడు. రోహింగ్యాలు వర్ధిల్లాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు. -
భారత్ మానవ హక్కులను కాలరాస్తోందా
సాక్షి, న్యూఢిల్లీ : ఏడుగురు రోహింగ్యా ముస్లింలను భారత ప్రభుత్వం గురువారం నాడు మయన్మార్కు పంపించిన విషయం తెల్సిందే. వారు 2012లో భారత్లో అక్రమంగా ప్రవేశించి అరెస్టయ్యారు. అప్పటి నుంచి వారు అస్సాం జైల్లోనే ఉన్నారు. వారిని వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో వారిని గురువారం మయన్మార్కు సాగనంపారు. మయన్మార్లో 2012 నుంచే కల్లోల పరిస్థితులు నెలకొని ఉండగా, 2016లో మైనారిటీలయిన రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ మారణ హోమం ప్రారంభమైంది. ఆ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు మయన్మార్ సైన్యం నడుంగట్టింది. పర్యవసానంగా వేలాది కుటుంబాలను హత్య చేశారు. వందలాది గ్రామాలను తగులబెట్టారు. మహిళలు, పిల్లలపై సామూహికంగా హత్యలు జరిపారు. ఇక ఆ దేశంలో తలదాచుకునేందుకు కూడా చోటు లేక దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు ఇరుగు, పొరుగు దేశాల వైపు పరుగులు తీశారు. ఈ దారణ మారణ కాండను ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాలని, రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అప్పటి వరకు తాత్కాలికంగానైనా సరే రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ఇరుగు పొరుగు దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో పరుగెత్తుకొచ్చిన రోహింగ్యాలను అటు బంగ్లా, ఇటు భారత దేశం సరిహద్దుల్లోనే నిలిపి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుగురు రోహింగ్యాలను భారత ప్రభుత్వం వెనక్కి పంపించింది. మాతృ దేశంలో మారణ హోమం కొనసాగుతున్నప్పుడు వారిని అక్కడికి పంపించడం కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం ‘రిఫౌల్మెంట్’ను ఉల్లంఘించడమే. ఓ దేశంలో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాందిశీకులను లేదా శరణార్థులను ఆ దేశానికి పంపించకూడదన్నదే ‘రిఫౌల్మెంట్’ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను పట్టించుకోకుండా రోహింగ్యా ముస్లింలను పంపించాలని భారత ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో అసలైన భారతీయ పౌరులను గుర్తించడంలో భాగంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేరు చేసేందుకు కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును తీసుకొచ్చిన (ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది) భారత ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపించడానికి కారణం వారు ముస్లింలు కావడమేనా...! చదవండి: రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’ -
‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’
న్యూయార్క్ : జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టుల తరపున వారి కుటుంబాలు.. మయన్మార్ అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాయని మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనీ తెలిపారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో జరిగిన పత్రికా స్వేచ్ఛా కార్యక్రమంలో అమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్ క్షమాభిక్ష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆమెకే బాగా తెలుసు.. ‘ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ద్వారా అతడు మళ్లీ సాధారణం జీవితం గడిపేందుకు వీలవుతుంది కదా. ఈ కోవలోనే వా లోన్, కా సో ఓల కుటుంబ సభ్యులు అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం వారి తరపున దరఖాస్తు చేశారు. నాకు తెలిసి మయన్మార్ అధ్యక్షుడు ఈ విషయమై అంగ్ సాన్ సూకీతో తప్పకుండా చర్చిస్తారు. వారిద్దరు తలచుకుంటే ఈ ఇద్దరు జర్నలిస్టులకు ఈరోజుతో శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. ఒక రాజకీయ ఖైదీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అంగ్ సాన్ సూకీ కంటే ఎవరికీ కూడా అంత ఎక్కువగా తెలిసి ఉండదు’ అంటూ అమల్ వ్యాఖ్యానించారు. కాగా మయన్మార్లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా అరెస్టైన వీరిద్దరి వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరికి శిక్ష ఖరారు చేస్తూ సెప్టెంబరు 3న తీర్పు ఇచ్చింది. ధైర్యంగా ఎదుర్కొంటాం.. తీర్పు అనంతరం వా లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
రోహింగ్యాలకు భారత్ చేయూత..!
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్లో ఊచకోతకు గురైన రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం చేయూతగా నిలిచింది. గత ఏడాది మయన్మార్ ప్రభుత్వం, సైన్యం చేతిలో ఊచకోతకు గురైన రోహింగ్యాలు ప్రస్తుతం బంగ్లాదేశ్లో నివాసముంటున్న విషయం తెలిసిందే. బంగ్లాలో ఉంటున్న రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం తరుఫున నిత్యవసర వస్తువులను సోమవారం బంగ్లాకు పంపింది. పదిలక్షల లీటర్లకుపైగా కిరోసిన్, ఇరవై వేల కిరోసిన్ స్టవ్లు, ఇతర నిత్యవసర వస్తువులు రోహింగ్యాలకు చేరినట్లు బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్ హర్ష వర్ధన్ వెల్లడించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంలో భాగంగా భారత విదేశాంగ ప్రతినిధులు వాటిని పంపినట్లు ఆయన తెలిపారు. కాగా మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై దమనకాండ తరువాత అత్యధికంగా బంగ్లాదేశ్కు వలస వెళ్లిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో సుమారు ఐదు లక్షల వరకు రోహింగ్యాలు నివాసముంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది -
మయన్మార్ చరిత్రలో చీకటిరోజు
నోపిడా : మయన్మార్ చరిత్రలో ఈ రోజును చీకటి రోజుగా ఆ దేశ పత్రిక సెవెన్ డైలీ (7డైలీ) వర్ణించింది. దేశంలో వాక్ స్వాతంత్య్ర లేదని, మీడియాపై ప్రభుత్వం కుట్రపూరీతంగా వ్యవహరిస్తోందని దేశంలో అతిపెద్ద ప్రచురణగల సెవెన్ డైలీ మొదటి పేజీలో ప్రచురించింది. అంతేకాకుండా మొదటి పేజీలో కొంత భాగాన్ని పూర్తిగా నల్లరంగుతో ప్రచురించి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మయన్మార్లో ఇటీవల జరిగిన రోహింగ్యాల ఊచకోతపై ఇద్దరు జర్నలిస్టులు ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా కథనాలు రాశారన్న ఆరోపణలతో.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులను పెట్టింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్లు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన పత్రికలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రజాప్రభుత్వం పేరుతో 2015లో బాధ్యతలు స్వీకరించిన అంగ్సాన్ సూకీ కూడా గతంలో దుర్మర్గాలకు పాల్పడిన సైన్యం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సెవెన్ డైలీ వ్యాఖ్యానించింది. పత్రికలపై సెన్సార్షిప్ విధిస్తూ 2012 సైన్యం చట్టం చేసిందని.. ఆ చట్టం పేరుతో సూకీ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని తీవ్రంగా మండిపడింది. -
రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
