వైఎస్ జగన్ యువభేరి కార్యక్రమానికి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులో ఏర్పాటుచేసిన యువభేరి కార్యక్రమానికి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. యువభేరి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివస్తున్న విద్యార్థులను అధికారులు అడ్డుకుంటున్నారు. పలుచోట్లు ఆర్టీఏ అధికారులు విద్యార్థుల బస్సులను అడ్డుకున్నారు. బస్సులను వదలకపోతే ధర్నాకు దిగుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు.