increase
-
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం ధర
పెళ్లిళ్ల వేళ పసిడి ధర చుక్కలు చూపిస్తుంది. గతేడాది కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందే కొనేసుకుందాం అని అనుకున్నారు. కానీ పసిడి మాత్రం తగ్గేదేలే అంటూ పెరుగుతూ వస్తుంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనేవారు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.87,500 పలికింది. వెండి ధర 10 గ్రాములకు రూ.970 నమోదు అయ్యింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.గత 20 ఏళ్లలో బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపు లేకుంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కి కూర్చుంది. దేశీయంగా డాలర్ విలువ రూ.87.36 కావడంతో మన దేశంలో పసిడి మరింత భగ్గుమంటుంది. 2004 ఏప్రిల్ బంగారం ధర 10 గ్రాములు రూ.5,800 ఉంది. 2024 ఏప్రిల్ నాటికి రూ.71,300కు పెరిగింది. కాగా ఫిబ్రవరి 5న నాటికి ఎప్పుడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో రూ.87,500 పలికింది. వెండి 10 గ్రాములకు రూ.970 నమోదయ్యింది. గత డిసెంబర్లో రూ.72 వేలు, ఈ జనవరిలో రూ.74 వేలు ఉండగా వారం రోజుల్లోనే అమాంతంగా పెరిగింది. జిల్లాలో మెదక్ కేంద్రంగా బంగారం వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడ సుమారు 80 వరకు బంగారు దుకాణాలు ఉండగా, సీజన్లో రోజుకు రూ.కోటి టర్నోవర్ జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ధరలు పెరగడంతో గిరాకీ తక్కువగా ఉంటుందని వ్యాపారులు వాపోతున్నారు.పెళ్లికి కొనలేని పరిస్థితి..ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ ప్రారంభంకావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో పెళ్లి చేస్తే వధువుకు ఎంత లేదన్నా కనీసం 5 తులాల పైగానే బంగారం పెడుతుంటారు. ఈ మధ్యలో మగ పెళ్లివారు కట్న కనుకలు అడుగకుండా మీ అమ్మాయికి ఇంత బంగారం పెడితే చాలు అంటూ తేలిగ్గా చెప్పేస్తున్నారు. దీంతో పెళ్లి కూతురు తరఫున వారు బంగారం ధర చూసి నోరెల్ల బెడుతున్నారు. పెళ్లి ఖర్చుకంటే బంగారానికే ఎక్కువ ఖర్చు అవుతుందని, రూ.లక్షలు పెట్టి కొనలేక వెనక్కి తగ్గుతున్నారు. ఈ సీజన్లో పసిడి ధర మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.తలకు మించిన భారంబంగారం ధరలు ఇలా పెరిగితే ఎలా కొంటాం. ఆడ కూతుళ్ల పెళ్లీళ్లు చేయాలంటే మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారం అవుతోంది. ఈ రోజుల్లో ఎంత లేదన్నా అమ్మాయికి కనీసం 10 తులాలు పెట్టాలి. ఇలా ధరలు పెరిగితే వారి పరిస్థితి ఏంటి. ఈ రోజు రూ.87,500 తులం బంగారం ఉంది. ప్రభుత్వం స్పందించి బంగారం ధరలపై నియంత్రణ ఉంచేలా చర్యలు తీసుకోవాలి.– కుకూనూరు స్వప్న, గృహిణి, పాపన్నపేట -
ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు
గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరగనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈవీలపై జీవితకాల పన్ను మినహాయించింది. దీంతో కొంతకాలంగా నగరంలో ఎలక్ట్రిక్ బైక్లు, ఆటోలు, కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. తాజాగా కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా రాయితీలను ప్రకటించింది. ఈ వాహనాలకు వినియోగించే బ్యాటరీలకు వాడే 35 రకాల ముడి పదార్థాలపై పన్ను మినహాయించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని రవాణారంగం నిపుణులు పేర్కొంటున్నారు. 15 శాతం నుంచి 20 శాతం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా. బైక్లపై గరిష్టంగా రూ.10 వేల వరకు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గవచ్చని ఆటో మైబైల్ డీలర్లు సైతం అంచనా వేస్తున్నారు. మరోవైపు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చుకొంటే వాటి స్థానంలో కొనుగోలు చేసేవాటిపై సబ్సిబీ లభించనుంది. కాలపరిమితి ముగిసిన వాటిను తుక్కు చేసి కొత్తగా ఈవీలను కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనం కలగనుంది. లగ్జరీ వాహనాల ధరలు తగ్గుముఖం.. మరోవైపు కేంద్రం తాజా బడ్జెట్లో దిగుమతి చేసుకొనే వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో హైఎండ్ వాహనాల ధరలు కూడా తగ్గుముఖం పట్టనుంది. లగ్జరీ బైక్లు, కార్లు, బస్సులు, ఇతర వాహనాల ధరలు కూడా 12 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గనున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈవీలకు ఇది ప్రోత్సాహకరం ఈవీ ధరలు నేరుగా తగ్గకపోయినా బ్యాటరీ ముడి పదార్థాలపై పన్ను మినహాయించడం వల్ల ఈవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయి. బ్యాటరీల తయారీకి వినియోగించే 35 రకాల పదార్థాలపై కేంద్రం పన్ను మినహాయింపునివ్వడం ఎంతో సంతోషంచదగ్గ అంశం. ఇది ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపునకు దోహదం చేస్తుంది. – సంధ్య, ఎలక్ట్రిక్ వాహన డీలర్ -
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో షాక్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు ఆదేశాలు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉత్తర్వులు ఇవ్వడంతో.. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. అర్బన్, రూరల్ అన్ని ప్రాంతాల్లోనూ బాదుడుకు అనుమతులిచ్చింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెంచేందుకు నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు జీవో కూడా జారీ చేసేసింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది.కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి! -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్శాఖ భావిస్తోంది.డిమాండ్కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..
50 వేలు కట్టండి.. లక్ష రూపాయలు ఇస్తాం.. ఈ లింక్పై క్లిక్ చేయండి మీ డబ్బులు డబుల్ త్రిపుల్ అవుతాయి.. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు.. ఇంత డబ్బులు చెల్లించకపోతే జైలు ఊసలు లెక్కపెడతారు..! మీ మొబైల్కి ఓటీపీ వచ్చిందా? అయితే ఇక్కడ టైప్ చేయండి లేదంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..! ఈ ఆన్లైన్ గేమ్ ఆడితే రోజుకు 50 వేలు సంపాదించవచ్చు.. ఓ సారి ట్రై చేయండి..! ఇవన్నీ మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో విన్న మాటలు. ఇవి నమ్మినవాళ్లు ఇప్పటికీ చాలా డబ్బులే పొగొట్టుకోని ఉంటారు.గతంలో సైబర్ ఫ్రాడ్ అంటే ఏదో న్యూస్లో వస్తే విన్న సందర్భాలే కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ మోసాల బాధితులు మన పక్కనే కనిపిస్తారు.. మన ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో కేటుగాళ్ల వలలో చిక్కుకుని మన దగ్గర లబోదిబోమని బాధపడిన సందర్భాలు ఎక్కువే ఉండి ఉంటాయి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ లెక్కలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటిపడుతున్నాయి.త్వరలోనే సైబర్ ఫ్రాడ్ మోసాల ఎకానమీ సైజు...ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటాయట. ఇది పోలీసులతో పాటు అనేకమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న వాస్తవం! ఏంటి నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే లెక్కలు వింటే మీకే అర్థమవుతోంది.రోజుకు 15,000 సైబర్ మోసాలుప్రతి 6 సెకన్లకు ఒకటి.. నిమిషానికి 10.. రోజుకు 15,000.. ఏడాదికి 50లక్షలు.. ఇది సైబర్ ఫ్రాడ్ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి ఆరు సెకన్లకు ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కుకోని విలవిలలాడుతున్నడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్లైన్ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగాళ్ల జేబుల్లోని వెళ్లాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ ఫ్రాడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ పౌరులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రతిరోజూ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని మొదటి ఐదు సైబర్ ఫ్రాడ్ బాధిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక 2022లో అయితే సైబర్ ఫ్రాడ్ కేసుల్లో తెలంగాణ టాప్ పొజిషన్లో నిలిచింది. 96శాతం సైబర్ నేరాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇందులో మోసపూరిత లింక్లపై క్లిక్ చేయడం, ఇతరులతో పాటు మోసగాళ్లతో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం లాంటివి చేయడం కారణంగానే సైబర్ ఫ్రాడ్ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది.ఏడాదికి లక్షల కోట్లుసైబర్ క్రైమ్ మోసాల డబ్బుల లెక్కలు ఏడాదికి లక్షల కోట్లు దాటుతుంది. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే 2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం 10.5 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల మాట. 10.5 ట్రిలియన్ డాలర్స్ అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం 87 లక్షల కోట్లు. అంటే USA, చైనా తర్వాత ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది సమానం. ఇక అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా టాప్-3లో ఉంది.2023లో ఆన్లైన్ స్కామ్స్లో భారత్ భయంకరమైన పెరుగుదలను చూసింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 8 కోట్ల సైబర్ దాడులు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణలో సైబర్ మోసాల కేసులు 2022 నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ఏరియాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 2023లో 5,342 సైబర్ మోసం కేసులు ఈ ఏరియాల్లోనే రికార్డయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డవని కేసులు, పరువు పోతుందన్న భయంతో పోలీస్స్టేషన్ గడప వరకు రాని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.సైబర్ నేరాలకు హాట్స్పాట్లుముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాలు సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి, కేసుల్లో దాదాపు 40శాతం సిటీస్ నుంచే రికార్డవుతున్నాయి. అయితే అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలనే కేటుగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పల్లెటూర్లు, టౌన్స్ నుంచి సిటీలకు చదువు కోసం ఉద్యోగాల కోసం వచ్చేవారిలో ఎక్కువగా బాధితులు ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే విలేజ్ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి డిజిటల్ భద్రతా పద్ధతులపై అవగాహన తక్కువగా ఉంటుందట. అందుకే మోసగాళ్ల ట్రాప్లో చిక్కుకుని వీరంతా బలైపోతున్నారు.నకిలీ క్రిప్టోకరెన్సీ పాత్రసైబర్ ఫ్రాడ్ కేసుల్లో నకిలీ క్రిప్టోకరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముందుగా కొంచెం ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. ఈ పెట్టుబడికి తగ్గట్టుగా కాస్త డబ్బు ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడి ఎక్కువ పెట్టాలని.. అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపెడతారు.. ఆ తర్వాత మొత్తం దోచుకుంటారు. ఇక KYC అప్డేట్ మెయిల్ లింక్స్, వాట్సాప్లో ఇన్స్టాంట్ లోన్ మెసేజీలు పట్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.ఇక బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు లేదా మార్కెట్లో మంచి పేరున్న కంపెనీలను డూప్ చేస్తూ నకిలీ ఇమెయిల్స్ పంపుతారు. ఆ మెసేజీలు అచ్చం బ్యాంక్వారు పంపినట్టే ఉంటాయి.. లోగో కూడా వారిదే ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న లింకులు క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్కు గురవుతుంది. ఇలాంటి ఎన్నో ఫ్రాడ్లు నిత్యం జరుగుతున్నాయి. ఇక ఇటీవల బడా పారిశ్రమికవేత్తలు డిజిటల్ అరెస్టుల ఫ్రాడ్లకు చిక్కుతున్నారు. కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్నారు.డిజిటల్ అరెస్ట్ తర్వాత వచ్చే వీడియో కాల్లో సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు సెటప్ ఉంటుంది. నేరుగా డూప్ సీజేఐ మాట్లాడతారు..! కేటుగాళ్ల తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే అంతే సంగతి, కష్టపడి సంపాదించుకున్నదంతా క్షణకాలంలో ఆవిరైపోతుంది. బతుకులను వీధిపాలు చేస్తుంది, ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. మీ పిల్లలను, తల్లిదండ్రులను దిక్కులేనివారిని చేస్తుంది..! సో బీకేర్ ఫుల్. -
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్లోని ‘గో ఓట్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.అక్టోబర్ 26న కేబినెట్ భేటీలో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏల విడుదలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ వేళ పెండింగ్లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.👉పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తింపు👉డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపు👉2022 జులై 1 నుంచి ఈనెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ👉సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ👉సీపీఎస్ ఉద్యోగులకు మిగతా 90 శాతం 17 వాయిదాల్లో చెల్లింపు👉సీపీఎస్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు👉జీపీఎఫ్ ఖాతాలు లేని పుల్టైం కంటింజెంట్ ఉద్యోగులకు 17 వాయిదాల్లో చెల్లింపు👉కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు👉రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపు -
మలబద్దకంతో గుండెకు ముప్పే : తాజా అధ్యయనం
మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. మలబద్దకం రకాలు, కారణాలుఅందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి. అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు కారణమవుతుంది. ఎపుడు అప్రమత్తం కావాలి?జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.మలబద్దకం-నివారణ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు తీసుకోవాలి.పుష్కలంగా నీరు తాగాలి. ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి తేలికపాటి వ్యాయాయం, వాకింగ్ లాంటివి చేయాలి.పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది. -
చెలరేగిన బుల్!
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు ఆర్జించాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24,541 వద్ద నిలిచింది. ఈ ముగింపు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సూచీలు 2% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.7.30 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.451.59 లక్షల కోట్ల(5.38 ట్రిలియన్ డాలర్లు) కు చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! సెన్సెక్స్ ఉదయం 649 పాయింట్లు లాభంతో 79,755 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 24,335 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో కొన సాగాయి. ఐటీతో పాటు అన్ని రంగాల షేర్లూ రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,412 పాయింట్లు ర్యాలీ చేసి 80,518 వద్ద, నిఫ్టీ 295 పాయింట్లు పెరిగి 24,531 వద్ద గరిష్టాలు తాకాయి.లాభాలు ఎందుకంటే ⇒ అమెరికా రిటైల్ అమ్మకాలు పెరగడం, నిరుద్యోగ క్లెయిమ్స్ డేటా తగ్గడంతో ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లాయి. అలాగే జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు తగ్గట్లు నమోదు కావడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 103 స్థాయి నుంచి 102.81 స్థాయికి దిగివచి్చంది. ఇటీవల భారీగా పతనమైన జపాన్ కరెన్సీ యెన్ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. దీంతో యూఎస్ మార్కెట్లు గురువారం 2% ర్యాలీ చేశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 3–1% చొప్పున లాభపడ్డాయి. అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల ధోరణి దేశీయ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చాయి. ⇒ సెన్సెక్స్, నిఫ్టీ ఇటీవల తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాయి. ఆగస్టు నెలలో 2.5 శాతం దాకా నష్టపోయాయి. దీంతో కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్ల చేపట్టడం సూచీలకు కలిసొచి్చందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ⇒ బ్లూచిప్ షేర్లు టీసీఎస్ (3%), ఐసీఐసీఐ (2%), ఇన్ఫీ (2%), ఐటీసీ (2%) హెచ్డీఎఫ్సీ (1.50%), రిలయన్స్ (1%) రా ణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి.⇒బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 3%, రియల్టీ 2.50%, ఆటో, కమోడిటీ, విద్యుత్, ఫైనాన్సియల్ సర్వీసెస్ సూచీలు రెండుశాతం చొప్పున రాణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.75 శాతం రాణించాయి. ⇒సెన్సెక్స్ సూచీలో 30 షేర్లన్నీ లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీసీఎస్, హెచ్సీఎల్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. నిఫ్టీ సూచీలో 50 షేర్లలో దివీస్ ల్యాబ్స్ (0.50%), ఎస్బీఐ లైఫ్ (0.10%), డాక్టర్ రెడ్డీస్ (0.01%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 47 షేర్లూ లాభపడ్డాయి. ⇒ఎలక్ట్రిక్ బైక్స్లో 3 మోడళ్లను ఆవిష్కరించడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ షేరు 20% ర్యాలీ చేసి రూ.133 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది. -
బీఐఎస్ కీలక ప్రకటన: పెరగనున్న చెప్పుల ధరలు
2024 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' కొత్త నాణ్యతా ప్రమాణాల కారణంగా పాదరక్షలు (చెప్పులు, షూస్) ఖరీదైనవిగా మారుతాయి. పాదరక్షల తయారీదారులు ఐఎస్ 6721 & ఐఎస్ 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ వెల్లడించింది.పాదరక్షల క్వాలిటీ పెరిగితే ధర పెరుగుతుంది. అయితే రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన తయారీదారులకు బీఐఎస్ ఈ నియమం నుండి మినహాయింపు కల్పించింది. ఇప్పటికే తయారు చేసిన పాత స్టాక్కు కూడా ఈ నియమం వర్తించదు. అయితే విక్రయదారులు బీఐఎస్ వెబ్సైట్లో పాత స్టాక్ వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఆగస్టు 1 నుంచి 46 అంశాలు సవరించిన బీఐఎస్ నిబంధనల పరిధిలోకి వస్తాయి. కంపెనీలకు అవగాహన కల్పించడం కోసం తమ అధికారిక వెబ్సైట్లో ఈ సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లు బీఐఎస్ తెలిపింది. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి పాదరక్షలలో ఉపయోగించే ముడి పదార్థాలు రసాయన లక్షణాలను కంపెనీలు పరీక్షించాల్సి ఉంటుంది.త్వరలో అమలులోకి రానున్న కొత్త రూల్స్ చెప్పులను బలంగా, మన్నికైనవిగా చేస్తాయి. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధరల పెరుగుదల ఎంత వరకు ఉంటుందనేది.. ఆగష్టు 1 తరువాత తెలుస్తుంది. -
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు రెట్టింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజును రెట్టింపునకు మించి పెంచింది. ప్రస్తుతం 710 డాలర్లు (రూ.59,255)గా ఉన్న ఫీజును 1,600 డాలర్లు (రూ.1.33 లక్షల)కు పెంచింది. పెంచిన ఫీజులు అమలవుతాయని జూలైæ ఒకటో తేదీ నుంచి తెలిపింది. దీని ప్రభావం ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై పడనుంది. ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం. 2023 ఆగస్ట్ నాటికి 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నట్లు కాన్బెర్రాలోని భారత హైకమిషన్ తెలిపింది. ఇకపై విదేశీ విద్యార్థులు బ్రిటన్ వంటి దేశాలను ఎంచుకోవచ్చంటున్నారు. కునే బ్రిటన్లో స్టూడెంట్ వీసా ఫీజు 900 డాలర్లు(రూ.75 వేలు)గా ఉంది. -
ఔటర్పై నేటి నుంచి పెరగనున్న టోల్ చార్జీలు
లక్డీకాపూల్: ఔటర్ రింగ్ రోడ్పై టోల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సోమవారం నుంచి పెంచిన టోల్ చార్జీలు 5 శాతం అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్లకు ప్రతి కిలోమీటర్కి రూ.2.34 పైసలు, ఎల్సివి, మినీ బస్లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్ ట్రక్లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్ మూ వింగ్ ఎక్విప్మెంట్లకు రూ.12.40, ఓవర్సైజ్డ్ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్ చార్జీలు పెరగనున్నాయి.కొత్త టోల్ రేట్లు, రో జువారీ పాసులు, నెలవారీ పాసులు తదితరాలకు హెచ్ఎండిఏ వైబ్సైట్ను సందర్శించాల్సిందిగా ఐఆర్బి గోల్కొండ ఎక్స్ప్రెస్వే ప్రైవేట్ సంస్ధ నిర్వాహకులు సూచించారు. -
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
భూమి విలువ పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయండి ‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలి. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి. తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు ఆదాయం ఎందుకు పెరగలేదు? గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది. అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. -
హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనీ, వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు. నిజానికి ఇదేమీ వ్యాధి కాదు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు (మెడికల్ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో, అందుకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ, చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం. రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్ లాంటిది గుండె. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్తరిస్తుంది. కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా... మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం, చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు. ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది. గుండె పెరగడం.. రకాలు.. గుండె కాస్త పెరిగినప్పటికీ... ఒక దశ వరకూ అది మామూలుగానే పనిచేస్తుంది. ఒక దశకు చేరాకే అనర్థాలు కనిపిస్తాయి. గుండె పెరిగిన కారణాలూ, తీరును బట్టి ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అవి.. డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె పెరిగితే ఇందులో గుండె కింది గదులు (వెంట్రికిల్స్) రెండూ పెరుగుతాయి. అధిక రక్తపోటు కారణంగా గుండె ఎడమవైపు కింది గది మందంగా మారవచ్చు. ఇలా కండరం మందంగా మారి గుండె పెరగడాన్ని ‘హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అంటారు. ఒక్కోసారి ఏ కారణమూ లేకుండానే గుండెపెరగవచ్చు లేదా ఇతమిత్థంగా కారణం తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇడియోపథిక్ డయలేటెడ్ కార్డియో మయోపతి అంటారు. కారణాలు.. గుండె కండరానికి ఇన్ఫెక్షన్ (మయోకారై్డటిస్) వచ్చేలా చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు. గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బతినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం. గుండె చుట్టూరా ఉండే ఒక పొరలోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. దీన్ని ఎక్స్–రే ద్వారా కనుగొంటారు. రక్తహీనత వల్ల అన్ని అవయవాలకూ ఆక్సిజన్ తగినంతగా అందదు. అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో. మహిళల్లో గర్భధారణ సమయంలో గుండె పెరిగే కండిషన్ అయిన పెరిపార్టమ్ కార్డియోమయోపతి వల్ల. కార్డియాక్ అమైలాయిడోసిస్ అనే కండిషన్లో రక్తంలో అమైలాయిడ్ ప్రోటీన్ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి). దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో థైరాయిడ్ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల పల్మునరీ హైపర్టెన్షన్ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడివైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవారిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు. లక్షణాలు.. శ్వాస సరిగా అందకపోవడం కాళ్ల / పాదాల వాపు బరువు పెరగడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో.. సెంట్రల్ ఒబేసిటీ) తీవ్రమైన అలసట కొందరిలో గుండెదడ లేదా గుండె లయ తప్పడం. నిర్ధారణ పరీక్షలు.. కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్–రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్, ట్రెడ్మిల్పై చేయించే స్ట్రెస్ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ. చికిత్స.. గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఉదాహరణకు.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా. రక్తపోటును నియంత్రించే మందుల్ని వాడటం ద్వారా. గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా. మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా. ఇతర మందుల వాడకంతోనూ.. కాళ్లవాపులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై–యూరెటిక్స్తో రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో. రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్తో. గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్ అనే మందును వాడతారు. గుండె కొట్టుకోవడం ఆగితే ఇం΄్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీ ఫిబ్రిలేటర్తో తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు. గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్మేకర్’ అమర్చడం ద్వారా. లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ) అనే ఉపకరణాన్ని. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరమైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ శస్త్రచికిత్సతో. చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్) చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇవి చదవండి: మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి.. -
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు..
అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయోధ్యలో పెరుగుతున్న రద్దీ చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామి అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది అయోధ్యను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరగడంతో ఉత్తరప్రదేశ్లో దేశీయ, విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు ఈ ఏడాది చివరి నాటికి 4 లక్షల కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మునుపటి కంటే కూడా రూ. 20000 నుంచి రూ. 25000 కోట్లు ఎక్కువని అంచనా..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయ వృద్ధి సాధించనుంది. గంగా నది, వారణాసి, తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది. 2022లో మాత్రమే 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ సందర్శించారు. ఇందులో కేవలం అయోధ్యను మాత్రమే సందర్శించిన వారు 2.21 కోట్లు. ఇది 2021తో పోలిస్తే ఏకంగా 200 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 'కాంతి ఘోష్' ప్రకారం, ఉత్తరప్రదేశ్లో దేశీయ పర్యాటకులు దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకుల ఖర్చు మొత్తం రూ.2.3 లక్షల కోట్లని తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ పర్యాటక వసూళ్లలో భారతదేశం వాటా 14వ ర్యాంక్తో 2.06 శాతం తక్కువగా ఉండేది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా, ఇది ఆరవ ర్యాంక్తో కేవలం 7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా వృద్ధి చెందుతుందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అవగతమవుతోంది. జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా.. 2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఏకంగా 500 బిలియన్ డాలర్లగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వృద్ధి భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు 2027 - 2028లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆర్ధిక వృద్ధిలో 500 బిలియన్ డాలర్ల మార్కుని అధిగమించే రెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఉండనుంది. ఇది నార్వే, హంగేరీ మొదలైన యూరోపియన్ దేశాల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
ఇంకా పెరగాలి ఓటు ధర!
ఓ జర్నలిస్టు... ఓ (అ)సామాన్య ఓటరును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓటును నోటుకూ, ఓ రేటుకూ అమ్ముకుంటున్నారనీ, ఈ పద్ధతి తప్పు అని తెలియజెప్పాలని సదరు జర్నలిస్టు ఉద్దేశం. అదే విషయాన్ని అతణ్ణి అడిగాడు. ‘‘సార్... పేపర్లలో టీవీల్లో... మీరే దాన్ని ‘విలువైన ఓటు’, ‘విలువైన ఓటు’ అంటుంటారా, లేదా? మరి అంత విలువైనదాన్ని ఫిరీగా ఇచ్చేయడమేంటి?... నాన్చెంచ్’’ ‘‘ఓటు ధర ఇలా పెరిగిపోవడం ఓ చెడు సంకేతం కాదా?’’ ‘‘ఎంతమాత్రమూ కాదు. నిజానికి నా ఒపీనియనింగు పెకారం ఓటింగు ప్రైసింగు వింకా పెరగాలి. ఒకప్పటి రేట్లూ..ఇప్పటి ధరలూ, ఇప్పటికి తరిగిపోయిన రూపాయి విలువా.. వీటన్నింటినీ కూలంకచంగా పరిచీలింపచేసి, ఏ ఆడమ్ చ్మిత్తుతోనో, అమర్తచేనుతోనో లెక్కలు కట్టించారనుకోండి, పెరిగిన ద్రవ్యోల్బణం పెకారం.. ప్చ్..ఇప్పటి మన ఓటు ధర చాలా తక్కువని తెలుతుంది. ఇంకో విషయం.. ఓటు ధర బాగా పెరిగిందనుకోండి.. ‘అమ్మో.. మా చీటు ఇంతటి వ్యాల్యుయేషనబుల్ కదా’ అంటూ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని మరింత చంతృప్తిపరచేలా పాలిస్తుంటారు సార్ నేతలు’’ ‘‘అదేంటీ... ఇలా చెబుతున్నారు?’’ ‘‘సార్... మీకు మీ ఆఫీసువాళ్లు ఏడాదికోసారి బోనచు ఇస్తుంటారా, లేదా? దాన్ని మీరు తీసుకుంటారా లేక ‘అబ్బే..అప్పనంగా వచ్చింది మాకెందుకండీ’ అని వదిలేస్తారా?’’ ‘‘తీసుకుంటాం’’ ‘‘మాకు నెలనెలా వచ్చే మా పింఛనే జీతమనుకుందాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో... ఐదేళ్లకోసారి బోనచుగా ఏ ఐదువేలో, ఆరువేలో ఇస్తారు. మీరు ఏడాదికోసారి బోనచు రాకపోతేనే ఎంతో అల్లల్లాడిపోతారు కదా. మాకేమో ఏదో ఓ రెణ్ణెల్ల పింఛన్ను..అది కూడా ఐదేళ్లకు..మచ్చుకు కొద్దిగా బోనచులాగా పడేస్తే..మీరీమాత్రానికే ఇంతగా విదైపోతుంటారెందుకో నాకు అర్థంకావడం లేదు’’ ‘‘ఇలా ఓటుకు ధర పెరుగుతూ పోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం కాదా?’’ ‘‘ఓటును అమ్మడం, అమ్ముకోవడం అని మాటిమాటికీ అనకండి సిరాగ్గా! అమ్ముతున్నాడంటూ బదనాం చేయడానికి ఓటరే దొరికాడా మీకు తేరగా? అసలుఓటును అమ్ముకోడం అనడమేంటి? బార్బేరియన్’’ అన్నాడు చిరాగ్గా. ‘‘మరి ఏమనాలి?’’ ‘‘సార్.. నిజానికి ఇదొక వెకనమిక్ యాక్టివిటీ. అనగా... ఓ ఆర్థిక కార్యెకలాపం. ఉదాహరణకు..ఓ విలువైన పనికి టెండర్లు పిలుస్తారు. బిడ్డింగు వేస్తారు. ఎవరు ఎక్కువ లాభదాయకంగా కోటింగు చేస్తే, వాళ్లకు ఇస్తారు. ఓటు విషయంలోనూ అదే జరుగుతోందని ఎందుకనుకోరు? ‘అరె ఓ విలువైన పనికి బిడ్డింగు జరిగింది, ఎవరు ఎక్కువగా ఇస్తే, వాళ్లకు ఓటిచ్చారు’ అని మీరెందుకనుకోరు?’’ ‘‘బిడ్డింగులో ఎవరు లాభదాయకంగా కోట్ చేస్తే వారికే పని అప్పగిస్తారు. కానీ ఓటు విషయంలో అభ్యర్థులందరినుంచీ డబ్బులు తీసుకుంటారు కదా ఓటర్లు?’’ ‘‘నేను ముందే చెప్పాను కదా... ఇదొక ఆర్థిక కార్యెకలాపం అని. ‘ఓట్లు అమ్ముకుంటుంటారూ, అమ్ముకుంటున్నారం’టూ అదేపనిగా ఓటరును బ్లేమింగు చేస్తుంటారుగానీ..వాస్తవానికి ఏ ముగ్గురో, నలుగురో పోటీపడి ఆక్షనింగులో మానుంచి ఎమ్మెల్లే పదవిని కొనుక్కుంటున్నారననే ‘ఓ–కామర్స్’లా దీన్ని మీరెందుకు చూడరు? అరె... మార్కెట్ అన్నాక వొడిదొడుకులుంటాయ్. డిమాండును బట్టి ‘ఎలక్షన్ ఓటు రేటు సూచీ’ విండెక్చు ప్రకారం.. ఒక్కోసారి ఓటు ధర అమాంతం పెరుగుతుంది. ఒక్కోసారి పడిపోతుంది. కొన్నిసార్లు కొందరు ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్న దాఖలాలు లేవా? మిగతా కామర్చు విషయాల్లోలాగే..చెరతులు వర్తిస్తాయనీ లేదా ‘ద వోటు ప్రైసెస్ ఆర్ సజ్జెట్టు టు మార్కెట్ రిచుకు’ అని పేపర్లలో మీరే రాస్తుంటారు కదా. ఇక్కడా అంతే. చేమ్ టు చేమ్. దీనికి మీరెందుకంతగా ఆశ్చర్యపోతుంటారెందుకో నాకర్థం కావడం లేదు’’ ‘‘మీరు పేపర్లు బాగా చదువుతూ, టీవీ ఎక్కువగా చూస్తుంటారు కదా? అందునా బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రాములు’’ ‘‘అవును... మీకెలా తెలుసు?’’ కాస్త సిగ్గు నటిస్తూ, కాంప్లిమెంటులా తీసుకున్నాడా ఎక్్చపర్టు!! -
రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది. డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
భారత్లో పెరగనున్న ధాన్యం ధరలు! కారణం ఇదే..