యాంగూన్: మయన్మార్లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం సోమవారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని యాంగూన్ కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టులో అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ)కి చెందిన కొందరు ఉగ్రవాదులు మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ కేంద్రాలపై దాడిచేశారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరిట మయన్మార్ సైన్యం ఊచకోత ప్రారంభించడంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్కు పారిపోయివచ్చారు. ఈ సందర్భంగా రఖైన్లోని ఇన్ డిన్ గ్రామంలో 10 మంది అమాయకుల్ని మయన్మార్ సైన్యం కాల్చిచంపిన విషయాన్ని వా లోన్, కా బయటపెట్టారు. అనంతరం యాంగూన్లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న వీరికి పోలీస్ అధికారి ఒకరు కొన్ని కాగితాలను రహస్యంగా అందించారు. వాటిని తీసుకుని హోటల్ నుంచి బయటకు రాగానే ఆర్మీ అధికారులు కా, లోన్లను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన యాంగూన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టుల వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. తామిద్దరం ఎలాంటి తప్పు చేయలేదని జర్నలిస్టులు చేసిన వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. ఈ రోజు మయన్మార్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు దుర్దినమని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్.జె.అడ్లర్ వ్యాఖ్యానించారు. మీడియా నోరు మూయించేందుకు, భయపెట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
బస్సులో అగ్నిప్రమాదం..20 మంది మృతి
బ్యాంకాక్: థాయ్లాండ్ సరిహద్దు నుంచి రాజధాని బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఓ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతి కాగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొంత మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున 1.25 గంటలకు వాయివ్య టాక్ ప్రావిన్స్లో జరిగింది. చీకటిగా ఉండటం వల్లే గందరగోళంలో ప్రయాణికులకు బస్సులో నుంచి బయటపడటం కష్టంగా మారిందని, దానివల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. మృతులంతా మయన్మార్ వలస కార్మికులే. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి బస్సును నడిపినట్లు డ్రైవర్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
మయన్మార్ అధ్యక్షుడి రాజీనామా
మయన్మార్ : తమ అధ్యక్షుడు హితిన్ క్యా రాజీనామా చేసినట్లు మయన్మార్ అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత బాధ్యతలు, విధుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ఆయన రాజీనామా చేశారని ఫేస్బుక్లో పోస్ట్ చేశాయి. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షులు అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అప్పటి నుంచి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మింట్ స్వీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. హితేన్ నామమాత్రమే... 2016లో జరిగిన ఎన్నికల్లో అంగ్సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు అంగ్సాన్ సూకీనే అధ్యక్షురాలు అవుతుందని అందరూ భావించారు. కానీ ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. విదేశీయుడిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆమె స్థానంలో తనకు అత్యంత విధేయుడైన హితేన్కు పట్టం కట్టి సలహాదారుగా వ్యవహరించారు. ప్రధాని హోదాకు సమానమైన స్టేట్ కౌన్సిలర్గా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశ పాలనలో తనదైన ముద్ర వేశారు. కానీ రోహింగ్యాల విషయంలో అంగ్సాన్ సూకీ, హితేన్ ఇతర దేశాల నుంచి వ్యతిరరేకత ఎదుర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్లే.. 71 ఏళ్ల హితేన్ అనారోగ్య కారణంగానే అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి అంగ్ షిన్ తెలిపారు. పార్టీకి చెందిన మరో వ్యక్తి ఏడు రోజుల్లోగా అధ్యక్షునిగా ఎన్నికవుతారని, రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. -
అంతులేని కథ - అత్యాచారాల వ్యథ
‘‘మయన్మార్లోని రాఖైన్ ప్రాంతంలో రొహింగ్యా ముస్లింలు నివసించే కనీసం 200 గ్రామాలను సైనికదళాలు తగలబెట్టాయి. వందలాది మంది పౌరుల ప్రాణాలు తీశారు. పొరుగునున్న బంగ్లాదేశ్కు పారిపోయే శరణార్థులను గాయపరచి, చంపే లక్ష్యంతో సరిహద్దులో ఆర్మీ మందుపాతరలు పెట్టింది. స్త్రీలపై అత్యాచారాలు సహా అన్ని రకాల హింసాత్మక పద్ధతులు ప్రయోగించారు, ’’ అంటూ ఈ నెల ఆరున అమెరికా ప్రతినిధులసభ మయన్మార్ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానం ఆమోదించింది. అయితే, రొహింగ్యా జాతి నిర్మూలనకు ఈ వర్గం స్త్రీలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని తాజాగా వార్తలందుతున్నాయి. పురుషులు పారిపోగా నిస్సహాయ స్థితిలో ఉన్న రొహింగ్యా మహిళలను వారి ఇళ్లలోనే బంధించి బలాత్కారాలు చేయడం సైనికులకు అలవాటుగా మారింది. యూనిఫాంలో ఉన్న ఆర్మీ సైనికులు కొందరు స్త్రీలపై వారి భర్తల ముందే అత్యాచారం చేసినట్టు అనేక మంది మహిళలు పాశ్చాత్య మీడియా ప్రతినిధులకు వెల్లడిస్తున్నారు. పెళ్లికాని యువతులు, వివాహితలనే తేడా లేకుండా ఒక వ్యూహం ప్రకారం రేప్ చేసి వారిలో భయోత్పాతం సృష్టిస్తున్నారని కూడా తమ పేరు చెప్పడానికి భయపడిన యువతులు వివరిస్తున్నారు. ఇంత పాశవికంగా అత్యాచారాలకు గురయ్యాక ప్రాణాలు దక్కించుకుని బంగ్లాదేశ్లోని కాక్స్ బాజార్ చేరుకున్న రొహింగ్యా మహిళలు సైనికుల రాక్షస కృత్యాలను కథలు కథలుగా చెబుతున్నారు. దేశ పశ్చిమ ప్రాంతంలోని రాఖైన్ నుంచి బెంగాలీ ముస్లిం తెగకు చెందిన రొహింగ్యాలందరినీ తుడిచిపెట్టడానికి రేప్ను బలమైన ఆయుధంగా ఆర్మీ వాడుకుంటోందని మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన 37 పేజీల నివేదికలో పేర్కొంది. ఆర్మీ ఆయుధం ‘రేప్’ ‘‘రొహింగ్యాలను సమూలంగా నిర్మూలించడానికి లేదా తరిమికొట్టడానికి వారి ఆడపడుచులపై సైన్యం ప్రయోగిస్తున్న దుర్మార్గమైన ఆయుధం రేప్. బర్మా సైన్యం రాక్షస చేష్టలతో లెక్కకు అందనంత మంది మహిళలు కోలుకోలేని స్థాయిలో మానసికంగా, శారీరకంగా గాయపడ్డారు,’’ అని ‘ఆలాఫ్ మై బాడీ వాజ్ పెయిన్-సెక్సువల్ వయలెన్స్ అగెనెస్ట్ రొహింగ్యా విమిన్ అండ్ గాల్స్ ఇన్ బర్మా’ (నా శరీరమంతా బాధే-బర్మాలో రొహింగ్యా మహిళలు, యువతులపై లైంగిక హింస) అనే పేరుతో హ్యూమన్రైట్స్ వాచ్ ప్రచురించిన నివేదిక రచయిత స్కయ్ వీలర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి సైనిక దళాలు కొనసాగిస్తున్న దాష్టీకాలు, అత్యాచారాల ఫలితంగా ఇప్పటికి ఆరున్నర లక్షల మంది రొహింగ్యాలు మయన్మార్ వదిలి బంగ్లాదేశ్కు శరణార్థులుగా చేరుకున్నారు. ఇలా వచ్చిన 52 మంది మహిళలు, ఆడపిల్లలను హ్యూమన్ రైట్స్ వాచ్ కలిసి మాట్లాడింది. వారిలో 29 మంది బలాత్కారానికి గురయ్యాక ప్రాణాలతో బయటపడినవారు. ఇంకా 18 ఏళ్లు నిండని యువతులు వారిలో ఉన్నారు. సైనికుల చేతుల్లో అత్యాచారాలకు గురైన ఆడవాళ్లందరూ 19 గ్రామాలకు చెందినవారే. ఈ ప్రాంతంలో రొహింగ్యాలు కాని స్థానిక బర్మా జాతికి చెందిన పురుషులు తరచు ఆర్మీతో చేతులు కలిపి రొహింగ్యాలను ఇక్కడి నుంచి ఖాళీచేయించే పనిలో భాగంగా అన్ని రకాల అరాచకాలకూ పాల్పడ్డారు. అప్పటికే భయకంపితులైన రొహింగ్యా స్త్రీలపై సైనికులతోపాటు స్థానికులూ అత్యాచారాలు జరిపారు. హాథీపారా గ్రామానికి చెందిన హాలా సడక్ అనే 15 ఏళ్ల బాలిక తనను పది మంది సైనికులు ఎంత క్రూరంగా బలాత్కరించిందీ వివరించింది. సామూహిక అత్యాచారం చేశాక ఇలాంటి ఆడపిల్లలను మళ్లీ వాళ్ల ఇళ్ల దగ్గర వదలిపోవడం ఆర్మీకి అలవాటుగా మారింది. బాస్నియా తరహాలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు పాతికేళ్ల క్రితం(1992-93) పూర్వపు యుగోస్లావియా విచ్ఛిన్నమయ్యాక దానిలో అంతర్భాగమైన బాస్నియాలోని ముస్లిం మహిలపై ఐరోపా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యాచారాలు జరిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడినవారంతా సెర్బియన్లే. జాతుల పోరాటంలో చివరికి మహిళలు ఎక్కువ మంది బలయ్యారు. మూకుమ్మడి బలాత్కారాలకు కారకుడైన బాస్నియా సెర్బియా నేత రదోవా కరాజిచ్ను విచారించిన అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ కఠినశిక్ష విధించింది. ఇప్పుడు బర్మాలో జాతి ‘ప్రక్షాళన’ కార్యకలాపాల మాటున రొహింగ్యా స్త్రీలపై అత్యాచారాలు జరిగాయని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకటించగా, ఈ కథనాల్లో నిజం లేదని మయన్మార్ ఆర్మీ ఖండించింది. రొహింగ్యాలపై, మహిళలపై ఇదే స్థాయిలో అత్యాచారాలు కొనసాగితే ఆంక్షలు విధిస్తామని కూడా అనే ఐరోపా దేశాలతోపాటు అమెరికా పరోక్షంగా హెచ్చరిస్తోంది. ----(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
హక్కులను గౌరవిస్తేనే మయన్మార్కు భవిత
నేప్యీతా: దేశంలోని అన్ని జాతులు, తెగల హక్కులకు ఇచ్చే గౌరవంపైనే మయన్మార్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. మయన్మార్ పర్యటనలో ఉన్న పోప్.. దశాబ్దాలుగా వివక్షను, తాజాగా మిలటరీ చర్యను ఎదుర్కొంటూ.. జాతి హననంగా ఐరాస అభివర్ణించిన రోహింగ్యా సంక్షోభాన్ని నేరుగా ప్రస్తావించకపోవడం, రోహింగ్యా అనే పదాన్నీ వాడకపోవడం గమనార్హం. మయన్మార్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆంగ్సాన్ సూచీ, దౌత్యవేత్తలను ఉద్దేశించి మంగళవారం పోప్ ప్రసంగించారు. అంతర్గత ఘర్షణలతో మయన్మార్ ప్రజలు పడుతున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్ను తమ ఇంటిగా భావించే ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. బౌద్ధం మెజారిటీగా ఉన్న ఆ దేశంలో మత విద్వేషాలు చీలికలు సృష్టించొద్దని కోరారు. -
స్వదేశానికి రోహింగ్యాలు!
యాంగాన్: ఆరునెలలుగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చిక్కుముడిగా ఉన్న రోహింగ్యా ముస్లిం శరాణార్థుల విషయంపై ఇరుదేశాలు ముందడుగు వేశాయి. బంగ్లాదేశ్లో ఉంటున్న రోహింగ్యా శరణార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈమేరకు ఈ రెండు దేశాల మధ్య మయన్మార్ రాజధాని నేపిదాలో గురువారం ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్లు మయన్మార్ కార్మిక శాఖ కార్యదర్శి మీంట్ కయాంగ్ మీడియాకు తెలిపారు. మయన్మార్లోని రఖానే రాష్ట్రంలో ఆ దేశ సైనికులు రోహింగ్యా ముస్లింలపై హింసకు పాల్పడటంతో అక్కడ్నుంచి 6,20,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు వలస వచ్చేశారు. -
ప్లాస్టిక్ డబ్బాలతో బతుకు పోరాటం
షా పొరిర్ ద్వీప్ : 13 ఏళ్ల నబీ హుస్సేన్. పుట్టిన ఊరు తప్ప బయటి ప్రపంచం గురించి ఏం తెలీదు. అలాంటి బాలుడు ఒక్కడే ఓ పెద్ద నదిని దాటి పొరుగు దేశానికి వలస వెళ్లాడు. అలాగని అతనికి ఈత రాదు. ఓ ప్లాస్టిక్ డబ్బా సాయంతో బతుకు జీవుడా అంటూ 2.5 మైళ్లు దాటి ప్రాణాలు రక్షించుకున్నాడు. మయన్మార్లో నబీ లాంటి వ్యక్తులు ఎంతో మంది ఇలా తెగించి దేశం ఒడ్డు దాటి పొరుగున ఉన్న బంగ్లాదేశ్కి వలస వెళ్తున్నారు. ఇలా సుమారు ఒకవారంలోనే ముప్ఫై మందికి పైగా ఇలా ఖాళీ ఆయిల్ డబ్బాల ద్వారా నఫ్ నదీ ద్వారం గుండా దేశం దాటారని బంగ్లా అధికారులు చెబుతున్నారు. వీరంతా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన షా పొరిర్ ద్వీపం(బంగ్లాదేశ్ ఆధీనంలో ఉంది)కి చేరుకున్నారు. నబీ హుస్సేన్ ఫోటో నది గుండా వచ్చే సమయంలో దేవుడా.. ఇదే నా చివరి రోజు కాకూడదు అని ప్రార్థించా. అని నబీ మీడియాకు చెబుతున్నాడు. నబీ పెద్దగా చదువుకోలేదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని కూలీపనులకు పంపటం ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడి దారుణ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుటికైనా నబీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే అతన్ని తల్లిదండ్రులు బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఇలా ఒక్క నబీ తల్లిదండ్రులే కాదు.. అక్కడ ఉన్న వందల మంది తల్లిదండ్రులు తమ పిల్లను నఫా గుండా బంగ్లాదేశ్కు దగ్గరుండి మరీ పంపిస్తున్నారు. నాలుగు రోజులు నిద్ర, ఆకలి, దాహం(అది సముద్ర ముఖ ద్వారం దగ్గరగా ఉండటంతో ఉప్పు నీరుగా మారిపోయింది) అన్నింటిని చంపేసుకుని వారు షా పొరిర్కు చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి విషయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. భద్రతా సిబ్బంది అదుపులో మయన్మార్ యువత... అసలు సమస్యేంటి? కాగా, శతాబ్దాల నుంచి మయన్మార్లో తాము నివసిస్తున్నామని చెప్పుకుంటున్న రోహింగ్యా ముస్లింల ప్రాణాలకు ఇప్పుడు అక్కడ భద్రత లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రోహింగ్యా చోరబాటుదారుల దాడి ఆరోపణలతో ఎదురుదాడి ప్రారంభించిన మయన్మార్ సైనికులు, వారికి జత కలిసిన బౌద్ధ సంఘాలు ఊచకోతకు పాల్పడ్డారు. రోహింగ్యాలపై ఉగ్రవాద ముద్ర వేసి వారిని దారుణంగా హతమార్చటం, మహిళలపై అత్యాచారాలు, వారి ఆస్తుల విధ్వంసంలాంటివి చేయటం ప్రారంభించారు. దీంతో భయకంపితులైన 6 లక్షల మంది రోహింగ్యాలు పొరుగు దేశాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మయన్మార్ ప్రభుత్వం కూడా వారి హక్కుల రక్షణ విషయంలో చేతులెత్తేయగా.. అందుకే ఐక్యరాజ్య సమితి మాత్రం వారికి ఆశ్రయం కల్పించాలంటూ వివిధ దేశాలకు(భారత్ సహా) విజ్ఞప్తి చేస్తోంది. -
భారత్ లోకి డేంజరస్ ‘చైనా వైట్’
సాక్షి, న్యూఢిల్లీ : మార్ఫిన్ లేదా హెరాయిన్ల కన్నా వంద రెట్లు శక్తివంతమైనది, అంతకంటే ప్రమాదకరమైన డ్రగ్ ‘చైనా వైట్’ మయన్మార్ మీదుగా భారత్ నార్కోటిక్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశ రాజధానిలోని యువత ఈ డ్రగ్ను ఎక్కువగా వాడుతుండడంతో స్మగ్లర్లు మయన్మార్ నుంచి మిజోరమ్, మణిపూర్ల మీదుగా ఢిల్లీకి చేరవేస్తున్నారు. దీని అధిక డోస్ కారణంగా కెనడాలో ఇప్పటికే రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారు. మొన్నటి వరకు కెనడా, అమెరికాలకే పరిమితమైన ఈ డ్రగ్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. హెరాయిన్ తరహాలోనే దీన్ని కూడా ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్ ద్వారా రక్తంలోకి ఎక్కించుకుంటారు. చైనా వైట్గా పిలిచే ఈ డ్రగ్ను ఫెంటానిల్ అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. మయన్మార్ నుంచి వచ్చిన ఈ డ్రగ్ను మిజోరమ్లో బుధవారం పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్నారు. అంతకుముందు ఢిల్లీ పోలీసులు నగరంలో 12 కిలోల చైనా వైట్ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 50 కోట్ల రూపాయలు ఉంటుంది. మయన్మార్, లావోస్, థాయ్లాండ్ మధ్యనున్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గంజాయిని అక్రమంగా పండిస్తున్న దేశాల్లో మయన్మార్ ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క 2006 నుంచి 2013 మధ్య కాలంలోనే ఆ దేశంలో గంజాయి సాగు రెండింతలు పెరిగింది. సబ్బు పెట్టెలు, బొమ్మలు, బూట్లు, కాస్మోటిక్స్ వస్తువుల ద్వారా ఈచైనా వైట్ డ్రగ్ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విమాన మార్గాల్లో కూడా వస్తున్నట్లు తెల్సింది. గసగసాలకు ఫెంటానిల్ మొక్కల ఆకులను, కొద్ది మోతాదులో హెరాయిన్ను కలిపి చైనా వైట్ను తయారు చేస్తున్నట్లు తెల్సింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయకుడు ప్రిన్స్ కూడా ఈ డ్రగ్ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అమెరికా వైద్యులు ధ్రువీకరించారు. ఒక్క 2016లోనే అమెరికాలో 20,100 ఈ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించారు. గతంతో పోలిస్తే మృతుల సంఖ్య 540 రెట్లు పెరిగిందని అమెరికా పోలీసు అధికారులు చెబుతున్నారు. -
బర్మా నుంచి భారతీయులే పారిపోయి వస్తే...
న్యూఢిల్లీ: నాటి బర్మా నేటి మయన్మార్లో కొనసాగుతున్న జాతి విద్వేష దాడులకు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రోహింగ్యా మైనారిటీ జాతి ముస్లింలు నలుదిక్కులా పరుగులు తీస్తున్నారు. అటు బంగ్లాదేశ్, ఇటు మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి వచ్చి తలదాచుకుంటున్నారు. ఆశ్రయం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా బ్రతిమాలాడుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి నాడు భారతీయులకు కూడా దాపురించింది. బర్మా దేశీయులు తమ దేశం నుంచి తరిమి కొడితే ఉష్ణమండల అడవుల్లో నుంచి లక్షలాది మంది భారతీయులు పారిపోయి వచ్చారు. వారిలో వేలాది మంది మార్గమధ్యంలో ప్రాణాలు వదిలారు. 1826లో బర్మా, బ్రిటిష్ పాలకుల మధ్య జరిగిన యుద్ధంలో బర్మా ఓడిపోయింది. 1855 నాటికి ఆ దేశాన్ని బ్రిటిష్ పాలకులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి బర్మాలోకి భారతీయుల వలస ప్రారంభమైంది. 1985 నాటికి బర్మా జనాభాలో ఏడు శాతం మంది భారతీయులు ఉన్నారు. ముందుగా వ్యాపార కార్యకలాపాల కోసం శెట్టియార్, మర్వారీ, గుజరాతీలు బర్మాకు వలసపోయారు. బెంగాల్ డెల్టా ప్రాంతం నుంచి బెంగాల్ బాబులు కూడా అక్కడికి వలసపోయారు. ఆ తర్వాత సామాన్య ప్రజలు వలసపోయి కార్మికులుగా, కూలీలుగా స్థిరపడ్డారు. ఇళ్లలో వంట మనుషులుగా, పనివాళ్లుగా కూడా స్థిరపడ్డారు. బర్మా ఇంటి యజమానులకు బర్మా భాష రాకపోయినా ఫర్వాలేదుగానీ, భారతీయ వంటవాళ్లతో మాట్లాడేందుకు కనీసం ‘కిచెన్ ఉర్దూ’ అయినా రావాలని ప్రముఖ రచయిత జార్జి ఆర్వెల్ వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరారు. ‘దేవదాసు’ లాంటి చిత్ర కథలను అందించిన ప్రముఖ భారత కథా రచయిత శరత్ ఛంద్ర ఛటోపాధ్యాయ కూడా బర్మాలో పలు ఉద్యోగాలు చేశారు. ముందుగా రైల్వేలో పనిచేసిన ఆయన అకౌంటెంట్గా, గుమాస్తాగా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. బర్మాకు వలసపోయిన వారిలో తెలుగువారు కూడా ఎక్కువగానే ఉన్నారు. తెలుగువారితో ఘర్షణ.. బర్మా రాజధాని రంగూన్ ఓడ రేవులో 1930లో బర్మీయులకు, తెలుగువారికి మధ్య తొలిసారిగా ఘర్షణ జరిగింది. ఆ తర్వాత 1938లో పెద్ద ఎత్తున జరిగిన అల్లర్లలో వేలాది మంది భారతీయులు మరణించారు. రంగూన్లోనే ఎక్కువగా అప్పుడు భారతీయులకు వ్యతిరేకంగా జాతి విద్వేష దాడులు లేదా ఘర్షణలు జరగడానికి కారణం రంగూన్లో ఎక్కువ మంది భారతీయులు ధనవంతులు కావడమే. రంగూన్ మున్సిపల్ పన్నుల్లో 55 శాతం పన్నులను భారతీయులు చెల్లిస్తుండగా, బర్మ దేశీయులు కేవలం 11 శాతం పన్నులు చెల్లించేవారు. మిగతా పన్నులను ఇతర జాతులు, దేశస్థులు చెల్లించేవారు. భారతీయులను వారు అప్పుడు కాలా (నలుపు) అని, కోలా అని పిలిచేవారు. బర్మా భాషలో కోలా అంటే విదేశీయుడు అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా.. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ బర్మాపై దాడి చేసింది. బ్రిటిష్ సైన్యం వెనక్కి తగ్గింది. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు భాగం అవడం వల్ల అటు జపాన్ దాడులను, మరోపక్క స్థానిక బర్మా ప్రజల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బర్మా నుంచి భారతీయులు ప్రాణభీతితో వెనక్కి రావడం 1930లో ప్రారంభమై 1960వ దశకం వరకు కొనసాగింది. 1948లో బర్మాకు బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం రావడంతో భారతీయులపై దాడులు మరింత తీవ్రమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా బర్మాలో పది లక్షల మంది భారతీయులు ఉండగా, అది 1950 నాటికి ఏడు లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు మూడు లక్షల మంది భారతీయులు భారత్కు తిరుగుబాట పట్టారు. 1962లో సైనిక ప్రభుత్వం కఠిన వైఖరి 1949 నుంచి 1961 మధ్య తమకు బర్మా వారసత్వాన్ని కల్పించాల్సిందిగా కోరుతూ 1,50,000 మంది భారతీయులు అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చే సుకున్నారు. వారిలో తమ అవసరాన్ని,వృత్తి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని ఐదోవంతు భారతీయులకు మాత్రమే బర్మా ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. 1962లో బర్మాలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. వలస చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి సైనిక నియంతనే విన్, భారతీయులతోపాటు వివిధ మైనారిటీ జాతుల ఆస్తులను జాతీయం చేశారు. వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో 1962 నుంచి 1964 మధ్య దాదాపు మూడు లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చారు. ఐదు లక్షల మంది భారతీయులకు.. బర్మా ప్రభుత్వం 1982లో మరింత కఠినమైన పౌరసత్వాన్ని తీసుకొచ్చింది. దీంతో రోహింగ్యా ముస్లిం మైనారిటీ తెగతోపాటు భారతీయులు కూడా ఏ దేశానికి చెందిన వారయ్యారు. ప్రతి పౌరుడు మాత భాష బర్మానే మాట్లాడాలి, బర్మాలోనే విద్యాభ్యాసం కొనసాగించాలి. ఉద్యోగ వ్యవహారాలను బర్మాలోనే నిర్వహించాలనే కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్న రోహింగ్య ముస్లింలు గతేడాది చేతుల్లోకి ఆయుధాలు తీసుకొని బర్మా జాతీయులపై తిరుగుబాటు లేవనెత్తారు. ఫలితంగా సైనిక దాడుల్లో వేలాది మంది రోహింగ్యాలు మరణిస్తుండగా, లక్షలాది మంది బంగ్లా, భారత దేశాలకు పారిపోయి వస్తున్నారు. నాడేం చేయలేదు, నేడేమీ చేయడం లేదు బర్మాలో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని 1960వ దశకంలో బర్మా భారతీయుల నుంచే కాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురయ్యాయి. బర్మాలో అప్పుడు నివసిస్తున్న చైనీయుల రక్షణకు చైనా ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఈ విమర్శలకు ఆస్కారమైంది. ఇప్పటికి కూడా బర్మాలో ఐదు లక్షల మంది భారతీయులు ఉంటారన్నది అనధికార అంచనా. భారత్ వచ్చిన రోహింగ్యలను వెనక్కి పంపిస్తున్న ప్రస్తుత భారత ప్రభుత్వం, భారతీయులు వస్తే వారికి ఆశ్రయం ఇస్తుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు. -
ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉన్నా కూడా...
