![ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/71468957613_625x300.jpg.webp?itok=xPVM61yq)
ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి
Published Wed, Jul 20 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
![ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/71468957613_625x300.jpg.webp?itok=xPVM61yq)
పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొని తమ ఆధ్యాత్మిక గురువు సత్యసాయికి హృదయ నివేదనను అర్పించుకున్నారు. ఉదయం తొలుత సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ విద్యార్థులు తమ గురువు సత్యసాయికి గురు వందనం సమర్పించుకున్నారు. గురుబ్రహ్మ నీవే..ప్రేమ జ్యోతి నీవే అంటూ విద్యార్థులు నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవాళికి మంచిని బోధిస్తూ సన్మార్గం వైపు నడిపిన జగద్గురువు సత్యసాయి అని కొనియాడారు.ఈసందర్భంగా సత్యసాయి ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్ల ద్వారా వినిపించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏథెన్స్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి జార్జి బెబిడిలిస్ గురుపౌర్ణమి విశిష్టతను,సత్యసాయి వైభవాన్ని,ఆధ్యాత్మిక గురువుగా సత్యసాయి సందేశాన్ని వివరించారు. చెన్నైకి చెందిన కుమారి సంతాల సుబ్రమణియం వేణుగాణ కచేరి నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి రమేష్కుమార్ పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులతోపాటు,సేవా సంస్థల ప్రముఖలు పాల్గొన్నారు.
Advertisement
Related news by tags
-
పీక్ స్టేజ్కు కూటమి కుట్రలు.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో బెదిరింపుల పర్వం పీక్ స్టేజ్కు చేరుకుంది. బెదిరింపులతో, దొడ్డిదారిలో ఎమ్మెల్సీ పదవి, మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలోనే కూటమిలో చేరకపోతే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేస్తామని, వారిపై దాడులు చేస్తామని కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.కాగా.. విశాఖ మేయర్, ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరాలని పచ్చ పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీలో చేరకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని తప్పుడు కేసులు పెడతామని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లను టార్గెట్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు.ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఎన్నికల్లో టీడీపీకి తగిన మద్దతు లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారం దుర్వినియోగంతో గెలవాలని దుర్భుద్ధితో ముందుకు సాగుతోంది. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలని టీడీపీ రాజకీయం చేస్తోంది. మరోవైపు.. టీడీపీకి మేయర్ పీఠం, జనసేనకు డిప్యూటీ మేయర్ దక్కేలా కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూటమికి పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడంపై విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అఖిలపక్ష భేటీలో వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్సార్సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది.ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డిఅఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు. -
టీడీపీ అరాచకాలు.. గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్కు వెళ్లి, గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్.. టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైఎస్ జగన్.. రాష్ట్ర గవర్నర్కు వివరించనున్నారు.వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు వైఎస్ జగన్ అందజేయనున్నారు.సంబంధిత వార్త: యావత్ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్ జగన్ -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న (శనివారం) 83,538 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 30,267 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.25 కోట్లుగా లెక్క తేలింది. -
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. హైదరాబాద్లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు
Related News by category
-
గంభీర్ ఎంట్రీ.. రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే ఔననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజాను వన్డేలకు దూరంగా పెట్టాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక భారత జట్టులో రవీంద్ర జడేజాకు సెలక్టర్లు చోటివ్వలేదు. గత దశాబ్ద కాలంగా భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న జడేజాను సెలక్టర్లు లంక సిరీస్కు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.అయితే జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానాన్ని వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబెలలో ఎవరో ఒకరితో భర్తీ చేయాలని సెలకర్టు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబేలకు శ్రీలంకతో వన్డే సిరీస్కు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20ల్లో భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వన్డేల్లో కూడా జడ్డూ స్ధానాన్ని భర్తీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. దీంతో జడేజా ఇకపై టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జడ్డూ అద్బుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదర్శన పరంగా కూడా అతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో మేనేజ్మెంట్ పడింది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్టుల్లో మాత్రం జడ్డూ కొనసాగుతాడని పేర్కొన్నారు. కాగా జడేజా ఇటీవల కాలంలో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్కప్లోనూ జడేజా విఫలమయ్యాడు. ఇక జడేజాను పక్కన పెట్టడంలో భారత కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా తరపున ఇప్పటివరకు 197 వన్డేలాడిన జడ్డూ 2756 పరుగులు చేయడంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
'అదే హార్దిక్ కొంపముంచింది'.. అగార్కర్ అస్సలు ఒప్పుకోలేదంట!?
టీమిండియా నూతన టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టీ20ల్లో రోహిత్ శర్మ వారుసుడిగా సూర్యకుమార్ భారత జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత ఫుల్టైమ్ కెప్టెన్గా సూర్య ప్రస్ధానం మొదలు కానుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ను టీమిండియా కెప్టెన్గా ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఐపీఎల్లోనూ, భారత జట్టు తత్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటకి కెప్టెన్గా పాండ్యాను ఎంపిక చేయలేదన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.ఇందుకు ఒక్కొక్కరు ఒక్క కారణం చెబుతున్నారు. కొంత మంది ఫిట్నెస్ వాళ్లే అతడిని ఎంపిక చేయలేదని, మరికొంత మంది శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను తప్పించడం అందరని విస్మయానికి గురిచేసింది.ఒప్పుకోని అగార్కర్..కాగా హార్దిక్ పాండ్యాకు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ ఒప్పుకోలేదంట. పాండ్యా కెప్టెన్సీపై తనకు నమ్మకం లేదంటూ అగార్కర్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అందుకు ఐపీఎల్లో పాండ్యా కెప్టెన్సీనే కారణమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను వరుసగా రెండు సార్లు ఫైనల్కు చేర్చినప్పటకి.. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక తన మార్క్ను మాత్రం చూపించలేకపోయాడు. ఐపీఎల్-2024లో అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అగార్కర్ అండ్ కో సైతం పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్పై సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి. మరోవైపు భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపినట్లు తెలుస్తోంది. -
ఆసియాకప్లో టీమిండియాకు ఊహించని షాక్..
మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పాటిల్ గాయపడింది.ఈ మ్యాచ్లో క్యాచ్ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.కాగా పాక్తో జరిగిన మ్యాచ్లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్తో బీసీసీఐ భర్తీ చేసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో కన్వర్ తన బౌలింగ్తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. -
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(33 బంతుల్లో 8, 3 సిక్స్లతో 62 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా.. జయసూర్య(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో స్పిన్నర్ హసన్ ఖాన్ 3 వికెట్ల పడగొట్టగా.. రౌక్స్ రెండు, కౌచ్, ఆండర్సన్ తలా వికెట్ సాధించారు.ఫిన్ అలెన్ విధ్వంసం..అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో ఫిన్ అలెన్(న్యూజిలాండ్) విధ్వంసం సృష్టించాడు. లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాప్ సెంచూరియన్గా అలెన్ నిలిచాడు. అంతకుముందు ఆసీస్ స్టార్, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే ఆర్ధశతకం నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 30 బంతులు ఎదుర్కొన్న అలెన్.. 8 ఫోర్లు, 6 సిక్స్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్(24నాటౌట్) రాణించాడు. కాగా అలెన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
భారత్ రాకపోయినా నష్టం లేదు.. ఆ టోర్నీ మాత్రం పాక్లోనే: హసన్ అలీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టు పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. పాకిస్తాన్కు భారత జట్టును పంపిచేందుకు బీసీసీఐ విముఖత చూపుతోంది. భారత్ ఆడే మ్యాచ్లను తటస్ధ వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు సైతం తెలియజేసింది.ప్రస్తుతం ఈ విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. అయితే పీసీబీ మాత్రం మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ టోర్నీ నుంచి భారత్ వైదొలిగినా పాకిస్తాన్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తుందని అలీ థీమా వ్యక్తం చేశాడు."మేము గతేడాది వరల్డ్కప్లో ఆడేందుకు భారత్కు వెళ్లాము. అటువంటిప్పుడు వారు కూడా పాకిస్తాన్కు రావాలి కాదా. క్రీడలను రాజకీయాలకు దూరం పెట్టాలని ఇప్పటికే చాలా మంది లెక్కలేనన్ని సార్లు చెప్పారు. మరోవైపు చాలా మంది భారత ఆటగాళ్లు సైతం పాకిస్తాన్లో ఆడేందుకు సముఖత చూపిస్తున్నారు.ఈ విషయాన్ని భారత క్రికెటర్లే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే భారత జట్టు సైతం పాక్కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే కదా. కానీ వారి దేశ విధి విధానాలకు కట్టుబడి ఉన్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లోనే జరుగుతుందని పీసీబీ చైర్మెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్లోనే జరుగుతుంది.భారత్ రాకపోయినా ఈ టోర్నీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ దాటి వెళ్లదు. కచ్చింగా పాక్లో ఆడాల్సిందే. భారత్ ఆడకపోతే ఓవరాల్గా క్రికెట్ ముగిసినట్లు కాదు కాదా. భారత్ ఒక్కటే కాదు మిగితా టీమ్స్ కూడా ఈ టోర్నీలో ఉన్నాయి" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.