సూర్యాపేటలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు
సూర్యాపేట: సూర్యాపేటలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో.. సీఐ మొగులయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు పాల్గొని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేనటువంటి 70 బైక్లు, 20 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.