గతకొన్ని రోజుల నుంచి కెనడా - భారత్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కెనడా పౌరులకు వీసాల మంజూరును సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు, ఇదే కొనసాగితే భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు మరింత బలపడే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల.. ఇండియా ఇతర దేశాల మీద ఆధారపడుతోంది. కెనడా నుంచి ఎక్కువగా ధాన్యాలు దిగుమతి అయ్యేవి, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మునుపటికంటే 6 శాతం దిగుమతి తగ్గినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా గణనీయమైన పాత్రను పోషించింది, ఇది భారతదేశం యొక్క మొత్తం పప్పు దిగుమతుల్లో సగానికి పైగా ఉంది. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏకంగా 1,90,784 టన్నులు దిగుమతి చేసుకున్నట్లు భారతదేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడిస్తోంది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ప్రస్తుతం భారతదేశం కూడా కెనడా మీద ఎక్కువ ఆధారపడకుండా ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల మీద ఆధారపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కానీ ఇండియన్ మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని అధికారిక ఆవివరాలు తెలియాల్సి ఉంది. -
డీమ్యాట్ నామినీ నమోదు గడువు పెంపు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్కు సంబంధించి తమ ఎంపికను తెలియజేసేందుకు గడువును సెబీ డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. వాస్తవానికి అయితే ఈ నెల 30తో ఈ గడువు ముగుస్తోంది. ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించి నామినీ నమోదు లేదంటే నామినీ నిలిపివేయడం ఏదో ఒక ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ ఎంపికను స్వచ్ఛందం చేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ట్రేడింగ్ ఖాతాలకు ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఇన్వెస్టర్ల అభీష్టానికే విడిచిపెట్టింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లు, డిపాజిటరీలు, బ్రోకర్ల అసోసియేషన్లు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ను స్వచ్ఛందం చేసినట్టు సెబీ తెలిపింది. డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి నామినేషన్ ఎంపిక గడువును డిసెంబర్ 31వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఇక ఫిజికల్గా షేర్లు కలిగిన వారు తమ ఫోలియోలకు సంబంధించి పాన్, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా, స్పెసిమెన్ సిగ్నేచర్ (సంతకం)ను డిసెంబర్ 31 వరకు ఇవ్వొచ్చని సెబీ స్పష్టం చేసింది. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు. అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. -
విమానయాన ప్రాప్తిరస్తు! ఈ ఏడాది ఎన్ని కోట్ల మంది ఎక్కుతున్నారంటే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా తెలిపింది. 2023–24లో 15–15.5 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్ ముందస్తు 2019–20నాటి 14.12 కోట్ల ప్యాసింజర్లను దాటొచ్చని వివరించింది. విమానయాన పరిశ్రమ నష్టాలను మరింత తగ్గించుకోవచ్చని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్లో నిరంతర పునరుద్ధరణ, టికెట్ల ధరలు మెరుగైన నేపథ్యంలో భారతీయ విమానయాన రంగంపై స్థిరమైన అంచనాలు ఉన్నట్టు ఇక్రా ప్రకటించింది. ‘2023–24లో ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో 6.32 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. 2019–20 ఏప్రిల్–ఆగస్ట్లో 5.89 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో విహరించారు. భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5–2.7 కోట్ల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. 2022–23లో పరిశ్రమ రూ.17,000–17,500 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,000–5,000 కోట్లకు వచ్చి చేరనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో 2023 ఏప్రిల్ నుండి తగ్గుదల (ఇటీవలి పెరుగుదల ఉన్నప్పటికీ), సాపేక్షంగా స్థిర విదేశీ మారకపు రేట్ల కారణంగా విమానయాన సంస్థల ధరల శక్తి కొనసాగుతుంది’ అని ఇక్రా వెల్లడించింది. -
హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్హెచ్బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్హెచ్బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్హెచ్బీ నివేదిక వెల్లడించింది. -
దివ్యాంగుల పింఛన్ రూ.4,016
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా నెలవారీగా ఇస్తున్న పింఛన్ పరిమితిని పెంచింది. ఇప్పటివరకు రూ.3,016 చొప్పున దివ్యాంగులకు నెలవారీగా పింఛన్ ఇస్తుండగా... జూలై నుంచి రూ.4,016 చొప్పున ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం జీఓ. 25 జారీ చేసింది. ఇప్పటివరకు ఇస్తున్న పింఛన్కు మరో వెయ్యి రూపాయల పరిమితిని పెంచిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ సీఈఓను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్మిత్తల్ ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్ పెంపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభ వేదికగా ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో సంబంధిత శాఖ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. పింఛన్ పెంపుదలతో రాష్ట్రంలో దాదాపు 5,11,656 మందికి అదనపు లబ్ధి కలగనుంది. ముఖ్యమంత్రికి మంత్రుల కృతజ్ఞతలు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆసరా పింఛన్లలో భాగంగా నెలవారీగా ఇస్తున్న మొత్తాన్ని పెంచినందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కె.చంద్రశేఖర్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దేశంలో సామాజిక పింఛన్ల పథకాన్ని ఇంత పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా? భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది. గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది. గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం! -
వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది. క్యూ1లో 8.1 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్లో పరీక్షిస్తున్న ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. ఈ–రూపీ వినియోగం స్పీడ్ అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
కాసుల గలగల.. భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 నాటికి నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3.80 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం ఇందుకు దోహదపడినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జూన్ 17 నాటికి ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.70%పెరిగి రూ. 1,16,776 కోట్లకు చేరాయి. నికరంగా వసూలైన రూ. 3,79,760 కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ పన్నులు రూ. 1,56,949 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 2,22,196 కోట్లు ఉన్నాయి. జూన్ 17 నాటికి రీఫండ్లు 30% పెరిగి రూ. 39,578 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ రిటర్నులకు అదనపు ధ్రువీకరణలు! కాగా పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్లకు అడ్డుకట్ట వేసేలా జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ విధానంలో మరిన్ని ధ్రువీకరణలను అమలు చేయాలన్న సీబీఐసీ ప్రతిపాదనను జూలై 11న జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ అలాగే రిటర్ను దాఖలు చేసేటప్పుడు కూడా అదనంగా ధ్రువీకరణ నిబంధనలను ప్రవేశపెట్టాలని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయించినట్లు వివరించారు. -
వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థులకు శుభవార్త. వారి నెలవారీ స్టైపెండ్ను ప్రభుత్వం పెంచింది. సగటున 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్ సర్జన్లతో పాటు పీజీ మెడికల్, పీజీ డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్లకు ఇస్తున్న స్టైపెండ్ను పెంచుతూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు స్టైఫండ్ పెంపు ప్రక్రిను వేగంగా పూర్తి చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. ఇలావుండగా స్టైపెండ్ పెంపు నిర్ణయంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కౌశిక్ కుమార్ పింజర్ల, ఆర్కే అనిల్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్రెడ్డి తదితరులకు జూడా తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
కొండెక్కిన కోడి ధరలు.. ఇంత ధరా? ఏం కొంటాం.. ఏం తింటాం!
ఎన్టీఆర్: కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్లో కోడి మాంసం ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరగటంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరను చూసి జేబులు పట్టుకుంటున్నారు. సహజంగానే వేసవిలో కోడి మాంసం ధరలు అధికంగా ఉంటాయి. ఈ సీజన్లో కోళ్లకు సోకే వ్యాధులతో కోళ్లు మృతి చెందటం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. దీని వలన ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ దఫా అనూహ్యంగా పెరిగిన కోడి రేట్లతో నాన్ వెజిటేరియన్లు ఏమి కొంటాము.. ఏమి తింటామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కిలో బాయిలర్ రూ.200 నుంచి రూ.210 వరకు ధర పలికింది. ఫారమ్ కోడి రూ.150 నుంచి రూ.170 వరకు ధర ఉంది. అలాంటిది ఈ వారం బాయిలెర్ మాంసం కిలో ధర రూ.280 నుంచి రూ.285 పలుకుతుంది. ఫారం కోడి కిలో మాంసం రూ.200 దాటింది. స్థానికంగా లభ్యత లేకనే... ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కోళ్లు తక్కువగా పెంచుతారు. కోతకు సిద్ధం కాగానే విక్రయిస్తుంటారు. ప్రసుత్తం జిల్లా వ్యాప్తంగా కిలో నుంచి కిలోంపావు కోళ్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయని దుకాణ దారులు చెబుతున్నారు. వినియోగదారులు చిన్న కోళ్లు కొనటానికి ఆసక్తి చూపక పోవంటతో అధిక బరువు ఉన్న కోళ్లను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి, భీమవరం ప్రాంతాల నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. గుడ్డుదీ అదే దారి... కోడి మాంసంతో పాటు కోడి గుడ్డు ధర కూడా అదే రూట్లో పెరుగుతోంది. పది రోజుల క్రితం రూ.4 లోపు పలికిన గుడ్డు ధర ఈ వారం రూ.5 కు చేరింది. అట్ట కోడిగుడ్డు ధర రూ.120 పలకగా ధర ప్రస్తుతం రూ.150కు చేరింది. కోడి మాంసం, కోడి గుడ్లు ధరలు పెరగటంతో మాంసం ప్రియులు పెదవి విరుస్తున్నారు. -
AP: గుడ్న్యూస్.. టెన్త్ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ ఎంత పెరిగిందంటే?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు (జీవో 37) విడుదల చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం)లో పాల్గొనే వారందరి రెమ్యునరేషన్ను ప్రభుత్వం పెంచింది. ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్ హర్షం ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్ తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. 2016 తరువాత రెమ్యునరేషన్ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్టీఎఫ్ నేత జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో.. -
11 కరోనా కేసుల నమోదు
మహారాణిపేట: విశాఖలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 251 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి కరోనా నిర్ధారణ అయింది. 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. 31 మంది హోం ఐసోలేషన్ ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మాధవధారలోని లవ్ అండ్ కేర్ సెంటర్లో అనాథ పిల్లలకు కోవిడ్ సోకడంతో భయాందోళన నెలకొంది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 21 ఏళ్ల మానసిక దివ్యాంగుడికి ఈ నెల 17న రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా.. కోవిడ్ నిర్ధారణ అయింది. వెంటనే అతన్ని కేజీహెచ్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అప్పటికే ఈ యువకుడికి న్యూమెనియా, ఇతర వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. అదే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మంగళవారం చనిపోయాడు. అప్పటికి ఆర్టీపీసీఆర్ నివేదిక రాకపోవడంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన రిపోర్టులో నెగిజిట్ అని తేలిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆ యువకుడు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇదే ఆశ్రమానికి చెందిన ఓ బాలికకు పరీక్షలు నిర్వహించామని.. నెగిటివ్ వచ్చిందన్నారు. కానీ ఇతర వ్యాధుల కారణంగా బాలిక ఆరోగ్యం కూడా విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్ది మొదటి స్థానం. -
వెండి బంగారం ధరలు...
-
రాష్ట్రంలో దంచికొట్టనున్న ఎండలు..ఇప్పటికే పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు
సాక్షి, అమరావతి/గోనెగండ్ల: రాష్ట్రంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఆదివారమే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో 41.9 డిగ్రీలు, చింతూరులో 41.5, కూనవరంలో 40.1, తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 41.9, కోరుకొండలో 40.3, రాజమండ్రిలో 40.6, రాజానగరంలో 40.7, ఏలూరు జిల్లా భీమడోలులో 41.6, ద్వారకా తిరుమలలో 41.2, కాకినాడ జిల్లా శంఖవరంలో 40.3, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి, ముమ్మిడివరంలో 41.8, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40, పగిడ్యాలలో 40.5, పల్నాడు జిల్లా నకరికల్లులో 40, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 41.2, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 41.2, జరుగుమిల్లిలో 40.6, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 40, కోటబొమ్మాళిలో 40.4, లక్ష్మీనరసుపేటలో 40.2, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో 41.3, వరికుంటపాడులో 41, విజయనగరం జిల్లా కొత్తవలసలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఎండవేడికి పగిలిపోయిన కొండరాయి.. మరోవైపు.. అధిక ఉష్ణోగ్రతతో కర్నూలు జిల్లా గోనెగండ్లలోని నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి రెండుగా చీలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వచ్చి పరిశీలించారు. కొండరాయి పగిలిన దగ్గర నుంచి పొగలు రావడం, రాయి చిన్నచిన్న ముక్కలుగా పడిపోతుండటాన్ని గమనించారు. ఎండ ఎక్కువగా ఉండటంతో కొండరాయి పగిలిందని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చెప్పారు. చదవండి: 1991లో ఒకటి.. ఇప్పుడు నిమిషానికి 175.. యాక్టివ్గా ఉన్నది 18 శాతం మాత్రమే! -
వంట గ్యాస్ ధర భారీగా పెంపు
వంటగ్యాస్ ధర భారీగా పెంపు -
ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ అమలుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉపక్రమించింది. ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వా త ఇప్పటివరకు అత్యంత పరిమితంగానే నెలవారీ పెన్షన్ పొందుతున్నారు. తాజాగా ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేందుకు చేసిన సవరణ అమలు కానుంది. 2014 నాటి సవరణ ప్రకారం పెన్షన్ రూ.6,500 నుంచి రూ.15 వేల మధ్యలో పొందేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ పెంపును వేతన పరిమితి ఆధారంగా నిర్ణయించేలా గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశా లకు లోబడి వర్తింపజేసేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఈపీఎఫ్ఓ జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు సర్క్యూలర్ చేసింది. సేవా విభాగం ఏర్పాటుకు ఆదేశం ఉద్యోగులు, యాజమాన్యాలు ఉమ్మడి ఆప్షన్ దర ఖాస్తును ఈపీఎఫ్ఓ క్షేత్ర కార్యాలయాలకు సమర్పించాలని సంస్థ ఆదేశించింది. ఉద్యోగుల అవగా హనకు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు ప్రకటనను నోటీసుబోర్డులో ఉంచాలని, అ«ధిక పెన్షన్ కోసం సేవావిభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతి జాయింట్ ఆప్షన్ అప్లికేషన్ను రిజిస్టర్ చేసి, డిజిటల్గా లాగ్ఇన్ చేసి, రసీదు సంఖ్యను ఉద్యోగికి అందించాలని సూచించింది. సీలింగ్ కన్నా ఎక్కువ వేతనమున్న ఉద్యోగులు అధిక పింఛన్ కోసం సమర్పించే దరఖాస్తును ప్రాంతీయ పీఎఫ్ వో అధికారులు పరిశీలించి, నిర్ణయాన్ని పోస్టు ద్వారా, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి ఈపీఎస్ అధిక పెన్షన్కు అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి. జాయింట్ ఆప్షన్ దరఖాస్తు విధానం, వివరాలు, గడువు తేదీని సంబంధిత ఆర్పీఎఫ్సీ వెల్లడిస్తారు. అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్ విషయమై ఉమ్మడి ఆప్షన్ ఫారంలో ఉద్యోగి అంగీకారం కచి్చతంగా వెల్లడించాలి. అధిక పెన్షన్ అమలుపై యాజమాన్యాలకు అవగాహన కలి్పంచడం, సమస్యలను పరిష్కరించడం, సందేహాల నివృత్తిరి ఈపీఎఫ్వో కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. చదవండి: రాష్ట్రంలోనే మొదటి గాడిదల డెయిరీ ఫామ్.. లీటరు ధర రూ. 4 నుంచి 5 వేలు! -
ఊపు మీదున్న రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపింగ్ మాల్స్, ఖరీదైన వీధుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ గతేడాది 47 లక్షల చదరపు అడుగులు నమోదైంది. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో 2021తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో వెల్లడించింది. ‘భారత రిటైల్ రంగం రికవరీ బాటలో ఉంది. ఈ ఏడాదీ ఊపు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశీ బ్రాండ్లు ప్రథమ శ్రేణి నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించడమే ఇందుకు కారణం. 2022లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ బెంగళూరులో 16.8 లక్షల నుంచి 19.2 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ ఎన్సీఆర్ 3.6 లక్షల నుంచి 9.6 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే హైదరాబాద్లో 6.4 లక్షల నుంచి 3.1 లక్షల చదరపు అడుగులకు, ముంబైలో 6.6 లక్షల నుంచి 3.9 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. 2023లో భారత్లో కొత్తగా 16 మాల్స్ రాబోతున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే స్థాయిలో మాల్స్ ఏర్పాటు కానున్నాయి’ అని వివరించింది. -
చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా. 10-15 శాతం పెరగనున్న కేటాయింపులు ఈ బడ్జెట్లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలపై దృష్టి దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది. -
రిఫ్రిజిరేటర్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: రిఫ్రిజిరేటర్లు మరింత ప్రియం కానున్నాయి. ధరలు 5 శాతం వరకు అధికం అయ్యే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ (బీఈఈ) నూతన ప్రమాణాలు జనవరి 1 నుంచి అమలులోకి రావడమే ఇందుకు కారణం. కొత్త ప్రమాణాల కారణంగా మోడల్నుబట్టి 2–5 శాతం ధర పెరగవచ్చని గోద్రెజ్ అప్లయెన్సెస్, హాయర్, ప్యానాసోనిక్ వెల్లడించాయి. ఫ్రాస్ట్–ఫ్రీ మోడళ్లలో ఫ్రీజర్స్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్ల (నిల్వ విభాగం) కోసం వేర్వేరుగా స్టార్ లేబులింగ్ను బీఈఈ తప్పనిసరి చేసింది. రిఫ్రిజిరేటర్ స్థూల సామర్థ్యానికి బదులు నికర సామర్థ్యం (వినియోగం అయ్యే స్థలం) ఆధారంగానే కంపెనీలు స్టార్ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ నివేదిక ప్రకారం భారత్లో రిఫ్రిజిరేటర్ల విపణి 2022లో రూ.25,352 కోట్లు ఉంది. -
ఈపీఎఫ్వో అలర్ట్: ఉద్యోగులకు తీపి కబురు!
సాక్షి, ముంబై: పీఫ్ చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి (సీలింగ్) ని పెంచాలని ఈపీఎఫ్వో నిర్ణయించినట్టు సమాచారం. చందాదారుల గరిష్ట వేతన పరిమితి రూ. 21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్వో యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము అందనుంది. కనీస వేతనం పెంపు? ఈ అంశంపై త్వరలో ఒక కమిటీని వేయనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతన పరిమితి 21 వేలు కావచ్చు. దీని ప్రకారం ఉద్యోగుల వేతన పరిమితి 6వేల రూపాయల మేర పెరుగుతుంది. అలాగే ఉద్యోగి పీఎఫ్లో కంపెనీ ఇచ్చే కంట్రిబ్యూషన్ మొత్తం కూడా పెరగనుంది. (చదవండి: షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!) ప్రస్తుతం రూ.15 వేలు జీతం ఉన్న ఖాతాదారుడికి ఖాతాలో రూ.1800 పీఎఫ్ కట్ అయితే, జీతం 21 వేలు అయితే, పీఎఫ్ మొత్తం రూ. 2530కు చేరుతుంది. ఫలితంగా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఇది ఉద్యోగి, యజమాని చెల్లించే వాటాలకు కూడా వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. సభ్యులకు ఈపీఎఫ్ఓ భవిష్య నిధి ఫండ్తో పాటు పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఫ్యామిలీ పెన్షన్, బీమా సదుపాయం కూడా ఉంది. (Bisleri1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) కాగా ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పథకంలో కొత్తగా 16.82 లక్షల మంది చేరారు. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది ఈపీఎఫ్వో పరిధిలోకి వస్తారని అంచనా. -
చలి ఎఫెక్ట్: రాబోయే నాలుగు రోజులు జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో చలికాల ప్రభావం మొదలైంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది. ఉదయం చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్నారు. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు.. తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో ఇప్పుడే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల్లో చలి బీభత్సంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. HIGH INTENSE COLD weather ahead even tonight in entire Telangana. Humidity has dropped to season's lowest so far and cool winds coming from North. Super cool weather with min temp upto 7°C in rural TS and upto 11°C expected in parts of Hyderabad 🥶⚠️ — Telangana Weatherman (@balaji25_t) November 16, 2022 మరోవైపులోనూ ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాడేరులో 12, మినుములురులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అరుకులోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాబోయే నాలుగు రోజులు చలి విజృంభణ మరింతగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాతి పరిస్థితిని బట్టి మరిన్ని సూచనలు చేస్తామని తెలిపారు. -
మళ్ళీ షాక్ ఇవ్వనున్న వంట నూనెల ధర ..!
-
పసిడికి ధన్తెరాస్ ధగధగలు..
న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు. పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు. -
లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఫ్లాట్లు/ఇళ్ల విక్రయాలు (రూ.1.5 కోట్లకు పైన విలువైనవి) దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 25,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ల కాలంలో మొదటి ఆరు నెలల విక్రయాలతో పోలిస్తే అధికంగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2021 సంవత్సరం మొత్తం విక్రయాలు 21,700తో పోల్చి చూసినా 20 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోని మొత్తం విక్రయాల్లో సగం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోనే నమోదయ్యాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది అద్భుతంగా సాగినట్టు అనరాక్ పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె పట్టణాలకు సంబంధించిన గణాంకాలతో అనరాక్ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2020లో 8,470 యూనిట్లు, 2019లో 17,740 యూనిట్లు అమ్ముడుపోవడం గమనించాలి. ‘‘లగ్జరీ ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ ఏడాది చాలా వరకు లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. కస్టమర్లు వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు సంపాదించారని, దాన్ని వారు ఇప్పుడు రియల్ ఎస్టేట్పై పెడుతున్నారని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు మరింత విశాలమైన ఇళ్లు అవసమని కరోనా సమయంలో అర్థం చేసుకున్నాయి. ఇది కూడా డిమాండ్ను పెంచడానికి ఓ కారణం’’అని అనుజ్పురి వెల్లడించారు. వైశాల్యం, వసతులకు ప్రాధాన్యం ‘‘కరోనా తర్వాత కొనుగోలుదారులు ఖరీదైన వసతుల కోసం చూస్తున్నారు. మరింత పెద్ద ఇళ్లను మంచి ట్రాక్ రికార్డు కలిగిన డెవలపర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’’అని కల్పతరు డైరెక్టర్ ముకేశ్ సింగ్ తెలిపారు. పట్టణాల వారీగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఖరీదైన ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో 2,420 యూనిట్లుగా ఉన్నాయి. 2021లో 1,880 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు, 2019లో 500 యూనిట్లు చొప్పున అమ్ముడుపోవడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4,160 యూనిట్లు, ఎంఎంఆర్లో 13,670 యూనిట్లు, బెంగళూరులో 2,430 యూనిట్లు, పుణెలో 1,460 యూనిట్లు, చెన్నైలో 900 యూనిట్లు, కోల్కతా మార్కెట్లో 630 యూనిట్ల చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విక్రయాలు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐల ఆసక్తి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కూడా ఇళ్లకు డిమాండ్ ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రూపాయి విలువ క్షీణించడాన్ని వారు అనుకూలంగా చూస్తున్నట్టు పేర్కొంది. 2022 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 1.84 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతానికి చేరుకుంది. కరోనా రెండో విడత తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఇప్పటికీ ఇళ్ల ధరలు సహేతుక స్థాయిలోనే ఉన్నాయని, ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్టు వెల్లడించింది. -
పెరగనున్న మాల్స్ ఆదాయం..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాదితో పోలిస్తే 2022–23లో మాల్స్ అద్దె ఆదాయం 30 శాతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ప్రధానంగా డిమాండ్ పెరగడం, కోవిడ్–19 వ్యాక్సిన్లు అత్యధికులకు ఇవ్వడం, మల్టీఫ్లెక్స్లు పునఃప్రారంభం ఇందుకు కారణం. 2021 ఆగస్ట్ నుంచి రిటైల్ మాల్స్ కార్యకలాపాల రికవరీ ప్రారంభమైంది. ఒమిక్రాన్ కారణంగా క్లుప్త విరామం మినహా 2021–22 అర్ధ భాగం మెరుగ్గా కొనసాగింది. మూడవ త్రైమాసికంలో రిటైల్ వ్యాపారం విలువ పరంగా కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో ఈ వ్యాపార విలువను మించిపోయింది. 2022–23 మూడవ త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయిలో వినియోగదార్ల రాక ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్స్కు 2019–20 స్థాయి కంటే 4–6 శాతం అధిక అద్దె ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ మరింత మెరుగు అవుతుంది’ అని ఇక్రా వివరించింది. -
థామస్ కుక్లో ప్రమోటర్ వాటా అప్
ముంబై: ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఫెయిర్బ్రిడ్జ్ క్యాపిటల్(మారిషస్).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. దీంతో ఫెయిర్బ్రిడ్జ్ వాటా 70.58 శాతం నుంచి 72.34 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. మిగిలిపోయిన దాదాపు రూ. 133 కోట్ల విలువైన ఐచ్చిక మార్పిడికి వీలు కల్పించే క్యుమిలేటివ్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లకు బోర్డు సబ్కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఫెయిర్బ్రిడ్జ్ క్యాపిటల్ తాజాగా పొందినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 47.3 ధరలో మొత్తం రూ. 436 కోట్ల విలువైన రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పు చెందినట్లు వెల్లడించింది. వెరసి ప్రమోటర్ల వాటా 72.34 శాతానికి చేరినట్లు వివరించింది. ట్రావెల్, తత్సంబంధ సర్వీసుల విభాగాలలో కనిపిస్తున్న వేగవంత వృద్ధిపట్ల ప్రమోటర్లకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిఫలిస్తున్నట్లు థామస్ కుక్ (ఇండియా) ఎండీ మాధవన్ మీనన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో థామస్ కుక్(ఇండియా) షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 56 దిగువన ముగిసింది. -
భారత్ కు పొంచి ఉన్న కరోనా ముప్పు
-
కళాశాలలు విస్తృతం.. మరింత నైపుణ్యం
సాక్షి, హైదరాబాద్: దేశ వైద్య విద్యా రంగంలో సంస్కరణల జోరు కొనసాగుతోంది. వైద్య కళాశాలలను విస్తృతం చేస్తూనే, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు పాఠ్యాంశాల్లోనూ కేంద్రం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ంది. నీట్ నిర్వహణ, ఫీజుల నియంత్రణ వంటి చర్యలతో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ముందుకు దూసుకెళ్తోంది. 2014లో దేశవ్యాప్తంగా 387 వైద్య కళాశాలలుండగా.. గత ఏడేళ్లలో వీటి సంఖ్య 54% వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశంలో 596 వైద్య కళా శాలలున్నాయి. ఇందులో 313 ప్రభుత్వ కాలేజీలు కాగా, 283 ప్రైవేటువి. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడేళ్ల కాలంలో వైద్య విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న వైద్య వసతులకు దీటుగా భారత్ ముందుకు వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. గత ఏడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా 209 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాగా, ఇందులో 73 శాతం ప్రభుత్వ, 37 శాతం ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్రం.. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా, ఇందులో ఇప్పటికే 71 కాలేజీల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొత్త కాలేజీల్లో 25 శాతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా అనుమతులు జారీ చేసింది. మొత్తం 89,875 వైద్య సీట్లు ► దేశంలో ప్రతి 10 వేల మంది జనాభాకు 11.7 డాక్టర్లు ఉన్నారు. దేశ జనాభాతో పోలిస్తే సగటున 834 మంది జనాభాకు ఒక డాక్టరు ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ► వైద్య కళాశాలల పెరుగుదలతో వైద్య సీట్లు సైతం భారీగా పెరిగాయి. 2014–15 నాటికి దేశవ్యాప్తంగా 57,138 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 89,875కు చేరింది. అదేవిధంగా పీజీ సీట్లు కూడా పెరిగాయి. ► ప్రస్తుతమున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10 వేల సీట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 15 రాష్ట్రాల్లోని 52 ప్రభుత్వ కాలేజీల్లో 3,495 సీట్లను ఇప్పటికే పెంచింది. ► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్ల ఏర్పాటు, 75 ప్రభుత్వ మెడికల్ కాలేజీల అప్గ్రెడేషన్కు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో 19 కొత్త ఎయిమ్స్లను ఏర్పాటు చేసి 1,750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ► మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చిన కేంద్రం... దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ► కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును సులభతరం చేసింది. ఇదివరకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే కనీసం 20 ఎకరాల స్థలం ఉండాలి. ఇప్పుడు 10 ఎకరాల స్థలం ఉన్నా చాలు. 750 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఇప్పుడు 600కు కుదించింది. ► వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష.. నీట్ను ప్రవేశపెట్టింది. వైద్య విద్య బోధనలో స్కిల్ ల్యాబ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫీజుల నియంత్రణను నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా చట్టబద్ధం చేసింది. ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల నియంత్రణ కమిషన్ పరిధిలోనే ఉంటుంది. ► వైద్య విద్య పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకువచ్చింది. యూజీ విద్యార్థులకు సబ్జెక్టుతో కూడిన మార్కులతో పాటు యాటిట్యూడ్, కమ్యూనికేషన్కు కూడా మార్కులు కేటాయించింది. దీంతో విద్యార్థిలో నైపుణ్యం పెరుగుతుందని నివేదిక చెబుతోంది. కాలేజీల్లో నాణ్యత పెరిగేలా వాటి పనితీరు ఆధారంగా గ్రేడింగ్/ర్యాంకింగ్ ఇస్తోంది. -
ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారీ పన్ను వసూళ్లు బూస్ట్!
