8 మంది దొంగలు.. 8 బృందాలు | CP Anjan Kumar Said Hyderabad Tirumalagiri Theft Case Solve By North Zone Police Officer | Sakshi
Sakshi News home page

8 మంది దొంగలు.. 8 బృందాలు

Published Fri, Oct 5 2018 1:34 PM | Last Updated on Fri, Oct 5 2018 1:37 PM

CP Anjan Kumar Said Hyderabad Tirumalagiri Theft Case Solve By North Zone Police Officer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగు రోజుల క్రితం నగరంలోని తిరుమలగిరిలో జరిగిన దోపిడి కేసును ఛేదించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. దోపిడికి పాల్పడిన 8 మంది దొంగల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అంజన్‌ కుమార్‌ మాట్లడుతూ ‘ఈ నెల 1న తిరుమలగిరిలో దోపిడి జరిగింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఇంటి యజమాని పేరు అడుగుతూ వచ్చి దోపిడికి పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. చివరకూ నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు అధికారులు వీరిని అరెస్ట్‌ చేశార’ని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ‘ఈ గ్యాంగ్‌లో మొత్తం ఎనిమంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు చితికి పోవడంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేయడం కోసం ఓ కారును కూడా వాడనట్లు తెలిసింది. వీరంతా దోపిడి సమయంలో మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఈ గ్యాంగ్‌కి సయ్యద్‌ మూజుద్‌ లీడర్‌గా వ్యవహరించాడు. ఈ దోపిడి కేసులో సయ్యద్‌ జమీల్‌ ఏ1గా, సయ్యద్‌ ముజీద్‌ను ఏ2గా ఉన్నారు.  ఏ1, ఏ2లపై గతంలో కేసుల కూడా ఉన్నాయి. ఈ కేసులో ఏ1 అయిన సయ్యద్‌ జమీల్‌ గతంలో సనత్‌ నగర్‌లో జరిగిన హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడ’ని తెలిపారు.

ఈ గ్యాంగ్‌ నుంచి 30 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, 11 మొబైల్‌ ఫోన్స్‌తో పాటు మహీంద్ర కారును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement