నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలైంది.
నూజివీడు: నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. వెయిటింగ్ జాబితాలోని అభ్యర్థులకు నూజివీడు ట్రిపుల్ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కౌన్సెలింగ్లో రెండు ట్రిపుల్ ఐటీలకు కలిపి 555 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ కౌన్సెలింగ్, ప్రత్యేక కేటగిరి, సూపర్ న్యూమరరీ సీట్లు ఉన్నాయి.