శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. వింజమూరు, దుత్తలూరు సహా పలు గ్రామాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వేకువజామున ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఈ గ్రామాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని ఈ ప్రాంతాల్లో సాధారణంగా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.