
పాత నోట్లతో 24 వరకు పన్నులు..
సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఈ నెల 24వ తేదీ వరకు ప్రస్తుత సంవత్సర ఆస్తిపన్ను, గత బకాయిలు, ట్రేడ్లైసెన్స్ లను చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని నగరవాసులు వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని, వీటితో పాటు అన్ని మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల్లో పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లను మాత్రం జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో మాత్రమే జమచేయాలని తెలిపారు.