Water Problems
-
హైదరాబాద్లోని ఇందిరా నెహ్రూ నగర్లో నీటి సమస్య
-
నేడు కేజ్రీవాల్ విడుదల.. నీటి సంక్షోభంపై ఆప్ నిరసన
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. గురువారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు అయింది. అయితే బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి న్యాయ బిందు ఆదేశాలను జారీ చేశారు.దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆదేవించారు. అంతేగాక అవసరం ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. అయితే48 గంటల పాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.ఎట్టకేలకు బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ నేడు(శుక్రవారం) తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. సీఎం విడుదల నేపథ్యంలో ఆప్ నేతలు నేడు ఆయన్ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో మంత్రి అతిషి, భార్య సునీతా, ఇతర ఆప్ నేతలు తీహార్ జైలుకు వెళ్లనున్నారు.మరోవైపు దేశ రాజధానిలో నెలకొన్ని నీటి సంక్షోభంపై అధికార ఆప్ ప్రభుత్వం ఆందోళనలకు సిద్ధమవుతోంది. నేటి సాయంత్రం కేజ్రీవాల్ విడుదలకు ముందేనీటి కొరతపై నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ ఆందోళనల్లో మంత్రి అతిషి, కేజ్రీవాల్ సతీమణి సునీతా రాజ్ ఘాట్ను సందర్శించనున్నారు, అక్కడ నిరవధిక నిరాహారదీక్ష చేశారు. కాగా దేశ రాజధానికి నీటిని రాకుండా పొరుగున ఉన్న హర్యానా అడ్డుకుంటోందని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.హర్యానా యమునా నదికి నీటిని విడుదల చేయనంత వరకు ఢిల్లీలో నీటి కొరత కొనసాగుతుందని అతిషి పేర్కొన్నారు. మునక్ కెనాల్కు చాలా తక్కువ నీరు వస్తోందని, వజీరాబాద్ బ్యారేజీకి నీరు రావడం లేదని అన్నారు. యమునా నుంచి నీరు నీటి శుద్ధికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ ప్రజలకు సరాఫరా అవుతోందన్నారు. అయితే యమునాలో నీటి శాతం తక్కువ ఉందని పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ తాను హర్యానా ప్రభుత్వం ముందు చేతులు కట్టుకుని నిలబడి అర్థిస్తున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా నీటి సమస్యతో పాటు హస్తీనాను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో 50 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు, వడదెబ్బలతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 20 మందికి పైగా ప్రాణాలు విడిచారు. -
నీళ్లు.. నేలమట్టం.. డెడ్ స్టోరేజీలో జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది. కనీస నిల్వలూ కరువే! శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది. గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్ఫ్లో నమోదైంది. ఒకేసారి వచ్చి.. లాభం లేక.. గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది. మంజీరా వెలవెల సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
నదులున్నా తాగునీరేదీ?
‘వాస్తవానికి దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. వీటిని సాగు యోగ్యత ఉన్న భూములకు అందించాల్సి ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయగల వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండను. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలకు ఇప్పటికీ తాగు, సాగునీరు సరిగా అందడం లేదని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కూడా లేవని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకని నిలదీశారు. ‘దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగేందుకు నీళ్లుండవా? పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా? ఇంటికి పంపాలా?..’ అని ప్రశ్నించారు. సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తో పాటు పలువురు మరాఠా యోధులకు నివాళులర్పించారు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్తో పాటు ఆయన అనుచరులు, ఇతర నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు.. ‘మహారాష్ట్ర పవిత్రభూమికి నమస్కారం. ముస్లిం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. ముంబై దేశ ఆర్థిక రాజధాని. కానీ తాగేందుకు నీళ్లుండవా? ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇది ఇలాగే కొనసాగాలా? చికిత్స చేయాలా? ఇంకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా? భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారు. ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్నివర్గాలకు సరైన న్యాయం దక్కాల్సిందే. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు. అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ పుట్టింది. ఒక కులం, మతం, వర్గం కోసం ఆవిర్భవించలేదు. బీఆర్ఎస్కు ఒక లక్ష్యం ఉంది. మార్పు వచ్చే వరకు పార్టీ పోరాటం ఆగదు. నిజాయితీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ నీరు ఇస్తాం. కొత్త పార్టీ అనగానే కొందరు అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అబద్ధమైతే సీఎం పదవిలో నిమిషం కూడా ఉండను ‘వాస్తవానికి దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. వీటిని సాగు యోగ్యత ఉన్న భూములకు అందించాల్సి ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయగల వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండను. తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశాం. తెలంగాణ రాకముందు రోజుకు 3 గంటలే కరెంటు ఉండేది. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం. ఇవి మహారాష్ట్రలో ఎందుకు అమలు కావడం లేదు? తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పనిచేసే సామర్థ్యాలు లేవు..’ అని కేసీఆర్ విమర్శించారు. కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాలి ‘నా మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకండి. గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు, వీధిలో ఉన్న వారితో చర్చించండి. దేశంలో ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే విషయంపై చర్చ పెట్టాలి. లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. శంభాజీనగర్లో వారానికోసారి నీళ్లు వస్తాయా? మహారాష్ట్రలో కేబినెట్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఉండరా?..’ అని ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అమలు చేస్తే ఎందుకు వస్తా? ‘కేసీఆర్కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు వస్తాను? మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చెయ్.. 24 గంటల కరెంటు ఇవ్వు. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. అంబేడ్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా? దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు?..’ అని నిలదీశారు. ప్రజల ఆకాంక్ష గెలవాలి ‘దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ గెలిస్తే.. మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదు. ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. అందువల్ల పార్టీలు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజల ఆకాంక్ష గెలవడం ముఖ్యం. పరివర్తన రానంత కాలం ఈ దేశం ఇలాగే కునారిల్లుతుంది. ఎంత త్వరగా మేల్కొంటే.. అంత తర్వగా బాగుపడతాం..’ అని కేసీఆర్ అన్నారు. నూతనంగా నిర్మించే పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అభయ్ పాటిల్ ఇంటికి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ సభకు వెళ్లిన కేసీఆర్, విమానాశ్రయం నుంచి నేరుగా వైజాపూర్ మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ వెంట పార్టీ ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. -
Photo Feature: ‘దాహా’కారాలు
రోజురోజుకూ ఎండ తీవ్రతరం అవుతోంది. గిరిజనులకు తాగునీటి కష్టాలు మిగుల్చుతోంది. నీటికోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చెలిమ నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. బావులు, కాలువలు ఎండిపోవడంతో ఆ నీరే దిక్కయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా గంటలకొద్దీ నిరీక్షించి వచ్చే కొద్దిపాటి నీటి కోసం తంటాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం టెంబ్రిగూడలో వందమంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరంతా నీటికోసం అల్లాడుతున్నారు. కిలోమీటరు దూరంలోని చెలిమ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నెత్తిన బిందెలు ఎత్తుకొని నడిచి వెళ్తున్న గ్రామస్తులు -
యంగెస్ట్ ప్రెసిడెంట్..నీళ్ల కోసం గెలిచింది
‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్గా గెలుపొందింది. తెన్కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది. తమిళనాడులో ‘కరువు’ ఆధార్ కార్డ్ తీసుకుంటే దాని మీద అడ్రస్ ‘తెన్కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్ టీచర్. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ. ఎన్నికలొచ్చాయి తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్లో నిలబడతా అని చెప్పసాగింది. సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్ వేశారు. గట్టి అభ్యర్థి షారుకళ కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు. ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది. ‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు. గెలుపు వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది. ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది. -
తాగునీటి సమస్యకు చెక్ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం
-
ఏపీలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్ల లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆరి్థక సంవత్సరం వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వార్షిక ప్రణాళికను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా 47.13 శాతం కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జల్జీవన్ మిషన్ కింద గత ఏడాదిన్నర కాలంలో 14.34 లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు, 17,044 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,217 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. ఏపీకి జాతీయ కమిటీ ప్రశంస ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్ కులాలు, తెగల వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. 2020 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కింద 41,653 పాఠశాలలు, 42,722 అంగన్వాడీ కేంద్రాలు, 11,948 గ్రామ పంచాయతీ కార్యాలయాలు, 14,383 ఆరోగ్య కేంద్రాలకు మంచినీటిని పూర్తిగా పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ కమిటీ అభినందించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మిషన్ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ 7,131 గ్రామాల్లో ఏర్పాటుచేసిన నీరు, పారిశుధ్య కమిటీలు మంచినీటి పథకాలు ఎక్కువకాలం సమర్థంగా పనిచేసేలా చూసి నీటిసమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన, నిర్వహణ, యాజమాన్య పద్ధతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 54,568 మందికి శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పటిష్టం చేయడం, సరఫరాను మెరుగు పరచడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలకు జల్జీవన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం జిల్లా, ఉప జిల్లా స్థాయిలో 408 మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇంజనీరింగ్ అనుభవం ఉన్న 54,568 మంది సిబ్బంది, వివిధస్థాయిల అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 18,536 మందికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పంపుల నిర్వహణల్లో శిక్షణ ఇచ్చి జల్జీవన్ మిషన్ కింద చేపట్టే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వనున్నారు. నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో 9 ప్రయోగశాలలుండగా.. సబ్ డివిజన్ స్థాయిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా పరిశీలన, యాజమాన్యం కోసం సెన్సార్ ఆధారిత పరికరాలను వినియోగించాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సూచించింది. -
కృష్ణవేణితో దుర్భిక్ష ప్రాంతాలు సుభిక్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరవు ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాలకు కృష్ణా వరద జలాలను తరలించి.. తాగు, సాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి సిద్ధమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) నుంచి 8 టీఎంసీలను తరలించి.. కురుబలకోట మండలం ముదివేడులో 1.5, పుంగనూరు మండలం నేతిగుంటపల్లిలో 1, సోమల మండలం ఆవులపల్లిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలో నిల్వ చేయనుంది. తద్వారా కొత్తగా 70 వేల ఎకరాలు, చెరువుల కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. మిగిలిన 2 టీఎంసీలను పీలేరు, కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని 33 మండలాల ప్రజలకు తాగు నీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,144.50 కోట్లతో గతేడాది సెపె్టంబర్ 2న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.1,554.21 కోట్ల వ్యయంతో (మిగతాది భూ సేకరణకు) 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. ఆమోదం రాగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి.. గడువులోగా పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మూడు రిజర్వాయర్లకు నీటి తరలింపు ఇలా.. – వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలగా పిలుస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. – మిగతా 1550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. – అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. – పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి.. పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. – పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి.. సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. -
ఇదేం చోద్యం
సాక్షి, సిటీబ్యూరో:ఎండాకాలం.. నీటి సమస్య.. నీటిని వీలైనంత పొదుపుగా వాడాలి అని జలమండలి అధికారులు నిత్యం చెబుతుంటారు. అయితే నగరంలోని మంచినీటి పైప్లైన్లకు చాలా చోట్ల లీకేజీలున్నాయి. దీంతో నీరంతా వృథా అవుతోంది. స్థానికులు అక్కడక్కడా ఇలా స్నానాలు చేస్తుంటారు. మరి నీరు కలుషితమైతే దానిని ఆపేదెలా? జరిగే ప్రమాదాలకు బాధ్యులెవరు? -
ఫలించిన తోపుదుర్తి కృషి
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, విద్యానగర్, ఎంఎన్ఆర్ కాలనీ, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని నీటి సమస్య తీరనుంది. ఆయా గ్రామాలకు పీఏబీఆర్ పైపులైన్ ద్వారా నీటిని అందించడానికి గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫలించిన ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి కృషి గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్ పైపులైను ద్వారా అక్కంపల్లి, పాపంపేట, విద్యారణ్య నగర్, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని పలు కాలనీలకు పీఏబీఆర్ ద్వారా నీళ్లను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు రోజుకు 22 లక్షల లీటర్ల నీరు అందించే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో తమ గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య తీరిందని, ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘హరీశ్తో మాటల్లేవ్.. అయినా మాట్లాడాను’
సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన ఇంటికే వచ్చి విన్నవించుకునేలా ఏర్పాట్లు చేశానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం దసరా వేడుకలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ నుంచి సంగారెడ్డిలోని తన ఇంటి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 14 ఏళ్లుగా తనకు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు మాటలు లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఐఐటీ తీసుకొచ్చానని, తాను పార్టీలకు తల వంచనని, ప్రజలకే తల వంచుతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలా చేస్తే బతికినన్ని రోజులు కేసీఆర్కు రుణపడి ఉంటానని అన్నారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి ఫోటోలకు మొక్కితే లాభం లేదనీ, వారు బ్రతికుండగానే సేవ చేయాలని హితవు పలికారు. తన తల్లి ఎంతో కష్టపడి తనను జీవితంలో ఇంతవాణ్ని చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేని కారణంగా తన సతీమణి నిర్మల బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. తనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవనీ, కోట్లాది రూపాయల అప్పు ఉందనీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ పాపాలు.. తాగునీటికి శాపాలు
సాక్షి, అనుమసముద్రంపేట (నెల్లూరు): గత టీడీపీ ప్రభుత్వ పాలనలో తాగునీటి ఎద్దడి నెలకొన్న సమయంలో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గ్రామాలలో తాగునీటి సమస్య జఠిలమైంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, అధికారులు తాగునీటి కోసం ట్యాంకులు కడుతున్నట్లు గ్రామాలలో హడావుడి చేశారు. కొద్దిగా పనులు ప్రారంభించిన అనంతరం వాటిని వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాధార పరిస్థితులు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో పాటు ఎక్కడా తాగేందుకు మంచినీరు దొరకడం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పడకండ్ల, యర్రబల్లి, చేజర్ల మండలంలోని కొల్లపనాయుడుపల్లి, ఏఎస్పేట మండలంలోని పందిపాడు, జమ్మవరం, సీబీవరం, కాకర్లపాడు ప్రాంతాలలో తాగునీటి కోసం అలమటిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఎంజీఆర్ హెల్ప్లైన్ సమాచారం అందుకున్న మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. కానీ ఏఎస్పేట మండలం జమ్మవరం పంచాయతీ కాకర్లపాడు గ్రామంలో తాగునీరు అందక నక్కలవాగులో చలమలు తీసి ఆ నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నారు. ఇదే గ్రామంలో నక్కలవాగు దాదాపు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మహిళలు సైతం అక్కడకు వెళ్లి నీరు తెచ్చుకునేవారు. ప్రస్తుతం అక్కడ కూడా నీరు లేకపోవడంతో గ్రామంలోని బోర్ల వద్ద ఫ్లోరైడ్ నీటిని తెచ్చుకుని తాగుతుండడంతో కొంత మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నట్లు ఇటీవల డాక్టర్లు సైతం నిర్థారించారు. గ్రామంలోని గిరిజన కుటుంబానికి చెందిన యాకసిరి పెంచలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయి మంచంలో ఉన్నారు. కాకర్లపాడు గ్రామంలో దాదాపు 400 కుటుంబాలు ఉండగా దాదాపు 300 కుటుంబాల వారు మినరల్ వాటర్పైనే ఆధారపడి జీవిస్తున్నారు. క్యాన్ రూ.10 వెచ్చించి ప్రతిరోజు ఇంటికి 3 క్యాన్లను వేసుకుంటున్నారు. ఈ విషయంపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం విశేషం. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదుకుంటున్న ఎంజీఆర్ హెల్ప్లైన్ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఏర్పాటుచేసిన ఎంజీఆర్ హెల్ప్లైన్ ద్వారా అనేక గ్రామాలలో నీటి సమస్యలు తీరుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాకర్లపాడు, జమ్మవరం గ్రామస్తులు తాము సైతం ఎంజీఆర్ హెల్ప్లైన్కు సమాచారం అందించడమే కాక ఆ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు త్వరలో మేకపాటి గౌతమ్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి శాశ్వత మంచినీటి సౌకర్యం కలిగించేలా కోరనున్నట్లు సమాచారం. మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నాం రోజుకు మూడు నీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నాం. పనికి వెళ్లి వచ్చిన కూలి డబ్బులు నీటికే సరిపోతున్నాయి. బోరింగ్లో నీళ్లు తాగితే కాళ్లు, చేతులు నెప్పులు వస్తుండడంతో తాగడం మానేశాం. – యాకసిరి కృష్ణమ్మ, గిరిజన కాలనీ ట్యాంకు కడతామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందు గ్రామంలో వాటర్ ట్యాంకు కడుతున్నామంటూ టీడీపీ వాళ్లు నిర్మాణం చేపట్టారు. అయితే ట్యాంకు పూర్తి కాకపోగా తాగునీటి సమస్య మాత్రం తీరలేదు. నక్కల వాగే దిక్కయింది. చలమలు లోడి తాగునీరు తెచ్చుకుని సేద తీరుతున్నాం. ఇప్పటి ప్రభుత్వమైనా స్పందించి శాశ్వత మంచినీటి పథకానికి దారి చూపాలి – తాళ్లూరు కొండయ్య, గిరిజనకాలనీ -
దాహం.. దాసోహం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వం వాటర్ గ్రిడ్ల పేరుతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయించి, డీపీఆర్లు సిద్ధం చేసి, బాహుబలి సెట్టింగ్ల మాదిరిగా డిజైన్లు చూపించి ప్రజల్ని ఊహల్లో ఊరేగించింది. పదవిలో ఉన్నంతవరకు వాటర్ గ్రిడ్ల ఊసు లేదు. ఆ ప్రతిపాదనలు గుర్తుకు రాలేదు. కానీ ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడి చేసింది. వాటర్ గ్రిడ్లను మళ్లీ తెరపైకి తెచ్చింది. పోనీ అదేనా పూర్తిగా చేయలేదు. రూ.3600 కోట్లతో తొలుత ప్రతిపాదించిన ప్రాజెక్టును పక్కన పెట్టి రూ.1783 కోట్లతో కొత్త ప్రాజెక్టును రూపకల్పన చేసింది. దాన్ని రూ.1000 కోట్లకు కుదిస్తూ ఫిబ్రవరి 21న అనుమతి ఇచ్చింది. దాంట్లో రూ.510 కోట్లకు టెండర్లు పిలిచి, కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఇదంతా చూస్తే టీడీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ప్రతీ ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న సంకల్పం లేదని తేటతెల్లమైంది. ఆర్భాటంపై తప్ప ఆచరణలో శ్రద్ధ చూపించలేదు. మొత్తానికి ఐదేళ్లు చేసిన మోసాలను గుర్తు చేసుకున్న ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. మాటిస్తే నిలబెట్టుకుంటారనుకున్న వైఎస్సార్సీపీని గెలిపిం చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఇంకేముంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా దానికి మించి చేస్తూ శభాష్ అన్పించుకుంటున్నారు. కిడ్నీ బాధితులున్న ఉద్దానంకు అధికారంలోకి వస్తే శుద్ధ జలాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగునీరే అక్కడ సమస్యని నివేదికలు చెబుతుండటంతో ఉద్దానం సమస్యకు పరిష్కా రం శుద్ధ జలాలు సరఫరాయే మార్గమని భావించా రు. బాధ్యతలు స్వీకరించిన 90రోజుల్లో మాట నిలబెట్టుకున్నారు. ఉద్దానానికి రూ. 600కోట్లతో తాగునీటిని ప్రాజెక్టును ప్రాంభించారు. ఒక్క ఉద్దానమే కాదు జిల్లా అంతటికీ తాగునీటిని అందించాలని, ఇంటింటికి కుళాయి ద్వారా సరఫరా చేయాలన్న ఆలోచనకు వచ్చారు. మనసులో తట్టడమే తరువా యి కార్యరూపంలో పెట్టారు. జిల్లాను యూనిట్గా చేసుకుని రూ.3672.50కోట్లతో వాటర్గ్రిడ్ను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గ డీపీఆర్ను త్వరితగతిన తయారు చేయించడమే కాకుం డా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇంకేముంది చిక్కోలు తాగునీటి సమస్య తీరనుంది. -నిబంధనల మేరకు ప్రతి వ్యక్తికి రోజుకు అందించాల్సిన నీరు : 70 లీటర్లు -జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు -రోజుకు 40 లీటర్లు మేర అందించే గ్రామాలు : 1000 -10 లీటర్లలోపు అందించే గ్రామాలు : 400 -నీటి వనరులు లేని గ్రామాలు : 22 గత ప్రభుత్వ ప్రణాళిక.. ప్రతీ వ్యక్తికి రోజుకి 70 లీటర్లు అందిస్తామని చెబు తూ రూ.1783 కోట్లతో 24 మండలాల్లోని 1861 గ్రామాలకు పరిమితం చేస్తూ ప్రతిపాదనలు రూపొం దించారు. దీన్ని రూ.1000 కోట్లకు పరిమితం చేసి పరిపాలన అనుమతి ఇచ్చారు. ఇందులో 510 కోట్లతో పనులకు ఎన్నికలకు రెండు నెలలు ముందు టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. ఈ ప్రణాళికలో నగరం, పట్టణాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్దానంలోని 7 మండలాలకు పూర్తిగా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు మిగతా 17 మండలాల్లోని 11 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీనివలన పలు గ్రామాలకు పాక్షికంగా తాగునీరు అందనుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రణాళిక .. జిల్లాలోని 38 మండలాలకు విస్తరించారు. ప్రతీ వ్యక్తి కి రోజుకి 100 లీటర్లు శుద్ధ జలాలు అందించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. 1141 పంచాయతీల పరిధిలో ని 4207 ఆవాసాల్లో 5.66 లక్షల కుటుంబాలకు శుద్ధ జలాలను అందించేందుకు నిర్ణయించారు. నగర, పట్టణ, మండల, గ్రామాలకు శుద్ధ జలాలు అందించాలని కార్యాచరణ రూపొందించారు. యుద్ధ ప్రాతి పదికన డీపీఆర్ తయారు చేయించారు. రూ. 3672.50 కోట్లతో రూపకల్పన చేసిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో తొలి విడతలోనే ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. వాటర్ గ్రిడ్లో భాగంగా చేపట్టనున్న చర్యలు.. జిల్లాలో హిరమండలం, పారాపురం, సింగిడి, ఆఫ్షోర్, మడ్డువలస జలాశయాలను తాగునీటి వనరులుగా అభివృద్ధి చేయనున్నారు. తోటపల్లి జలాయశం ప్రాజెక్టు నీటిని కూడా వినియోగిస్తారు. వంశధార, నాగావళి ,మహేంద్రతనయ నదుల్లో అవసరమైన నీటి బావుల నిర్మాణాలు చేపడుతారు. తాగునీటి వనరులు దూరంగా ఉన్న ప్రాంతాల్లో చెరువులను జలాశయాలుగా అభివృద్ధి చేయనున్నారు. నగరం, పట్టణం, గ్రామాల్లో అమలవుతున్న రక్షిత మంచినీటి పథకాను అనుసంధానం చేస్తారు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితమవడంతో భూ ఉపరిత జలాలనే తీసుకోనున్నారు. నేరుగా ఉపరితల జలాలు అందుబాటులోకి తేవడం( ఇన్ఫిల్టరేషన వెల్స్ నిర్మించి అందుబాటులోకి తెచ్చుకోవడం)పై దృష్టి సారిస్తారు. దీనివల్ల సహజ సిద్ధంగా శుద్ధి అవుతుంది. అలాగే, కాలువల నుంచి నేరుగా నీటి ట్యాంకుల్లోకి మళ్లిస్తారు. శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేస్తారు. తీరనున్న తాగునీటి కష్టాలు.. జిల్లాలో తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్దానానికే పరిమితం అనుకున్న ప్రాజెక్టును జిల్లా అంతటికీ విస్తరించారు. యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్ తయారు చేయించారు. రూ.3,672.50 కోట్లతో రూపొందించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఇంటింటి కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆమేరకు రాజధానిలో జరిగిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. – టి.శ్రీనివాసరావు, ఎస్ఈ, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం జిల్లాలో ఉన్న నీటి వనరులు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు : 37 సింగిల్ రక్షిత మంచినీటి పథకాలు : 1090 సౌరశక్తి పథకాలు : 177 కమ్యూనిటీ ట్రీట్మెంట్ ప్లాంట్లు : 6 చేతి పంపులు : 15,624 -
కందకాలతో జలసిరి!