న్యూఢిల్లీ: రొహింగ్య ముస్లిం ప్రజల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ చొరబాటుదారులుగా పేర్కొంటూ సుమారు 40,000 మందిని తక్షణమే దేశం నుంచి పంపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ కసరత్తులు ప్రారంభించగా, రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గట్టర్స్ భారత ప్రతినిధులతో చర్చిస్తున్నారు. మయన్మార్ కు చెందిన రొహింగ్య ప్రజలు అక్కడ జరుగుతున్న దాడుల నేపథ్యంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భారత్ లకు వలసలగా వెళ్తున్నారు. వారి కోసం రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించి ఆశ్రయం కల్పించింది. భారత్ లో సుమారు 16,500 మంది పౌరులకు గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేసింది. అయితే హోంశాఖ సహోయమంత్రి కిరెన్ రిజ్జూ మాత్రం అవి చెల్లవని తేల్చేశారు. "శరణార్థుల విషయంలో ఐక్యరాజ్య సమితి చొరవను మేము అడ్డుకోబోం. అలాగని అక్రమచొరబాటుదారులను ఇక్కడ జీవించేందుకు ఒప్పుకోలేం. అలాగని వాళ్లనేం బంగాళాఖాతంలో పడేయట్లేదు. చట్టం ప్రకారమే తిరిగి వాళ్లను స్వదేశానికి పంపించేస్తాం. ఇప్పటికే మయన్మార్, బంగ్లాదేశ్ లతో సంపద్రింపులు చేపట్టాం" అని రిజ్జూ పేర్కొన్నారు. మయన్మార్ రఖీనే రాష్ట్రంలో స్థిరపడిన రొహింగ్య ముస్లిం ప్రజలపై గత కొన్నేళ్లుగా చొరబాటుదారుల ముద్ర వేయటమే కాదు, అల్లర్లకు కారణమౌతున్నారని పేర్కొంటూ సైన్యం వారిపై దాడులకు పాల్పడుతోంది. రొహింగ్య యువకులను కాల్చి చంపటం, మహిళలపై అకృత్యాలు పెరిగిపోవటంతో వారంతా పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. గత అక్టోబర్లో సుమారు 75,000 మంది బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అక్కడ రక్షణ కరువైందన్న ప్రజలను తిరిగి అదే ప్రాంతానికి పంపటం సరికాదన్న అభిప్రాయం ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేస్తోంది. -
కర్నూలులో మయన్మార్ బృందం
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పరిశీలన కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మయన్మార్ దేశ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. మయన్మార్ నుంచి పది మంది అధికారులు కలిగిన బృందం కర్నూలు చేరుకుంది. ముందుగా కల్లూరు మండలం బొల్లవరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని భూసార పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీ శేషారెడ్డి భూసార పరీక్ష కేంద్రాల్లో చేపట్టే మట్టి, నీళ్ల పరీక్షల గురించి వివరించారు. మయన్మార్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ఉన్నాయని, వీటిని మరింత అధ్యయనం చేసి మయన్మార్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
బర్మాలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏమైంది?
మయన్మార్ (బర్మా)లో నల్లడబ్బును సమూలంగా నిర్మూలించాలనే సదాశయంతో 1987లో అప్పటి దేశ నాయకుడు నే విన్ దేశ కరెన్సీ కియత్లోని పెద్ద నోట్లను రద్దు చేశారు. సరైన ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల దేశంలో ఒక్కసారి వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతుల్లో పెద్ద నోట్లు చెల్లకుండా పోవడంతోపాటు చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. రోజువారి కూడు కోసం కావాల్సిన ఉప్పు, పప్పుల కొనుగోలు కూడా కష్టమైంది. పదివేల మంది కాల్చివేత..! అప్పటికే వరి పంట చేతికి రావడంతో గ్రామీణ ప్రజలకు వస్తుమార్పిడి విధానం (బార్టర్) అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అక్కడి ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం ద్వారా కొనుక్కోవడం ప్రారంభించారు. పర్యవసానంగా బియ్యం, అలాగే కూరగాయల ఎగుమతులు పట్టణాలకు నిలిచిపోయి అక్కడ తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పట్టణ ప్రాంతంలో సరకుల దోపిడీలు, అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపు చేయడానికి సైనికులు జరిపిన కాల్పుల్లో పదివేలకు మందికిపైగా ప్రజలు మరణించారు. ఎన్నో మంచి పనులు చేశారు..! అంతకుముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన నే విన్ 1987లో యాభై, వంద రూపాయల కియత్ నోట్లను రద్దు చేసినప్పుడు పాలకపక్ష ‘బర్మ సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ’కి చైర్మన్గా కొనసాగుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. పాలకపక్ష సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఆర్మీ చీఫ్ కమాండర్గా, పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. సోషలిజం కార్యక్రమం కింద ఆయన ఎన్నో మంచి ప్రజా సంక్షేమ పనులు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను జాతీయం చేయడంతోపాటు పలు ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలను తీసుకొచ్చి పేదలకు మేలు చేశారు. నల్లకుబేరుల పని పట్టాలి.. ఇలాంటి సోషలిస్టు భావాలు కలిగిన ఆయన నల్ల కుబేరుల పీచమణచాలనే ఉద్దేశంతో యాభై, వంద కియత్ నోట్లను అనూహ్యంగా రద్దు చేసి వాటి స్థానంలో 49, 90 కియత్ నోట్లను తీసుకొచ్చారు. ఈ కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడడం వల్ల నే విన్కు చెడ్డ పేరు వచ్చింది. 1963లో ఆయన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ 50, 100 నోట్లను రద్దు చేశారు. అప్పడు కూడా ఆయన ఆశించిన ఫలితాలు కాకుండా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటిలాగా కాకూడదనే ఉద్దేశంతో 1987లో సంఖ్యా శాస్త్రం విశ్వసించే నే విన్ ఓ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యుడిని సంప్రతించారు. తొమ్మిదో నెంబర్ కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో 50, 100 నోట్ల స్థానాల్లో 49, 90 నోట్లను ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో నియత ఆర్థిక వ్యవస్థ 50 శాతం దెబ్బతింది. అనియత వ్యవస్థ అంటే ప్రజల్లో నగదు సర్కులేషన్ సరిగ్గా 86 శాతం పడిపోయి, జాతీయ స్థూల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి రాజీనామా! కేవలం జ్యోతిష్యుడు మాట నమ్మి దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా పాలకపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో 1988, జూలై 23వ తేదీన పార్టీ చైర్మన్ పదవికి నే విన్ రాజీనామా చేశారు. -
పంటలను పరిశీలించిన మయన్మార్ శాస్త్రవేత్తలు
సిరికొండ (మోతె) : మండలంలోని సిరికొండలో శనివారం మయన్మార్ దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా వేరుశనగ, కంది పంటలను పరిశీలించారు. మిర్యాలగూడెం కంపసాగర్ కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మయన్మార్ శాస్త్రవేత్తలకు పలువు వివరాలు తెలియజేశారు. రైతులు ఎక్కువగా పండించే కదిరి–కే 6, ఐసీజీయూ 00351, ఐసీజీయూ 91114 మూడు రకాల వేరుశనిగ పంటలు పరిశీలించి వాటి దిగుబడి, పంట కాల పరిమితులు, తెగుళ్లు, సాగు విధానం, యాంత్రీకరణ విధానం వంటి వివరాలు వారు అడిగి తెల్సుకున్నారు. కార్యక్రమంలో మయన్మార్ శాస్త్రవేత్తలు ఫీజీమోటో ఛీప్ అడ్వైజర్ టాసిన్, మీయాంటో, కంపసాగర్ శాస్త్రవేత్త ఎం.శంకర్, ఇక్రిషాట్ శాస్త్రవేత్త కృష్ణారెడ్డి, కోదాడ డివిజన్ ఏడీఏ ఎల్లయ్య, మోతె ఏఓ పి.రజిని, ఏఈఓ జ్యోత్సS్న, సర్పంచ్ నూకల శ్రీనివాసరెడ్డి, రైతులు నూకల ఉపేందర్రెడ్డి, నూకల వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, తిర్పయ్య, రమేష్, ఎల్లయ్య, ప్రభాకర్రెడ్డి, కొండపల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
త్వరలో మూడు దేశాల మధ్య రహదారి!
బ్యాంకాక్: భారత్, మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలను కలుపుతూ 1,400 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని నిర్మించనున్నట్లు థాయ్ లాండ్ లోని భారతీయ రాయబారి భాగవత్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఈ మార్గంపై చర్చలు జరుగుతున్నా అది అమలుకు నోచుకోలేదు. మయన్మార్ దేశంలో శిథిలావస్థలో ఉన్న 73 వంతెనలను భారత్ 18 నెలల్లో పునర్నిర్మిస్తుందని ఆయన వివరించారు. వీటన్నింటిని రెండో ప్రపంచయుద్ధ సమయంలో నిర్మించారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా 1400 కిలోమీటర్ల రోడ్డు వస్తే.. 2018 తర్వాత ఎంచక్కా రోడ్డు మార్గంలో థాయ్ లాండ్ చేరుకోవచ్చు. భారత్ లోని మోరే ప్రాంతం నుంచి మొదలయ్యే ఈ రోడ్డు మార్గం మయన్మార్ లోని టామూ నగరం వద్ద ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం థాయ్ లాండ్ లోని తఖ్ ప్రాంతం వరకు రోడ్డును పొడిగించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. థాయ్ లాండ్ తో భారత్ కు ఇప్పటికే సాంఘిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, త్వరలో ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గం కూడా ఏర్పడుతుందని భాగవత్ పేర్కొన్నారు. తూర్పుదేశాలతో సహకార సంబంధాలు పెంచుకోవాలనే భారత్ ఆంకాక్షకు ఇది సరిగ్గా సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
నియంతలకు గుణపాఠం
దేశదేశాల నియంతలనూ భయపెట్టే పరిణామాలు ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తాయి. ఉద్యమ పుత్రికగా, మయన్మార్ స్వేచ్ఛా ప్రతీకగా అందరి మన్ననలూ అందుకుంటున్న ఆంగ్సాన్ సూచీ ఆ దేశ పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఘన విజయం అలాంటి అరుదైన సందర్భమే. ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయిదురోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో 440 స్థానాలున్న దిగువ సభలో శుక్రవారంనాటికి ఆమె పార్టీ 238 స్థానాలను గెల్చుకుందని...224 సభ్యులుండే ఎగువసభలో ఇంతవరకూ ఆ పార్టీకి 110 లభించాయని యూనియన్ ఎన్నికల కమిషన్(యూఈసీ) ప్రకటించింది. మొత్తంగా అక్కడి పార్లమెంటులో ఎన్ఎల్డీకి ఇంతవరకూ 348 స్థానాలు వచ్చాయి. అంతేకాదు...అక్కడున్న ఏడు రాష్ట్రాల్లోనూ, ఏడు ప్రాంతీయ సభల్లోనూ, ఆరు స్వయంపాలిత జోన్లలోనూ, ఒక స్వయంపాలిత డివిజన్లోనూ ఆ పార్టీదే ఆధిక్యం. వీటిలో ఇంతవరకూ 522 స్థానాల ఫలితాలు ప్రకటించగా 401 స్థానాలు ఎన్ఎల్డీ గెల్చుకుంది. సైన్యం ప్రాపకంతో ఏర్పడిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ) ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసినవారే సభ్యులవుతారు. ఆ స్థానాలకు ఎన్నికలుండవు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఇంచుమించు మనతోపాటే స్వాతంత్య్రాన్ని సాధించుకున్న మయన్మార్(అప్పటి పేరు బర్మా) దురదృష్టవశాత్తూ స్వల్పకాలంలోనే సైనిక శాసనంలోకి వెళ్లిపోయింది. అక్రమ నిర్బంధాలు, దారుణ చిత్రహింసలు నిత్యకృత్యమైనా... అడుగడుగునా నిఘాతో ఇబ్బందులపాలు చేసినా మయన్మార్ ప్రజల్లోని స్వేచ్ఛా పిపాసను సైనిక నియంతలు చల్లార్చలేకపోయారు. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్లో స్థిరపడిన సూచీ... అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు సామాన్య పౌరుల్లో పెల్లుబుకుతున్న ఈ ఆగ్రహజ్వాలలను పసిగట్టారు. వారికి నాయకత్వంవహించి తీరాలని సంకల్పించారు. ఆమె నేతృత్వంలో సాగిన మహోద్యమానికి తలొగ్గి రెండేళ్ల తర్వాత...అంటే 1990లో సైనిక పాలకులు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్ఎల్డీ అపూర్వమైన విజయం సాధించింది. ఊహించని ఈ ఫలితాలతో ఖంగుతిన్న సైనిక పాలకులు ఎన్నికలను రద్దు చేసి సూచీని బంధించారు. అయిదేళ్ల జైలు జీవితం, పదిహేనేళ్ల గృహ నిర్బంధం ఆమెలోని పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి. అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం, నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఇతర దేశాల సహకారం తప్పనిసరికావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సైనిక నియంతలు అయిదేళ్లక్రితం ఆమెను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహిస్తామని కూడా వాగ్దానం చేశారు. అయితే దీన్నెవరూ నమ్మలేదు. 2010లో ఒకసారి ‘పోటీ’లేని ఎన్నికలు జరిపించి 80 శాతం ఓట్లు తెచ్చుకున్నామని ప్రకటించిన చరిత్రగల సైన్యంపై ఎవరికీ నమ్మకం కుదరలేదు. సైనిక పాలకులు తెలివితక్కువగా ఏమీ లేరు. సూచీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా...తమకున్న అధికారాలు చెక్కుచెదరకుండా రాజ్యాంగంలో అన్ని ఏర్పాట్లూ చేసుకునే ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ అందులో నిబంధన పెట్టారు. అలాగే అన్ని చట్టసభల్లోనూ 25 శాతం సీట్లు దఖలుపరుచుకున్నారు. రాజ్యాంగ సవరణకు పూనుకుంటే వీటో చేసే అధికారాన్ని కూడా అట్టేబెట్టుకున్నారు. మయన్మార్లో నాలుగు నెలల తర్వాతగానీ కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఈలోగా సైనిక పాలకులు మరెన్ని కుట్రలు రచిస్తారో తెలియదుగానీ...ఇప్పటికైతే ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే మార్చిలో తప్ప ఎన్ఎల్డీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం లేదు. అధ్యక్ష పీఠానికి సూచీ ఎవరి పేరును ప్రతిపాదిస్తారో, కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఎజెండాను నిర్దేశిస్తారో అప్పటికిగానీ తేలదు. అయితే ఆమె పార్టీ ప్రభుత్వం చాలా సమస్యలనే ఎదుర్కొనవలసి ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింల సమస్యకు సూచీ ఏం పరిష్కారం వెదుకుతారో, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఎలాంటి కార్యక్రమాన్ని ప్రకటిస్తారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. రోహింగ్యాల్లో అత్యధికులు ముస్లింలు. గుర్తింపు పొందిన జాతుల్లో లేరన్న నెపంతో రోహింగ్యాలకు ఓటు హక్కును రద్దు చేయడంతోపాటు ఇతర ముస్లింలను సైతం అనేకవిధాల వేధించారు. వీటిపై సూచీ మాట్లాడలేదు సరిగదా...తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదు. అలా చేస్తే బౌద్ధ తీవ్రవాదుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని, పర్యవసానంగా తమకు అధికారం చేజారవచ్చునని ఆమె భావించారు. ఈ ఎన్నికల ద్వారా మయన్మార్ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. జనాభిప్రాయాన్ని గౌరవించి ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సీన్, ఆర్మీ చీఫ్ ఆంగ్ హ్లెయింగ్ ఎటూ ఆమె పార్టీకి అధికారాన్ని బదలాయిస్తారు. అయితే సూచీ అధ్యక్ష పీఠం ఎక్కకుండా నిరోధిస్తున్న రాజ్యాంగ నిబంధనను సవరించడానికి వారు ముందుకు రావాలి. కొత్త ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించే కుట్ర బుద్ధులను వదులుకోవాలి. సూచీ సైతం మైనారిటీ జాతులు గౌరవప్రదంగా, నిర్భయంగా జీవించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మయన్మార్ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా వర్థిల్లుతుంది! -
మయన్మార్లో ముగిసిన ఎన్నికలు
భారీగా పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం సూచీ పార్టీ గెలుస్తుందనే అంచనాలు యాంగాన్: దశాబ్దాలపాటు మిలిటరీపాలనలో మగ్గిన మయన్మార్లో ఆదివారం పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పోలింగ్ నమోదుకావడంతో ప్రజాస్వామ్య స్థాపన కోసం ఏళ్లతరబడి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఆంగ్సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ విజయబావుటా ఎగరేస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మిలిటరీ పాలనకు చరమగీతం పాడినట్లేనని అంటున్నారు. ఈ ఎన్నికల్లో 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో విపక్ష ఎన్ఎల్డీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. ఆదివారం యాంగాన్లో సూచీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ను ప్రారంభించారు. సోమవారం నుంచి దశల వారీగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాజధాని నేపిదాలో అధ్యక్షుడు, జుంటా జనరల్ థీన్ సేన్ (యూనియన్ సాలిడారిటీ, డెవలప్మెంట్ పార్టీ) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
జనస్వామ్యం దిశగా...
అర్ధ శతాబ్దికి పైగా సైనిక దుశ్శాసనమే పాలనగా చలామణి అవుతున్న మయన్మార్లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఉక్కు తెరల వెనక తాము రాసిందే రాజ్యాంగంగా...చెప్పిందే ప్రజాస్వామ్యంగా ఇష్టానుసారం అమలు చేస్తున్న పాలకులు తప్పనిసరై ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఎన్నో ఆంక్షల్లో, మరెన్నో పరిమితులతో జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఉద్యమ పుత్రిక ఆంగ్సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)... యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)ప్రధానంగా తలపడబోతున్నాయి. తమలో కొంతమందిచేత రాజీనామా చేయించి సైనిక పెద్దలే నెలకొల్పిన పార్టీ యూఎన్డీపీ. ఇంకా రంగంలో 91 పార్టీలున్నాయి. ఎన్ఎల్డీని ఓడించడానికి సైన్యం పరోక్షంగా పుట్టించిన పార్టీలే వీటిల్లో ఎక్కువ. ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుంది? మయన్మార్లో ప్రజాస్వామ్యం వికసిస్తుందా? అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలనూ, సిద్ధాంతాలనూ ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందా? ఇందులో ఏం జరిగినా, జరగకున్నా ఆంగ్సాన్ సూచీ దేశాధ్యక్షురాలు కావడం మాత్రం అసాధ్యం. ఆమె అధ్యక్ష పీఠం అధిరోహించకుండా చేసే నిబంధనలన్నిటినీ రాజ్యాంగంలో పొందుపరిచాకే ఈ ప్రజాస్వామ్య నాటకానికి సైనిక పాలకులు తెరలేపారు. ఎందుకంటే 1962లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక తొలిసారి 1990లో పార్లమెంటు ఎన్నికలు జరిపినప్పుడు సూచీ తిరుగులేని మెజారిటీ సాధించారు. అయితే, ఆ ఫలితాలను తాము గుర్తించబోమని సైనిక పాలకులు ప్రకటించి ఆమెను 20 ఏళ్లపాటు ఖైదు చేశారు. మళ్లీ ఆ పరిస్థితి రావచ్చునన్న భయంతోనే సూచీకి తలుపులు మూసేవిధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 2008లో రిఫరెండం పేరిట అమల్లోకి తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారం... దంపతుల్లో ఎవరైనా విదేశీయులైన పక్షంలో అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు వారు అనర్హులవుతారు. ఆఖరికి పిల్లలు విదేశాల్లో పుట్టి ఉన్నా తల్లిదండ్రులిద్దరూ అనర్హులే. ఈ నిబంధనలు సూచీని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. మరణించిన ఆమె భర్త బ్రిటన్ జాతీయుడు. పిల్లలిద్దరూ అక్కడ పుట్టినవారే. కనుకనే ఆమె అధ్యక్ష పీఠం అధిరోహించడం వీలుపడదు. అందుకే సమర్ధతగల వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని సూచీ ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అధ్యక్ష పదవికంటే తాను ఉన్నతురాలిగా ఉంటానని అంటున్నారు. ఎన్నికల తర్వాత నిశ్చయంగా జరగబోయేది ఒకే ఒక్కటి-యూఎన్డీపీ నెగ్గినా, ఓడినా సైన్యం ఎప్పటిలానే శక్తిమంతంగా ఉంటుంది. దేశాన్ని శాసిస్తుంది. ఈ ఎన్నికలు ఎన్ని పరిమితుల్లో జరుగుతున్నాయో గమనిస్తే మయన్మార్లో ఉన్నది ప్రజాస్వామ్యమేనా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. హ్లుతా గా పిలిచే మయన్మార్ పార్లమెంటులో 440మంది సభ్యులుండే ప్రతినిధుల సభ, 224మంది సభ్యులుండే వివిధ జాతుల సభ ఉంటాయి. ఈ 664 స్థానాల్లో 75 శాతం స్థానాలకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతినిధుల సభలోని 330 స్థానాలకూ...జాతుల సభలోని 168 స్థానాలకూ ప్రజలు ఓట్లేయవలసి ఉంటుంది. మిగిలిన 25 శాతం స్థానాలూ(166) సైన్యానివే. పైగా పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణను ఆమోదించినా దాన్ని వీటో చేసే అధికారం సైనిక ప్రతినిధులకుంటుంది. ఈ రెండు సభలూ చెరొక అభ్యర్థినీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తాయి. సైనిక ప్రతినిధులు విడిగా తమ అభ్యర్థిని ప్రకటిస్తారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ ముగ్గురిపైనా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో విజేత దేశాధ్యక్షుడవుతారు. ఓడిన ఇద్దరూ ఉపాధ్యక్షులవుతారు. అధ్యక్ష ఎన్నికే ఇంత కంగాళీగా ఉన్నదనుకుంటే ...ఓటర్ల జాబితాలు మరింత అయోమయంగా ఉన్నాయి. హింసాత్మక ప్రాంతాలుగా ప్రకటించినచోట జాబితాలూ లేవు...ఎన్నిక లూ లేవు. అలాగే పది లక్షలమంది రోహింగ్యా ముస్లింలను రాజ్యరహిత పౌరులుగా ప్రకటించి వారినసలు జాబితాల్లోనే చేర్చలేదు. ఈ ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని చేపట్టబోయే ప్రభుత్వానికి తలకు మించిన సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. తమ ఆశల్ని, ఆకాంక్షల్ని వ్యక్తం చేయడానికి అనువైన ప్రజాస్వామిక వేదిక లేకపోవడంతో దాదాపు అన్ని జాతులూ తమ ప్రయోజనాల సాధనకు ఘర్షణ మార్గాన్నే ఎంచుకున్నాయి. ఆ ఘర్షణ ప్రభుత్వంతో మాత్రమే కాదు...తమ ప్రయోజనాలను కొల్లగొట్టే అవకాశమున్నదని భావించే వేరొక తెగపై కూడా! సాయుధ పోరాట బాటపట్టిన 15 ముఖ్యమైన జాతుల్లో ఏడెనిమిదింటితో ప్రస్తుత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందానికి వెలుపల ఉండిపోయినవాటిలో రెండు సంస్థలు కీలకమైనవి... భవిష్యత్తు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చేవి. నోబెల్ శాంతి బహుమతి కూడా పొందిన ఆంగ్సాన్ సూచీ ఈ జాతుల సమస్యల గురించిగానీ...