న్యూఢిల్లీ: బడ్జెట్లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని, పన్ను రాబడులు పుంజుకుంటాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆయా అంశాలు ఎకానమీని ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడుపుతాయన్న భరోసాను వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయ ం)ను 35.4% పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. తాజా ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అంచనాలపై ఆర్థిక శాఖ ఆవిష్కరించిన అవుట్లుక్లో ముఖ్యాంశాలు... ► గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు రికార్డు స్థాయిలో 34% పెరిగి రూ. 27.07 లక్ష ల కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొని వేగవంతమైన పురోగతి సాధిస్తోందనడానికి ఇది గొప్ప సాక్ష్యం. ► భారత్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిబద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఆయా అంశాలు దేశాన్ని పటిష్ట ఆర్థిక పురోగతి బాటన నిలుపుతున్నాయి. ► ఎకానమీ పటిష్ట బాటన నడుస్తోందని ఇటీవల భారీగా పెరిగిన పన్ను ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధన సాధ్యమేనని ఈ గణాంకాలు భరోసా ఇస్తున్నాయి. 2020–21లో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.6.5 లక్షల కోట్లయితే, ఇది 2021–22లో రూ.8.6 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో 49 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల వసూళ్లు 20 శాతం పెరిగి 12.90 లక్షల కోట్లకు ఎగశాయి. ► పన్ను వసూళ్ల బేస్ పెంపు, తక్కువ వడ్డీరేట్లు, మినహాయింపులు లేని కొత్త సరళీకృత పన్ను విధానం, కార్పొరేట్ రంగానికి వ్యాపారాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం, పన్ను ఎగవేతలకు చర్యలు వంటి పలు సంస్కరణాత్మక చర్యలు పన్నుల రాబడిని పెంచడానికి, తద్వారా ఎకానమీ పురోగతికి దోహదపడుతున్నాయి. -
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. హైదరాబాద్లో మెట్రో రైళ్ల వేగం పెంపునకు CMRS గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంటకు 80 కి.మీ నుంచి 90 కి.మీకి స్పీడ్ పెంచుకునేందుకు CMRS అనుమతిచ్చింది. అయితే, మార్చి 28,29,30 తేదీల్లో మెట్రో రైలు స్పీడ్, సెక్యూరిటీని అధికారులు పరిశీలించారు. తనిఖీల అనంతరం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో స్పీడ్ను పెంచుకునేందుకు అనుమతించింది. కాగా, మెట్రో రైలు స్పీడ్ పెంపుతో ప్రయాణికులకు ట్రావెల్ సమయం ఆదా కానుంది. నాగోల్-రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్-ఎల్బీనగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య ఒకటిన్నర నిమిషం ఆదా అవుతుంది. ఇదిలా ఉండగా.. ప్రయాణికులు కోసం సూపర్ సేవర్ కార్డును మెట్రో ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డుతో హైదరాబాద్లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య సెలవు రోజుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. -
వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!
మిర్యాలగూడ: నిత్యావసర ధరలు పెరగడంతో ఇప్పటిటే సామాన్యులు అల్లాడుతండగా.. మూలిగే నక్కపై తాటిపడ్డ చందంగా వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ధరలు లీటరుపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి అయ్యే సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కాకపోవడంతో పామాయిల్కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో పామాయిల్ వాడకం ఎక్కువ కావడంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో వంటనూనెను కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులే కావాలని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తగ్గిన సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి వంట నూనె ధరల పెరుగుదలకు ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్లో 80 శాతం వరకు సన్ఫ్లవర్ సాగుచేస్తారు. రష్యాలో కూడా ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. ఆ రెండు దేశాల నుంచి భారత్ సన్çఫ్లవర్ దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఏటా 3లక్షల టన్నుల నూనెను దిగుమతి చేసుకోగా యుద్దం కారణంగా ప్రస్తుతం 1.40లక్షల టన్నులకు తగ్గింది. ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమ తి చేసుకునే పామాయిల్ వినియోగం పెరగడంతో పామాయిల్ ధర కూడా అమాంతం పెరిగింది. అంతేకాకుండా త్వరలోనే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించారు ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాకుగా చూపించి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెల ధరలను విపరీతంగా పెంచుతున్నారు. అధి కారులు స్పందించి దుకాణాలపై దాడులు చేసి ధరలు పెంచి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. – కోల ఉమాశ్రీ, మిర్యాలగూడ దిగుమతి అంతరాయంతోధరలు పెరిగాయి ఉక్రెయిన్, ఇండోనేషియా నుంచి వంట నూనెలు దిగుమతి అవుతాయి. దిగుమతి అంతరాయం వల్లే కంపెనీ నిర్వాహకులు ధరలు పెంచారు. స్టాక్ పెట్టేందుకు అవకాశం లేదు. వచ్చినది వచ్చినట్లుగానే వినియోగదారులకు అందించేందుకు నా వంతు కృషిచేస్తా. – చల్లా భాస్కర్, వంట నూనెల హోల్సేల్ డీలర్ -
అటు బాంబుల మోత.. ఇటు ధరల వాత
-
ఉపాధి.. మరింత పెరిగేలా
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలి కంటే ఎక్కువ మొత్తం దక్కేందుకు వీలుగా పనిగంటలు పెంచుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల డ్వామా పీడీలకు, ఉపాధి హామీ పథకం సమన్వయకర్తలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకం కింద పనిచేసే వారికి సరాసరిన రూ. 221ల చొప్పున కూలి అందుతోంది. అయితే, మన రాష్ట్రంలో గరిష్టంగా రూ.245 చొప్పున కూలి ఇచ్చే అవకాశముంది. ఇందుకనుగుణంగా రోజు వారీ కూలీ రూ.245 వచ్చేలా కూలీల పనిగంటలు పెంచుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీచేశారు. వేసవిలో రెండు పూటలా హాజరయ్యేలా.. ఇక రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉ.6 గంటల నుంచి 10 గంటల మధ్య.. మళ్లీ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు కూలీలు హాజరయ్యేలా చూస్తే మంచిదని జిల్లా అధికారులకు ఆయన సూచించారు. మరోవైపు.. కూలీలకు ఎక్కువసేపు పనిచేసి, ఎక్కువ మొత్తంలో వేతనం పొందేలా ప్రతి శ్రమశక్తి సంఘం (ఎస్ఎస్ఎస్ గ్రూపు)లో 40 మంది కూలీలు సభ్యులుగా ఉండేలా చర్యలు చేపట్టాలని కూడా కమిషనర్ జిల్లా అధికారులకు సూచించారు. ప్రతి గ్రూపులో చదువుకున్న మహిళను మేట్గా నియమిస్తే ఆమెను వర్క్సైట్ సూపర్వైజరుగా గుర్తిస్తారు. కూలీల సమీకరణ, ప్రతి కూలీకి రూ.245 చొప్పున వేతనం దక్కేలా ఆయా కూలీలకు పనిని మార్కింగ్ చేసి ఇవ్వడం, పనికి హాజరయ్యే కూలీల మస్టర్లు నమోదు వంటి విధులను మేట్ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మేట్ నమోదు చేసే మస్టర్లను గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్ ధృవీకరించి సంతకం చేయాల్సి ఉంటుంది. రోజూ లక్ష మందికి పని.. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గుముఖంపడుతుండడంతో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన పెంపుపై గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి పెట్టింది. ఇక నుంచి వచ్చే 40 రోజులతోపాటు ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం లక్ష మందికి ఉపాధి పనుల కల్పనకు సిద్ధంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో మార్చి నెలాఖరులోగా ఐదు కోట్ల పనిదినాల పనుల కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
వ్యయాల పెంపుతో డిమాండ్కు పునరుత్తేజం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యయాల పెంపు వ్యవస్థలో డిమాండ్ పునరుత్తేజం, పటిష్టతకు అలాగే ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్ విభాగాలకు ఈ నిర్ణయం మంచి ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ప్రత్యక్ష మద్దతు చర్యలు పరిమిత స్థాయిలోనే సానుకూల ప్రభావం చూపిస్తాయని పేర్కొన్న ఆయన, ఆర్థిక వ్యవస్థను స్థిరమైన పద్ధతిలో మెరుగుపరచడానికి దీర్ఘకాలం నుండి మధ్యకాలిక ప్రభావాన్ని కలిగి ఉండే చర్యలు అవసరమని చెప్పారు. ‘‘ఆర్థికాభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు ఏదో ఒక ఏడాదికి సంబంధించి అంశం కాదు. ఇవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంశాలతో ఇమిడి ఉంటాయి. ప్రత్యక్ష ఆదాయ మద్దతు స్వల్పకాలిక ప్రయోజనాలకు తగిన విధంగా ఉపయోగపడుతుందనికానీ, మధ్యకాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇక్కడ మూలధన వ్యయాల కీలకమైనవి. దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలు సమకూర్చుతాయి. ఈ చర్యల వల్ల ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడుల ప్రక్రియ పురోగమిస్తుంది’’ అని ఆయన అన్నారు. వినియోగ ధోరణి పట్ల దీర్ఘకాలిక రీతిన ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రధానమని ఆయన అన్నారు. పెట్టుబడులకు సంబంధించి మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్కు సంబంధించి) భారీగా 35.4% పెంచుతూ 2022–23 బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే, 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు బడ్జెట్ పేర్కొంది. -
దేశం సుసంపన్నం కావాలంటే..
నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యు డిగా నా మనస్సులో ఏడు సూత్రాల ఎజెండా ఉంది. ఈరోజు మనం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి, నవతరం సంపద సృష్టికర్తల పురోగతి గురించి సంబరంగా మాట్లాడుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా భావనను ఈ స్టార్టప్స్ ముందుకు తీసుకెళతాయి. భారత్ను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఈ ఏడు సూత్రాలను పరిశీలిద్దాం. ఒకటి. 2020 సంవ త్సరం గణాంకాలను చూసినట్లయితే మన జనా భాలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 80 శాతం మేరకు 20 శాతం ఆదాయ పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తోంది. అంటే అధికాదాయం పొందు తున్న 0.4 శాతం మంది వ్యక్తులు 80 శాతం పన్నులను చెల్లిస్తున్నారు. వీరిని మనం తప్పకుండా గౌరవించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల్లో చాలామంది వేధింపులకు గురవుతున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 2019లో అధికాదాయం కలిగిన వారిలో 7 వేలమంది విదేశాలకు వలస వెళ్లిపోయారని వార్తలు. ఇలా దేశం విడిచిపెట్టిన వారిలో చాలామంది తమచుట్టూ విషపూరితమైన వాతావరణం, వేధింపుల గురించి మాట్లాడు తున్నారు. అలా దేశాన్ని వదిలి వెళ్లిపోయిన సంపద సృష్టికర్తలందరినీ తిరిగి వెనక్కు తీసుకొచ్చి జాతి ఉన్నతి కోసం వారు పాటుపడేలా ప్రోత్సహించే రోజు కోసం నేను కలగంటున్నాను. 2. పారిశ్రామిక నేతలు తరచుగా ప్రభుత్వంతో తమ సంప్రదింపుల గురించి మాట్లాడుతుంటారు. అయితే పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం కొరవడటం గురించి ఒక సందర్భంలో కూడా వీరు మాట్లాడటం లేదు. అందుకే న్యాయమైన, పార దర్శకమైన వ్యవస్థ కోసం మనందరం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది. 3. సులభతర వాణిజ్య సూచికి సంబంధించి తన స్కోరును పెంచుకోవడంలో భారత్ ఎంతో మెరుగైంది. వాణిజ్యవర్గాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రశంసలు అందుకుంటోంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో గొప్ప సానుకూలత ఉంది. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిబద్ధతను ప్రదర్శించింది. అయితే వాణిజ్య రంగంలో మనం చేయవలసింది ఎంతో ఉంది. 4. నిష్పక్షపాతమైన, న్యాయమైన, సంతోష కరమైన సమాజానికి హామీ ఇచ్చేలా న్యాయ సంస్కరణల దిశగా మనం కృషి చేయవలసిన అవ సరం ఉంది. 5. పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో చాలా రాష్ట్రాలు అమలుపర్చలేదని తాజా నివేదిక తెలి పింది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. 6. నాణ్య మైన విద్యను మనం మెరుగుపర్చాలి. 2020 జాతీయ విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం. శిక్షణ పొందిన, ఉపాధి పొందగల శ్రామిక శక్తికి భరోసా ఇచ్చేలా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. 7. నేడు భారత్ అవకాశాలు పురివిప్పుతున్న దేశం. నిజంగానే కోవిడ్–19 మహమ్మారి అనిశ్చిత త్వాన్ని పరిష్కరించడంలో మన సామర్థ్యాన్ని పరీ క్షించింది. ఈ విషయంలో మరిన్ని çసృజనాత్మక ఆవిష్కరణలు రావాల్సిన తరుణమిది. దేశం పోకడ గురించి అనేక వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భేదాభిప్రా యాలు, చీలికలు మనల్ని కలవరపెడుతున్న ప్పుడు త్రివర్ణ పతాకాన్ని మన మనస్సులో ఉంచు కోవలసిన సమయమిది. జాతీయ జెండా కంటే మించిన ఐక్యతా చిహ్నం మరొకటి లేదు. – నవీన్ జిందాల్ చైర్మన్ – జిందాల్ స్టీల్ అండ్ పవర్, మాజీ ఎంపీ -
ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ?
Allu Arjun High Remuneration For Lyca Productions Movie After Prabhas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత మరో మలుపు తిరిగింది. టాలీవుడ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. బాలీవుడ్లో రూ. 75 కోట్ల కలెక్షన్సు రాబట్టి హిందీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు పుష్ప రాజు. ముఖ్యంగా సినిమాలోని బన్నీ యాక్టింగ్కు విమర్శకులు, ప్రేక్షకలోకం ఫిదా అయింది. అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి తర్వాత ఇదే సుకుమార్ డైరెక్షన్లో ఆర్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్న బన్నీ యాక్టింగ్, డ్యాన్సింగ్లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. (చదవండి: హెల్మెట్తో 'పుష్ప'రాజ్.. పోలీసుల అవగాహన) వీటన్నింటితో పోలిస్తే పుష్పతో పాన్ ఇండియా స్టార్గా మారాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్పై ఫోకస్ పెట్టనున్నాడు అల్లు అర్జున్. 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత బన్నీ ఏం మూవీ చేస్తాడనేది హాట్ టాపిక్గా మారింది. పుష్పకు వచ్చిన క్రేజ్ చూసి పలువురు నిర్మాతలు బన్నీకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారట. అయితే పుష్ప తొలి భాగానికి అల్లు అర్జున్ రూ. 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ దక్షిణాది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బన్నీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆ సినిమా కోసం బన్నీకి ఏకంగా రూ. 75 కోట్లు ఇచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (చదవండి: 'పుష్ప'రాజ్కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు) ఇదే నిజమైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే స్టార్గా అల్లు అర్జున్ రికార్డ్ కొట్టినట్టే. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాలకు ప్రభాస్ రూ. 100 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. టాలీవుడ్లో ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకునే వారిలో ఇప్పటివరకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, తర్వాత బన్నీ ఉండేవారు. ఇప్పుడు ఈ లైకా ప్రొడక్షన్స్తో సినిమా నిజమైతే ప్రభాస్ తర్వాతి స్థానం అల్లు అర్జున్దే అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా హలచల్ చేస్తోంది. (చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు) -
వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్
వినియోగదారులకు గృహోపకరణ సంస్థలు భారీ షాకివవ్వనున్నాయి. జనవరి ఫెస్టివల్ సీజన్ నుంచి మార్చి ఈ మూడు నెలల మధ్య కాలంలో ఫ్రిజ్, ఏసీల ధరలు భారీగా పెంచనున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్ సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రకారం..ముడి సరకుతో పాటు సరుకు రవాణా పెరగడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ను 5 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు ఆయా కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. కమోడిటీస్, గ్లోబల్ ఫ్రైట్, ముడి సరుకు పెరుగుదలతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుండి 5 శాతం వరకు పెంచడానికి చర్యలు తీసుకున్నామని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇప్పటికే ఏసీల ధరలను 8శాతం వరకు పెంచిన పానాసోనిక్, మరింత పెంచే ఆలోచనలో ఉందని, అందుకే గృహోపకరణాల ధరల పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ కండీషనర్లు ఇప్పటికే దాదాపు 8 శాతం పెరిగాయి.పెరుగుతున్న వస్తువులు, సప్లయ్ చైన్ ధరల్ని బట్టి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, గృహోపకరణాల ధరల పెరగొచ్చని పానాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. కాగా, భారత్లో రూ.75 వేల కోట్లున్న ఇండియన్ అప్లయన్స్ మార్కెట్ కోవిడ్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్డౌన్, చిప్ కొరతతో పాటు ఉత్పత్తులు తగ్గి పోవడం,అదే సమయంలో డిమాండ్లు పెరగడంతో పలు కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
అమ్మాయిల ఐఐఠీవి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య 9,450 మాత్రమే కాగా 2020–21 నాటికి 20,228కి చేరుకుంది. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) విభాగాలలో యువతుల భాగస్వామ్యం 2017 నాటికి 14 శాతం ఉందని.. దీన్ని మరింత పెంచాలన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థినుల చేరికలు పెరిగాయి. 2018 నుంచి అదనపు కోటా ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు 2018–19లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో విద్యార్థినులకు 14 శాతం మేర ప్రత్యేక కోటా సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర వర్గాల కేటాయింపులకు భంగం కలగ కుండా సూపర్ న్యూమరరీ కోటా కింద అదనంగా ఆ సీట్లను సిద్ధం చేసింది. అదనపు సీట్లను 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అమ్మాయిల చేరికలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి. గతంలో ఐఐటీల్లో 9,450 మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య 2019–20 నాటికి 18,456కి పెరిగింది. 2020–21లో ఇది మరింత పెరిగి 20,228 మంది చేరడం గమనార్హం. ప్రత్యేక కోటా వల్ల ఐఐటీల్లో యువతుల చేరికలు 2018 నాటికి 18 శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. ఐఐటీల్లో ఈ అదనపు కోటాను 8 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంటర్లో రాణిస్తున్నా.. మండి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ తిమోతి ఎ.గోన్సాల్వేస్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన ప్రత్యేక కమిటీ జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధిస్తున్న బాలికల శాతం 11 నుంచి 12.5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఐఐటీ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదు వారికి అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఇంటర్లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధిస్తున్నా జేఈఈ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో వెనుకంజ వేయటానికి కారణాలను కమిటీ లోతుగా విశ్లేషించింది. -
ప్రజలకు షాక్.. ఎవర్నీ వదల్లే..!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పొంచి ఉన్న విద్యుత్ చార్జీల బాంబు ఒక్కసారిగా పేలనుంది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై బాదుడుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగనుండగా, మే నుంచి కరెంటు బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రతిపాదించాయి. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్కు 50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచుకో వడానికి అనుమతి కోరా యి. ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఏటా.. ఎల్టీ విభాగంలోని 1.10 కోట్ల గృహాలు, 44 లక్షల గృహేతర కేటగిరీల వినియోగదారులపై 2,110 కోట్లు, హెచ్టీ విభాగంలోని అన్ని కేటగిరీలు కలిపి 13,717 మంది వినియోగదారులపై రూ.4,721 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ మేరకు 2022–23కు సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్ఎస్పీ డీసీఎల్/టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్రావు సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ.మనోహర్రాజు, బండారు కృష్ణయ్యకు ప్రతిపాదనలు అందజేసిన అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో వినియోగం తర్వాత మేలో జారీ చేసే బిల్లుల్లో చార్జీల పెంపు ప్రభావం వినియోగదారులకు కనిపించనుంది. ఆర్థిక లోటు రూ.16,580 కోట్లు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 2022–23లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.53,054 కోట్ల వ్యయం కానుందని, ఆమేరకు వార్షిక ఆదాయ అవసరాలుండనున్నట్టు డిస్కంలు అంచనా వేశాయి. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యధాతథంగా అమలు చేస్తే రూ.36,474 కోట్ల ఆదాయం మాత్రమే రానుందని, దీంతో రూ.16,580 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని నివేదించాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,652 కోట్ల మేర సబ్సిడీ సొమ్ము ఇవ్వనుందని, దీంతో మొత్తం ఆదాయం రూ.42,126 కోట్లకు పెరిగి, ఆదాయ లోటు రూ.10,928 కోట్లకు తగ్గుతుందని అంచనా వేశాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, ఇంకా మిగిలే రూ.4,097 కోట్ల ఆదాయ లోటును అంతర్గత సమర్థత చర్యలు/ ప్రభుత్వ అదనపు మద్దతుతో పూడ్చుకుంటామని ఈఆర్సీకి నివేదించాయి. ఉచితం, సబ్సిడీ పథకాలు యధాతథం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు ఉచితంగా 101 యూనిట్లు వంటివి యధాతథంగా కొనసాగనున్నాయి. నాయి బ్రాహ్మణుల హెయిర్ సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు నెలకు ఉచితంగా 250 యూనిట్లు, పవర్ లూమ్స్, పౌల్ట్రీలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్పై రూ.2 చొప్పున సబ్సిడీ వంటి పథకాలు కూడా కొనసాగుతాయని రఘుమారెడ్డి వెల్లడించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత 18.72 శాతం పెంపు తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, తర్వాత 2016–17లో విద్యుత్ చార్జీలు పెంచారు. ఆ తర్వాత ఐదేళ్లుగా ఎలాంటి చార్జీలు పెంచలేదు. ప్రస్తుత చార్జీలతో 2022–23లో రూ.36,474 కోట్ల ఆదాయం రానుండగా, రూ.6,831 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అంటే వినియోగదారులపై 18.72 శాతం అదనపు భారం పడనుందన్నమాట. విద్యుత్ టారిఫ్లోని ఎనర్జీ చార్జీల పెంపును మాత్రమే సోమవారం బహిర్గతం చేయగా, ఫిక్స్డ్ చార్జీలు ఎంత పెంచబోతున్నారన్న అంశాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఫిక్స్డ్ చార్జీలతో సహా మొత్తం రిటైల్ టారిఫ్ షెడ్యూల్ను ప్రకటించిన తర్వాతే వినియోగదారులకు సంబంధించిన బిల్లులు ఏ మేరకు పెరగబోతున్నాయన్న అంశంపై స్పష్టత రానుంది. కొత్తగా లోడ్ చార్జీలు! కిలోవాట్కు రూ.15 ఎనర్జీ చార్జీలు, ఫిక్స్డ్/డిమాండ్ చార్జీలు కలిపి వినియోగదారులకు బిల్లులను జారీ చేస్తారు. ఇప్పటివరకు గృహ వినియోగదారులపై ఎనర్జీ చార్జీలే విధిస్తుండగా, కొత్తగా వారి లోడ్ సామర్థ్యం ఆధారంగా కిలోవాట్కు రూ.15 చొప్పున ఫిక్స్డ్/ డిమాండ్ చార్జీలను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. వాణి జ్య, పరిశ్రమల కేటగిరీలో ఫిక్స్డ్ చార్జీల పెంపు నకు కూడా అనుమతి కోరినట్టు తెలిసింది. -
హైదరాబాద్ను కప్పేసిన దట్టమైన పొగమంచు.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ను పొగమంచు కప్పేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. మరోవైపుసాయంత్రం అయిదు గంటలకే కారుచీకట్లు అలుముకునేలా సర్పిలాకారంలో (స్పైరల్) కమ్మేసిన కారుమబ్బులు.. మరోవైపు వాహనాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ.. వెరసీ.. సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూ వాతావరణానికి తక్కువ ఎత్తులో.. కేవలం 0.9 కి. మీ ఎత్తులోనే దట్టమైన క్యుములో నింబస్మేఘాలు ఏర్పడడం వీటి నుంచి నింబోస్ట్రేటస్, అల్టోస్ట్రేటస్ అనే వాయువులు వెలువడడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ సమస్యలున్నవారు ఊపి రాడక విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: ‘గుడ్’మార్నింగ్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు కాలుష్యం.. కారుమబ్బులు.. ► నగరంలో పీల్చే గాలిలో వాయు కాలుష్యం తీవ్రమవడంతో ఆయా కారకాలు దట్టమైన మేఘాల కారణంగా భూ ఉపరితల వాతావరణంలో పైకి వెళ్లలేక భూవాతావరణాన్ని ఆవహిస్తున్నాయి. మరోవైపు అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా.. సిటీజన్లు న్యుమోనియా, అస్తమా, ఓమిక్రాన్ తదితర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ► క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం)తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.ì గత మూడు రోజులుగా ఇదే దుస్థితి నెలకొంది. కాలుష్యం విషయానికి వస్తే..సిటీలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. చదవండి: HYD: మందుతాగి పోలీసులకు దొరికితే.. ఇక ఆఫీస్లో మీ పని అంతే! ►గ్రేటర్ పరిధిలో సుమారు 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. పలు కూడళ్లలో సుమారు 90–100 మైక్రోగ్రాముల ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. అంతేకాదు ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త... ఉష్ణోగ్రతలు పడిపోతుండడం, పొగమంచు కారణంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. చలినుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరని సూచిస్తున్నారు. -
టారిఫ్ల పెంపు.. ‘ట్రాయ్ నిద్రపోతోందా?’
BoycottJioVodaAirtel Twitter Trend Amid Tariffs Hike: పరిణామాలు ఏవైనా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలు మొదలుకుని.. ప్రతీదానిపైనే బాదుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మొబైల్ టారిఫ్ల పెంపుపైనా వ్యతిరేక గళం వినిపిస్తోంది. భారత జనాభాలో సగానికి కంటే ఎక్కువగా(దాదాపు 60 శాతంపైనే అని సర్వేలు చెప్తున్నాయి) మొబైల్ ఇంటర్నెట్నే ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో ధరల పెంపు పెద్దషాక్ అనే చెప్పాలి. ఈ తరుణంలో టెలికాం కంపెనీలను నియంత్రించలేని ట్రాయ్ (TRAI) నిద్రపోతోందా? అంటూ తీవ్ర విమర్శలను దిగుతున్నారు నెటిజనులు. నష్టాల సాకును చూపిస్తూ.. టెలికామ్ కంపెనీలన్నీ సగటు భారతీయుల డబ్బును దోచేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎయిర్లెట్, వొడాఫోన్-ఐడియా, జియో కంపెనీలు 20రూ. మినిమమ్ పెంపుతో రెగ్యులర్, డాటా టారిఫ్ ప్యాకేజీలన్నింటిని సవరించడం సామాన్యుడికి దెబ్బే అని చెప్పాలి. పేద దేశమైనా సుడాన్ సూపరహే.. 1 జీబీకి ఎంత ఖర్చంటే.. ఇక ఎయిర్టెల్, వొడాఫోన్, జియో కంపెనీలు టారిఫ్లను అమాంతం పెంచేయడంపై నిరసన తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. అదే టైంలో ఈ నిరసన సరదా కోణంలోనూ నడుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇంటర్నెట్తోనే ఈ ట్రెండ్ను నడిపిస్తున్నారంటూ సరదా కామెంట్లు కనిపిస్తున్నారు. పరుషంగా తిట్టలేక మీమ్స్ టెంప్లెట్స్తో విమర్శిస్తున్నారు కొందరు. పెరిగిన జియో టారిఫ్ ధరల పూర్తి వివరాలు VI పెంచిన ధరలు ఇవే! ఎయిర్టెల్ బాదుడు.. ఇలా ఉంది మరికొందరేమో బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లడం మంచిదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్పరం చేయొద్దని, అలాగని ప్రజలంతా బీఎస్ఎన్ఎల్ (సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా) పోర్ట్ కావాలంటూ పిలుపు ఇస్తున్నారు నెటిజన్స్. ట్విటర్లో ఈ ట్రెండ్ను మీరూ చూసేయండి. #BoycottJioVodaAirtel In the past jio hiked the prices then after all the telecom companies hiked,but now airtel hiked then after suddenly jio hiked something is fishy, #Airtel #Jio #VI these fu.... Companies wanted to create monopoly in the market — VAMSHI RUDRA (@VAMSHIRUDRA2) November 29, 2021 #BoycottJioVodaAirtel is trending People who are using BSNL right now reaction of #BSNL user..💪 pic.twitter.com/ZXCMPA4EHR — Rakesh prajapat (@Rakeshp8290) November 29, 2021 #BoycottJioVodaAirtel We will go to BSNL network — prakash (@sibdumercury) November 29, 2021 #BoycottJioVodaAirtel People in this corona situation lost their jobs and all the investments. In this difficult situation the telecom operators are ruthlessly increasing their tariff price. 😡😡🤬🤬😤😤😤🤧🤧 @JioCare @reliancejio — Satnam Singh (@SatnamS1995) November 29, 2021 Why @TRAI is sleeping? all telecome companies are extending their money is it easy to paid by poor people? wake up TRAI.#BoycottJioVodaAirtel pic.twitter.com/L6CKCy3m4k — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Jio Raises Prepaid Rates By Up To 20% After Airtel, Vodafone Idea. Where is @TRAI in all this loot?#BoycottJioVodaAirtel — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Meanwhile me to those who are trending: #BoycottJioVodaAirtel pic.twitter.com/yk8POQ387W — All in One 🇮🇳 (@mayankm94847123) November 29, 2021 This woman got so busy on her mobile that she left her child at the hotel. Just think from where did this mobile reach us #BoycottJioVodaAirtel #Vellore #VirgilAbloh #NZvsIND #bimbisarateaser pic.twitter.com/svBgJczqSV — Imtiyaz Ahamad (@ahamad1_imtiyaz) November 29, 2021 -
RBI Report: శ్రమజీవికి సంతోషం.. ఏపీలో కూలీల వేతనాలు పెరుగుదల..
