
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
నడిగూడెం: వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి ఎండి.సలీంషరీఫ్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యాభివృద్దికి కృషి చేయాలని, పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని ఆయన కోరారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు నిర్మల, తలారి శ్రీనివాసరావు, వెంకటనర్సయ్య, ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు.