
సాక్షి పాట్నా: సమస్తిపూర్ ఘోర రోడ్డు ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. సమస్తిపూర్లోని ముష్రిఘరారీలో ఆదివారం మధ్యామ్నం ఓ ఆటోను ట్రక్ ఢీకొన్న ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై సీఎం నితీశ్ అధికారులను విచారణకు ఆదేశించారు.