భూగర్భ జాలాలు అడుగంటిన నేపథ్యంలో వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాల్లోని పండ్ల తోటల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోకసాని పద్మారెడ్డి కూడా వారిలో ఒకరు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో పద్మారెడ్డికి 80 ఎకరాల భూమి ఉంది. ఇందులోబత్తాయి తదితర తోటలు ఉన్నాయి. తోటలకు నీటి కొరత తీర్చుకునేందుకు గత కొన్నేళ్లుగా మొత్తం 247 బోర్లు వేసిన రైతు పద్మారెడ్డి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల బోర్లలో నీరు ఆఫ్ ఇంచ్కు తగ్గిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (99638 19074), వాటర్ మేనేజ్మెంట్ ఫోరం నిపుణుడు శంకరప్రసాద్ (90003 00993) సూచన మేరకు జూలై 5–6 తేదీల్లో తమ 80 ఎకరాల్లో, వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, కందకాలు తవ్వించారు. అదృష్టం కొద్దీ కందకాలు తవ్విన కొద్ది రోజుల్లోనే 3 రోజుల పాటు మంచి వర్షాలు కురిశాయి. పొలాల్లో కురిసిన ప్రతి చినుకూ కందకాల ద్వారా అంతకుముందెన్నడూ లేని విధంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జల మట్టం పెరిగింది. గతంలో ఆఫ్ ఇంచ్ పోసే బోర్లు ఇప్పుడు 2.5 ఇంచులు ఫుల్లుగా పోస్తుండడంతో పద్మారెడ్డి పరమానందభరితుడయ్యారు. అనూహ్యంగా ఇంత సులువుగా, ఇంత తక్కువ రోజుల్లో భూగర్భ జల మట్టం పెరగడం తనను ఆశ్చర్యపరచిందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో గుంటిపల్లి దగ్గర ఉన్న మరో 30 ఎకరాల్లో కూడా కందకాలు తీయిస్తున్నామన్నారు. సాగు నీటి భద్రత కోసం కందకాల ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రిక, టీవీ యాజమాన్యాలకు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నేతలకు పద్మారెడ్డి(99481 11931) కృతజ్ఞతలు తెలిపారు. -
నగరవాసులకు తప్పని నీటి కష్టాలు
-
వర్షమియ్యరా స్వామీ!
తిరుమలలో నీటి సమస్య జటిలమవుతోంది. ప్రస్తుత నీటి నిల్వలు మరో 50 రోజులకు సరిపోతాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోయే ప్రమాదం ఉంది. కళ్యాణిడ్యాం, కండలేరు, తెలుగుగంగ కూడా డెడ్ స్టోరేజ్కి చేరాయి. తిరుమలకు ప్రత్యామ్నాయంగా నీటిని తరలించే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీటి వాడకాన్ని పొదుపుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వరుణదేవుడిపై గంపెడాశలు పెట్టుకుని కాలం నెట్టుకొస్తున్నారు. సాక్షి, తిరుమల: తిరుమలకు నీటినందించే జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. విధిలేని పరిస్థితుల్లో టీటీడీ పొదుపు చర్యలు పాటిస్తోంది. దగ్గర్లో వర్షాలు రాకుంటే బ్రహ్మోత్సవాల నాటికి తీవ్ర ఇబ్బందులు తప్పేటట్లు లేదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో 70 వేల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుకుంటుంది. దీనికితోడు భక్తులకు సేవలందించే ఉద్యోగులు, స్థానికులు మరో 20 వేల మంది వరకు తిరుమలలో నివాసం ఉంటున్నా రు. వీరందరికి తాగునీటి సౌకర్యం కల్పిం చేందుకు 1963 నుంచి దశల వారీగా తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలను టీటీడీ నిర్మించింది. ఇవేగాక తిరుపతి కళ్యాణి డ్యాం నుంచి, బోర్ల ద్వారా కూడా నీటిని తిరుమలకు టీటీడీ తరలిస్తోంది. గోగర్భం డ్యాంలో 2,683 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 5,167 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 670 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 3,962 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 1,295 లక్షల గ్యాలన్లు నీటిని నిల్వ చేయవచ్చు. తిరుమలకు సంబంధించి నిత్యం 30 నుంచి 40 లక్షల గ్యాలన్లు వరకు నీటి వాడకం ఉంటుంది. కానీ గత ఏడాది ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. తిరుమలలో సగటు స్థాయిలో కూడా వర్షాలు కురవలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వర్షాలు లేవు. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోగా కూమార, పసుపు ధార జంట ప్రాజెక్టుల్లో దాదాపు 2వేల లక్షల గ్యాలన్లు నీటి నిల్వలు ఉన్నాయి. నీటి ఎద్దడి సమస్య కొత్తది కాదు తిరుమలలో నీటి ఎద్దడి సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. 2002 సంవత్సరంలో కూడా తీవ్ర వర్షభావం కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి. అప్పట్లో ట్యాంకర్ల ద్వారా టీటీడీ తిరుమలకు నీటిని తరలించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం భక్తుల అవసరాల దృష్ట్యా తిరుమలకు తిరుపతి నుంచి నీటిని తరలించేందుకు పైపులైను నిర్మించింది. కళ్యాణిడ్యాం నుంచి నీటిని భక్తుల అవసరాల కోసం తరలించేందుకు అనుమతించడంతో పాటు బోర్ల ద్వారా 2 లక్షల గ్యాలన్ల నీటిని తరలించింది. కానీ ఈ ఏడాది ఇప్పటికే కళ్యాణిడ్యాంలో కూడా నీరు అడుగంటిపోయింది. కండలేరు నుంచి తెలుగు గంగ నీటిని తిరుమలకు తరలించాలని నిర్ణయించినప్పటికీ కండలేరులో కూడా నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం తిరుమలలోని జలాశయాల్లో ఉన్న నిల్వల మేరకు మరో 50 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు అధికారులు. తిరుమలలో వర్షాలు సా«ధారణంగా ఈశాన్య రుతుపవనాలు కాలంలో కాకుండా నైరుతి రుతు పవనాల సమయంలో కురుస్తాయి. అంటే తిరుమల జలాశయాల్లో నీరు చేరే వర్షాలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అధికారుల లెక్కల మేరకు ఆగస్టు మాసం మధ్యంతరానికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతాయి. బ్రహ్మోత్సవాల నాటికి పరిస్థితి మరింత తీవ్రం సెప్టెంబర్ చివరలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ ఏడాది తిరుమలలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. నీటి ఎద్దడి తరుముకొస్తుండడంతో తిరుపతి నుంచి నీటి తరలింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగంతో టీటీడీ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. రానున్న నీటి ఎద్దడిని నివారించేందుకు త్వరలోనే జిల్లాస్థాయి అధికారులతో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముంచుకొస్తున్న నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందుగా కళ్యాణిడ్యామ్ వద్ద ఉన్న బోర్ల నుంచి సాధ్యమైనంత నీటిని ప్రతిరోజు తిరుమలకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. అక్కడ నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిచోటా నీరు డెడ్ స్టోరేజ్ లెవల్కు చేరుకోవడంతో తిరుమలకు నీటిని తరలించే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ప్రస్తుతానికి ఉన్న నీటి ద్వారా దాదాపు 50రోజులు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అటు తర్వాత మాత్రం ఏడుకొండలవాడే దిక్కు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతా ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడుకొండలవాడు కనికరించపోతాడా.. వర్షం కురవకపోతుందా.. జలాశయాలు నిండకపోతాయా.. సమస్య తీరకపోతుందా.. అని అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మానవ ప్రయత్నం ద్వారా చేయాల్సిందంతా చేసేయడంతో అధికారులు ఇక వరుణదేవుడిపై భారం మోపారు. నీటి పొదుపు చర్యలు తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం కూడా లేకపోవడంతో తిరుమలలో టీటీడీ నీటి పొదుపు చర్యలను మొదలుపెట్టింది. ఇప్పటికే మఠాలు, హోటళ్లకు కేవలం రోజుకు 4గంటలకు మాత్రమే నీటిని పంపిణీ చేస్తోంది. కాటేజీల్లో నీటి నియంత్రణ చేస్తోంది. ఇక స్థానికులు, ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీటిని వదులుతోంది. దీంతో స్థానికులు, ఉద్యోగులు నీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మరో చెన్నైగా బెంగళూరు !
