
తిరుమలలో పుర్రె కనిపించడం కలకలం రేపుతోంది.
సాక్షి, తిరుమల: తిరుమలలో పుర్రె కనిపించడం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్డులోని జింకల పార్కు సమీపంలో పుర్రె, ఎముకలు భక్తుల కంటపడ్డాయి. దీంతో భక్తులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం భక్తులతో ఉండే ఘాట్ రోడ్డులో ఈ పుర్రె ఎలా వచ్చిందో అని తెలియడం లేదు. భక్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.