జిల్లాలో పంట కాలువలకు ఒకటో తేదీనే సాగునీరు ఇచ్చేశాం.. ఖరీఫ్ సాగుకు రైతులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడక్కడా కాలువ పనులు జరుగుతున్నా సాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు. అయినా కొన్ని పత్రికలు
- క్లోజర్ పనుల దారి పనులదే
- అసత్యాలు రాస్తున్నారంటూ మండిపాటు
- ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ సాక్షి కథనంపై
- చినరాజప్ప చిందులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాలో పంట కాలువలకు ఒకటో తేదీనే సాగునీరు ఇచ్చేశాం.. ఖరీఫ్ సాగుకు రైతులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడక్కడా కాలువ పనులు జరుగుతున్నా సాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు. అయినా కొన్ని పత్రికలు పనిగట్టుకుని అవాస్తవాలు రాస్తున్నాయని కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. చినరాజప్పకు కోపం రావడానికి ‘సాక్షి’లో శనివారం ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనమే కారణమైంది. కాలువలకు నీరు విడుదలచేసి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు సాగునీరందని ఆయకట్టు పరిస్థితులపై ఫొటోలతో సహా ‘సాక్షి’లో ప్రచరితమవడంతో చినరాజప్పకు చిర్రెత్తుకు వచ్చింది.