సాక్షి బెంగళూరు : భవిష్యత్లో బెంగళూరు నగరం మరో చెన్నైగా మారనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నీటి కటకటతో చెన్నై నగరం తీవ్ర కష్టాలు పడుతోంది. ఇదే తరహాలో బెంగళూరుకు కూడా తాగునీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే తీవ్ర వర్షాభావం వల్ల కావేరి నీరు దాదాపుగా లభ్యత తగ్గిపోతూ వస్తోంది. చాలా అపార్టుమెంట్లకు కావేరి నీరు లభించడం లేదు. నగరవాసులు ప్రస్తుతం కావేరి నీరు కంటే బోరు నీళ్లు, వాటర్ ట్యాంకర్ల మీదే ఎక్కువగా ఆధార పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో చెన్నైగా మారడానికి ఎంతో సమయం పట్టదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వేగంగా తగ్గుతున్న భూగర్భజలాలు.. చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో చెన్నై నగరానికి నీటి సరఫరా చేయడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కష్టసాధ్యంగా మారింది. పొరుగింటికి అంటుకున్న మంట పక్కనే ఉన్న మన ఇంటికి చేరడానికి ఎక్కువ సమయం పట్టదన్న రీతిగా బెంగళూరుకు నీటి కష్టాలు త్వరలోనే సంభవించే విధంగా ఉన్నాయి. బెంగళూరులో కూడా ప్రస్తుతం నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు రాత్రిబవళ్లు నీటి గురించి ఆలోచించాలిన పరిస్థితి దాపురించింది. బెంగళూరులో 40కి పైగా బోర్వెల్స్లోని నీరు ఒకే నెలలో అడుగంటాయి. భూగర్భ జలాలు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 అడుగుల లోతుకు తవ్వినప్పటికీ చుక్క నీరు పడని పరిస్థితి ఉంది. రెండు మూడు రోజులకొకసారి కావేరి నీరు.. నీటి కొరత కారణంగా నీటిని డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నీటి ట్యాంకర్ కోసం ఆర్డర్ చే స్తే వెంటనే లభించడం లేదు. 20 లీటర్ల ఒక క్యాన్ నీరు రూ. 10 చెల్లిస్తే కానీ దొర కడం లేదు. బెంగళూరులో రెండు, మూ డు రోజులకొకసారి కావేరి నీటిని అ«ధికారులు వదులుతున్నారు. ఆ వచ్చే నీరు కూడా ఒక గంట మాత్రమే వస్తోంది. నగరంలో దాదాపు 70 శాతం అపార్టుమెంట్లకు కావేరి నీరు ఇప్పటికే అందడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో దా దాపుగా 75 వేల అపార్టుమెంట్లు ఉం డగా.. అందులో 22 వేల అపార్టుమెంట్లకు మాత్రమే కావేరి నది అందుతోంది. మిగిలిన వారు వాటర్ ట్యాంకర్లు, బోరుబావుల మీదే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో శరావతి నది నీటిని కూడా బెంగళూరుకు తరలించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆలోచన చేస్తోంది. అయితే శివమొ గ్గ జిల్లా పలు సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మలేనాడు ప్రాంతానికి ప్రాణధారమైన శరావతి నీటిని బెంగళూరుకు తరలిస్తే శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి వంటి జిల్లాలకు తాగు నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతాయని ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర జనాలకు తీవ్ర నిరాశ ఎదురయింది. దీంతో తీవ్ర వర్షాభావం పరిస్థితుల్లో శరావతి నీటిని బెంగళూరుకు తరలిస్తే తమ పరిస్థితి ఏంటని మలేనాడు ప్రాంతవాసులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన పారిశ్రామీకరణ వల్లే.. మరోవైపు బెంగళూరు నగరం ఎంతో వేగంగా విస్తరిస్తున్న రీత్యా విపరీతమైన పారిశ్రామీకరణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బెంగళూరులో అనేక చెట్లను తొలగించాల్సి వచ్చింది. పలు చెరువులను పూడ్చి అక్కడ ఆకాశహరŠామ్యలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, అభివృద్ధి పేరిట సహజ సంపదనను నాశనం చేస్తూ పోయారు. కెంపేగౌడ నిర్మించిన వందలాది చెరువులు ప్రస్తుతం అంతరించిపోయాయి. దీంతో వర్షాభావం పరిస్థితులు తలెత్తి ప్రస్తుతం నీటికటకటకు దారితీసింది. ప్రస్తుతం నగరానికి నీటిని సరఫరా చేసే కేఆర్ఎస్, హేమావతి, హారంగి, కబిని జలాశయాల్లో నీరు దాదాపుగా అడుగంటే స్థితిలో ఉంది. గత జూన్ నెలలోనూ ఈ జలాశయాల్లోకి నీరు వచ్చి చేరలేదు. మున్ముందు కూడా ఇన్ఫ్లో లేకపోతే బెంగళూరుకు నీటి ఇక్కట్లు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు నగర ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. బెళ్లందూరు వంటి చెరువుల్లో ఈ ఉష్ణోగ్రత పుణ్యమా అని అప్పుడప్పుడు నిప్పులు కక్కుతున్నాయి. ఆయా చెరువుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. కొన్ని చెరువుల్లో అయితే నీరే ఉండడం లేదు. ఒకవేళ ఉన్న కాలుష్య నీటి వల్ల ఎవరికీ ప్రయోజనం కాకుండా పోతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బెంగళూరు నగరం నరకకూపంగా మారనుందనడంలో అతిశయోక్తి లేదు. -
నీటి కొరత అన్నదాతలను మరింత కుంగదీస్తోంది
-
ఐటీని వణికిస్తోన్న నీటి సంక్షోభం
సాక్షి, చెన్నై: చెన్నైలో రోజు రోజుకి పెరుగుతున నీటి సంక్షోభం అక్కడి ప్రజలతోపాటు ఐటీ సంస్థలను కూడా బెంబేలెత్తిపోతున్నాయి. నీటి సమస్యను తట్టుకోలేక కోన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. నీటి సమస్య తీవ్రతరం కావడం.. తమ కార్యాలయాల్లో కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ కంపెనీలే కాదు.. చెన్నైలోని రెస్టారెంట్లు కూడా నీటి సంక్షోభంతో చేతెలెత్తేసే పరిస్థితి నెలకొంది. వినియోగదారులకు తగినంత నీటిని అందుబాటులో ఉంచలేక పలు రెస్టారెంట్లు కేవలం టిఫిన్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. నీరు అందుబాటులో లేకపోవడంతో భోజనం సదుపాయం కల్పించలేకపోతున్నామని చెప్తున్నాయి. అంతేకాకుండా రెస్టారెంట్లు పనిగంటలు కూడా గణనీయంగా తగ్గించాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి సంక్షోభం మీద నివేదికను కోరినట్లు సమాచారం. నీటి సంక్షోభం వల్ల అనేక సంస్థలు మూసివేయబడ్డాయని, ఐటీ కంపెనీలయితే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే పరిస్థతికి దిగజారాయని, ఇవేవి పట్టించుకోకుండా అవినీతితో బిజీగా ఉన్న మున్సిపల్ మంత్రి వేలుమణి దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని స్టాలిన్ డిమాండ్ చేశారు. -
చెరువులకు నీరు చేరేలా..
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో చెరువులు నింపడానికి నేరుగా తూములను ఏర్పాటు చేయనున్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎడమకాల్వ పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయకపోయినా నీరు పుష్కలంగా లభ్యం కావడం వల్ల ఆయకట్టులో చెరువులు నిండేవి. కానీ ఇటీవల వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాశయంలోకి నీరు చేరడం లేదు. దాంతో ఎడమకాల్వకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి వచ్చినా కనీసం చెరువులు నింపడానికి నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. కాగా కాల్వ నుంచి నేరుగా చెరువులకు తూములు లేకపోవడం వల్ల మేజర్ కాల్వలకు నీటిని విడుదల చేస్తే నీరు చెరువుకు చేరకుండా వృథాగా పోతోంది. దీంతో ఎన్ఎస్పీ అధికారులు కాల్వలకు నేరుగా తూములు ఏర్పాటు చేసి ఆయకట్టు పరిధిలోని చెరువులు నింపడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయకట్టులో ఉన్న మొత్తం చెరువులపై ఇటీవల సర్వే పూర్తిచేశారు. సర్వే ఆధారంగా ఎడమకాల్వకు నేరుగా తూములు ఏర్పాటు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టులో మొత్తం 417 చెరువులు.. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 173 గొలుసుల పరిధిలో 309 గొలుసుకట్టు చెరువులు, 108 ఒంటరి చెరువులు, మొత్తం 417 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటిపై ఎన్ఎస్పీ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా 309 గొలుసుకట్టు చెరువుల్లో 151 చెరువులకు మాత్రమే ప్రస్తుతం తూములు ఉన్నట్లు తేలింది. కాగా 22 చెరువులకు భూసేకరణ చే యాల్సి ఉందని, 20 చెరువులకు కాల్వలకు లేవని, 50 చెరువులు ఎన్ఎస్పీ ఆయకట్టు ప రిధిలో లేవని, 13 చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలింది. కాగా మరో 53 చెరువులకు కొ త్తగా తూములు ఏర్పాటు చేయడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. అదే విధంగా 108 ఒంటరి చెరువుల్లో 52 చెరువులకు కాల్వలతో పాటు పంట పొలాల మీదుగా వెళ్లే నీరు చేరుతుంది. ఒక చెరువుకు భూసేకరణ సమస్య, 16 చెరువులకు కాల్వలు తీసే పరిస్థితి లేదు. ఐదు చె రువులు ఆక్రమణకు గురయ్యాయని, 23 చెరువులు ఆయకట్టు పరిధిలో లేవనితే లింది. కాగా 11 ఒంటరి చెరువులకు తూముల ఏర్పాటుకు కసరత్తు సాగుతుంది. 64 చెరువులకు 45 కొత్త తూములు.. మొత్తం 417 చెరువుల్లో కొన్నింటికి తూములు ఉండడంతో పాటు ఇతర సమస్యల కార ణం ఉండగా ప్రస్తుతం 64 చెరువులకు 45 తూములను ఏర్పాటు చేసి ఈ వేసవిలో సా గర్ ఎడమకాల్వ నుంచి నేరుగా చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నారు. 35 గొలుసుల పరిధిలోని 53 గొలుసుకట్టు చెరువులకు, 11 ఒంటరి చెరువులకు తూములు ఏర్పాటు చేయనున్నారు. అందుకు గాను ఇటీవలనే ఎన్ఎస్పీ అధికారులు టెండర్లు సైతం పిలిచారు. కొత్తగా ఏర్పాటు చేసే తూముల్లో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాలుగు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 13, హుజూర్నగర్ నియోజకవర్గంలో 11, కోదాడ నియోజకవర్గంలో 17 తూములున్నాయి. వాటి పరిధిలో 64 చెరువులకు నీటిని అందించనున్నారు. నేరుగా నీరు చేరేలా చర్యలు సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో నేరుగా తూముల ద్వారా నీటిని నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆయకట్టు పరిధిలోని చెరువులను సర్వే నిర్వహించాం. నేరుగా తూములు లేని చెరువులను గుర్తించాం. అందుకు కొత్తగా 64 చెరువులకు 45 తూములు ఏర్పాటు చేసి నీటిని నింపుతాం. అందుకోసం టెండర్లు కూడా పిలిచాం. తూములు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులను నింపే అవకాశం ఉంటుంది. – నాగేశ్వర్రావు, ఈఈ, ఎన్ఎస్పీ మిర్యాలగూడ -
‘డబుల్’ కాలనీల్లో సదుపాయాలు కరువు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం... అవి పూర్తయ్యేలోగా ‘డబుల్’ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, సీసీ టీవీలు, కమ్యూనిటీ హాళ్లు, అంగర్వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు తదితర ఏర్పాటు చేయాలని భావించింది. అయితే జీహెచ్ఎంసీకి ఇళ్ల నిర్మాణ ఖర్చులు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులపై స్పష్టత లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖలఅధికారులతో ఏడాది క్రితం సమావేశం నిర్వహించారు. ఆయా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు వివరాలు అందజేయగా, జీహెచ్ఎంసీ వాటిని క్రోడీకరించి ఆయా పనులకు దాదాపు రూ.616 కోట్లు ఖర్చువుతుందని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన అనుమతులతో పాటు సంబంధిత శాఖలకు నిధులు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి ఏడెనిమిది నెలల క్రితమే నివేదిక అందజేసింది. అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. నిధులకు సంబంధించి ఆయా శాఖలకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయనిదే తాము పనులు చేపట్టలేమని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేనిదే లబ్ధిదారులకు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం త్వరిత్వగతిన నిర్ణయం తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు... ఆ మేరకు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఆయా శాఖలు మొత్తం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలకు ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుతం 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తకాగా... మరో 35 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. కనీసం ఇళ్లు పూర్తయిన కాలనీల్లోనైనా మౌలిక సదుపాయాలు కల్పించనిదే ప్రభుత్వ ప్రయోజనం నెరవేరదని అధికారులు పేర్కొంటున్నారు. వృథాగా మారిన జేఎన్ఎన్యూఆర్ఎం తదితర ఇళ్ల పరిస్థితిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇవీ ప్రతిపాదనలు... ♦ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 109 ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయా శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ♦ టీఎస్ఏపీడీసీఎల్: విద్యుత్ ఏర్పాట్లకు రూ.235.40 కోట్లు. ♦ జలమండలి: ఓఆర్ఆర్ లోపల తాగునీటి సరఫరాకు రూ.158.65 కోట్లు. ♦ ఆర్డబ్ల్యూఎస్అండ్ఎస్: ఓఆర్ఆర్ వెలుపలి కాలనీలకు తాగునీటి ఏర్పాట్లకు రూ.77.40 కోట్లు. ♦ హెచ్ఎండీఏ: జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లోని కాలనీలకు అప్రోచ్ రోడ్లకు రూ.94.30 కోట్లు. ♦ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్: 10 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.26.16 కోట్లు. ♦ రాచకొండ పోలీస్ కమిషనరేట్: 7 పోలీస్ అవుట్ పోస్టులు, 36 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.11.26 కోట్లు. ♦ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్: 3 పోలీస్ అవుట్ పోస్టులు, 32 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.7.34 కోట్లు. ♦ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్: 3 పోలీస్ అవుట్ పోస్టులు, 19 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు. ♦ అన్నీ కలిపి మొత్తం వ్యయం: రూ.616.01 కోట్లు. ♦ ఇంకా ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. -
నిమ్స్లో నీటి చుక్క కరువాయె!
సాక్షి, సిటీబ్యూరో/సోమాజిగూడ: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని రోగులకు నీటి కష్టాలు తప్పడం లేదు. దాహమేస్తే తాగేందుకే కాదు...సర్జరీ తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరులేక పోవడంతో సోమవారం పలు విభాగాల్లో చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎండాకాలంలో నీటి అవసరాలపై అధికారులు ముందే ఓ అంచనాకు రాలేక పోవడం, సంపుల్లోకి చేరుతున్న నీటిని, వాటి నిల్వలను పరిశీలించక పోవడం, సరఫరా అయిన నీటిని కూడా సద్వినియోగం చేసుకోక పోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. నీటికోసం ఆస్పత్రి నెలకు రూ. 50 లక్షల చొప్పున ఏడాదికి రూ.ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. కానీ రోగుల నిష్పత్తికి తగినంత నీటిని అందించలేక పోతోంది. ఫలితంగా రోగులే బయటి నుంచి బాటిళ్లను కొనుగో లు చేయాల్సి వస్తుంది. ఇలా ఒక ఐదు లీటర్లకు రూ. వంద వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆశతో వచ్చి..నిరాశతో వెనుతిరిగిన రోగులు నిజానికి శని, ఆదివారాల్లో రోగుల రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రతి సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. జలమండలి నుంచి వచ్చే నీటి సరఫరా, ట్యాంకుల్లో నిల్వల పరిశీలన, వార్డులకు సరఫరా కోసం ఆస్పత్రిలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నీటిసంపులోని నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించక పోవడం వల్ల ఆదివారం సాయంత్రం నుంచి కుళాయిల్లో నీటిసరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే సర్జరీలకు ప్లాన్ చేసుకున్న వైద్యులు, చికిత్సల కోసం ఉదయం ఐదు గంటలకే ఆపరేషన్ థియేటర్ల ముందుకు చేరుకున్నారు. తీరా చికిత్స తర్వాత వైద్య సిబ్బంది చేతులకు శుభ్రం చేసుకునేందుకు నీరు లేదని తెలిసి చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూ రో సర్జరీ, కార్డియాలజీ, తదితర విభాగాల్లో చిన్నాపెద్ద అన్ని కలిపి 60 సర్జరీల వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సగం మంది వైద్యులు వేసవి సెలవుల్లో ఉన్నారు. నీరులేక ఉన్నవాళ్లు కూడా సర్జరీలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఉగ్గబట్టుకోవాల్సిందే ఉస్మానియా, గాంధీ వంటి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్ కొంత భిన్నమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మాత్రమే కాదు దీనికి చైర్మన్గా స్వయంగా సీఎం కొనసాగుతుంటారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే..ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం, మెరుగైన వైద్యసేవలు అందుతుండటం, అనేక మంది నిపుణులు అందుబాటులో ఉండటంతో రోగులు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. 1500 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున రెండు వేల మందికిపైగా వస్తుంటారు. పదిహేను వందలకుపైగా రోగులు ఇన్పేషంట్లు చికిత్సలు పొందతుంటారు. ఒక్కో రోగికి ఒక సహాయ కుడు ఉంటారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు కూడా నీటి సరఫరా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతు న్నాయి. జనరల్ వార్డుల్లోనే కాదు పేయింగ్ రూమ్ల్లోనూ ఇదే దుస్థితి. మూత్రశాలలు కంపుకొడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఉగ్గబట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా రోగులు, వైద్యులు రోజంతా నీరు లేక ఇబ్బంది పడటంతో అధికారులు మేల్కొని సాయంత్రానికి సమస్యను పరిష్కరించారు. మంగళవారం నుంచి సమస్య రాకుండా చూస్తామని పేర్కొన్నారు. -
నీళ్లు లేవు, పెళ్లి వాయిదా
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భయంకరమైన కరువు పీడిస్తోంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఫలితంగా పలు ప్రాంతాల వాసులు వలస పోతున్నారు. పశువులు, గొర్రెలను సంతలో అమ్ముకుని బెంగళూరు, మైసూరు తదితర నగరాలకు వచ్చి ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. వేసవి ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకూ తాగునీటి సమస్య ఎక్కువ కావడంతో జనాలు వలస వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,122 ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాగా పలు తోటల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దీంతో పంటలు కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా గృహప్రవేశాలు, వివాహాలు కూడా వాయిదా దాఖలాలు అక్కడక్కడా చూడవచ్చు. అన్నింటికీ సమస్యే ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల్లో జరగాల్సిన జాతరల హడావుడి నీటికొరతతో తగ్గిపోయింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు బం ధువుల ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బళ్లారిలో 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో బోర్లు ఎండిపోయాయి. కుళాయిల్లో నీళ్లు బంద్ అయ్యా యి. హోటళ్లు, హాస్టళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తే కానీ గొంతు తడవని పరిస్థితి నెలకొంది. ఉత్తర, మధ్య కర్ణాటకలోనే సమస్య అధికంగా ఉంది. అన్ని జిల్లాల్లో దాహాకారాలు ♦ ఆలమట్టి జలాశయం నుంచి విజయపుర జిల్లాకు నీళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ట్యాంకర్ నీటిపైనే ఆధారపడ్డారు. ♦ భాగల్కోటె జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ♦ బెళగావి జిల్లా చిక్కోడిలో ఈ ఏడాది మార్చి ఆరంభం నాటి నుంచి నీటి సమస్య ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 1,330 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ♦ దావణగెరె జిల్లాలో 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. దీంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకుని నీళ్లు తరలిస్తున్నారు. ఈక్రమం లో నెలకు రూ.2.16 కోట్లు బాడుగ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ♦ రాయచూరు జిల్లాలో తుంగ, కృష్ణా నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య వేధిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా కేవల నాలుగు గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నారు. ♦ తుమకూరు జిల్లాలో నీటి సమస్య నివారణ నిమిత్తం 505 బోరుబావులను ప్రక్షాళన చేశారు. అయితే 192 బావుల్లో నీళ్లు లభించలేదు. మిగతా వాటిలో నీళ్లు రావడంతో మోటార్లు బిగించి నీటిని సరఫరా చేస్తున్నారు. ♦ బళ్లారి జిల్లాలో 10 రోజులకు ఒకసారి నీళ్లు లభిస్తున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నీటి సమస్య వేధిస్తోంది. నీటి కోసం వేసిన బోర్లలో 65 సఫలం కాగా.. 177 విఫలమయ్యాయి. ♦ దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు గత 2016 తరహాలో కరువు ఏర్పడింది. నగదు వెచ్చించినా నీళ్లు దొరకని పరిస్థితి. అంతేకాకుండా ట్యాంకర్ను ఉదయం బుక్ చేస్తే సాయంత్రానికి వస్తుంది. మూడు ట్యాంకర్లు ఆర్డర్ చేస్తే ఒక ట్యాంకర్ నీటిని పొందవచ్చు. గత 2016లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ♦ శివమొగ్గ జిల్లాలో గాజనూరు, భద్ర, వరాహి, చక్ర, సావేహక్లు, లింగనమక్కి, తలకళలె ఆనకట్టలు ఉన్నా.. నీటి సమస్య ఎక్కువగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 216 గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. ♦ ఉత్తర కన్నడ జిల్లాలో మూడు దశాబ్దాల తర్వాత నీటి కొరత అధికమైంది. అంకోలా, కారవార నగరాలకు గంగావళి నది నుంచి నీళ్లు వస్తాయి. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఈ నగరాలకు తొలిసారిగా నీటి సమస్య ఏర్పడింది. ♦ చిత్రదుర్గ జిల్లాలో నీటి కోసం నిత్యం ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. సమస్య మరింత తీవ్రం అవుతోంది తప్ప తగ్గుముఖం పట్టలేదు. ♦ కొప్పళ జిల్లాలో బహద్దూర్ బండి గ్రామంలో నీటి కోసం గొడవలు జరుగుతున్నాయి. నిత్యం జగడం పడితే కానీ నీరు సంపాదించలేని పరిస్థితి. కొప్పళ నగరంలో 10 – 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ♦ మైసూరు జిల్లాలో కావేరి, కబిని నదులు ఉన్నప్పటికీ నీటి సమస్య ఉంది. మైసూరు నగరంలో తాగునీటి సమస్య లేకున్నా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేధిస్తోంది. ♦ పనులు లేక వలసలు వెళ్లడం చూశాం.. కానీ నీళ్లు లేక వలస వెళ్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగిపోతోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు పది కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నదుల పక్కనున్న జిల్లాల్లోనూ కటకట నెలకొంది. -
నీటి కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
రాయదుర్గం: నీటి సమస్య తీర్చాలని కోరుతూ గోపన్పల్లి రాజీవ్నగర్ మహిళలు బిందెలతో రోడ్డెక్కిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై బిందెలు, బకెట్లు వరుసగా పెట్టి నిరసన తెలుపడంతో ఇరువైపులా గంటన్నరపాటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలియడంతో చందానగర్ పోలీసులు, గచ్చిబౌలి జలమండలి అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపన్పల్లిలోని రాజీవ్నగర్లో నాలుగు నెలల క్రితం తాగునీటి పైప్లైన్లు వేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో కేవలం 30 ఇళ్లకు మాత్రమే నీటి కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు. మిగతావారు ఇప్పటి వరకు తీసుకోలేదు. కాగా ఇటీవలి వరకు బోరు పని చేసినా అది కూడా వట్టిపోవడంతో నీటి సమస్య ఎదురైంది. దీంతో మహిళలు బిందెలు, బకెట్లు పట్టుకొని ప్రధాన రోడ్డుపైకి వచ్చి రోడ్డుకు అడ్డంగా బిందెలు, బకెట్లు పెట్టి వాహనాలను నిలిపివేశారు. దీంతో గంటన్నరపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులతో చర్చించారు. అనంతరం జలమండలి గచ్చిబౌలి సెక్షన్ మేనేజర్ వెంకట్రెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో స్థానికులు శాంతించారు. అనంతరం అరగంటపాటు తాటునీటి సరఫరా చేశారు. కాగా బోరునుబాగు చేసి నీటి సరఫరా జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.గోపన్పల్లిరాజీవ్నగర్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంచినీటి కనెక్షన్లు ఇస్తామని జలమండలి గచ్చిబౌలి మేనేజర్ వెంకట్రెడ్డి తెలిపారు. గోపన్పల్లి ప్రాంతంలో రోజువిడిచి రోజు గంటా ఇరవై నిమిషాలపాటు నీటి సరఫరా చేస్తున్నామన్నారు. -