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీల వేతనాలు కేరళలో అత్యధికంగా ఉంటే అత్యల్పంగా గుజరాత్లో ఉండటం గమనార్హం. చదవండి: ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఇక రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది. -
పండగ సీజన్లో ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్ !
Flipkart Pay Later Limit: పండగ వేళ కస్టమర్లకు మరో ఆఫర్ని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఈ కామర్స్ ఫ్టాట్ఫామ్పై తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి తదుపరి నెలలో బిల్ పే చేసే అవకాశాన్ని పే లేటర్ ద్వారా ఫ్లిప్కార్ట్ కల్పిస్తోంది. కొత్త వారికి అవకాశం ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పది కోట్ల మంది కష్టమర్లకే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. పండగ సీజన్ని పురస్కరించుకుని మరింత మందికి పే లేటర్ అవకాశం కల్పిస్తోంది. పే లేటర్ ఆప్షన్ పొందాలని అనుకునే వారు ఆధార్కార్డు, బ్యాంకు డిటైల్స్ అందివ్వడం ద్వారా పే లేటర్ని ఏనేబుల్ చేసుకోవచ్చు. కొత్తగా పది కోట్ల మందిని ఈ ఆప్షన్ పరిధిలోకి తేవాలని ఫిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్కార్ట్ యాప్లో మోర్ ఆన్ ఫ్లిప్కార్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి క్రెడిట్ ఆప్షన్లోకి వెళితే పే లేటర్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ ఆప్షన్ని పొందవచ్చు. లిమిట్ పెంపు పే లేటర్ ఆప్షన్లో ప్రస్తుతం క్రెడిట్ లిమిట్ కేవలం రూ. 10,000గానే ఉంది. తాజాగా ఈ మొత్తాన్ని రూ. 70,000లకు పెంచుతూ ఫ్లిప్కార్ట్ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్లో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ లిమిట్ను పెంచినట్టు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. పే లేటర్ ఆప్షన్లో వినియోగించిన మొత్తాన్ని కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి ఏడాదిలోగా ఈఎంఐ పద్దతిలో చెల్లించే వీలు సైతం కల్పించింది. పే లేటర్ ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు సందర్భంగా పదే పదే బిల్లులు చెల్లింపులు చేయడానికి బదులు నెలలో జరిగిన చెల్లింపులకు ఒకే సారి బిల్లును పొంది,ఆ మొత్తాన్ని తదుపరి నెలలో ఒకే సారి చెల్లించవచ్చు. అంతేకాదు క్రెడిట్కార్లు లేక కోనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న వారికి సైతం ఈ పే లేటర్ ఆప్షన్ ఉపయుక్తంగా ఉంటుంది. చదవండి: వచ్చేస్తోంది.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు...! -
తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ
కాబూల్: అఫ్గానిస్తాన్ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటినుంచీ సానుకూలంగా ఉన్న చైనా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అలాగే సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్కు అందించే మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దీనిపై చైనా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మేరకు దోహాలో తాలిబన్ల ప్రతినిది అబ్దుల్ సలాం హనాఫీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ విదేశాంగ మంత్రి వు జియాంగావోతో ఫోన్ ద్వారా సంభాషించినట్టు సుహైల్ షాహీన్ ట్వీట్ చేశారు. కాబూల్లో తమ రాయబార కార్యాలయాన్ని నిర్వహించడం తోపాటు, గతంతో పోలిస్తే సంబంధాలు మరింత బలపడతాయని వు జియాంగావో తెలిపారన్నారు. అలాగే కోవిడ్-19 చికిత్సకు సంబంధించి తన సాయాన్ని పెంచనుందని అబ్దుల్ సలాం వెల్లడించారు. కాగా అఫ్గాన్లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో తొలిసారిగా మద్దతు ప్రకటించింది చైనా మాత్రమే. ఆ తరువాత పాకిస్తాన్, రష్యా కూడా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. భద్రత క్షీణించడంతో తమ పౌరులను తరలిస్తున్నప్పటికీ కాబూల్లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోంది. ప్రస్తుత భద్రతా ఆందోళన దృష్ట్యా తక్షణమే కాకపోయినా, విస్తారమైన రాగి, లిథియం గనులపై చైనా కంపెనీలు కూడా దృష్టి పెట్టనున్నాని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాలిబన్లు చైనాను పెట్టుబడి, ఆర్థిక మద్దతుకు కీలకమైన వనరుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్లో శాంతి స్థాపన సయోధ్యతోపాటు, ఆ దేశ పునఃనిర్మాణంలో ఇప్పటికే చైనా ప్రకటించిన సహకారాన్ని స్వాగతించిన తాలిబన్లు అఫ్గాన్ అభివృద్దిలో చైనాదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 1/3 Abdul Salam Hanafi, Deputy Director, PO held a phone conversation with Wu Jianghao, Deputy Foreign Minister of the People’s Republic of China. Both sides discussed the ongoing situation of the country and future relations. The Chinese Deputy Foreign Minister said that — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 2, 2021 -
తీరనున్న ఎరువుల కొరత
సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)తో ఎరువుల లభ్యత పెరగనుంది. ఈనెల 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్ బ్రాండ్’పేరుతో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి చేసే 45 కిలోల యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించి వాణిజ్య అవసరాల నిమిత్తం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో రాష్ట్రంలో యూరియా, అమ్మోనియా కొరత పూర్తిగా తీరిపోనుంది. తగ్గనున్న దిగుమతి భారం దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సీల్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ కొరత చాలావరకు తీరనుంది. విదేశాలనుంచి దిగుమతి భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆర్ఎఫ్సీఎల్ (అప్పటి ఎఫ్సీఐ), గోరఖ్పూర్ (ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), బరౌనీ(బిహార్) ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ చేపట్టింది. వీటిలో మొదట రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక గోరఖ్పూర్, సింద్రీ యూనిట్లలో 2022 మార్చి నాటికి, తాల్చేర్ ప్లాంట్లో 2023లో యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్సీఐ ఏర్పడింది ఇలా.. ►1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి త్రిగున్సేన్ రామగుండంలో ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ►గడువు కంటే ఆరేళ్లు ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్సీఐ.. 1980 నవంబర్ ఒకటి నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేసింది. ►అనంతర కాలంలో పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది. నాడు బొగ్గు.. నేడు సహజవాయువు రామగుండంలో మూతపడిన ఎఫ్సీఐ కర్మాగారం అప్పట్లో బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. ప్రస్తుతం కర్మాగారాన్ని పునరుద్ధరించాక సహజవాయువును ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్తాన్కు వెళ్లే గ్యాస్ పైప్లైన్ నుంచి రామగుండం వరకు 363 కిలోమీటర్ల మేర ప్రత్యేక గ్యాస్ పైప్లైన్లను నిర్మించారు. ఈ కర్మాగారంలో కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి 50 శాతం యూరియూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఐదు నెలలుగా ఇక్కడ ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే సరఫరా చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ సాంకేతికతతో ఉత్పత్తి ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్డోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్పేమ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. గ్యాస్ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకతల్లో ఒకటి. ప్లాంటుకు కావాల్సిన ఒక టీఎంసీ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కేటాయించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా...!
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. డీఎ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన హెచ్ఆర్ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్ఆర్ఏ పెంపు ఉండనుంది. హెచ్ఆర్ఏ పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ‘ఎక్స్’ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి, పెంపు 27 శాతం ఉంటుంది. ‘వై’, ‘జెడ్’ నగరాల్లో నివాసితులకు వరుసగా 18 శాతం, 9 శాతం హెచ్ఆర్ఏ పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా 30%, 20% , 10% కు సవరించబడతాయి. X, Y, Z నగరాల వర్గాలు X కేటగిరి నగరాలు 50 లక్షలకు పైగా జనాభా ఉన్నవి. Y కేటగిరి నగరాలు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నవి Z కేటగిరి ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నవి అంతకుముందు X, Y, Z నగరాల్లో వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం హెచ్ఆర్ఏ ఉండేది. -
కిలో టమాటా రూ.22: అమాంతం పెరిగిన ధర
మదనపల్లె: నిన్న మొన్నటిదాకా రూ.6 నుంచి రూ.16 వరకు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా రూ.22కు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో శుక్రవారం మొదటిరకం టమాటా కిలో రూ.15 నుంచి రూ.22 మధ్య ధర పలికింది. రెండోరకం టమాటా రూ.8 నుంచి రూ.14.60 వరకు నమోదైంది. అయితే నిన్నటివరకు మార్కెట్కు 1,120 నుంచి 1,646 మెట్రిక్ టన్నుల వరకు వచ్చిన టమాటా ఒక్కసారిగా 470 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. రెండురోజులుగా మదనపల్లె డివిజన్లో వర్షాలు కురుస్తుండటం, పొలాల్లో నీళ్లు నిలవడం కాయలు కోసేందుకు ఇబ్బందిగా మారింది. పంట బాగా దెబ్బతినడం, కొద్దోగొప్పో వస్తున్న పంట నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం, కాయపై మచ్చలు, పగుళ్లు రావడంతో మార్కెట్కు వచ్చే టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పలికిన టమాటా ధరల్లో రూ.22 అత్యధికం కావడం, తక్కువస్థాయిలో దిగుబడులు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం టమాటాకు లభిస్తున్న ధరతో రైతు సంతృప్తిగా ఉన్నప్పటికీ దిగుబడులు తగ్గుతుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. -
రెండు రోజుల సంబరమే,మరోసారి పెరిగిన పెట్రో ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు చమురు ధరలు అలాగే ఉన్నా.. గురువారం రోజు వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర 31 నుంచి 39 పైసా వరకు పెరగ్గా..డీజిల్ ధర 15 నుంచి 21 పైసా వరకు పెరిగింది. దీంతో చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లో చమురు ధరలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేశాయి. గురువారం రోజు ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52, డీజిల్ ధర రూ.97.96 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54, డీజిల్ ధర రూ.89.87 చెన్నైలో పెట్రోల్ రూ.102.23, డీజిల్ ధర రూ.94.39 ముంబై పెట్రోల్ ధర రూ.107.54 డీజిల్ ధర రూ.97.45 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.74, డీజిల్ ధర రూ.93.02 కాగా, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో చమురు ధరల పెరగడానికి కారణమైందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లో క్రూడ్ అయిల్ స్టాక్స్ ప్రభావం లేకపోవడంతో పాటు సెప్టెంబర్ నాటికి చమురు ధరల రవాణా తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. -
వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విక్రయాలు తిరిగి గాడినపడుతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. జూన్ నెల దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ కలిపి 12,96,807 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14.7 శాతం వృద్ధి. ప్యాసింజర్ వెహికిల్స్ 1,05,617 నుంచి 2,31,633 యూనిట్లకు ఎగిశాయి. ద్విచక్ర వాహనాలు 10,14,827 నుంచి 10,55,777 యూనిట్లకు చేరాయి. గత నెలలో త్రీ వీలర్లు 9,397 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 జూన్లో ఈ సంఖ్య 10,300 యూనిట్లు నమోదైంది. తొలి త్రైమాసికంలో ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో వాహన అమ్మకాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా నమోదయ్యాయి. ఈ కాలంలో భారత్లో అన్ని విభాగాల్లో కలిపి 31,80,039 వెహికిల్స్ విక్రయమయ్యాయి. కోవిడ్–19 దెబ్బతో 2020–21 తొలి త్రైమాసికంలో ఈ సంఖ్య 14,92,612 యూనిట్లకు పరిమితమైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 1,53,734 నుంచి 6,46,272 యూనిట్లకు పెరిగాయి. ద్విచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 24 లక్షల యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వెహికిల్స్ మూడు రెట్లు అధికమై 1,05,800 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు రెండింతలై 24,376 యూనిట్లకు చేరుకున్నాయి. చదవండి: ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు -
ఆ జాబితాలో వరుణ్తేజ్ టాప్ హీరో !
హైదరాబాద్: టాలీవుడ్లో ప్రస్తుతం రెమ్యునరేషన్ల విషయం హాట్ టాపిక్గా మారుతోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో హీరోల రెమ్యునరేషన్లను చూస్తే.. మూవీ బడ్జెట్లో అధిక భాగంగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో అగ్రహీరోలుగా కొనసాగుతున్న నటులు తమ రెమ్యునరేషన్ను రూ.35 నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటుండుగా, వారి తరువాత జాబితాలో కొనసాగుతున్న మీడియం రేంజ్ హీరోలు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు నిర్మాతలు ముట్టచెప్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రెండో జాబితాలోకి మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చేరిపోయాడు. ఇటీవల కాలంలో వరుణ్ నటించిన సినిమాలు.. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 వరుసగా హిట్ కావడంతో తన సినిమాలు మినిమం గ్యారెంటీ లిస్ట్లో చేరిపోయాయి. దీంతో వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ వరుసలో ‘అంతరిక్షం’ చిత్రం ఆడగపోయినా ఆ ప్రభావం వరుణ్ పారితోషకంపై పడలేదు. ‘ఎఫ్ 2’ కు సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా కోసం వరుణ్ తేజ్ రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోగా.. తాజాగా ఒప్పుకుంటున్న సినిమాలకు రూ.12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో రూ.8 కోట్లు రెమ్యునరేషన్ కాగా.. మిగిలిన మొత్తం షేర్ రూపంలో తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక రెండో జాబితా నటుల్లో శర్వానంద్, నితిన్ అంత పారితోషికం తీసుకోవడం లేదు. నాని ప్రస్తుతం రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఇవన్నీ చూస్తే మీడియం హీరోల జాబితాలో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ ప్లేస్ లో వరుణ్ తేజ్ ఉన్నాడనే తెలుస్తోంది. చదవండి: నేను ప్రేమలో ఉన్నా.. నా దృష్టి మొత్తం దానిపైనే : నటి -
డబుల్ హ్యాపీ: కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు, గతంలో ఇస్తున్న రూ. 1,500 పెన్షన్ను రూ. 3,016కు పెంచుతూ సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వృద్ధ కళాకారుల అర్హత, సమగ్ర సమాచారాన్ని వెరిఫై చేసి పంపాలని సూచించారు. సీఎంకు మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు కళాకారుల వృద్ధాప్య పెన్షన్లను పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధాప్య పెన్షన్ల వల్ల రాష్ట్రంలోని 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సాహితీవేత్తలు, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్లే పెన్షన్ను పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేశారని కొనియాడారు. -
కరోనా మృత్యుకాటు: కొత్తగా 529 మంది మృతి
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో కరోనా మారణహోమం కలకలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కేసులు మరింత తగ్గి 25,311 పాజిటివ్లు నమోదయ్యాయి. మరోవైపు 57,333 మంది కోలుకున్నారు. అయితే మరణ మృదంగం గుబులు పుట్టిస్తూ 529 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,50,215 కి పెరిగింది. ఇప్పటివరకు 19,83,948 మంది డిశ్చార్జి అయ్యారు. 25,811 మంది కన్నుమూశారు. 4,40,435 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. బెంగళూరులో తగ్గిన కేసులు.. బెంగళూరులో కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం నగరవాసులకు శుభవార్త. తాజాగా 5,701 పాజిటివ్లు, 34,378 డిశ్చార్జిలు, 297 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,25,253 కు పెరిగింది. ఇప్పటికి 8,86,871 మంది కోలుకున్నారు. ప్రాణనష్టం 11,513 కి పెరిగింది. ప్రస్తుతం 2,26,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లక్ష మందికి టీకా కొత్తగా 1,07,562 మందికి కరోనా టీకా ఇచ్చారు. మొత్తం టీకాల సంఖ్య 1,21,97,196కు పెరిగింది. మైసూరులో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు టీకా ఇవ్వడం మొదలైంది. యువత ఉత్సాహంగా టీకా తీసుకున్నారు. మరో 1,08,723 మందికి కరోనా టెస్టులు చేశారు. మొత్తం పరీక్షలు 2.88 కోట్లను దాటాయి. -
తగ్గుతున్న కరోనా ఉధృతి!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా ప్రకోపం కాస్తంత తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పదో తేదీన 24.83 శాతంగా ఉన్న కరోనా కేసుల పాజిటివిటీ రేటు మే 22(శనివారం) నాటికి 12.45 శాతానికి దిగిరావడమే ఇందుకు తగిన తార్కాణం. పాజిటివిటీ రేటుతోపాటు రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ శనివారం మీడియాకు చెప్పారు. దేశవ్యాప్తంగా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతంపైగానే ఉందని ఆయన వెల్లడించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. 18 రాష్ట్రాల్లో 15 శాతానికిపైగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. రోజురోజుకూ కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని, మే 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 22వ తేదీకి 12.45 శాతానికి పడిపోయిందని లవ్ అగర్వాల్ వివరించారు. తగ్గిన వ్యాక్సిన్ వృథా వ్యాక్సిన్ డోస్ల వృథా సైతం తగ్గిందని అగర్వాల్ చెప్పారు. మార్చి ఒకటో తేదీన 8 శాతమున్న వృథా.. ప్రస్తుతం ఒక్క శాతానికి తగ్గిపోయిందన్నారు. అదేకాలానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వృథా 17 శాతం నుంచి 4 శాతానికి దిగిరావడం సానుకూల అంశమన్నారు. కొత్తగా 2.57 లక్షల పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో 2.57 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది ఆరోరోజు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగింది. మరోవైపు రికార్డుస్థాయిలో గత 24 గంటల్లో 4,194 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ బాధితుల మొత్తం మరణాల సంఖ్య 2,95,525కు పెరిగింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29,23,400కు తగ్గింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం 11.12 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 69.94% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 87.76 శాతం రికవరీ రేటు ఇప్పటిదాకా భారత్లో మొత్తం 2,30,70,365 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు మరింత మెరుగై 87.76 శాతానికి చేరుకుంది. కాగా, మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తంగా 32,64,84,155 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 20,66,285 శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,263 మంది చనిపోయారు. కేంద్రం కేటాయింపులు బ్లాక్ ఫంగస్ చికిత్సకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు ఔషధాలను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలు, యూటీలకు 23,680 వయల్స్ యాంఫోటెరిసిన్–బి పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్కు 2,310 వయల్స్, తెలంగాణకు 890 వయల్స్ కేటాయించారు. -
చైనా జనాభాలో స్వల్ప పెరుగుదల
బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో జనాభా పెరుగుదల అతితక్కువ స్థాయిలో నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం చైనా జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. వచ్చే ఏడాది నుంచి తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. పర్యవసానంగా సిబ్బంది కొరత, వినియోగ స్థాయిలు తగ్గడం వంటివి వాటిని ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా ఆందోళన చెందుతోంది. చైనా ప్రభుత్వం మంగళవారం ఏడో జాతీయ జనగణన వివరాలను వెల్లడించింది. మకావో, హాంకాంగ్ మినహా దేశంలోని 31 ప్రావిన్సులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కలిపి 5.38% శాతం పెరుగుదల రేటుతో 7.206 కోట్ల మేర పెరిగి మొత్తం జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. చైనా జనాభా గత దశాబ్ద కాలంగా తక్కువ పెరుగుదల నమోదు చేసుకుంటోందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎన్బీఎస్) చీఫ్ నింగ్ జిఝే అన్నారు. అదేవిధంగా, దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు గత ఏడాదితో పోలిస్తే 18.7% పెరిగి 26.4 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. జనాభాలో పనిచేయగలిగే సామర్థ్యమున్న 16–59 ఏళ్ల మధ్య వారు 88 కోట్ల మంది కాగా జనాభా సగటు వయస్సు 38.8 ఏళ్లు. ఏడాదికి సరాసరిన 0.53% చొప్పున జనాభా పెరుగుదల నమోదవుతోందని చెప్పారు. సమతుల జనాభా అభివృద్ధిని సాధించడానికి దీర్ఘకాలంలో తాము ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తాజా వివరాల ద్వారా వెల్లడవుతోందని ఆయన విశ్లేషించారు. చైనాలో 1982లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు 2.1% నమోదు కాగా, అప్పటి నుంచి తగ్గుతూ వస్తోంది. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం దీర్ఘకాలం పాటు ఒకే సంతానం విధానాన్ని అమలు చేసింది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2016లో ఒకే సంతానం విధానానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. భారత్లో 2019లో 136 కోట్లున్న జనాభా 2027 నాటికి చైనాను దాటే అవకాశం ఉందని ఐరాస విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది. చదవండి: ('సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది') -
తెలంగాణాలో పెరుగుతున్నకరోనా కేసులు,మరణాలు
-
కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు రోజుల్లోనే డబుల్!
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. నాలుగు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 28న 403 కేసులు నమోదు కాగా, 29న 463 కేసులు, 30న 684 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం ఏకంగా 887 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 1,02, 10,906 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,08,776 కేసులు నమోదయ్యాయి. బుధవారం 59,297 టెస్టులు చేయగా, అందులో 887 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 201 మంది కరోనా బారినపడ్డారని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 337 మంది కోలుకోగా, ఇప్పటివరకు 3,01,564 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో నలుగురు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 1,701 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 97.66 శాతానికి పడిపోయింది. వృథా అవుతున్న 2.85 శాతం వ్యాక్సిన్లు రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గత నెల 31 నాటికి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేశారు. గురువారం నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా కార్యక్రమం మొ దలైంది. అయితే 31వ తేదీ నాటి నివేదిక ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారు 4,42,429 మంది టీకా వేయించుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 2,41,311 మంది టీకా పొందారు. మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 12,64,026కు చేరింది. కాగా, తాజాగా బుధవారం ఒక్క రోజులో 60 ఏళ్లు పైబడిన 17,384 మందికి టీకా వేయగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 12,648 మందికి టీకా వేశారు. కాగా, 2.85 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. -
జనవరి 1 నుంచి హోండా కార్ల ధరల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం హోండా కంపెనీ వచ్చే నెల జనవరి 1 నుంచి భారత్లో తన వాహన ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ధరల పెంపు నిర్ణయంపై ఇప్పటికే కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరెన్సీ అనిశ్చితులు, ఉత్పత్తి వ్యయం ఒత్తిళ్లతో కంపెనీ జనవరి నుంచి ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు కంపెనీ డీలర్లు తెలిపారు. తన అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్సీఐఎల్) ద్వారా దేశంలో ఈ కంపెనీ కాంపాక్ట్, సెడాన్, అమెజ్ నుంచి ప్రీమియం ఎస్యూవీ సీఆర్–వీ వరకు పలు వాహనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద అమెజ్ ప్రారంభ ధర రూ.6.17 లక్షలుండగా, ఎంట్రీ లెవల్ సీఆర్వీ ధర రూ.28.71 లక్షలుగా ఉంది. -
కాంట్రాక్టు ఉద్యోగాలకు డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు, ఉద్యోగార్థులు .. క్రమంగా కాంట్రాక్టు ఉద్యోగాల వైపు మొగ్గు చూపడం పెరుగుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇది ఇటు ఉద్యోగులకు, అటు కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటోందని నిపుణులు పేర్కొన్నారు. తక్కువ నైపుణ్యాలు అవసరమైన సేవల నుంచి అత్యంత నైపుణ్యాలు అవసరముండే సర్వీసుల దాకా ఇది విస్తరిస్తోందని వివరించారు. ‘కాంట్రాక్టు (తాత్కాలిక) ఉద్యోగాల విధానం చాలాకాలంగా ఉన్నప్పటికీ భారత్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఇది ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇటు ఆర్థిక, అటు కరోనా వైరస్ పరిస్థితులు ఇందుకు కారణం‘ అని టీమ్లీజ్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బెనర్జీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇలాంటి వర్కర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వివరించారు. డెలివరీ ఏజెంట్లు, వేర్హౌస్ హెల్పర్లు, అసెంబ్లీ లైన్ ఆపరేటర్లు మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక వైట్–కాలర్ ఉద్యోగాలకు సంబంధించి డిజైనర్లు, కంటెంట్ రైటర్లు, డిజిటల్ మార్కెటర్లకు డిమాండ్ ఉన్నట్లు బెనర్జీ వివరించారు. -
మొబైల్ రేట్లకు రెక్కలు!
సాక్షి,న్యూఢిల్లీ: డిస్ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఇండి యా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువావే, షావోమి, వివో, విన్స్ట్రాన్ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉంది. ‘మొబైల్ ఫోన్ల రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దశలవారీగా తయారీని ప్రోత్సహించే కార్యక్రమంలో (పీఎంపీ) భాగంగా డిస్ప్లే అసెంబ్లీ, టచ్ ప్యానెళ్లపై అక్టోబర్ 1 నుంచి దిగుమతి సుంకాలను అమలు చేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా తయారీ పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పీఎంపీని తెరపైకి తెచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ వల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ సుమారు రూ. 68,000 కోట్ల పెట్టుబడితో 2016లో ట్విన్స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్ పేరుతో దేశీయంగా తొలి ఎల్సీడీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు మొదలుకాలేదు. -
రేపటి నుంచి టీవీల ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఆరోగ్య బీమా వరకూ అక్టోబర్ 1 నుంచి పలు నూతన నిబంధనలు అమలవనున్నాయి. పలు వస్తువులపై పన్ను భారాలతో పాటు కొన్ని వెసులుబాట్లూ అందుబాటులోకి రానున్నాయి. టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు పొందడం సులభతరం కానుంది. గురువారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఈ చలాన్ను ఆన్లైన్ పోర్టల్లో పొందుపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయని, హార్డ్ కాపీని అధికారులు అడగరని తెలిపింది. అనర్హతకు గురైన డ్రైవింగ్ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను ఈ పోర్టల్లో రికార్డు చేస్తూ ఎప్పటికప్పుడు తాజాపరుస్తారు. ఇక ఆరోగ్య బీమా రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు బీమా నియంతరణ సంస్థ ఐఆర్డీఏ వెల్లడించింది. బీమా కంపెనీలు వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్కూ బీమా కవరేజ్ను వర్తింపచేస్తాయి. బీమా క్లెయిమ్లను బీమా కంపెనీలు సులభంగా పరిష్కరించనున్నాయి. పెరగనున్న టీవీల ధరలు మరోవైపు అక్టోబర్ 1 నుంచి టీవీల ధరలు భారం కానున్నాయి. టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్ సుంకాలను ప్రభుత్వం విధించనుంది. తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి. చదవండి : బడ్జెట్ ధరల్లో శాంసంగ్ స్మార్ట్ టీవీలు విదేశాలకు పంపే నగదుపై మరింత పన్ను విదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం మూలం వద్ద పన్ను (టీసీఎస్) విధిస్తారు. ఆర్బీఐ రెమిటెన్స్ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్ చెల్లించాలని ఫైనాన్స్ చట్టం, 2020 పేర్కొంది. -
అప్పటి వరకూ.. పసిడి పరుగే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాట పట్టే వరకూ పెట్టుబడిదారులకు బంగారం ఒక సురక్షిత సాధనంగా కొనసాగే అవకాశం ఉంటుందని ప్రముఖ మార్కెట్ డేటా విశ్లేషణా సంస్థ రిఫినిటివ్ అంచనావేస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆభరణాలకు డిమాండ్ 40 శాతం పడిపోవచ్చని విశ్లేషించిన సంస్థ సీనియర్ విశ్లేషకులు, అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ 15 శాతం పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఒక వెబినార్లో మంగళవారం వారు ఈ అంశాలను వివరించారు. కీలక అంశాలను పరిశీలిస్తే... పసిడి కదలికలు ఇలా... కరోనా తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో– నైమెక్స్లో పసిడి ఔ¯Œ్స (31.1గ్రాములు) ధర జూలై 27వ తేదీన తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. అటు తర్వాత వారంరోజుల్లోనే చరిత్రాత్మక స్థాయి 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ధరల వద్ద లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. ఈ వార్త రాసే రాత్రి 12 గంటలకు కీలక మద్దతు స్థాయి 1,900 డాలర్లకు ఎగువన 1,902 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇది 20 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర మంగళవారం ఈ వార్త రాసే సమయానికి రూ.550 లాభంతో రూ. 50,680 వద్ద ట్రేవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర ఆల్టైమ్ గరిష్టానికి చేరినప్పడు ఈ ధర ఇక్కడ రూ.54,000 వరకూ వెళ్లింది. ఉద్దీపన చర్యల తోడ్పాటు కోవిడ్–19ను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఆర్థిక ఉద్దీపన చర్యలను చేపట్టాయి. దీనితోపాటు వృద్ధికి తోడ్పాటును అందించే క్రమంలో వడ్డీరేట్లు అతి తక్కువ స్థాయిలో కొనసాగించడానికీ మొగ్గుచూపుతున్నాయి. పసిడి డిమాండ్ పెరుగుదలకు ఆయా అంశాలు దోహదం చేస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పసిడికి డిమాండ్ను గరిష్ట స్థాయిలకు తీసుకువెళుతుంది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఉద్దీపన చర్యలకు సంబంధించిన నిధులను పసిడిని ఆకర్షికంచే అవకాశం ఉంది. – దేబజిత్ సాహా, రిఫినిటివ్ సీనియర్ మెటల్స్ విశ్లేషకులు ఫిజికల్ డిమాండ్ ఉండదు బంగారం సరఫరా ఈ ఏడాది 3 శాతం పెరిగింది. దీనికి స్క్రాప్ సరఫరాల్లో పెరుగుదలా ఒక కారణం. దీనితో గనుల నుంచి సరఫరాలు కొంత తగ్గాయి. కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పసిడికి ఫిజికల్ డిమాండ్ ఉండకపోవచ్చు. ఇటీవల తగ్గిన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) డిమాండ్, మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. 2020 చివరికి ఈ డిమాండ్ వెయ్యి టన్నులు దాటే అవకాశం ఉంది. – క్యామెరాన్ అలెగ్జాండర్, రిఫినిటివ్ ప్రెషియస్ మెటల్స్ రీసెర్చ్ హెడ్ -
యూకేలో మళ్లీ కరోనా విజృంభణ
లండన్: యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్ వేవ్తో కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్లలో రోజుకి 6 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఆస్పత్రి పాలయ్యే కోవిడ్–19 రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో మరోసారి లాక్డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. జూలై, ఆగస్టులలో కేసులు బాగా నియంత్రణలోకి వచ్చినప్పటికీ సెప్టెంబర్లో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత వారంలో రోజుకి 3,200 కేసులు నమోదైతే, ఇప్పుడు వాటి సంఖ్య 6 వేలకి చేరుకున్నట్టుగా ఆఫీసు ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఒఎన్ఎస్) గణాం కాలు వెల్లడించాయి. ఇప్పటివరకు యూకేలో దాదాపుగా 4 లక్షల కేసులు నమోదైతే, 42 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీ ఎనిమిది రోజులకి ఆస్పత్రిలో చేరే కోవిడ్ రోగుల సంఖ్య రెట్టింపు అవుతూ ఉండడంతో తప్పనిసరైతే మళ్లీ లాక్డౌన్ విధిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్కాక్ చెప్పారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వచ్చేవారంలో నిర్ణయం తీసుకుంటా మన్నారు. లాక్డౌన్ పూర్తి స్థాయిలో కాకున్నా రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులపై ఆంక్షలు విధిస్తామని అన్నారు. శీతాకాలం వస్తూ ఉండడం ఫ్లూ వంటి సీజనల్ జ్వరాలు కూడా ఉధృతమయ్యే వేళ కరోనా కూడా తీవ్రమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. ప్రపంచంలో 3 కోట్ల కేసులు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కేసుల సంఖ్య 3 కోట్లకి చేరుకుంది. వీటిలో సగం కేసులు అమెరికా, బ్రెజిల్, భారత్ నుంచే వచ్చాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఆగస్టు 12న రెండు కోట్లు ఉన్న కేసులు నెల రోజుల్లోనే మూడు కోట్లకి చేరుకున్నాయి. యూరప్ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలో బ్యాక్టీరియా వ్యాధి బీజింగ్: చైనాలో కొత్త బ్యాక్టీరియా వ్యాధి వెలుగు చూసింది. జంతువుల ద్వారా బ్రూసిల్లోసిస్ బ్యాక్టీరియా లాంజౌ నగరంలోని 3,245 మందికి సోకినట్లు చైనా తెలిపింది. మరో 1,401 మందికి బ్యాక్టీరియా ప్రాథమిక దశలో ఉందని వెల్లడించింది. ప్రభుత్వ బయో ఫార్మా సూటికల్ ప్లాంట్ నుంచి గాలి ద్వారా బ్యాక్టీరియా సోకినట్లు తెలుస్తోంది. దీని కారణంగా జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొంది. ప్లాంట్లో నిర్వహణ సరిగా లేకనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. -
మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకే..
సాక్షి, విజయవాడ: మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బార్ లైసెన్సులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా బార్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించింది. దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తు, 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
కొనలేం.. తినలేం!
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారం రోజుల్లో నే కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. హోల్సేల్/ రైతు బజార్లలోనే పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్లో ధరలు దాదాపు మూడు రెట్లు కావడం గమనార్హం. నగరంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డులో ఈ నెల 17, 24వ తేదీల్లో హోల్సేల్ / రైతు బజార్లలో కూరగాయల ధరలు పరిశీలిస్తే దాదాపు రెట్టింపుగా ఉన్నాయి. విరివిగా ఉపయోగించే టమాట, వంకాయ, దొండకాయ, బెండ, బీరకాయ వంటి కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా వర్షాలతో పెద్ద మొత్తంలో పంటలు నీట మునగడంతో దిగుబడి తగ్గిన కారణంగా కూరగాయల ధరలు పెరుగుతున్నట్లు హోల్సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా వినాయక చవితికి ఎక్కువగా వినియోగించే పచ్చి చింతకాయ ధర మాత్రం హోల్సేల్ మార్కెట్లోనే కిలో రూ. 250 పలకడం గమనార్హం. -
మళ్లీ పెట్రో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరసగా 19వ రోజు గురువారం కూడా పెరిగాయి. పెట్రోల్ ధరను లీటర్కు 16 పైసలు, డీజిల్ లీటర్కు 14 పైసల చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. భారత్లో తొలిసారిగా డీజిల్ ధరలు పెట్రోల్ ధర కంటే పెరిగాయి. ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు 82.79 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 79.92 రూపాయలకు పెరగ్గా, డీజిల్ లీటర్ ధర ఏకంగా 80.02 రూపాయలకు ఎగబాకింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను పెంచడంతోనే డీజిల్ ధరలు దేశరాజధానిలో పెట్రోల్ను మించిపోయాయని ప్రభుత్వరంగ ఐఓసీ చీఫ్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. చదవండి : ఢిల్లీ: పెట్రోల్తో పోటీ పడిన డీజిల్ ధర -
మోతెక్కిన వంట గ్యాస్..
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర సిలిండర్కు రూ 37 చొప్పున పెరిగింది. వరుసగా మూడు నెలలు వంట గ్యాస్ ధర దిగివచ్చినా జూన్ 1 నుంచి ఎల్పీజీ ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర పెరగడంతో సిలిండర ధరలను స్వల్పంగా పెంచామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అంశాల ఆధారంగా ఎల్పీజీ ధరలను ప్రతి నెల ఆరంభంలో సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ 636కు పెరిగింది. ఇక ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ 593కు చేరగా, కోల్కతాలో రూ 616, ముంబైలో రూ 590, చెన్నైలో రూ 606కు ఎగబాకింది. చదవండి : దిగొచ్చిన గ్యాస్ ధర..! -
కరోనా కేసులింకా పెరుగుతాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపులతో జనం రోజు వారీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటుండటంతో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని, ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. శనివారం వైద్య విద్య సంచాలకుడు రమేష్రెడ్డితో కలిసి కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలైందని, అందువల్లే కరోనా అదుపులో ఉందన్నారు. లాక్డౌన్ లక్ష్యం కరోనాను నిర్మూలించడం కాదని, ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టడం కోసమన్నారు. దీర్ఘకాల లాక్డౌన్తో తీవ్ర నష్టమని, అందుకే విడతల వారీగా సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలు, కేసుల నమోదు అంశాలు దాచినా దాగేవి కావన్నారు. అవసరం ఉన్న వారికే నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ఇప్పటివరకు రాష్ట్రంలో 30వేలకుపైగా పరీక్షలు చేశామని, 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ కట్టడికి మూడు సూత్రాలు పాటించాలని జి.శ్రీనివాసరావు సూచించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇవి పాటిస్తే కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకున్నట్టేనన్నారు. రాష్ట్రంలో కేసుల నమోదు తీరును పరిశీలిస్తే.. జనసమూహాలు ఏర్పడిన చోటే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఒడిబియ్యం, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాల వల్లే ఒకే కుటుంబానికి చెందిన పలువురు వైరస్ బారిన పడ్డారన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ గెలిచిందని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉంటే కరోనాపై విజయం సాధిస్తామన్నారు. భవిష్యత్తులో ఊపిరితిత్తులపై ప్రభావం: రమేష్రెడ్డి కరోనా వైరస్ నుంచి బాధితుడు కోలుకున్నా.. దీర్ఘకాలిక ఇబ్బందులు తప్పవని వైద్య విద్య సంచాలకుడు రమేష్రెడ్డి చెప్పారు. వైరస్ ప్రభావం ఊపిరి తిత్తులపై ఉంటుందని, కొన్నేళ్ల తర్వాత అది బయటపడొచ్చన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి చికి త్స చేసే క్రమంలో వెంటిలేటర్ అవసరం చాలా తక్కువన్నారు. 5శాతం మందికి మాత్రమే ఇది వాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. లాక్డౌన్ సడలింపులతో కేసుల తీవ్రత పెరుగుతుందని ముందే ఊహించామని, ఇందులో భాగంగా వసతులు, సౌకర్యాలు కల్పించి ఎక్కువమందికి చికిత్స అందేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 170 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని, కింగ్కోఠి ఆస్పత్రి, టిమ్స్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చికిత్స చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా వైరస్కు చికిత్స తీసుకున్న 7రోజుల తర్వాత బాధితుడి నుంచి మరొకరికి వైరస్ సోకదని, తొమ్మిదో రోజు అతడిలో వైరస్ కణాలు నశిస్తాయన్నారు. -
5,274 కేసులు.. 149 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి కేవలం కేవలం ఒక్కరోజులో 32 మంది కన్నుమూశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 485 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటిదాకా 149 మరణాలు సంభవించాయని, మొత్తం పాజిటివ్ కేసులు 5,274కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసుల తీవ్రత నానాటికీ పెరుగుతుండడంతో కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం అదేస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులకు కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కరోనా బాధితులను కలిసిన వారందరినీ గుర్తించాలని, తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు. ఇప్పటిదాకా 1,21,271 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లో ఎడిడెమోలజీ విభాగం అధిపతి రామన్ ఆర్ గంగాఖేడ్కర్ చెప్పారు. ఇందులో 13,345 పరీక్షలు మంగళవారం నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో 139 ల్యాబ్లు పని చేస్తున్నాయని అన్నారు. అలాగే 65 ప్రైవేట్ ల్యాబ్లకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. కరోనా కట్టడికి కొత్త ఉద్యోగులు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కొంత విశ్రాంతి కల్పిస్తూ వారి స్థానంలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు, వైరస్ నియంత్రణ చర్యలు అమలు చేసేందుకు ఈ కొత్త ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఉద్యోగులకు అవసరమైన శిక్షణను ఆన్లైన్ ద్వారా ఇస్తారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్(ఐజీవోటీ) అనే వేదికను సిద్ధం చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఏఎన్ఎంలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పౌర రక్షణ సిబ్బందికి ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. -
నిత్యావసరాలకు ‘కరోనా’ సెగ
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: నిత్యావసర సరుకులకు కరోనా వైరస్ సెగ తగిలింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ పదిరోజుల్లో వివిధ సరుకుల ధరలు ఒక్కసారిగా పెరగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే విలవిల్లాడుతున్నారు. ఆయా సరుకుల ధరలు సగటున కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పెరిగాయి. లాక్డౌన్తో సరుకు రవాణా ఖర్చులు పెరిగాయని, అందుకే నిత్యావసరాల ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎండుమిర్చిపై చైనా ప్రభావం.. సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలనుంచి ఎండు మిర్చి ఏటా చైనాకు ఎగుమతి అవుతుంది. కరోనా వైరస్ ప్రబలడంతో ఆ దేశంలోకి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు, రైతులనుంచి కొనుగోలు చేసిన మిర్చిని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయగా, మిగిలినది కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. చైనాలో పరిస్థితులు చక్కబడ్డాక ఎగుమతి చేస్తే అధిక ధర వస్తుందన్న ఆలోచనలో వ్యాపారులున్నారు. ఈ కారణంగా బహిరంగ మార్కెట్లో మిర్చి నిల్వలు తగ్గాయి. దీంతో ఒక్కసారిగా ఎండుమిర్చి ధర బాగా పెరిగింది. ఈ పది రోజుల్లోనే కేజీ ధర సాధారణం కంటే అదనంగా రూ.70 వరకు పెరిగింది. వచ్చేది మామిడి పచ్చళ్ల సీజన్ కావడంతో ఇంకెంత పెరుగుతుందోనని పేదలు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రవాణా తగ్గి ఘాటెక్కిన అల్లం, వెల్లుల్లి ధరలు.. లాక్డౌన్తో అల్లం, వెల్లుల్లి ధరలు ఘాటెక్కాయి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ హోల్సేల్ మార్కెట్లకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలనుంచి అల్లం, వెల్లుల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. అలాగే మెదక్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు పండించింది కూడా ఈ మార్కెట్లకు వస్తుంది. అయితే లాక్డౌన్తో కర్ణాటక, కేరళ రాష్ట్రాలనుంచి ఉభయ రాష్ట్రాలకు అల్లం, వెల్లుల్లి దిగమతి భారీగా తగ్గింది. కరోనా వైరస్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో హోల్సేల్ మార్కెట్ల నుంచి ట్రక్కుల్లోకి సరుకు ఎత్తడానికి కూలీలు బయపడుతుండడంతో మన రాష్ట్రానికి తగినంతగా రావడం లేదని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా కట్టడికి అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా వాడాలని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కూడా ధర పెరగడానికి ఒక కారణమైందని అంటున్నారు. దీంతో అల్లం, వెల్లుల్లి ధర సగటున కేజీకి రూ.60 నుంచి 100 వరకు పెరిగింది. చింత‘పండ’లేదని.. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతాలనుంచి రాష్ట్రానికి చింతపండు దిగుమతి అవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఈసారి చింతకాయ పంట దిగుబడి సరిగా లేనందున దీని ధర పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక కంది పప్పు, పెసరపప్పు, పేదలు వాడే మైసూర్ పప్పు (ఎర్రపప్పు)ల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో కంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన దాంట్లో చాలావరకు మార్క్ఫెడ్ గోదాముల్లో నిల్వ ఉండడంతో కంది పప్పు ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది. రిటైల్ దుకాణాల్లో నిత్యావసరాల ధరలు (కిలో.. రూపాయల్లో) ఇలా.. -
కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరువు భత్యం (డీఏ)ను 4శాతం పెంచే నిర్ణయానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించిం ది. దీనివల్ల 1.13 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దార్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన డీఏ 2020 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ 17 నుంచి 21శాతానికి చేరుకుంది. పెరిగిన రేట్లకు అనుగుణంగా దీన్ని పెంచినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలిపింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 12,510 కోట్లు, 2020–21 సంవత్సరానికి (2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు) రూ. 14,595 కోట్ల అదనపు భారం పడనుంది. దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందనున్నారని సమాచార, ప్రసార శాఖ మంత్రి జవడేకర్ చెప్పారు. -
మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : మార్కెట్లోకి ఏదైనా స్మార్ట్ ఫోన్ న్యూ మోడల్ రాగానే దాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరేవారితో పాటు బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే వారికీ ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వనుంది. మొబైల్ ఫోన్లపై జీఎస్టీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మొబైల్స్పై జీఎస్టీ ని 18 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మొబైల్ పోన్లతో పాటు ఫుట్వేర్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్పై జీఎస్టీ రేటును పెంచనున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. కాగా, జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు , వ్యాపారుల ఇన్వాయిస్లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించి రూ .10 లక్షల నుంచి రూ .1 కోటి మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించే ప్రతిపాదననూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించవచ్చని భావిస్తున్నారు. చదవండి : జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే! -
పదవీ విరమణ @ 61
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కె.చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి మంత్రివర్గ సమావేశం నాటికి ఫైల్ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. విరమణ వయసును 61 ఏళ్లకు పెంచితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2023 మార్చి 31 నాటికి పదవీ విరమణ చేయనున్న 26,133 మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు అదనపు సరీ్వసు కలిసొస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాష్ట్రంలో కూడా పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంతో పాటు 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు ఈ పెంపు వర్తింపచేయకూడదన్న ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులను సీఎం పక్కన పెట్టినట్లు తెలిసింది. ఉద్యోగుల సర్వీసు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగానే 61 ఏళ్లకు సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. మూడేళ్ల పాటు నో రిటైర్మెంట్.. పదవీ విరమణ వయసు పెంపుదల ఉత్తర్వులు అమల్లోకి వస్తే 2020 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 దాకా రిటైర్మెంట్లు ఉండవు. దాదాపు 26,133 మంది ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించి చెల్లింపులు నిలిచిపోతాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తాత్కాలికంగా ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లు కొనసాగిస్తే ప్రభుత్వం ప్రతినెలా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వానికి కలిసొస్తుంది. పదవీ విరమణ వయసు పెంపుదలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ మూడు సంవత్సరాల పాటు సరీ్వసు పెరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పదవీ విరమణ చేయనున్న 7,040 మందితో పాటు ఆ తర్వాత రెండేళ్లు కలుపుకొని మొత్తం 26,133 మంది ఉద్యోగులకు వెంటనే మూడేళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో కొనసాగడానికి వీలు కలుగుతుంది. -
మళ్లీ పసిడి పరుగు..
ముంబై : బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి పసిడికి కలిసివచ్చింది. ఎంసీఎక్స్లో సోమవారం వరుసగా మూడోరోజు పదిగ్రాముల బంగారం రూ 200 పెరిగి రూ 40,560కు ఎగబాకింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే అంచనాతో మదుపురులు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. వెండి ధరలు సైతం భారమవుతూ కిలో రూ 47,291కి పెరిగి రూ 50,000కు చేరువయ్యాయి. చదవండి : చమురు మంట.. పసిడి పంట -
హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు..!
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనేది వెల్లడించలేదు. మారుతీ, టాటా మోటార్స్తో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
గోల్డ్..క్రూడ్..రయ్ రయ్!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రెండు కమోడిటీలు బంగారం, క్రూడ్ రెండూ 2020లో అప్ట్రెండ్లోనే ఉంటాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం... గోల్డ్మన్ శాక్స్ తాజాగా ఒక నివేదికలో అంచనా వేసింది. ఈ సంస్థ ఇంకా ఏమని చెబుతోందంటే... ‘‘అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 2020లో సగటున 1,600 డాలర్లుగా ఉంటుంది. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు, రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఎంచుకునే అవకాశాలున్నాయి. 2019లో ఇప్పటివరకూ పసిడి 14 శాతం పెరిగింది. ఒకే ఏడాది ఈ స్థాయిలో పసిడి ధర బలపడ్డం 2010 తరువాత ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో గడిచిన 52 వారాల్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి బంగారం ధరను ఒకదశలో 1,566 డాలర్లకూ చేర్చాయి. తర్వాత దాదాపు 100 డాలర్ల కరెక్షన్కు గురై... ప్రస్తుతం 1,470– 80 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. అమెరికా– చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు, అమెరికా కార్మిక మార్కెట్ పటిష్టత ఈ కరెక్షన్కు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ఈ ఆశారేఖల వల్ల పసిడి సమీప కాలంలో తగ్గితే తగ్గవచ్చు. దీర్ఘకాలంలో చూస్తే, ప్రపంచ వృద్ధి అంతంతమాత్రమే. ఉపాధి కల్పన రేటు కూడా బలహీనంగానే ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో పసిడి పరుగుకే అవకాశాలెక్కువ. ప్రధాన అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబాల పొదుపులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి వంటి రక్షణాత్మక అసెట్స్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కలిసి దాదాపు 750 టన్నుల పసిడిని కొనుగోలు చేయడం కూడా చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం. ఉత్పత్తి కోతతో క్రూడ్ భగభగలు... 2020లో క్రూడ్ ధరల అంచనాలను కూడా పెంచుతున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచీ... ఉత్పత్తిలో కోత పెట్టాలని పెట్రోలియం ఎగమతి దేశాల సంఘం (ఒపెక్), దాని మిత్ర దేశాలు ఒక అంగీకారానికి రావడం దీనికి ప్రధాన కారణం. దీనివల్ల చమురు నిల్వలు కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది తొలి ఆరు నెలల్లో క్రూడ్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. 2020లో బ్రెంట్ ధర బేరల్కు సగటున 60 డాలర్లు ఉంటుందన్న తొలి అంచనాలను 63కు పెంచుతున్నాం. నైమెక్స్ లైట్ స్వీట్ ధరను కూడా 55.3 డాలర్ల నుంచి 58.5 డాలర్లకు పెంచుతున్నాం’’ అని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. 2020 మధ్య నుంచి చల్లారవచ్చు: మోర్గాన్ స్టాన్లీ ఇదిలావుంటే... వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి ఉత్పత్తిలో కోత పెట్టాలన్న ఒపెక్, దాని మిత్రపక్షాల నిర్ణయం స్వల్పకాలికంగానే క్రూడ్ ధర పెరుగుదలకు దారితీయవచ్చని మరో దిగ్గజ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. 2020 మధ్యస్థం నుంచీ ధరలు తిరిగి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ 2020 మధ్య నుంచీ 60 డాలర్లుగానే కొనసాగే వీలుందని, దీనికి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితే కారణమని అభిప్రాయపడింది. మొదటి త్రైమాసికం అంచనా మాత్రం 62.50 డాలర్లుగా పేర్కొంది. మరి రూపాయి పరిస్థితి? అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే, అది డాలర్ మారకంలో రూపాయి విలువకు ప్రతికూలాంశమేనని నిపుణుల అభిప్రాయం. గత ఏడాది అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 12 పైసలు బలపడి నెల గరిష్టం 70.92కు చేరింది. -
మద్యం ధరలు పెంపు?
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయాన్వేషణలో భాగంగా మద్యం ధరల ను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసర త్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రు లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించబోతోందని ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సబ్కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను బట్టి.. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వివిధ రకాల మద్యం ధరలను 5–10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమో దిస్తే ఏటా రూ. 1,200–1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆ వర్గాల అంచనా. ఈ ప్రతిపాదనలను త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అంశంపై మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు మధ్య ఇటీవల చర్చ జరిగిన ట్టు తెలుస్తోంది. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీ నిర్ధారించిన ధరలపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని సమా చారం. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత సవరించాలని, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు జాప్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజు! కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఏర్పాటైన 73 మున్సిపాలిటీల్లో కూడా బార్ నోటిఫికేషన్ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో పాటు రాజధాని తో పాటు శివార్లలో, రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో నిర్వహించే ఈవెంట్లను వర్గీకరించాలని, ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజును సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యం లో మద్యం ధరల పెంపు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు నోటిఫికేషన్, ఈవెంట్ చార్జీల పెంపు ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. -
వచ్చే ఏడాది ఏప్రిల్లో విద్యుత్ చార్జీల పెంపు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగడం లాంఛనమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ టారీఫ్ పెంపు ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (ఈఆర్సీ) సమర్పించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) నిరీక్షిస్తున్నాయి. డిస్కంల ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలను అధిగమించి నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి డిస్కంలు భారీగా విద్యుత్ కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ సరఫరాను 24 గంటలకు పొడిగించాయి. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం భారీగా పెరిగింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుతించలేదు. ఇక ఒక్క మున్సిపల్ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉండగా, మరో నాలుగైదు ఏళ్ల వరకు రాష్ట్రం లో మరే ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించేందుకు డిస్కంలు సమాయత్తమయ్యాయి. ఏటా నవంబర్లోగా నివేదిక.. ప్రతి ఏటా నవంబర్లోగా డిస్కంలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదికను (ఏఆర్ఆర్) ఈఆర్సీకి సమర్పించాలని కేంద్ర విద్యుత్ చట్టం పేర్కొంటోంది. ప్రస్తుత విద్యుత్ చార్జీలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో యథాతథంగా కొనసాగిస్తే ఏర్పడనున్న ఆర్థిక లోటు, దీనిని అధిగమించేందుకు పెంచాల్సిన విద్యుత్ చార్జీల అంచనాలను ఈ నివేదికలో పొందుపరుస్తాయి. 2020–21కి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను ఈ నెలాఖరుతో డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు డిస్కంలు వాయిదా వేసుకునే అవకాశాలున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏఆర్ఆర్ను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. దీంతో ఎలాంటి మార్పుల్లేకుండా విద్యుత్ చార్జీల్లో యథాతథంగా అమలవుతున్నాయి. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఆర్ఆర్ నివేదికతో పాటు చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించడం ఖాయ మని దక్షిణ డిస్కం (టీఎస్ఎస్పీడీసీఎల్) వర్గాలు పేర్కొన్నాయి. ఒకటి రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే వచ్చే ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రావచ్చు. ఒకవేళ ఎన్నికలు ఆలస్యమైతే జూన్ నుంచి చార్జీల పెంపును అమలు చేసే అవకాశముంది. ఈఆర్సీ అంకెల గారడీతో మరింత సంక్షోభం.. ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు పోగా మిగిలిన లోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వ అను మతి లభించలేదు. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు కేటాయించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, డిస్కంల ఆర్థిక లోటు అంచనాలను రూ. 9,970.98 కోట్ల నుంచి రూ. 5,980 కోట్లకు ఈఆర్సీ తగ్గించింది. ఆర్థిక లోటు పెద్దగా లేదని, చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పాత చార్జీలను కొనసాగించా లని 2018–19 టారీఫ్ ఉత్తర్వులు జారీ చేసిం ది. 2018–19 ముగిసేసరికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 5,000 కోట్లకు చేరిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
పూల ధరలు పైపైకి..
సాధారణంగా ఇంట్లో పూజలు, వివాహ శుభకార్యాలకు ఎక్కువగా పూలకు ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది బతుకమ్మ పండుగ. పూల పండుగ అంటే ఊరూ వాడ బతుకమ్మ సందడి. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలైన పూల జాతర సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. వివిధ రకాల పువ్వుల్లో ఔషధ గుణాలుంటాయని, బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తే చెరువు నీటిలో ఉండే క్రిములు చనిపోయి నీరు శుభ్రమవుతుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బతుకమ్మ పండుగ పూలు సాగు చేసే రైతులను నిరాశకు గురి చేసింది. సాక్షి, సంగారెడ్డి: ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్న దిగుబడి రాకపోవడంతో పండుగ సందర్భంగా బతుకమ్మ బంతి పైపైకి లేస్తోంది. పూల పండుగైన బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పువ్వులకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మకు బంతి, ముద్ద బంతి, తంగెడు, చామంతి, పట్టుకుచ్చుల పువ్వులకు భలే గిరాకీ పెరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని పందిల్లకు చెందిన గూళ్ల రవి తనకున్న భూమిలో బంతి, చామంతి, మల్లె, కనకంబురాల, పట్టుకుచ్చుల సాగు చేశాడు. సాగు చేసిన తోటలు కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ సందర్భంగా రవి ఎకరం కనకంబురాలు, 10 గుంటలు పట్టుకుచ్చులు, 10 గుంటలు బంతి, 10 గుంటలు మల్లె పూలు సాగు చేశాడు. ముసురు వర్షాలతో పూల సాగు అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. కొద్దోగొప్పో పూలు పూసిన బంతి పూలు గుత్తులతో నిగనిగలాడుతోంది. కిలోకి రూ.50కి పైనే.. సాధారణ రోజుల్లో ఒక కిలోకు రూ.30 ధర పలుకుతుందని, పండగ వేళల్లో మార్కెట్లో కిలో బంతికి రూ.50 పలుకుతుందని రైతు తెలిపారు. పూల సాగు లాభదాయకమని నమ్మిన రైతు రకరకాల పువ్వుల సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ బంతి పూల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఏ పల్లె, ఏ ఊరు, ఏ వాడలో చూసిన బతుకమ్మ ఆటలతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పూల ధరలకు రెక్కలచ్చాయి. తుంపురు వర్షాలతో, ఉన్న నీటితో వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు పూల తోటలపై ఎక్కువ దృష్టి సారించకపోవడంతో బతుకమ్మ పండుగకు అవసరమయ్యే పూల ధరలు కొండనెక్కి కూర్చున్నాయి. మరో మూడు రోజుల్లో పూల జాతర రానుండటంతో బంతి పూల ధరలు జనానికి చుక్కలు చూపెట్టనున్నాయి. మండుతున్న ధరలు ఓ వైపు బతుకమ్మ సంబరాలు, మరో వైపు వర్షాలు లేక పూల తోటల సాగు తగ్గిపోవడంతో పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్ మార్కెట్లో పూల ధరలు మండుతున్నాయి. బంతి కిలోకు రూ.100, చామంతి కిలోకు రూ.400, కాగడ మల్లెపువ్వులు రూ.700, గులాభి రూ.400 ధరలు పలుకుతుండటంతో జనాలు బెంబలెత్తిపోతున్నారు. దీంతో పాటుగా పట్టుకుచ్చుల పువ్వులు ఒక్క కట్టకు రూ.20 పలుకుతుంది. ఇది కూడ నేరుగా రైతులు అమ్మితేనే ఈ ధర పలుకుతుంది. బతుకమ్మ పండుగ సందర్బంగా గునుగు. తంగేడు, పట్టు కుచ్చులు, చామంతి, బంతి పువ్వులను అధికంగా వాడుతారు. ప్రస్తుతం ఉన్న ఈ పూల ధరలు బతుకమ్మ పండుగ వరకు ఇంకా పెరగవచ్చని పూల వ్యాపారులు చెబుతున్నారు. పూల ధరలు పెరిగినయ్ బతుకమ్మ సందర్భంగా పూల ధరలు పెరిగినయ్. గతం కంటే ఈ ఏడాది పూల దిగుబడి తగ్గడంతో ధరలు అంతకంతకు పెరిగాయి. హోల్సెల్ ధరలు సైతం ఎక్కువ పెంచారు. బంతిపూలు కిలోకు రూ.100కు పైగా అమ్ముతున్నాం. పూల డిమాండ్ను బట్టి పండుగ రోజున బంతి పూల ధర రూ.200 వరకు పెరిగే అవకాశాలున్నాయి. – షబ్బీర్, పూల వ్యాపారి, హుస్నాబాద్ దిగుబడి తగ్గింది పండుగను బట్టి పూల సాగు చేపడుతాను. బతుకమ్మ పండుగ సందర్భంగా 10 గుంటల్లో బంతి పూల విత్తనాలు చల్లితే, సగం నష్టం వచ్చింది. ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ పువ్వులను సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్కు తరలించి అమ్ముతున్నాను. కిలోకి రూ.50 ధర పలుకుతోంది. – గూళ్ల రవి, రైతు, పందిల్ల -
మహబూబ్నగర్లో ఉల్లి..లొల్లి!
సాక్షి, మహబూబ్నగర్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అటువంటి ఉల్లి నేడు ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఉన్న ధర నేడు ఉండటంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు రెట్టింపవుతోంది. నెల రోజుల కిందట కేవలం రూ.20 ఉన్న ఉల్లి ధర బుధవారం రూ.60కు ఎగబాకింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దిగుమతి లేకనే.. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని తక్కువగా దిగుమతి చేసుకోవడంతో కొరత వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతుండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప రిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. ఉల్లిపాయల ఉత్పత్తికి పేరుగాంచిన మహారాష్ట్ర రాష్ట్రంలో ముందుగా కరువు ఉండటంతో సా గు ఆలస్యమైంది. కర్నాటక నుంచి రావాల్సిన ఉల్లి కూడా రాకపోవడంతో రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుత దిగుబడి సమయంలో వర్షాలు అధికమవడం కూడా కొరతకు కారణంగా చెప్పవచ్చు. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరల పెరుగుదలకు కారణమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వా రానికే సగానికి సగం ధర పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలో కు రూ. 15 నుంచి రూ. 20 పెరగడం తో సామాన్యులు తట్టుకోలేకపోతున్నా రు. సాధారణంగా కిలో రూ.15 నుంచి రూ. 20 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 60 పలుకుతోంది. ప్రభుత్వ కేంద్రాలు ఎక్కడా? ప్రతీఏటా ఉల్లి ధర అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మార్కెటింగ్, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు రైతుబజార్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. గ తంలో చౌకధర దుకాణాల ద్వారా కూడా తక్కు వ ధరకు ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున ఉ ల్లిని అందించారు. అయితే ఈసారి విక్రయ కేం ద్రాలు ఏర్పాటు చేయలేదు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య, పేద ప్రజలకు తక్కువ ధర కు ఉల్లిగడ్డలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. సామాన్యులు విలవిల ఓ వైపు నిత్యవసర సరుకులు, మరో వైపు కూరగాయలు ఇలా రోజురోజుకు పెరగుతున్న ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రలో ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వరదలు వచ్చిన కారణంగా ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో ప్రస్తుతం ఉల్లిధర కొండెక్కి కూర్చుంది. ఇదే సాకుగా వ్యాపారులు అక్రమ నిల్వలు చేస్తున్నారు. ఆనందంలో రైతులు దేవరకద్ర మార్కెట్లో కొత్త ఉల్లి దిగుమతులు ప్రారంభమైనా ధర మాత్రం తగ్గడం లేదు. అధికారుల సూచనలు పాటించి పండించిన రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా రాష్ట్రాలలో ఉల్లి కొరత తీవ్రంగా ఏర్పడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో రాష్ట్రానికి తగినంత వచ్చే ఉల్లి దిగుమతులు పూర్తిగా తగ్గి పోయాయి. జిల్లాలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. గత రెండేళ్ల నుంచి రూ. 1000 దాటని ఉల్లి ధరలు రెండు నెలల నుంచి మూడింతలయ్యాయి. గరిష్టంగా రూ. 3,520 దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. మార్కెట్లోని రెండు షెడ్లు ఉల్లి కుప్పలతో నిండి పోయాయి. గూరకొండ, గోప్లాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు కొత్త ఉల్లిని అమ్మకానికి తీసుకువచ్చారు. ట్రాక్టర్లలో తెచ్చిన ఉల్లిని కిందకు పోయకుండానే వేలం వేశారు. దాదాపు 5 వందల బస్తాల ఉల్లి మార్కెట్కు అమ్మకానికి వచ్చినా ధరలు మాత్రం పెరిగాయి తప్ప దిగిరాలేదు. దేవరకద్ర మార్కెట్ వ్యాపారులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పోటీ పడ్డారు. ఉల్లి క్వింటాల్కు గరిష్టంగా రూ. 3,520, కనిష్టంగా రూ. 2,910, మధ్యస్తంగా రూ. 3,215 వరకు ధరలు వచ్చాయి. ఇక పాత ఉల్లికి ఏకంగా క్వింటాల్కు రూ. 3800 వరకు ధర వచ్చింది. గతంలో తీవ్రంగా నష్ట పోయిన ఉల్లి రైతులు ఉల్లిని ఇప్పుడు వచ్చిన ధరలు చూసి ఆనందంలో మునిగి పోయారు. 45 కేజీల బస్తా ధర రూ. 1800... మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారులు 45 కేజీల బస్తాను గరిష్టంగా రూ. 1800 లకు విక్రయించగా, కనిష్టంగా రూ. 1600 నుంచి వరకు ప్యాకెట్గా విక్రయించారు. చిరు వ్యాపారులు ఉల్లిని బస్తాలుగా కొనుగోలు చేసి బుధవారం జరిగిన దేవరకద్ర సంతలో చిల్లరగా కిలో రూ. 40 నుంచి రూ. 35 వరకు విక్రయించారు. -
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద
-
జూరాల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
సాక్షి, మహబూబ్ నగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఇన్ ప్లో 26,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 29,614గా నమోదైంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 8.670 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 318.030 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. -
మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు
-
మెదక్లో ఫుల్ కిక్కు!
వచ్చే నెలాఖరుతో మద్యం దుకాణాల కాలపరిమితి ముగియనుండడంతో నూతన మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటుతోపాటు వైన్స్ దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. లైసెన్స్ ఫీజులను సైతం పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైన్స్ షాపులను దక్కించుకోవాలనే కోటి ఆశలతో ఉవ్విళ్లూరుతున్న వారితోపాటు మద్యం ప్రియులకు ‘ఫుల్ కిక్కే’ అని చెప్పొచ్చు. సాక్షి, మెదక్: రాష్ట్ర ఖజానాకు ప్రధానంగా ఎక్సైజ్ శాఖ నుంచే ఆదాయం సమకూరుతోంది. ప్రతి రెండేళ్లకోసారి కొత్త పాలసీని రూపొందిస్తూ.. లైసెన్స్ల రూపేణా, మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను పెంచుతూ ఆదాయం పెంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 2017 అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితి వచ్చే నెల 30తో ముగియనుంది. ఈ మేరకు నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించేందుకు సర్కారు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆదాయం పెంచుకునే మార్గాలపై అన్వేషణ చేస్తున్న క్రమంలో జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సారి టెండర్ల లైసెన్స్ ఫీజులను పెంచేలా యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు కొత్త మద్యం దుకాణాలు, బార్లకు అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో మెదక్ మున్సిపాలిటీ మాత్రమే ఉండగా.. గత ఏడాది మూడు మున్సిపాలిటీలు కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట కొత్తగా ఆవిర్భవించాయి. వీటి పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుతోపాటు మద్యం దుకాణాల సంఖ్య పెంచే దశగా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ మద్యం దుకాణాల కాలపరిమితి నెలన్నర మాత్రమే మిగిలి ఉంది. వీటి గడువు ముగియక ముందే కొత్త పాలసీని ప్రకటించి టెండర్లను ఆహ్వానించాలి. ఈ మేరకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఇప్పటినుంచే విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్తగా రానున్న ఎక్సైజ్ పాలసీపై మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. కాలపరిమితిని ఏడాదికి పరిమితం చేస్తారా.. రెండేళ్లకా.. లైసెన్స్ ఫీజు ఎంత పెంచుతారో వంటి అంశాలపై వ్యాపార వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. వేలమా.. లాటరీనా..? 2015లో వేలం పాటల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు. ఎక్కవ మొత్తంలో పాట పాడిన వారికి ఆయా దుకాణాలను కేటాయించేవారు. కొన్ని అనివార్య కారణాలతో ఈ విధానాన్ని 2017లో ప్రభుత్వం రద్దు చేసింది. ఒకే మద్యం షాపునకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో షాపుల వారీగా లైసెన్స్ ఫీజును నిర్ధారించి.. లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించాలని పాలసీలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వేలం పద్ధతిన కేటాయిస్తారా.. లక్కీ డ్రా అమలు చేస్తారా అనే అంశాలపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి మర్గదర్శకాల రూపకల్పనలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. పోటాపోటీ జిల్లాలో ప్రస్తుతం 37 వైన్స్ దుకాణాలు, రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రెండేళ క్రితం నిర్వహించిన టెండర్లకు 301 అప్లికేషన్లు వచ్చాయి. వీటి చార్జీలు, లైసెన్స్ ఫీజుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా నుంచి రూ.3.01 కోట్లు సమకూరాయి. 2015లో ఒక్క మద్యం దుకాణానికి దరఖాస్తు రుసుం రూ.50 వేలు ఉండగా.. 2017లో రూ.లక్షకు పెంచారు. అయినప్పటికీ దరఖాస్తులు భారీగానే వచ్చాయి. ఈ సారి మద్యం దుకాణాలను పెంచనుండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుతోపాటు టెండర్ రేటు పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకులకు వరుస ఎన్నికలు ఆర్థికంగా కలిసొచ్చాయి. లాభాల పంట పండటంతో వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మద్యం వ్యాపారం లాభసాటిగా మారడంతో ఈ రంగంలోకి రావడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సారి పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు అధికారులతోపాటు మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
వాన కురిసె.. చేను మురిసె
సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతం లోటు... ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. -
ట్రంప్ మరో షాక్ : ఐటీ కంపెనీలకు పెనుభారమే
వాషింగ్టన్ : అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పడనుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రొగ్రామ్కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు.ఈ మేరకు 2020 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదనలు చేర్చారు. అయితే ఏఏ కేటగిరీల వ్యక్తులకు ఈ పెంపు వర్తిస్తుంది అనేది స్పష్టం చేయలేదు. తాజా నిర్ణయంతో భారతీయ ఐటీ కంపెనీలపై భారం పడనుంది. తమ ఉద్యోగులను అమెరికా పంపాలనుకునే భారత ఐటీ సంస్థలు హెచ్-1బీ దరఖాస్తు రుసుంను భరించాల్సి ఉంటుంది. ఇది ఆయా సంస్థలకు అదనపు భారంగా పరిణమించనుంది. కాగా, ఈ పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికా యువతకు సాంకేతిపరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కోసం వినియోగించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వలసలపై ఉక్కుపాదం మోపుతుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి ఐటీ ఉద్యోగులకు సంబంధించిన హెచ్-1బీ వీసాపై ఇప్పటికే పలు కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. తాజాగా హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచాలని నిర్ణయించడం భారతీయ ఐటీ ఉద్యోగులకు కూడా షాకింగ్ న్యూసే -
నేనంటే నేను
సార్వత్రిక సమరం ముగిసింది. ప్రజాతీర్పు స్ట్రాంగ్రూంలలోని ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ‘జడ్జిమెంట్ డే’కు మరో 40 రోజుల సమయం ఉంది. అయితే పోలింగ్ ముగియడం, భారీగా పోలింగ్శాతం నమోదు కావడంతో సర్వత్రా పోలింగ్ జరిగిన తీరుపైనే చర్చ సాగుతోంది. ఎప్పుడూలేని విధంగా రాత్రి వరకూ ఓటర్లు క్యూలో నిల్చొని ఓటేశారు. ఇప్పుడు ఈ అంశం కేంద్రంగానే పోలింగ్ సరళిని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, టీడీపీ వాదన అందుకు భిన్నంగా ఉంది. మొత్తం మీద ఎవరికి వారు పోలింగ్ తీరును విశ్లేషించుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాజకీయ పార్టీల నేతలు ‘రిలాక్స్ మూడ్’లో ఉన్నప్పటికీ గెలుపోటములపై లెక్కలు వేస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? ఏ డివిజన్, పంచాయతీల్లో తమకు ఎక్కువగా వచ్చాయి? ఎక్కడ తక్కువ వచ్చి ఉంటాయి? ఏ లీడర్ మనకు సహకరించారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు అని రకరకాల అంశాలను చర్చిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి, పెరిగిన పోలింగ్ శాతంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో 79.65శాతం నమోదైతే, ఇప్పటి ఎన్నికల్లో 82.22 శాతం నమోదైంది. అంటే 2.57 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఊహించని విధంగా ఓటెత్తిన ‘అనంత’ ఓటర్లు: జిల్లా వ్యాప్తంగా 3,884 పోలింగ్ బూత్లలో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 9,330 ఈవీఎంలు వినియోగించారు. ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. అయితే 97 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యమైంది. వీటిలో 10 నుంచి 30 నిమిషాల్లోపు 50 ఈవీఎంల సమస్య పరిష్కారమై పోలింగ్ మొదలైంది. ఆపై మరో 30–60 నిమిషాల్లోపు తక్కిన ఈవీఎంలు కూడా పనిచేశాయి. అంటే జిల్లాలో అన్ని పోలింగ్ సెంటర్లలోని ఈవీఎంలు సక్రమంగా పనిచేశాయి. వీటికి ఉపయోగించిన 9,993 వీవీ ప్యాట్స్ కూడా పనిచేశాయి. పైగా ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి ఫొటో కూడా ఈవీఎంపై స్పష్టంగా ఉంది. ఈవీఎం బటన్ నొక్కగానే పెద్దగా లైటింగ్, బీప్ శబ్దం రావడంతో పాటు ఏ గుర్తుపై ఓటేశారో ప్రింట్ కూడా వచ్చింది. వీటిని ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఇలా వీవీప్యాట్ ద్వారా ప్రింట్ వచ్చే ప్రక్రియతో ఒక్కో ఓటర్ ఓటు వేసేందుకు పట్టే సమయం కాస్త ఎక్కువైంది. పైగా వేసవి కావడం, ఎండలు మండిపోవడంతో మధ్యాహ్నం ఓటర్ల సంఖ్య తగ్గింది. సాయంత్రం భారీగా వచ్చారు. ఈ మొత్తం పరిణామాలతో పోలింగ్ సమయం ముగిసే గడువు 6గంటలకు అధికశాతం పోలింగ్స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. అయితే క్యూలో నిల్చున్న వారందరూ ఓటేసేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాత్రి 10.30గంటల వరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మొదట్లో నెమ్మదించి.. తర్వాత జోరందుకున్న పోలింగ్ ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలైనా.. 9గంటల వరకూ పోలింగ్ మందగించింది. అందుకే 9గంటల వరకూ 10.62శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11గంటలకు 21.47శాతం నమోదైంది. 11 నుంచి పోలింగ్శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.86శాతం నమోదైతే, 3 గంటలకు 54.96 శాతానికి చేరింది. 5గంటలకు 67.08శాతం నమోదైంది. 5 నుంచి పోలింగ్ ముగిసే సమయానికి ఏకంగా 15.14శాతం నమోదై 82.22శాతంతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ శాతం పెరగడంపై ఎవరికి వారు ధీమా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. దీంతో పోలింగ్శాతం పెరిగిన తీరును ఇరుపార్టీలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, అది ఓట్ల రూపంలో చూపించారని వైఎస్సార్సీపీ అంటోంది. అందుకే ఇంత భారీగా పోలింగ్ పెరిగిందని, ‘మార్పు’ కోరుతూ ప్రజలు తీర్పు ఇచ్చారని చెబుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణులు ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, పసుపు కుంకుమ, పింఛన్ డబ్బుల ప్రభావం ఉందని అందుకే ప్రజలు తరలివచ్చి టీడీపీకి ఓటేశారనేది వారి వాదన. అయితే టీడీపీ చేసిన గిమ్మక్కులను ప్రజలు నమ్మరని, పసుపు–కుంమ, పింఛన్లు ఎన్నికల ముందు తాయిళాలు వేసినట్లుగా ప్రజలు భావించారని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఈ రెండుపార్టీలు కాకుండా రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు తీర్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా రెండుపార్టీల్లో ఎవరి వాదన నిజం అనేది తేలాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. ఈవీఎంలపై అనుమానం తగదు ఈవీఎంలలో ఎలాంటి పొరబాట్లు ఉండవు. ఎన్నికల కమిషన్ ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయాన్ని చంద్రబాబు మరిచి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా గొప్పది. సంస్థ దృష్టిలో అందరూ సమానమే. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంలనే వినియోగిస్తున్నారు. – భాస్కరరెడ్డి, న్యాయవాది, పెనుకొండ 2014 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? ఈవీఎంలపై నిందలు వేస్తూ ఓ సీఎం స్థాయిలో చంద్రబాబు మా ట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈవీఎంలు వాడారు. మరీ ఆ ఎన్నికల్లో ఇదే తరహాలోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారా? అప్పట్లో వీవీ పాట్లు లేవు. ఓటు ఎవరికి వేసింది తెలియక తికమకపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి ఓటు వేసిందీ చాలా స్పష్టంగా అందరూ వీవీపాట్లలో చూసి తెలుసుకున్నారు. ఓటమి భయంతో తప్పును ఈవీఎంలపై నెట్టేయడం సబబు కాదు. – నాగిరెడ్డి, విశ్రాంత ఎంఈఓ, పుట్టపర్తి -
బీఓబీ మినిమం బ్యాలెన్స్ నిర్వహణ రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పొదుపు ఖాతాదారులు తమ ఖాతాల్లో నిర్వహించే కనీస బ్యాలెన్స్ను రెట్టింపు చేసింది. నగర, మెట్రో, సెమీ అర్బన్ బ్రాంచ్ల్లో కనీస నిల్వను రూ 1000 నుంచి రూ 2000కు పెంచుతున్నట్టు బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ల్లో కనీస నిల్వను రూ 500 నుంచి రూ 1000కి పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి నూతన మినిమం బ్యాలెన్స్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. బీఓబీలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లు విలీనం కావడంతో ఈ రెండు బ్యాంకుల పొదుపు ఖాతాలకూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. కాగా మినిమం బ్యాలెన్స్ నిర్వహణను వంద శాతం మేర బ్యాంకు పెంచినప్పటికీ కనీస నిల్వను నిర్వహించని ఖాతాదారులపై విధించే జరిమానాను పెంచకపోవడం ఖాతాదారులకు కొంత ఊరట ఇస్తోంది. అయితే అదనంగా మినిమమ్ బ్యాలెన్స్ను నిర్వహించడం ఖాతాదారులపై భారం మోపనుంది. -
8 నెలల్లో 90 శాతం..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా.. గడిచిన 8 నెలల్లో 90 శాతం ఉత్పత్తి సాధించింది. సింగరేణి వ్యాప్తంగా 4 ఏరియాల్లో వందశాతం ఉత్పత్తి జరిగింది. ఇక ఓపెన్కాస్టు గనుల్లో 94 శాతం, భూగర్భ గనుల్లో 76 శాతం ఉత్పత్తి నమోదు చేసుకుంది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ మాసం వరకు 8 నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా భూగర్భ, ఓపెన్కాస్టు గనుల్లో 43.71 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకోగా నవంబర్ 30వ తేదీ వరకు 39.53 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 90 శాతం సాధించారు. ఇక ఓపెన్కాస్టు గనుల్లో 35.80 మిలియన్ టన్నులకు గాను 33.52 మిలియన్ టన్నులతో 94 శాతం, భూగర్భ గనుల్లో 7.91 మిలియన్ టన్నులకు గాను 6.0 మిలియన్ టన్నులతో 76 శాతం మాత్రమే ఉత్పత్తి సాధించడం గమనార్హం. వార్షిక లక్ష్య సాధనకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో సింగరేణి వ్యాప్తంగా నెలవారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లైతేనే వార్షిక ఉత్పత్తి సాధించగలమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొంత ఉత్పత్తి లోటు కనిపిస్తుండటంతో నెలవారీ లక్ష్యాలను మించి ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు ఏరియాల్లో నూరుశాతం దాటిన ఉత్పత్తి సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా గడిచిన 8 నెలల ఉత్పత్తి లక్ష్య సాధనలో నాలుగు ఏరియాలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగాయి. కొత్తగూడెం, ఇల్లెందు, రామగుండం–1తో పాటు శ్రీరాంపూర్ ఏరియాల్లో నూరు శాతం మించి ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం ఏరియాలో అత్యధికంగా 112 శాతం, రామగుండం–1లో 104 శాతం, ఇల్లెందులో 103 శాతం కాగా శ్రీరాంపూర్ ఏరియాలో 100 శాతం ఉత్పత్తి నమోదైంది. -
హెచ్ -1బి వీసాలపై కంపీట్ అమెరికా ఫిర్యాదు
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను డొమొక్రాట్లు గట్టి దెబ్బతీసారు. మరోవైపు టాప్ ఐటీ కంపెనీలకు జారీ అయ్యే వీసాలపై ప్రముఖ ఐటీ కంపెనీల సంఘం కంపీట్ అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సర్కార్ హయాంలో విదేశీ ఐటీ నిపుణులకిచ్చే హెచ్ 1బీ వీసాల జారీ నిలుపుదల సంఖ్య బాగా పెరిగిందని తేల్చి చెప్పింది. ఈ సంఘంలో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-1బీ వీసాల జారీ నిలుపుదల బాగా పెరిగిపోయిందని కంపీట్ అమెరికా తెలిపింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో యూఎస్సీఐఎస్ వద్ద హోల్డ్లో ఉంటున్నాయని ఫిర్యాదు చేసింది. అంతేకాదు అయితే ట్రంప్ యంత్రాగం ఆధ్వర్యంలో హెచ్-1బీ వీసాల న్యాయ విచారణ పద్ధతుల్లో మూడు ప్రధానమైన మార్పులు గమనించామని కంపీట్ అమెరికా పేర్కొంది. న్యాయపరమైన నిబంధనలలో చాలా అసమానతలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్రిస్ట్ జెన్ నీల్సన్, యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా కంపీట్ అమెరికా నవంబరు 1వ తేదీన ఒక లేఖ రాసింది. ఈ విధానం యజమానులను గందరగోళంలో పడవేస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. యూఎస్సీఐఎస్ పద్ధతులు, నిబంధనల పట్ల కంపెనీలకు సరైన అవగాహన లేకుండా పోయిందనీ, ఈ అనిశ్చితి వల్ల అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్న కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. గత 18 నెలల్లో కంపెనీలకు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లు, దరఖాస్తుల తిరస్కరణలు బాగా పెరిగిపోయాయని వెల్లడించింది. కాగా డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్-1బీ వీసా చట్టాల్లో పలు మార్పులను తీసుకొవస్తున్నసంగతి తెలిసిందే. ఈ హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేసే విదేశీయులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులను భారీగా ప్రభావితం చేస్తోంది. -
కోటీశ్వరులు ఎంత శాతం పెరిగారో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కోటీశ్వరులు సంఖ్య పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో కరోడ్ పతిల సంఖ్య భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత పన్నులు చెల్లిస్తున్నవారు గత నాలుగేళ్లలో 1.40లక్షల మంది పెరిగారని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కల ప్రకారం కోటి పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య సుమారు 60శాతం పెరుగుదలను నమోదు చేసిందని తెలిపింది. గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులచెల్లింపుల గణాంకాలను సీబీడీటీ సోమవారం ప్రకటించింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పుంజుకుందని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా గత మూడేళ్లలో పన్ను చెల్లింపు దారుల నమోదు భారీగా పెరిందని తెలిపారు. కోటి రూపాయల ఆదాయాన్ని చూపిస్తూ (కార్పొరేట్లు, సంస్థలు, హిందూ డివైడెడ్ ఫ్యామిలీస్ తదితరులు) ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి మొత్తం సంఖ్య ఏటా 68 శాతం పెరిగిందన్నారు. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 55 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014-15 లో రూ. 32.28 లక్షల తో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో సగటు పన్ను రూ .49.95 లక్షలకు పెరిగింది. సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ్య 37శాతం పెరిగింది. అలాగే నాన్ సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ్య 19శాతం వృద్ధిని నమోదు చేసింది. -
మరో విడత వడ్డింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 3,4,5వ తేదీల్లో జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) నిర్ణయం వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరశాతం వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ తీవ్రత, రూపాయి బలహీనత, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాల నేపథ్యంలో రేటు పెంపు వైపే ఆర్బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఒక వార్తా సంస్థ సెప్టెంబర్ 19 నుంచి 25 మధ్య నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక డాలర్ మారకంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 శాతం బలహీనపడ్డ రూపాయి విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగించే అంశమేనన్నది వారి విశ్లేషణ. అమెరికాలో వడ్డీరేటు పెరుగుతున్న పరిస్థితుల్లో, దేశీయంగా ఈ తరహా నిర్ణయం లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్కు తగిన రిటర్న్ లభించని పరిస్థితి ఉంటుంది. దీనితో దేశానికి విదేశీ నిధులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి కరెంట్ అకౌంట్ లోటుకు, రూపాయి మరింత పతనానికి దారితీస్తుంది. 3వ తేదీ నుంచీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది. 5వ తేదీన కీలక రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ అంశంపై కొందరి అభిప్రాయాలు చూస్తే... ఎస్బీఐ: రూపాయి బలహీనతను అరికట్టడానికి కనీసం పావుశాతం రేటు పెంపు తప్పదని ఎస్బీఐ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన ‘తటస్థ వైఖరి’ని కూడా ఆర్బీఐ మార్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఐఎన్జీ: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడ్ వడ్డీరేట్ల (ప్రస్తుతం 2.25%) పెంపు నేపథ్యంలో దేశీయంగానూ రేట్ల పెంపు తప్పని పరిస్థితి నెలకొందని ఐఎన్జీలో ఆసియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు ప్రకాశ్ శక్పాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ అక్టోబర్ 4వ తేదీన పావుశాతం రేటు పెంచినా, ఫెడ్ రేటుకు సంబంధించి పోల్చిచూస్తే, ఆ మేర రేటు పెంపు (పావుశాతం) తక్కువగానే భావించాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. రాబోబ్యాంక్: భారత్ రెండవ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటును సాధించినప్పటికీ, దానికి ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ కారణమవుతుందని రబోబ్యాంక్లో సీనియర్ ఎకనమిస్ట్ హుగో ఎర్కిన్ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత్ ముందున్న తీవ్ర సవాలని అన్నారు. ఇది కరెంట్ అకౌంట్పై ప్రతికూలత చూపే అంశంగా పేర్కొన్నారు. డీబీఎస్: రూపాయి క్షీణతతో పాలసీ రేటు పెంపు ఆర్బీఐకి తప్పనిసరేనని, అయితే ఎప్పుడు పెంచుతారన్నదే కీలకమని సింగపూర్లో డీబీఎస్ ఎకనమిస్ట్ రాధికారావు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర తీవ్రత, దేశంలో ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశాలు రేటు పెంపు నిర్ణయం పట్ల ఆర్బీఐ మొగ్గుచూపేలా చేస్తాయని రాధికారావు పేర్కొన్నారు. మోర్గాన్ స్టాన్లీ: ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడుతోంది. రూపాయి బలహీనత ఇక్కడ కీలకాంశమని పేర్కొంది. కరెన్సీ విలువ స్థిరీకరణకు తీసుకుంటున్న చర్యలూ ఫలితమివ్వడం లేదన్న విషయాన్ని మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యలోటు సమస్య, ద్రవ్యోల్బణం ఎగసే అవకాశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెట్రో ధరల మంట... దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ము న్ముందు పెరుగుతుందనడానికి ఇది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ముందస్తు చర్య తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటు పావుశాతం పెరుగుతుందని భావిస్తున్నా. – రాజ్కిరణ్ రాయ్ జీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రూపీ బలహీనత కారణంగా... కరెన్సీ విలువ డాలర్ మారకంలో భారీగా పడిపోతోంది. ఆయా పరిణామాలను ఎదుర్కొనడానికి పావుశాతం రేటు పెంపు తక్షణ అవసరం. – కేకి మిస్త్రీ, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ రయ్మంటున్న క్రూడ్... అంతర్జాతీయంగా క్రూడ్ ధర నాలుగున్నరేళ్ల గరిష్టస్థాయికి చేరింది. మంగళవారం నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర 75.91 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 75.30 వద్ద ట్రేడవుతోంది. భారత్ ప్రధానం గా వినియోగించే బ్రెంట్ ధర 85.36 స్థాయిని తాకి, అదే స్థాయిలో ట్రేడవుతోంది. సరఫరా పరమైన ఆందోళనలు అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణం. 100 డాలర్లకు బ్రెంట్ చేరుతుందన్న అంచనాలు భారత్ వంటి వర్థమాన దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. జారిపోతున్న రూపాయి... ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోతోంది. మంగళవారం నైమెక్స్లో రూపాయి విలువ డాలర్ మారకంలో 73.77కు పడిపోయింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 73.30 వద్ద ట్రేడవుతోంది. ఇక ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ మళ్లీ 95 పటిష్ట స్థాయిని దాటింది. దేశీయ ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటికి రూపాయి ఇంట్రాడే రికార్డు 72.99 అయితే, ముగింపులో రికార్డు 72.98. అంతర్జాతీయ ట్రేడింగ్ ధోరణిని చూస్తుంటే, బుధవారం దేశీయంగా 73ను రూపాయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మూఢనమ్మకాలెక్కువ..
గిరిజనులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం.. వారికి అన్ని సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందిస్తాం.. ఈ మాటలు అధికారులు, పాలకులు ఎప్పటికప్పుడు వల్లెవేస్తూనే ఉంటారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గిరిజన ప్రాంతంలో వైద్యం, అంగన్వాడీ సేవలు అంతంతమాత్రమే. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. అలాగే వైద్యసేవల తీరు కూడా అంతే. వీటన్నింటికీ తోడు మూఢనమ్మకాల ప్రభావం గిరిపుత్రులపై ఎక్కువగా ఉంటోంది. గర్భిణికి పురిటినొప్పులు వస్తే క్షుద్రపూజలు చేయించి పసర మందు తాగించింది ఓ గిరిజన కుటుంబం. అలాగే మరోచోట పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి దెయ్యం పట్టిందని ఆమె దగ్గరకే వెళ్లలేదు ఆ కుటుంబ సభ్యులు. ఇలాంటి సంఘటనలు మన్యంలో కోకొల్లలు. మరి వీరిని చైతన్యపరచాల్సిన అధికారుల జాడెక్కడ..? అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న పాలకులేరీ...? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నా సమాధానాలు దొరక్కుండానే మిగిలిపోతున్నాయి. సాలూరురూరల్: మైదాన ప్రాంతాలతో పోలిస్తే గిరిశిఖర గ్రామాల్లో మాతా,శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమాయక గిరిజనులకు వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. గ్రామాలకు రహదారి సౌకర్యం అంతంతమాత్రమే కావడం.. మూఢనమ్మకాలను విశ్వసించడం, తదితర కారణాల వల్ల మన్యంలో మరణాలు సంభవిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల సేవలు మన్యంలో అంతంతమాత్రంగా ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వైద్యసేవలు కూడా సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు. మరోవైపు గిరిజనులు మూఢనమ్మకాలను విశ్వసించడం వల్ల సకాలంలో ఆస్పత్రులను ఆశ్రయించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పౌష్టికాహారం లోపం, వైద్యం అందకపోవడం, తదితర కారణాల వల్ల మన్యంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాలెక్కువ.. ఏజెన్సీలో పలు మరణాలకు ముఖ్యంగా మూఢనమ్మకాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 16న సాలూరు మండలం సారిక పంచాయతీ మిర్తిగుడ్డివలస గ్రామానికి చెందిన గర్భిణి మువ్వల శారదకు నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు క్షుద్ర గురువును ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు పురిటినొప్పులతో బాధపడుతున్న శారదతో పూజలు చేయించి పసర మందు తాగించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. అలాగే ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలసకు చెందిన అంగన్వాడీ టీచర్ బడ్నాన పార్వతి ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించారు. అయితే ఈమె ప్రసవ నొప్పులతో తల్లడిల్లుతుంటే పలువురు గ్రామస్తులు ఆమెకు దెయ్యం పట్టిందని భావించి ఎవ్వరు చాలా సమయం దగ్గరకు చేరలేదు. చివరకు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చి రక్తపుమడుగులో మృతిచెందింది.బిడ్డ కూడా కన్నుమూశాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గిరిజన గ్రామాల్లో వెలుగు చూడని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య, అంగన్వాడీ సేవలు మెరుగ్గా అందించడంతో పాటు మూఢనమ్మకాలు విడనాడేలా చైతన్యపరచాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ఏడాది సెప్టెంబర్ 17న సాలూరు మండలం మిర్తిగుడ్డివలసకు చెందిన గర్భిణి మువ్వల శారద (20) జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడం.. పౌష్టికాహారలోపం వల్ల ఆమె మృత్యువాత పడినట్లు సమాచారం. ► ఈ ఏడాది జూలై 29న సాలూరు మండలంలోని గిరిశిఖర కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందెకు పురిటినొప్పులు వచ్చాయి. మూడో కాన్పు కావడంతో పాటు నెలలు నిండకపోవడంతో పుట్టిన వెంటనే మగబిడ్డ కన్నుమూశాడు. ఈక్రమంలో గిందెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే భర్త డుంబ్రీ, స్థానికులు డోలి ద్వారా సుమారు 12 కిలోమీటర్లు కొండమార్గం గుండా నడుచుకుంటూ దుగ్గేరు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యాధికారుల సూచనల మేరకు అక్కడ నుంచి 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా గిందె కోలుకుంది. ► ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలస గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త బడ్నాన పార్వతి (24) ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. పుట్టిన బిడ్డ కూడా కొద్ది క్షణాల్లోనే మృతి చెందాడు. పౌష్టికాహారం లోపం వల్లే మరణాలు సంభవించినట్లు సమాచారం. ► 2017 జూలై 24న సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు సాలూరు సీహెచ్సీలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రక్తస్రావం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆమెను విజయనగరం ఘోషా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్లో తరలిస్తుండగా ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో చిన్నమ్మలు మార్గమధ్యలోనే కన్నుమూసింది. ► 2017 జూలై 24న కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ సకాలంలో వైద్యం అందక ఓ బిడ్డకు జన్మనిచ్చి, తానూ మృత్యు ఒడిలోకి జారుకుంది. ► గర్భిణి పాలక రమణమ్మకు పురిటినొప్పులు రావడంతో గ్రామస్తులు డోలీ సహాయంతో మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్సీకి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరానికి తరలించగా అక్కడ బిడ్డ మృతి చెందాడు. దీంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. -
నెత్తురోడుతున్న రహదారులు
రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ మానవ తప్పిదాల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్లో ఎంతటి నిపుణులైనా నిబంధనలు పాటించకుంటే ప్రమాదాలు తప్పడం లేదు. దురదృష్టవశాత్తూ సినీ నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఇటువంటిదే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవింగ్ సీటులో ఉన్న హరికృష్ణ సీటు బెల్టు ధరించకపోవడం, అత్యంత వేగంగా వాహనం నడపడం అని నల్గొండ పోలీసులు చెబుతున్నారు. ఇక మన జిల్లాకు వస్తే రహదారి ప్రమాదాల కారణంగా అధికారుల గణాంకాల ప్రకారం ఏటా రెండు వేలకు పైగా మృత్యువాత పడుతున్నారు. మరో 700 మంది వరకూ క్షతగాత్రులవుతున్నారు. లెక్కల్లోని రాని ప్రమాదాల్లో మరో వెయ్యిమంది వరకూ గాయాలు పాలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసులు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు. నిపుణుల సూచనలు తెలుసుకుందాం. నిడమర్రు: వాహనచోదకుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. రోడ్డు సేప్టీ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా.. ► కార్లు, జీపులు, బస్సులు, లారీలు నడిపే సమయంలో ముఖ్యంగా కాళ్ల సమీపంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి, బ్రేక్ కిందకు వచ్చినప్పుడు వాటిని నొక్కినా బ్రేక్ పట్టక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ► వాహనం నడిపేటప్పుడు క్లచ్, బ్రేకు ఎక్స్లేటర్ విషయంలో కచ్చితమైన అవగాహన అవసరం. కొత్తగా కొన్న వాహనాన్ని ► కారు పార్కింగ్ చేసేటప్పుడు సెంట్రల్ బ్రేకు వేస్తుంటాం, అయితే కారు వేగంగా వెళ్తున్నప్పుడు అదే సెంట్రల్ బ్రేకు ప్రమాదానికి కారణమవ్వవచ్చు. ఎవరైనా చిన్న పిల్లలుంటే దాన్ని పట్టుకొని లాగితే ప్రమాదం. అలా లాగితే నాలుగు చక్రాలకు బ్రేకులు పడతాయి. ► టైర్లలో గాలి తక్కువగా ఉంటే వెంటనే గాలి నింపుకోవాలి. లేకుంటే వేగంగా వెళ్తుండగా మొత్తం గాలిపోతే కారు నెమ్మదిగా వెళ్లడంతో పాటు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అదీగాక పంక్చర్ పడితే వాహనాన్ని నియంత్రించడం కష్టం. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో జాగ్రత్తలు ఇలా.. ప్రమాదాల శాతం ఎక్కువగా పొగమంచు రోజుల్లోనూ, వర్షాకాలంలో జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వర్షంలో తడిసిన / నీటితో నిండిన రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాన్ని స్లో చెయ్యటం క్లిష్టం, అలాంటి సందర్భాల్లో మితిమీరిన వేగం వద్దు. ప్రత్యేకించి కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తతో డ్రైవ్ చెయ్యాలి. వైఫర్స్ సరి చేసుకోవాలి. పగటి పూట హెడ్లైట్స్ వేయాలి. వాహనాల మధ్య దూరం ఎక్కువ ఉండాలి. ద్విచక్ర వాహనాల విషయంలో.. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పలుమార్లు జరిమానా కడుతున్నా హెల్మెట్ ధరించడం లేదని జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు చెప్పారు. జిల్లాలో డీటీ ఆర్బీ అనే ప్రత్యేక వింగ్ జిల్లాలో రహదారిపై జరిగే ప్రమాదాల నివారణకు డీటీఆర్బీ(డిస్ట్రిక్ ట్రాఫిక్ రికార్డ్ బ్రాంచ్) అనే ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. ఈ వింగ్ జిల్లా పోలీసులు, ఆర్టీవో అ«ధికారులకు నోడల్ ఏజెన్సీగా సహకరిస్తుంది. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానికి కారణాలు, తర్వాత తీసుకోవల్సిన చర్యలు, ప్రమాదానికి సంబంధించిన డేటా సేకరించి అనుబంధ శాఖలకు అందిస్తారు. హైవేలపై డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు సిద్ధాంతం నుంచి ఏలూరు వరకూ 23 పెట్రోలింగ్ వాహనాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు తెలిపారు. హరికృష్ణ మృతికి ఇదే కారణమా..! సీటు బెల్టు పెట్టుకోని కారణంగా కార్లకు ఉండే సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రాపిడికి ముందుగా తెరుచుకునేవి కారు తలుపులే. అలాంటి సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అనేక మంది ప్రమాదాల్లో వాహనంలోంచి విసిరేసినట్లు పడటంతో తీవ్రంగా గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. హరికృష్ణ మృతి విషయంలో ఇదే జరిగింది. డివైడర్ను ఢీకొట్టిన వెంటనే కారు తిరగబడుతున్న సమయంలో సీట్ బెల్టు పెట్టుకోకపోవడంతో హరికృష్ణ వాహనంలోచి బయటకు విసిరి వేయబడి తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. నాలుగు ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీర వేగం వల్లే సంభవిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు జిల్లాలో కొవ్వూరు, తణుకు, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల వెంబడి స్పీడ్ లేజర్గన్స్ ఏర్పాటు చేశాం. రహదారి వెంబడి ఉంచిన స్పీడ్ లిమిట్ సూచీల్లో ఉన్న వేగంకంటే అధిక వేగంతో వాహనాలు నడిపిన వారికి ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తున్నాం. ఈ చలానాలో వాహనం ఫొటో, ఏ సమయంలో, ఎంత వేగంతో వెళ్లింది ఉంటుంది, దీంతో వారు వేగం లిమిట్ దాటకుండా నియంత్రిస్తున్నాం. –పి.భాస్కరరావు, డీఎస్పీ, ట్రాఫిక్ హైవేలపై ప్రత్యేక డ్రైవ్స్ పెట్రోలింగ్ వాహనాల్లో సిబ్బంది హైవేలపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన 5 నుంచి 10 నిమిషాల్లో స్పాట్కు చేరి క్షతగాత్రులను హాస్పటల్కు తరలించేలా పెట్రోలింగ్ సిబ్బంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోడ్డు మార్జిన్లో వాహనాలు నిలిపినా, అపసవ్య దిశలో వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. రోడ్డు ప్రమాదాలకు కారణాలు సేకరించి. అవసరమైన సూచనలు అందించేందుకు కృషి చేస్తున్నాం. –చావా సురేష్ ఎస్సై, డీటీ ఆర్బీ స్వీయ నియంత్రణ అవసరం వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ విషయంలో స్వీయ నియంత్రణ ఉంటే ప్రమాదాలు జరగవు. రహదారుల అధ్వానంగా ఉండటం, హైవేలపై రోడ్డు నిర్వహణ సక్రమంగా చెయ్యకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో జరిగిన ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నట్టు రోడ్డు ప్రమాద కేసుల ద్వారా తెలుస్తోంది. –మోపాటి బాల పరమేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, భీమవరం -
హౌసింగ్ కంపెనీలకు చౌక ఇళ్ల బొనాంజా!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో గృహాలు (అఫర్డబుల్ హౌసింగ్) రాజకీయ నేతలకు ఓట్లు కురిపించినట్టే... ఇళ్ల కొనుగోలుకు రుణాలిచ్చే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ భారీ వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక ఫలితాలపై కనిపిస్తోంది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) కంపెనీలు ఈ విభాగంలోనే 20 శాతం వృద్ధిని ఈ ఏడాది నమోదు చేయడం గమనార్హం. ఈ విభాగాలపై కంపెనీల దృష్టి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ–1), మధ్య ఆదాయంలోనే రెండో గ్రూపు (ఎంఐజీ–2) ఉన్నాయి. వీటిలో చివరి రెండు గ్రూపుల నుంచి హౌసింగ్ రుణాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఎంఐజీ–1 విభాగంలో వార్షికంగా రూ.6–12 లక్షల ఆదాయం కలిగిన వారికి వడ్డీ రేటులో 4 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. రుణం ఎంతన్న దానితో సంబంధం లేకుండా... రుణంలో రూ.9 లక్షలపై వడ్డీకి మాత్రమే దీన్ని ఆఫర్ చేస్తోంది. ఇక రూ.12–18 లక్షల ఆదాయం కలిగిన లబ్ధిదారులకు రూ.12 లక్షల రుణంపై వడ్డీకి 3 శాతం రాయితీ అమల్లో ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలకూ గృహ రుణాల్లో వడ్డీ రాయితీని కేంద్రం అందిస్తోంది. ఈడబ్ల్యూఎస్ గ్రూపులో రూ.3 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారు, ఎల్ఐజీలో రూ.3–6 లక్షల ఆదాయం కలిగిన వారు వడ్డీలో 6.5 సబ్సిడీకి అర్హులు. పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.20–40 లక్షల గృహ రుణాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. మధ్యస్థ ధరల ఇళ్లకు డిమాండ్ రూ.6–12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు తొలిసారి ఇల్లు కొనుగోలుకు రుణం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరు తీసుకునే రుణం కూడా తమ వార్షికాదాయానికి మూడు రెట్ల మేర అంటే రూ.18–35 లక్షల మధ్య ఉంటోంది. రూ.25–40 లక్షల విలువ కలిగిన ఇళ్ల కొనుగోలుకు వీరు రుణాల బాట పడుతున్నారు. కొన్ని పట్టణాల్లో, పెద్ద పట్టణాలకు శివార్లలో మధ్య తరహా ఇళ్లకు డిమాండ్ ఉంటోందని ఆంటిక్యూ బ్రోకింగ్ అనలిస్ట్ దిగంత్ హారియా చెప్పారు. ‘‘రూ.10–20 లక్షల మధ్య ఇళ్లకు ఇంకా డిమాండ్ పుంజుకోలేదు. రెరా, నోట్ల రద్దు, సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ విభాగం బంగారం వంటిది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ 37 శాతం రుణాలను ఈడబ్ల్యూఎస్ విభాగంలో, 19 శాతం రుణాలను ఎల్ఐజీ విభాగంలోనే ఆమోదించడం గమనార్హం. నెలవారీగా హెచ్డీఎఫ్సీ ఈ రెండు విభాగాలకు సంబంధించి 8.300 రుణ దరఖాస్తులను ఆమోదిస్తోంది. నెలవారీగా ఆమోదించే సగటు రుణాల విలువ రూ.1,346 కోట్లుగా ఉంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే అందుబాటు గృహాలపై దృష్టి సారించడం ద్వారా 28 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఈ సంస్థ కస్టమర్లలో 65 శాతం మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే. తమ కస్టమర్లలో 35 శాతం మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద వడ్డీ రాయితీకి అర్హులేనని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీసీ గగన్బంగా తెలిపారు. -
రాజధానిలో పెరిగిన ఎయిడ్స్ కేసులు
న్యూఢిల్లీ : గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గింది.. కానీ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ సంఖ్య పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్సభలో సభ్యులు దేశవ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్ కేసుల వివరాల గురించి అడిగిన ప్రశ్నలకు, ఆరోగ్య, మంత్రిత్వ శాఖ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానాలు అందించింది. గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్ వ్యాధి కేసుల వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం.. 2015 - 16 సంవత్సరంలో 2, 00, 465 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా, 2013 - 17లో 1, 93, 195 కేసులు, 2017 - 18 సంవత్సరంలో 1, 90, 763 ఎయిడ్స్ కేసులు నమోదయినట్లు తెలిపింది. ఏడాదికేడాది దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. అందుకు విరుద్ధంగా రాజధాని ఢిల్లీలో మాత్రం ఎయిడ్స్ కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నట్లు ప్రకటించింది. 2017 - 18 సంవత్సరానికి గాను ఢిల్లీలో ఉన్న కొత్తగా 6,563 ఎయిడ్స్ కేసులను గుర్తించగా, గతేడాది ఈ సంఖ్య 6,340గా ఉన్నట్లు తెల్పింది. అయితే ఈ పెరుగుదలకు కారణం ‘వలసలు’ అంటున్నారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు. ‘ఉపాధి కోసం ప్రతిరోజు ఎందరో రాజధానికి వలస వస్తుంటారు. అందువల్లే కొత్త కేసులు పెరుగుతున్నాయ’ని తెలిపారు. ప్రస్తుతం రాజధానిలో మొత్తం 28, 445 ఎయిడ్స్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది ఎయిడ్స్ వ్యాధి బారిన పడి దాదాపు 400 మంది మరణిస్తున్నారని ప్రకటించారు. 2017 - 18 సంవత్సరానికి గాను మహారాష్ట్రలో అత్యధికంగా ఎయిడ్స్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రలు ఎయిడ్స్ వ్యాధికి హాట్స్పాట్స్గా మారాయన్నారు. త్వరలోనే రాజధాని ఢిల్లీలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. అంతేకాక ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మరో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. -
పెరిగిపోతున్నారు.. పెళ్లికాని ప్రసాద్లు
నిడదవోలు : పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్నా.. వారికి వివాహం చేసే విషయంలో మాత్రం తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కుమారుల వివాహ విషయంలోనే ఎక్కువగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడుకు పుట్టాలని తమ ఇష్ట దైవాలను పూజించడం, మొక్కులు చెల్లించడం వంటివి కొందరు తల్లిదండ్రులు చేస్తారు. కొడుకు పెరిగి పెద్దవాడైన తరువాత అతని పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయడానికి ప్రస్తుతం తల్లిదండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు. జీవితాంతం పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తరువాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే సంబంధాలు అంత తేలిగ్గా కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్టు యువ తులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన చేయకపోవడం, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడకపోవడం, అమ్మాయిలు కోరుకున్నట్లు యువకులు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య పెరుగుతోంది. అమ్మాయిల అభిప్రాయానికే ప్రాధాన్యత గతంలో కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి ఎంత చెబితే అంతలా ఉండేది. అమ్మాయిలకు పెళ్లి సంబంధాలలో కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఏ సంబంధం చూసినా పిల్లలు అభ్యంతరం చెప్పేవారు కాదు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమ్మాయి ఓకే అంటేనే పెళ్లి చూపులు. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లి. అంటే ప్రాధాన్యత అమ్మాయికే ఎక్కువగా ఉంటోంది. అబ్బాయి ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని.. ఉద్యోగం కూడా చేస్తూ ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత వివాహం చేసుకోవాలనే సంకల్పం కారణంగా అబ్బాయిల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఉన్నత చదువులు.. పెరుగుతున్న పెళ్లి వయస్సు మానవుని జీవిత చక్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల ఆవశ్యకత ఎంతో ఉంది. చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ.. యువతీ, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువతులకు 23 నుంచి 25 ఏళ్లు, యువకులకు 28 నుంచి 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ చదివితే కనీసం ప్రైవేట్ ఉద్యోగం అయినా వస్తుందనుకుంటే నేటి రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉన్నత చదువులు ఉంటేనే వస్తున్నాయి. ఆ చదువులు పూర్తయ్యే సరికి పెళ్లి వయస్సు మించిపోతుంది. గతంలో ఉన్నత చదువులైన మెడిసిన్, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంసీఏ, సీఏ వంటి కోర్సులు కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే చదివేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వీరిలో అమ్మాయిలే అధికంగా కనిపిస్తున్నారు. దీంతో అమ్మాయిల చదువు పూర్తయిన తర్వాతనే మంచి ఉద్యోగం ఉన్న యువకుడితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. చాలా మంది మధ్యతరగతి అమ్మాయిలు కూడా టీచర్ ఉద్యోగానికి ఆసక్తి చూపుతున్నారు. చేసుకోబోయే యువకుడు కూడా బీఈడీ చేసినట్లయితే వాళ్లిద్దరూ ప్రైవేట్ స్కూల్స్లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవించవచ్చుననే భావనతో అమ్మాయిలు బీఈడీ వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బాయిలు కూడా టీచర్ ఉద్యోగం చేస్తున్నా కనీసం చేసుకోబోయే అమ్మాయికి బీఈడీ ఉండాలని కోరుకుంటున్నారు. వివక్షను విడనాడాలి పూర్వ కాలంలో తల్లిదండ్రులు సంతానం విషయంలో ఆడైనా మగైనా దేవుడు వరంగా ఇచ్చిన బిడ్డలుగా భావించేవారు. తరువాత కుటుంబ నియంత్రణ అమలులోకి రావడంతో ఆర్థిక స్థోమతును కూడా దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేక ముగ్గురితో ఎక్కువ సంతానానికి ముగింపు పలికారు. ఆ తరువాత కాలంలో (రెండు దశాబ్దాల క్రితం) ఆడపిల్లలు పుడితే వారిని చదివించడం, సంరక్షించడం, పెళ్లి చేయడం వంటివి భారంగా భావించేవారు. అదే అబ్బాయిలు అయితే ఎంత ఖర్చయినా ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తాడని, అదే విధంగా వివాహం చేస్తే వచ్చే కోడలు తెచ్చే కట్న కానుకలతో కుటుంబం ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో మగ బిడ్డే కావాలని కోరుకున్నారు. మొదటి కాన్పులో అమ్మాయి పుడితే రెండవ కాన్పులో అబ్బాయి కోసం ఎదురు చూసేవారు. అదేవిధంగా మొదటి కాన్పులో అబ్బాయి పుడితే రెండవ కాన్పులో అమ్మాయి పుడుతుందనే భావంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించునేవారు. దీంతో ఎక్కడి పడితే అక్కడ చట్ట విరుద్ధమైన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేవారు. ఆడ బిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్ప డేవారు. నేడు యువతీ యువకుల నిష్పత్తిలో తేడాలు పెరగడానికి ఇదో కారణం. ప్రతి వెయ్యి మంది పురుషులకు 980 మంది మహిళలు మాత్రమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో వివాహాలు జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షక పాత్రలో ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి. స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబ్బాయిల నిష్పత్తి ఎక్కువగా ఉండి అమ్మాయిల నిష్పత్తి తక్కువగా ఉండటంతో భవిష్యత్లో ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య జనాభా నిష్పత్తి సమానంగా ఉంటేనే వివాహాలు ఆలస్యం కాకుండా జరుగుతాయి. – టీఎన్వీ సూర్యప్రకాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, నిడదవోలు ఆడపిల్లలను తక్కువ చేసి చూడొద్దు తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో తక్కువ చేసి చూడొద్దు. ఆడ పిల్లల విషయంలో వివక్ష కొనసాగితే భవిష్యత్లో పూర్వ రోజులు కన్యాశుల్కం వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. కనుక ఆడ పిల్లలను తక్కువగా చూడకుండా మగ బిడ్డలతో పాటు సమానంగా చూడాలి. – కొండా నిర్మల, సీనియర్ సిటిజన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నిడదవోలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం నిషేధం విధించినా రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో మగ బిడ్డ పుడితే వంశోధ్ధారకుడని, ఆడ బిడ్డ పుడితే మరో ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని పెద్దలు, భర్త ఒత్తిడితో ఆలోచన లేకుండా ఆడ పిల్లలను వద్దనుకోవడంతో అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే మహిళా చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. సమాజంలో ఆడ పిల్లల ప్రాధాన్యత, వారికి న్యాయస్థానాలు కల్పిస్తున్న హక్కులు, చట్టాలపై భవిష్యత్లో అవగాహన సదస్సులు చేపడతాం. – కారింకి సాయిబాబు, రోటరీక్లబ్ అధ్యక్షులు, నిడదవోలు -
గరీబ్రథ్ చార్జీలకూ రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : పేదవారి ఏసీ ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ చార్జీలూ భారం కానున్నాయి. పదేళ్ల కిందట రూ 25గా నిర్ణయించిన ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా లినెన్ ధర పెరిగినప్పటికీ గరీబ్ రథ్ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్ రథ్ చార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. బెడ్రోల్ ధరలను రైలు చార్జీల్లో కలపాలని కాగ్ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో బెడ్రోల్ ధరలు టికెట్ ధరలో కలపడంతో చార్జీలు కొంతమేర పెరుగుతాయని వెల్లడించారు. బెడ్రోల్ కిట్స్ ధరలను టికెట్తో పాటే ప్రస్తుతం ఆఫర్ చేస్తుండగా, ఇక వీటి ధరలనూ టికెట్లో కలుపుతామని అధికారులు సంకేతాలు పంపారు. కాగ్ సూచనలతో పేద, సాధారణ ప్రయాణీకులు ఎంచుకునే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ప్రయాణీకుల పైనా చార్జీల వడ్డన తప్పేలా లేదు. -
ఫండ్స్లోకి పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ వరకు మొదటి మూడు నెలల కాలంలో నికరంగా రూ.1.34 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.93,400 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే గనుక 43 శాతం వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం బలంగా ఉంటోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ గణాంకాల ప్రకారం చూస్తే... విరివిగా వచ్చి పడుతున్న పెట్టుబడులతో 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ కూడా కొత్త శిఖరాలకు చేరుతోంది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.23.40 లక్షల కోట్లుగా ఉంది. 2017 జూన్ నాటికి ఉన్న రూ.20.40 లక్షల కోట్ల ఆస్తులతో పోలిస్తే 20 శాతం పెరుగుదల ఉంది. -
రైలు ప్రయాణీకులకు తీపికబురు
సాక్షి, కోల్కతా : రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వేలు ఊరట కల్పించాయి. 2022 నాటికి దూర ప్రాంత రైళ్ల వేగాన్ని గంటకు 25 కిమీలకు పెంచాలని రైల్వేలు నిర్ణయించాయి. సరుకు రవాణా రైళ్ల వేగాన్ని రెట్టింపు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరామని రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గొహెయిన్ సోమవారం వెల్లడించారు. దూరప్రాంత రైళ్ల వేగాన్ని ఏటా గంటకు 5 కిమీ మేర వేగం పెంచాలని తాము అన్ని జోనల్ రైల్వే జీఎంలను కోరామని, 2022 నాటికి గంటకు 25 కిమీ వేగం లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ధేశించామని చెప్పారు. ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బావిస్తోందని, తక్కువ సమయంలో ప్రయాణీకులను వారి గమ్యస్ధానాలకు చేరవేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓవర్నైట్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. -
ఆ క్లబ్లో కొత్తగా కోటి మంది
సాక్షి, న్యూఢిల్లీ : ట్యాక్స్ రిటన్స్ దాఖలు చేసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ముందుకొస్తున్నారు. 2017-18లో దాదాపు కోటి మంది కొత్తగా ఆదాయ పన్ను రిటన్స్ను దాఖలు చేశారు. ఫలితంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మెరుగైన వృద్ధి నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది 5.4 కోట్ల రిటన్స దాఖలవగా, 2017-18లో 6.8 కోట్ల ఆదాయ పన్ను రిటన్స్ దాఖలయ్యాయని పన్ను విభాగం అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా పన్ను పరిధిని విస్తరించేందుకు, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల ఫలితంగా ఆదాయ పన్ను రిటన్స్ను దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నూతనంగా అమలు చేస్తున్న జీఎస్టీతో పరోక్ష పన్ను వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడంతో 2017-18 కేంద్ర బడ్జెట్ అంచనాలను రెవెన్యూ శాఖ అధిగమించింది. 2016-17లో వసూళ్ల కంటే 17.1 శాతం అధికంగా ప్రత్యక్ష పన్నులు రూ 9.9 కోట్ల మేర వసూలయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ 10 లక్షల కోట్ల మైలురాయిని దాటతాయని భావిస్తున్నామని ఫైనాన్స్ సెక్రటరీ హస్ముక్ అథియా ధీమా వ్యక్తం చేశారు. -
ఆయుధాల అమ్మకాల్లో అమెరికానే ఫస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అమ్మకాలు 1985 సంవత్సరం నుంచి తగ్గుతూరాగా, 2000 సంవత్సరం నుంచి అమ్మకాలు మళ్లీ ఊపందుకొని 2017 సంవత్సరం వరకు కొనసాగినట్లు స్టాక్హోమ్ పీస్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ సిప్రీ ఓ నివేదికలో వెల్లడించింది. 2013 నుంచి 2017 మధ్య కొనసాగిన ప్రధాన ఆయుధాల అమ్మకాలను పరిశీలిస్తే అంతకుముందు ఐదేళ్ల అమ్మకాల కన్నా పది శాతం అమ్మకాలు పెరిగాయి. 2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు ప్రధాన ఆయుధాలను విక్రయించగా వాటిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా దేశాలు ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు విక్రయించిన ఆయుధాల్లో 74 శాతం ఈ అయిదు దేశాలే విక్రయించడం గమనార్హం. 34 శాతంతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 22 శాతంతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. 2008 నుంచి 2012, 2013 నుంచి 2017 మధ్య ఆయుధాలు ఎక్కువగా ఆసియా, ఓసియానియా, మధ్య ప్రాచ్యానికి వెళ్లాయి. ఆఫ్రికా, అమెరికా, యూరప్లకు గణనీయంగా తగ్గాయి. అమెరికా తన ఆయుధాలను 98 దేశాలకు విక్రయించగా వాటిలో 49 శాతం ఆయుధాలను మధ్యప్రాచ్యానికే విక్రయించింది. 34 శాతం ఆయుధాల అమ్మకాలతో ప్రపంచంలోనే అగ్రభాగాన నిల్చిన అమెరికా గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే తన అమ్మకాలను 25 శాతం పెంచుకుంది. 1990వ దశకంతో పోల్చుకుంటే ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగానే అమెరికా ఎక్కువ శాతం ఆయుధాలను అమ్మకలిగిందని సిప్రీ ఆమ్స్ అండ్ మిలిటరీ ఎక్స్పెండీచర్ ప్రోగామ్ డైరెక్టర్ డాక్టర్ ఔడ్ ఫ్లూరంట్ తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ప్రపంచంలోకెల్లా అమెరికా నుంచి ఆయుధాల అమ్మకాలు ఎక్కువ జరుగుతాయని, 2017లో అమెరికా కుదుర్చుకున్న పలు ఒప్పందాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని ఆయన తెలిపారు. 2008 నుంచి 2012, 2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య సాగిన అమ్మకాలను పరిశీలిస్తే రష్యా అమ్మకాలు 7. 1 శాతం పడిపోయాయి. ఫ్రాన్స్ అమ్మకాలు ఏకంగా 27 శాతం పెరిగాయి. ఆయుధాల అమ్మకాల్లో నాలుగవ పెద్ద దేశమైన జర్మనీలో కూడా 14 శాతం పడిపోయాయి. ఇదే కాలానికి చైనా అమ్మకాలు కూడా 19 శాతం పడిపోయాయి. చైనా నుంచి ఒక్క మయన్మార్ దేశమే 68 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకోగా రష్యా 15 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంది. -
విచ్చలవిడిగా వాడేస్తున్నారు
లండన్ : యాంటీబయాటిక్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతుండటంతో ఇవి నిరుపయోగంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో సంపన్నదేశాల్లో అధికంగా వాడే యాంటీబయాటిక్స్ను ఇప్పుడు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారని 76 దేశాల్లో చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. 2015లో రోజుకు ప్రపంచవ్యాప్తంగా 3500 కోట్ల డోసులు వాడారని ప్రిన్స్టన్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో తేలింది. గత 15 ఏళ్లలో యాంటీబయాటిక్స్ వాడకం 40 శాతం పెరిగింది. స్పెయిన్, గ్రీస్ దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువగా ఉండగా, భారత్, పాకిస్తాన్ వంటి ఆసియా దేశాల్లోనూ వీటి వాడకం గత 15 ఏళ్లలో విపరీతంగా పెరిగిందని పరిశోధకులు తెలిపారు. స్పెయిన్, గ్రీస్ దేశాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారని పరిశోధన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్టీరియాతో తలెత్తే ఇన్ఫెక్షన్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉండగా, వైరస్ వల్ల వచ్చే చెవి ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి వాటికి సైతం అనవసరంగా యాంటీబయాటిక్స్ను ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. యాంటీబయాటిక్స్ను పరిమితుల మేరకే వాడాలని, అనవసరంగా వీటిని తీసుకుంటే అవి పనిచేయకపోగా ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ అంట్వెర్ప్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హెర్మన్ గూసెన్స్ చెప్పారు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించేందుకు మార్గాలను అన్వేషించాలని, తప్పని పరిస్థితుల్లోనే వీటిని వాడేలా మార్గదర్శకాలు రూపొందించాలని అథ్యయన నివేదిక రూపొందించిన అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ప్రతినిధి డాక్టర్ ఎలి క్లెన్ చెప్పారు. -
పెళ్లి సాయం పెరిగింది!