బౌద్ధ మిలిటెంట్ గ్రూపుల చేతుల్లో దారుణమైన హింసను చవిచూసి, ప్రభుత్వ తిరస్కారానికి గురై దుర్భరమైన స్థితిలో శిబిరాల్లో గడుపుతున్న రోహింగ్యా ముస్లింల గురించిగానీ నోరెత్తలేదు. తమ ప్రభుత్వం వస్తే అన్నీ పరిష్కరిస్తామనడమే తప్ప రోహింగ్యాలను పౌరులుగా గుర్తించి, వారికి గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని కూడా ఆమె అడగలేదు. అయినప్పటికీ ఆమెను రోహింగ్యాల ఏజెంటుగా బౌద్ధ మిలిటెంట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆ ప్రజల గురించి ప్రస్తావించకపోవడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. ఇన్ని అవరోధాలమధ్యా, ఇన్ని అవాంతరాలమధ్యా ఆమె పార్టీకి 1990లో వచ్చినట్టుగా ఈసారి అఖండ మెజారిటీ రావడం అంత సులభం కాకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ సూచీయే దేశంలో జనాకర్షణ గల ఏకైక నేత. మౌలిక సదుపాయాల లేమితో, ఆర్ధికంగా అంతంతమాత్రంగా ఉన్న మయన్మార్ నిలదొక్కుకోవాలన్నా, ఎంతో కొంత అభివృద్ధిని సాధించాలన్నా ఏదో రూపంలో ప్రజాస్వామ్యం ఉండటం తప్పనిసరని సైనిక పాలకులు గుర్తించారు. కనుకనే ఇప్పుడీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన పొరుగు దేశం గనుకా... మనతో ఈశాన్య ప్రాంతంలో 1,600 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది కనుకా మయన్మార్లో సుస్థిరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడటం మన భద్రతకూ, క్షేమానికీ ముఖ్యం. అందుకే మయన్మార్ ప్రజల వినూత్న ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించాలి. -
ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందా?
నవంబర్ లో జరగునున్న మయన్మార్ స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ ఆయ్యే అవకాశం లేదా? ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయాన్ని సాధించినా అధ్యక్షపదవిని దక్కించుకునే అవకాశాలు తక్కువే అని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 59 ఎఫ్ ప్రకారం.. సూకీ ఓ విదేశీ వ్యక్తిని పెళ్ళాడి, చట్టబద్ధంగా పిల్లలు ఉండటంతో ఆమెను అనర్హురాలుగా ప్రకటించవచ్చు. అంతేకాక ఆమె ఇద్దరు కుమారులైన.. కిమ్, అలెగ్జాండర్లు బ్రిటిష్ పాస్ పోర్టు కలిగి ఉండటం కూడ ఆమె పదవిని దక్కించుకునేందుకు అవకాశాలు లేవు. సూకీ.. ఎన్నికల్లో భారీ విజయాన్ని వరించినా... ఆర్టికల్ లోని నిబంధనల ఆధారంగా ఆమె అధ్యక్షపదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ ప్రతినిధులు ఏదైనా ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుంటే తప్పించి సూకీ.. ప్రెసిడెంట్ అయ్యే మార్గమే లేనట్టు ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాయి. ఒకవేళ సూకీ ప్రెసిడెంట్ కాకపోతే? మరి ఎవరు అవుతారన్నది మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఒకవేళ ఎన్ ఎల్డీ మద్దతును కనుక పొందగల్గితే స్పీకర్ హట్టా యు షూ మన్ అధ్యక్షుడుగా మారవచ్చు. అయితే ఇది ఆంగ్ సాన్ సూకీకి, సైనికులకు మధ్య అంతరాన్నితగ్గించి.. వారితో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగితే మాత్రమే జరిగుతుంది. అంతేకాదు రాజ్యాంగ మార్పుకోసం కూడ వారివద్ద హామీ తీసుకోవాల్సి కూడ ఉంటుంది. అయితే ఆగస్టు నెలలో జరిపిన తిరుగుబాటు లో అతన్ని యూఎస్పీడీ అధిపతి పదవినుంచీ తొలగించడంతో సూకీ సైన్యం మద్దతును ఇప్పటికే కోల్పోయింది. సైనిక మద్దతు లేకుండా సూకీ పదవిని పొందే అవకాశం ఎట్టిపరిస్థితిలోనూ లేనట్లే కనిపిస్తుంది. మరి అప్పుడు ఎవరు అధ్యక్ష పదవిని పొందుతారు? అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగానే ఉంది. ఈనెల మొదట్లో ఓ భారతీయ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఎన్ ఎల్డీ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంలో సూకీ... తానొక పౌరురాలు కావడంతోనే ఈ అవకాశం వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పింది. అదే ఆత్మ విశ్వాసంతో ఆమె నేటికీ సమర్థవంతంగా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోగలననే ధీమాతో...ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మాజీ కమాండర్ ఇన్ ఛీఫ్.. టిన్ ఊ, మాజీ సైనిక అధికారి విన్ హెటిన్ వంటి వారిని సన్నిహిత అంతరంగికులుగా ఉంచుకోవడం, అతి దగ్గరకు తీయడం కూడ ఆమెకు అవకాశాలను జారవిడుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే షూ మన్ కూ...సూకీకి ఇప్పటికే డీల్ కుదిరిపోయిందని కొన్ని పుకార్లు కూడ షికార్లు చేస్తున్నాయి. అదే జరిగితే.. రెండేళ్ళ తర్వాత అతడు రాజ్యాంగ మార్పులను చేసి ఆమెకు అవవాశం కల్పించేట్లు ఒప్పందం కుదిరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నవంబర్ 8 న ఓటర్లు చెప్పే జాతకాలను బట్టే సూకీ అధ్యక్ష పదవిపై చిక్కు ముడి వీడుతుంది. -
మయన్మార్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: మయన్మార్లో భారత సైన్యం దాడులు జరిపి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన మరుసటిరోజు నెలకొన్న తాజా పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ మేరకు మయన్మార్ కు బయలుదేరి వెళ్లాల్సిందిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను ఆదేశించారు. తాజా పరిస్థితులపై సమాచార సేకరణతోపటు పలువురు కీలక వ్యక్తులతో జితేంద్ర చర్యలు జరుపుతారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) ఉగ్రవాదులు భారత సైన్యంపై జరిపిన దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఘటనకు బాధ్యులైనవారిపై విడిచిపెట్టేది లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మయన్మార్ దళాలతో కలిసి మంగళవారం భారత సైన్యం ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, మయన్మార్ లో భారత సైన్యం చర్యకు రాజకీయ రంగులు పులిమే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. -
భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ:విదేశీ పర్యటన ముగించుకుని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం స్వదేశానికి చేరుకున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజి దేశాల్లో తొమ్మిది రోజుల పాటు పర్యటించిన మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజైన బుధవారం నాడు మోదీ ఫిజీలో పర్యటించారు. దాదాపు 33 సంవత్సరాల కిందట 1981లో ఇందిరాగాంధీ పర్యటన అనంతరం ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.