విశాఖ జిల్లా చింతపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది.
విశాఖపట్టణం: విశాఖ జిల్లా చింతపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది. కొయ్యూరు మండలం మర్రిపాకల వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆజాద్ అనే పురుషుడు ఉన్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 తుపాకీతోపాటు కిట్బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించటం లేదు.