సాక్షి, కామారెడ్డి: ఆడపిల్లల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అందజేస్తున్న సాయాన్ని రూ.1,00,116 కు పెంచింది. సోమవారం శాసన సభలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీలకు వారికి రూ.51,116 అందజేసేవారు. తరువాత దీన్ని మైనారిటీలకు షాదీముబారక్ పేరుతో వర్తింపజేసి తరువాత అన్ని వర్గాల పేద కుటుంబాలకు వర్తింపజేయడంతో పాటు ఆర్థికసాయం మొత్తాన్ని రూ.రూ.75,116కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.1,00,116 కు పెంచుతూ సీఎం ప్రకటన చేయడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మందికిపైగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రయోజనం పొందారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన వారికి వివాహ కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయం అందిస్తారు. అయితే పథకం అమలులో అక్కడక్కడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట మండలంలో రెండు, మూడు అక్రమాలు జరగగా, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. -
షాకింగ్ : పెరగనున్న రైలు చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు పెరుగుతున్న ఖర్చులకు దీటుగా ప్రయాణీకులపై చార్జీల భారం మోపనున్నాయి. నష్టాలను తగ్గించుకునే క్రమంలో నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలను సమీక్షించాలని పార్లమెంట్లో సమర్పించిన కాగ్ నివేదిక సూచించింది. రైల్వేలు నిర్వహణా వ్యయాన్ని అధిగమించలేకపోతున్నాయని 2016, మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సమర్పించిన ఈ నివేదిక పేర్కొంది. 2015-16లో రైల్వేలకు ప్రయాణీకులు, ఇతర కోచింగ్ సేవలపై రూ 36,283 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. 2015-16లో రైల్వేల మొత్తం ఆదాయం కేవలం 4.57 శాతం మాత్రమే పెరిగిందని ఇది 2011-15 వరకూ సాధించిన 14.86 శాతం వృద్ధి కంటే చాలా తక్కువని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘రైల్వేలు నష్టాలను తగ్గించుకునే క్రమంలో ప్రయాణీకుల చార్జీలను దశలవారీగా సవరించాల్సిన అవసరం ఉంద’ ని నివేదిక స్పష్టం చేసింది. రైల్వేల ఆర్థిక పరిస్థితి..ప్రస్తుత మార్కెట్ తీరుతెన్నులతో పాటు నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను నిర్ణయించాలని పేర్కొంది. ప్రయాణీకుల సేవలపై నష్టాలను కేవలం ఏసీ ఫస్ట్క్లాస్, ఫస్ట్క్లాస్, ఏసీ 2-టయర్పైనే రికవరీ చేయాలనుకోవడం సరైంది కాదని తెలిపింది. -
ఆదాయ పన్ను మినహాయింపు: ఎస్బీఐ కీలక నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : 2018 ఆర్ధిక బడ్జెట్ మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. తాజాగా ఎస్బీఐ ఆకర్షణీయమైన నివేదికను సోమవారం వెల్లడించింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3లక్షల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉందని నివేదించింది. ముఖ్యంగా ఏడో వేతన కమిషన్ తర్వాత ఉద్యోగుల ఆదాయాలు పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత 2.50 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచాలని ఎస్బిఐ తన తాజా నివేదికలో పేర్కొంది. తద్వారా దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని నివేదించింది. దీని మూలంగా ప్రభుత్వానికి కేవలం 7,500 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఎస్బిఐ ఇకోరాప్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదాయపన్ను మినహాయింపు పెంపుతోపాటు, గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సంబంధించిన మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల రూపాయల నుంచి 2.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరింది. దీంతో హోంలోన్ గ్రహీతలు సుమారు 75 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించింది. అంతేకాదు బ్యాంకుల్లో సేవింగ్స్ డిపాజిట్లు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. దీంతోపాటు సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని సూచించింది. ఈ డిపాజిట్లను మినహాయింపు లభించే ఇఇఇ పన్ను విధానంలోకి తీసుకురాలని కోరింది. అంతేకాకుండా వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల్లో గృహ సదుపాయ కల్పనకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించింది. మౌలిక సదుపాయాలకు మద్దతు అందించడం, కార్మికుల నైపుణ్య శిక్షణ లాంటి ఇతర చర్యలు తీసుకోవాలనిఎస్బిఐ నివేదిక పేర్కొంది. -
పెట్రో మంటలు
సాక్షి, హైదరాబాద్ : అవి పైసలే.. రోజూ కొన్ని పైసలే.. అసలు మనం లెక్కలోకి తీసుకోని పైసలే.. కానీ పైసలు పైసలు కలసి రూపాయలై బండెడు బరువుగా మారిపోయాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసి, రోజువారీగా మార్చే విధానం అమలు చేసినప్పటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గినా దేశంలో ధరలు తగ్గించకుండా పన్నులు పెంచుతూ సమానం చేయడం.. ధరలు పెరిగితే మాత్రం పెంచుకుంటూ వెళ్లడం.. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో.. బండి బయటికి తీద్దామంటే భయమేస్తోందని వాహనదారులు వాపోతున్నారు. నొప్పి తెలియకుండా.. చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.92కు, డీజిల్ ధర రూ.68.79కు చేరాయి. సగానికిపైగా మోత పన్నులతోనే.. పెట్రోల్, డీజిల్ అసలు ధరలకు.. వినియోగదారుడికి చేరేవరకు ఉన్న ధరలకు అసలు పోలికే లేదు. ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న ధరలో సగానికిపైగా కేంద్ర రాష్ట్రాల పన్నులు, సుంకాలే ఉండడం గమనార్హం. దీనికితోడు దాదాపు రెండేళ్ల కింద అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ల ధరలు తగ్గించకుండా.. సుంకాలు పెంచి ధరల వ్యత్యాసాన్ని సొమ్ము చేసుకుంది. అలా రెండు మూడు సార్లు సుంకాలు పెంచింది. తర్వాత పెట్రోల్, డీజిల్ల ధరలను కూడా కొద్దిగా తగ్గించింది. అయితే కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో దేశంలోనూ పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ వస్తున్నారు. పెంపుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా తరచూ పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్ల ధరలు బాగా పెంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద ఒక్కో లీటర్ పెట్రోల్పై రూ.21.48, డీజిల్పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్పై 57 శాతం, డీజిల్పై 44 శాతం భారం పడుతున్నట్లు అంచనా. రెండో స్థానంలో తెలుగు రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్పై 26 శాతం వ్యాట్తో పాటు ప్రతి లీటర్పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. దీంతో పెట్రోల్పై పన్ను 43.71 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్కుతోడు ప్రతి లీటర్పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి. ఇక ముందు బాదుడే! అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం ఇండియన్ క్రూడ్ బాస్కెట్ (బ్యారెల్) ధర రూ.4,085గా ఉంది. ఒక బాస్కెట్లో 159 లీటర్ల చమురు ఉంటుంది. దానిని రిఫైనరీల్లో శుద్ధి చేసి.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్లతో పాటు ఇతర ఉత్పన్నాలను వేరుచేస్తారు. వాటిని వేర్వేరు ధరలతో విక్రయిస్తారు. మొత్తంగా పెట్రోల్, డీజిల్ల ఉత్పత్తి ఖర్చులు మాత్రం ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే ఉంటాయి. మిగతాదంతా పన్నుల భారమే. జీఎస్టీలోకి చేర్చితే తగ్గుతాయా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను అందులో చేర్చలేదు. రాష్ట్రాలకు దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అడ్డగోలు పన్నులు తగ్గించాలి ‘‘పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. అందువల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ప్రజలపై పన్ను పోటు వేయడం తగదు. జీఎస్టీ పరిధిలోకి చేర్చితే ధరలు దిగివస్తాయి..’’ – రియాజ్ ఖాద్రీ, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ చైర్మన్ పైసలు తగ్గిస్తూ.. రూపాయల్లో పెంచుతున్నారు ‘‘అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడం లేదు. పెరిగినప్పుడు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడు పైసలు మాత్రమే తగ్గిస్తూ.. పెంచినప్పడు రూపాయల్లో బాదుతున్నారు.. ఇలాగైతే ఎలా..?’’ – సతీష్ దేవ్కట్, మిట్టికాషేర్ (16సీహెచ్ఎం22) డ్రైవింగ్ ఫీల్డ్ వదిలేద్దామనిపిస్తోంది.. ‘‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే భయమేస్తోంది. రోజంతా పనిచేసినా తగిన ఫలితం లేదు. వాహనాన్ని క్యాబ్ లింకులో పెట్టాను. ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడికి పోవాల్సిందే. బండి ఫైనాన్స్లో ఉంది కాబట్టి తిరగక తప్పడం లేదు. ఫీల్డ్నే వదిలేయాలనిపిస్తోంది..’’ – యూనస్, తార్నాక (16టీఏఆర్73) వాహనదారులపై మోయలేని భారం ‘‘ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనాన్ని వినియోగించక తప్పని పరిస్థితి. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే మోయలేని భారం పడుతోంది. ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి..’’ – శ్రీకాంత్రెడ్డి, నానక్రాంగూడ (16జీసీబీ44పి–160054) -
గ్రీన్కార్డు కోటా పెంపు
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్కార్డు కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభవార్త. అక్కడ ఉద్యోగంతో పాటు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు దోహదపడే గ్రీన్కార్డు కోటాను గణనీయంగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ప్రతిభ ఆధారిత వలస విధానాలను ప్రోత్సహించే ఈ బిల్లుకు ట్రంప్ ప్రభుత్వ మద్దతు కూడా ఉంది. ఇది చట్టంగా మారితే భారత్, చైనా లాంటి దేశాల సాఫ్ట్వేర్ నిపుణులకు అధిక ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ‘సెక్యూరింగ్ అమెరికాస్ ఫ్యూచర్ యాక్ట్’ పేరిట రూపొందించిన ఈ బిల్లులో ఏటా ఇస్తున్న గ్రీన్కార్డుల కోటాను 45 శాతం.. అంటే ప్రస్తుతమున్న 1.20 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అనధికారిక అంచనాల ప్రకారం..ప్రస్తుతం అమెరికాలో సుమారు 5 లక్షల మంది భారతీయులు గ్రీన్కార్డు కోసం ఎదురుచూస్తూ ఏటా హెచ్–1బీ వీసాలను పొడిగించుకుంటున్నారు. కొందరైతే దశాబ్దాలుగా గ్రీన్కార్డు కోసం నిరీక్షిస్తున్నారు. హెచ్–1బీ వీసాపై అమెరికాకు వచ్చి, శాశ్వత నివాసం కోసం గ్రీన్కార్డు కోరుకునే అర్హులైన ఐటీ నిపుణులకు ఈ బిల్లు వరం కానుంది. ఏటా జారీచేసే ఈ కార్డుల సంఖ్య పెరిగితే వారు అందుకోసం ఎదురుచూసే సమయం తగ్గిపోతుంది. తల్లిదండ్రులకు తాత్కాలిక వీసానే... గొలుసుకట్టు వలస విధానాన్ని(చైన్ ఇమిగ్రేషన్) ఎత్తివేయాలని అందులో ప్రతిపాదించడం వల్ల జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు మినహా మిగతా కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకెళ్లడం కుదరదు. అయితే గ్రీన్కార్డు కలిగి ఉన్న పౌరులను కలుసుకునేలా వారి తల్లిదండ్రులకు పునరుద్ధరించడానికి వీలుపడే తాత్కాలిక వీసా కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. వ్యవసాయ కార్మికులు తాత్కాలికంగా అక్కడికి వెళ్లి పనిచేయడానికి వీలు కల్పించే కార్యక్రమాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం విదేశీ కార్మికుల సేవలు వాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వైట్హౌస్’కు అనుగుణంగానే.. ప్రతిభ ఆధారిత వలస విధానాల వల్ల మెరికల్లాంటి నిపుణులే దేశానికి వస్తారని, అక్రమంగా ప్రవేశించే వారికి అడ్డుకట్ట పడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన వారిలో ఒకరైన హౌజ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ మైకేల్ మెక్కౌల్ స్పందిస్తూ దేశ సరిహద్దులను రక్షించేలా బిల్లు ఉందని అన్నారు. దేశ భద్రతకు సైన్యం చేస్తున్న కృషి, అంతర్గత చట్టాల అమలుకు మద్దతుగా నిలుస్తూ, వలస విధానాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు చేర్చామని తెలిపారు. భారతీయుల స్టోర్లపై దాడులు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అమెరికా అధికారులు భారతీయులకు చెందిన సుమారు 100 7–ఎలెవన్ రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించి 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వలసొచ్చిన వారిని ఉద్యోగాల్లో నియమించుకోవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. 18 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఈ దాడులు నిర్వహించారు. అరెస్టయిన వారు ఏ దేశస్తులో వెల్లడికాలేదు. అమెరికాలో ఇండో–అమెరికన్లే 7–ఎలెవన్ పేరిట ఎక్కువగా రిటైల్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. -
టికెట్ ధరలు పెంచుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్లలో అన్ని తరగతుల టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపుపై ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేసి ఈ వ్యవహారం తేల్చేంత వరకు పెంచిన ధరలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. పెంపును సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ధరల నిష్పత్తిలో పన్ను చెల్లించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్టు విధించిన షరతులను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయో లేదో జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని, సంబంధిత నివేదికను తమ ముందుంచాలని స్పష్టం చేశారు. ధరల పెంపుపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, నిర్ణయం తీసుకునే వరకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలంటూ పలు థియేటర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ విచారణ జరపగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టికెట్ ధరల సవరణపై 2013లో ప్రభుత్వం జీవో 100ను జారీ చేయగా హైకోర్టు కొట్టేసిందన్నారు. ధరలను నిర్ణయించేందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శుల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని వివరించారు. 2017 మార్చి 30 లోపు ధరలపై మార్గదర్శకాలు రూపొందించాలని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని.. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. -
తెలంగాణలో కాస్త పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో నల్లగొండ, నిజామాబాద్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెరిగాయి. ఖమ్మంలో 4 డిగ్రీలు, భద్రాచలంలో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, రామగుండంలలో 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా 31 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హకీంపేట, నల్లగొండ, నిజామాబాద్లలో 29 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు నమోదుకాగా, మెదక్లో 12, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. -
నీటి బిల్లు మోత
సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీలోని ఆప్ సర్కార్ నీటి బిల్లులనూ మోతెక్కించింది. వాటర్ టారిఫ్ను 20 శాతం పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20,000 లీటర్ల పైన ఒక్క లీటర్ అధికంగా వాడుకున్నా మొత్తం వాడిన నీటిపై బిల్లు భారం పడనుంది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన నీటి చార్జీలు అమల్లోకి రానున్నాయి. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ జల్ బోర్డ్ నీటి చార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. గత ఏడాది రూ.209 కోట్ల నష్టాలు మూటగట్టుకున్న జల్ బోర్డ్ ప్రస్తుత నష్టాలు రూ.516 కోట్లకు పెరిగాయి. -
రైలెక్కాలంటే భయం..భయం..
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణమంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. రైలు ప్రమాదాలు ఒకెత్తయితే ఏటికేడు రైళ్లలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత రెండేళ్లలో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) నమోదు చేసిన హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ వంటి నేరాలను పరిశీలిస్తే వీటి సంఖ్య ఏకంగా 35 శాతం పెరగడం గమనార్హం. 2014లో నమోదైన నేరాలు 31,609 కాగా, 2016లో వీటి సంఖ్య 42,388గా నమోదైంది. రాష్ట్రాలవారీగా చూస్తే 8293 కేసులతో యూపీ ఈ జాబితాలో టాప్లో ఉండగా, 7358 కేసులతో మహారాష్ట్ర, 5082 కేసులతో మధ్యప్రదేశ్, ఢిల్లీ (4306), బిహార్ (2287)లు తర్వాతి స్ధానాలత్లో నిలిచాయి. వీటిలో 236 హత్య కేసులు, 125 హత్యాయత్నం కేసులు, 79 అత్యాచార కేసులు, 53 దోపిడీ కేసులు, 112 ఘర్షణ కేసులున్నాయి. -
మద్యం సేవించేందుకు వయోపరిమితి
తిరువనంతపురం : మద్యం సేవించేందుకు వయోపరిమితిని పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ను జారీ చేసింది కూడా. మద్యం సేవించే యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంతో ఏం ఒరగకపోవచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాగా, 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రయత్నించగా.. అది కుదరలేదు. దీంతో కేవలం ఫైవ్స్టార్ హోటళ్లకు మాత్రమే లైసెన్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవటంతో వందలాది పబ్లు, బార్లు మూతపడ్డాయి. ఉద్యమకారులు ఆ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ పబ్, బార్ యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేగాక పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరుగా మళ్లీ లైసెన్సులు జారీ చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా త్రీస్టార్హోటళ్లతోపాటు రిసార్ట్స్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే యువతను కట్టడి చేసేందుకు మాత్రం వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ జిమిక్కుగా అభివర్ణిస్తోంది. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి.. కంటి తుడుపు చర్యగా వయో పరిమితిని పెంచిందని విమర్శిస్తోంది. -
ట్వీటర్లో డిస్ప్లే నేమ్ ‘పరిమితి’ పెంపు
న్యూయార్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్ప్లే నేమ్ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా శనివారం నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్ప్లే నేమ్గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది. -
టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం
బొమ్మనహాళ్ : టీబీ డ్యాంలో నీటిమట్టం పెరిగినట్లు జలాశయం సిబ్బంది గురువారం తెలిపారు. జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం ఆశాజనకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిసే ఇన్ప్లో 15వేలు దాటిందని.. ఇదేవిధంగా మరో 20 రోజులు నీరు వచ్చి చేరితే ఆయకట్టుకు ఊపిరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
హౌస్ లిఫ్టింగ్ టెక్నాలజీతో ఇంటి ఎత్తు పెంపు
-
మండుతోన్న తిరుమల కొండలు
-
స్కూటర్, మోటార్ సైకిళ్ళ ధరలు పెరుగుతాయట!
న్యూఢిల్లీ: దేశీయంగా ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయిట. వచ్చే నెల 1 నుంచి బీఎస్-4 ఉద్గార నిబంధనలుమ అమల్లోకి రానున్న కారణంగా వాహన ధరలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడి అన్ని వాహనాలను రూపొందించాలన్న ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగనున్నాయట. మార్చి 31 నుంచి భారత్ స్టేజ్-4(బీఎస్-4) ఉద్గార నియమ నిబంధనలు అన్ని వాహన తయారీ సంస్థలకు వర్తించనున్న నేపథ్యంలో ఈ పెరుగదల తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పలు విభాగాలకు చెందిన వాహనాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయన్న కారణంతో పర్యావరణ కమిటీ పిటిషన్ స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉద్గార నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం కూడా యోచిస్తోంది. అయితే కార్ల తయారీ కంపెనీలు మరియు డీలర్లు సుప్రీంను ఆశ్రయించారు. 9 లక్షలకు పైగా వాహనాలు డీలర్ల దగ్గర పెండింగ్ లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సుమారు 20వేల మంది కోట్ల రూపాయలు నష్టపోతారని, వేల ఉద్యోగాలు కోల్పోతామని, డీలర్లు ఫెడరేషన్ ఆప్ డీలర్స్ అసోసియేషన్ వాదిస్తోంది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ పిటిషన్ సుప్రీం ఆదేశాలను రివ్యూ చేయాలని కోరింది. ఇప్పటికే దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఈ నిబంధనలను పాటిస్తున్ననేపథ్యంలో .. ఈనిబంధనలను అమలుకు ముందు టూ వీలర్, ఇతర కమర్షియల్ వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉందని ఏంజిల్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీకాంత్ అకోల్కర్ చెప్పారు. 6-8శాతం ధరల సవరణ చూడగలమన్నారు. అయితే బిఎస్-4 ప్రమాణాలను చాలా ప్యాసింజర్ వాహన తయారీదారులు ఇప్పటికే అనుసరిస్తునందున, ఆ తర్వాత దీని ప్రభావం మొత్తం రంగంపై తటస్థంగా ఉంటుందన్నారు. అటు గడువును పొడిగించాల్సిన అవసరం లేని డైమ్లర్ ఇండియా సీఈవో ఇటీవల ప్రకటించారు. అలాగే గడువు పెంపును వాహన పరిశ్రమ కోరడం లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. కొందరు పర్యావరణ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) ను కోరింది. డిసెంబర్2015 మార్చి 24 తరువాత తయారైన బీఎస్-3 వాహనాలపై నెలవారీ వివరాలు సమర్పించాలని కోరింది. ఈ గడువును పొడిగించే విషయంలో వాహన పరిశ్రమ రెండు వర్గాలు చీలిపోయాయి . గడుపు పెంపు పై ఆశాభావంతో ఉన్నారు. మరి సుప్రీంతీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. -
జీ మెయిల్ యూజర్లకు గుడ్న్యూస్
జీ మెయిల్ వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ అందించింది. జీ మెయిల్ అటాచ్మెంట్ సైజ్ను రెట్టింపు చేసింది. ఇన్ కమింగ్ మెయిల్ సైజును రెట్టింపు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇకపై, ఇతర మెయిల్స్ జీ మెయిల్ వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు అటాచ్ మెంట్లతో కలిపి జీమెయిల్ సైజు 25 ఎంబీ నుంచి 50 ఎంబీకి పెంచింది. ఇక మీదట 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ ను రిసీవ్ చేసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించింది. ఈ అవకాశాలు కేవలం జీ మెయిల్ యూజర్లకు మాత్రమే, అదీ ఇన్ కమింగ్ మెయిల్స్కు మాత్రమే అనుమతి ఉందని గూగుల్ బ్లాగ్ స్పాట్ లో స్పష్టం చేసింది. ఇది ఈ రోజు(గురువారం) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే పెద్ద సైజు ఫైల్స్ రిసీవ్ చేసుకోవాలంటే ‘డ్రైవ్’ అప్లికేషన్ ను వాడుకోవాలని, ఇది ఇప్పటికే జీ మెయిల్ తో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. ఈ మార్పు వినియోగదారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, అడోబ్ ఫైల్స్ లాంటి పెద్ద ఫైళ్లను రిసీవ్ చేసువడానికి సహాయపడనుంది. అయితే మెయిల్ సెండింగ్ సైజ్ మాత్రం 25ఎంబీలాగే ఉంటుందని తెలిపింది. భారీ ఫైళ్ల సెండింగ్ కోసం ఇంతకుముందులాగానే గూగుల్ డ్రైవ్ ను వాడుకోవాలని తెలిపింది. 5టీబీ దాకా ఇలా సెండ్ చేసుకోవచ్చని తెలిపింది. త్వరలోనే సెండింగ్ మెయిల్స్కు కూడా ఈ అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. -
నోట్ల రద్దు: ఖాతాదారులకు శుభవార్త!
-
ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త. త్వరలోనే విత్ డ్రా పరిమితిని పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత విధించిన నగదు విత్ డ్రా పరిమితులను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వారంలో క్యాష్ విత్ డ్రాలను సమీక్షించనున్న రిజర్వు బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పొదుపు ఖాతా పరిమితి దాదాపు రూ.30-35 వేలకు వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కరెంట్ ఖాతాలోని నగదు ఉపసంహరణను వారానికి రూ. 50 వేలనుంచి కూడా పెంచనున్నట్టు అంచనా. ఇప్పటివరకు పొదుపు ఖాతాల విత్ డ్రా పరిమితి రూ. 24 వేలు మాత్రమే. కాగా డిమానిజేషన్ నేపథ్యంలో నగదు కష్టాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం దశల వారీగా వివిధ వెసులు బాటులను కల్పిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఏటీఎం ఉపసంహరణలను రోజుకు రూ.2500 నుంచి రూ.4,500 కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే విత్ డ్రా లిమిట్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తారా లేదా అనేది ఇంకా అస్పష్టమే. -
మాజీ సైనికోద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్ : మాజీ సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్లో మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపై కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సైనికులకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసే మాజీ సైనికులకు డబుల్ పెన్షన్, ఒకవేళ మాజీ సైనికోద్యోగి మరణిస్తే అతడి భార్యకు కూడా పెన్షన్ వర్తింపచేస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న బోర్డులతో పాటు నూతనంగా ఏర్పాటైన 21 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఇక్కడి మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టయోటా రేట్లు పెరుగుతున్నాయ్
జనవరి నుంచి 1-3% మధ్య పెంపు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నారుు. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరుగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. ‘స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ వంటి ముడిపదార్థాల ధరలు గత ఆరు నెలలుగా పెరగుతూ వస్తున్నారుు. దీంతో తయారీ వ్యయం బాగా పెరిగింది. దీని వల్ల మేం వాహన ధరలను పెంచాల్సి వస్తోంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ డెరైక్టర్, సీనియర్ వైస్ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్.రాజా వివరించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో జపనీస్ కరెన్సీ యెన్ మారకపు విలువ పెరగడం కూడా కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. యెన్ బలపడటం వల్ల జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వాహన విడిభాగాల ధర పెరిగిందని, దీని వల్ల కంపెనీ తయారీ వ్యయంపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు-రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రరుుస్తోంది. -
'పేదలకు విత్డ్రా పరిమితిని పెంచాలి'
-
మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత
-
మన్యంలో పెరిగిన చలి తీవ్రత
విశాఖ: మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో గురువారం రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. లంబసింగిలో 5 డిగ్రీలు, పోతురాజుగుడి సమీపంలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మంచు దుప్పటి కప్పుకున్న విధంగా దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పర్యాటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఔటర్ రింగ్రోడ్పై టోల్ మోత!