పల్లెల్లో దాహం దాహం
జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వరుసగా మూడేళ్ల నుంచి వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు పూర్తిగా అడుగంటాయి. వేసవిలో నీటి సమస్య ఉండే అవకాశం ఉన్న సంగతి తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. బోరుబావులు, రక్షిత మంచినీటి ప«థకాలకు మరమ్మతులు చేయలేదు. దీంతో నీటి సరఫరా చేసే వ్యవస్థ దెబ్బతింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్ర పర్యటన చేసి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారనేఆరోపణలున్నాయి. నెల్లూరు, ఉదయగిరి: తాగునీటి అవసరాల కోసం జిల్లాలోని పలు పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులను అధికారపార్టీ నేతలు ఎన్నికలకు ముందు అరకొరగా పనులు చేసి ఉన్న కాస్త పైసలు కాజేశారు. దీంతో పంచాయతీ ఖాతాల్లో బ్యాలెన్స్ నిండుకుంది. దీంతో బోర్లకు, తాగునీటి మోటార్లకు మరమ్మతులు చేపట్టేందుకు వీలు లేకుండా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 940 గ్రామ పంచాయతీలు, 3,120 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం అధికారంగా 320 గ్రామాల్లో నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం 148 ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అవసరాల మేరకు సరఫరా జరగడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మూగ జీవాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాగేందుకు నీరు లేక అనేక మంది పశుపోషకులు తక్కువ ధరకే వాటిని తెగనమ్ముకుంటున్నారు. మెట్టలో దారుణం డెల్టా ప్రాంతంలో తాగునీటి సమస్యతో పోల్చుకుంటే మెట్టలో మరింత దారుణంగా ఉంది. కొన్ని గ్రామాల్లో బిందెడు నీటి కోసం పనులు మానుకొని అదే పనిలో ఉండాల్సి పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో 400 ఆవాస ప్రాంతాలు ఉంటే వీటిలో 280 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. ప్రస్తుతం 108 ఆవాస ప్రాంతాల్లో మాత్రమే నీటి సరఫరా ట్యాంకర్లు ద్వారా చేస్తున్నారు. వింజమూరు, ఉదయగిరి, కొండాపురం, కలిగిరి సీతారామపురం, రాపూరు, డక్కిలి, పొదలకూరు, వెంకటగిరి, సైదాపురం, ఏఎస్ పేట, సూళ్లూరుపేట తదితర మండలాలలో నీటి తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు లేక నీటి వనరులైన చెరువులు, బావులు, బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. పైగా ఎండ తీవ్రత 47 డిగ్రీలకు చేరుకోవడంతో కాస్త ఉన్న నీటì జాడలు కూడ వట్టిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంత గ్రామాలు కూడ నీటి కోసం అల్లాడిపోతున్నాయి. వింజమూరు, ఉదయగిరి పట్ణణాలలో తీవ్రర çనీటి సమస్య నెలకొంది. ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేసినా ప్రజల అసరాలను తీర్చే పరిస్థితి లేదు. పట్టించుకోని ప్రభుత్వం కొన్ని గ్రామాల్లో నీటి కోసం ప్రమాదఘంటికలు మోగుతున్నా అధికారులకు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పంచాయతీల్లో నీటి అవసరాల కోసం నిల్వ ఉంచిన నగదును అధికారపార్టీ నేతలు వివిధ రకాల పనులు చేసి నిబంధనలకు విరుద్ధుంగా కాజేశారు. పైగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న నగదును ప్రభుత్వం ఎన్నికలకు ఓటరు తాయిలాల కోసం వాడేసింది. దీంతో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. చిన్న పనులు చేయాలన్నా డబ్బు లేకçపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. పైగా నెలలు తరబడి బిల్లులు పెండింగ్లో ఉండడంతో పనులు చేసేందుకు ఏవరూ ముందుకు రావడం లేదు. దీంతో సమస్య పరిష్కారం కావడం లేదు. తాగునీటి సమస్యనివారణకు చర్యలు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా అవసరమైతే స్థానికంగా ఉన్న ఎంపీడీఓను కలసి వినతిపత్రం అందజేయాలి– శ్రీనివాసరావు, ఈఈ -
నాలుగు నిమిషాలు..40 వేల లీటర్లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన నగేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఢిల్లీ బయలుదేరాడు. రాత్రి భోజనం ముగించుకున్నాక రైలు వాష్రూమ్కు వెళ్లాడు. కానీ అక్కడ నీళ్లు రావడం లేదు, వెలుపల హ్యాండ్ వాష్ దగ్గర పరిశీలించాడు, అక్కడా అదే కథ. మరో బోగీకి వెళ్లి చూసినా, పరిస్థితిలో మార్పులేదు. కాసేపట్లో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. అత్యవసరాలకు కూడా నీళ్లు లేకపోవడమేంటని వారు సిబ్బందిని నిలదీశారు. రైలులో నీళ్లు అయిపోయాయని, మధ్యలో నింపే వెసులుబాటు కూడా లేదని, ఏదైనా ప్రధాన స్టేషన్లో నింపాలంటే అరగంట సమయం పడుతుందని, అంతసేపు రైలును ఆపలేమని చెప్పి చేతులెత్తేయటంతో జనం ఆగ్రహంతో సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఇది ఈ ఒక్క రైలుకే పరిమితం కాదు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో తరచూ ఏర్పడే సమస్యే. గత వేసవి కాలంలో మొత్తం రైలు ఫిర్యాదుల్లో 42 శాతం ఇవే కావటం విశేషం. మెరుగైన ప్రయాణం సంగతి దేవుడెరుగు, రైళ్లలో కనీసం నీళ్లు కూడా ఉండవు అన్న అపవాదును భారతీయ రైల్వే మూటగట్టుకుంది. ఇంతకాలం తర్వాత దీనికి విరుగుడు మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక నీటి సమస్య ఉండదు. కేవలం నాలుగు నిమిషాల్లో... రైలు ప్రయాణంలో నీటి ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాగునీరైతే కొనుక్కుంటారు. కానీ వాడుక నీరు లేకుంటే ఇబ్బంది అంతాఇంతా కాదు. దూరప్రాంతాలకు వెళ్లేవారి అవస్థలు ఎన్నో. ఇటీవలి వరకు ప్రయాణికులను ఈ సమస్య వెంటాడింది. ప్రారంభ స్టేషన్లో నిండుగా నీటిని నింపిన తర్వాత వేసవి సమయాల్లో ఆ నీళ్లు వేగంగా అయిపోయేవి. మళ్లీ ఆ నీటిని నింపాలంటే అన్ని స్టేషన్లలో వసతి ఉండేది కాదు. వసతి ఉన్నా రైలు మొత్తం నీటిని నింపాలంటే కనీసం 25 నిమిషాల నుంచి అరగంట పట్టేది. అంతసేపు రైలును నిలపడం వీలు కానందున, కొంత నీటినే నింపేవారు. కాస్త దూరం వెళ్లగానే అవి అయిపోయేవి. దీంతో గమ్యం చేరుకునేవరకు నీళ్లు లేకుండానే రైలు వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణికుల నుంచి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు రైల్వే మేల్కొంది. ఇప్పుడు ప్రధాన స్టేషన్లలో ‘క్విక్ వాటరింగ్ సిస్టం’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం బోగీల్లో నీళ్లు నింపే పాత పైప్లైన్లు మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. ఒక్కోచోట నాలుగు చొప్పున 40 హెచ్పీ సామర్థ్యం ఉన్న మోటార్లు అమర్చారు. ఈ పైప్లైన్ నుంచి బోగీలకు చిన్న పైప్లను అమర్చి మోటారు అన్ చేయగానే కేవలం నాలుగు నిమిషాల్లో మొత్తం రైలులోని నీటి ట్యాంకులు నిండిపోతాయి. పైగా ఒకేసారి అన్ని బోగీల్లో నీళ్లు నిండుతాయి. మరో లైన్లో నిలబడిన రైలుకు కూడా అదే సమయంలో నీళ్లు నింపేలా ఏర్పాటు చేశారు. వెరసి నాలుగు నిమిషాల్లో రెండు రైళ్లలో ట్యాంకులు నింపేయొచ్చన్నమాట. నీళ్లు అయిపోయిన రైలు వచ్చి ఆగి.. తిరిగి బయలుదేరేంత సమయంలోనే నీటిని నింపేస్తారు. కొద్దిరోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థను సెన్సార్లు, రిమోట్లతో అనుసంధానించారు. నీళ్లు నిండగానే సెన్సార్లు గుర్తించి ఆటోమేటిక్గా పంపింగ్ నిలిచిపోయేలా చేస్తాయి. ఈ పనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మనుషులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మోటారు వద్ద ఉండే వ్యక్తి రిమోట్ సాయంతో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. అంతకుముందు పంపింగ్ సామర్థ్యం లేక ఒక బోగీ నిండాక మరో బోగీ నింపాల్సి వచ్చేది. పైప్లైన్కు లీకేజీల వల్ల నీళ్లు కూడా వృథాగా పోయేవి. - ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డు గతేడాది రూ.300 కోట్లు విడుదల చేసింది. ప్రధాన స్టేషన్లకు రూ.2 కోట్లు చొప్పున కేటాయింపులు చేసింది. ఏప్రిల్లో పనులు పూర్తయి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. - ఒక్కో బోగీకి 1,600 లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకులుంటాయి. గరిష్టంగా పెద్ద రైలులో 40 వేల లీటర్ల నీళ్లు అందుబాటులో ఉంటాయి. గతంలో ఇన్ని నీళ్లు నింపాలంటే దాదాపు అరగంట పట్టేది. కొత్త వ్యవస్థతో ఇది 4 నిమిషాల్లో పూర్తవుతుంది. - దేశవ్యాప్తంగా 142 స్టేషన్లలో ఈ వ్యవస్థ అందుబాటులోకిరాగా, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ప్రారంభించారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. -
డెల్టా..ఉల్టా
భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ డెల్టా కాలువలు అధ్వానంగా మారాయి.. ఏళ్ల తరబడి ఆధునికీకరణకు నోచుకోక రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. వేసవిలో కాలువలను ఆధునికీకరిస్తాం అని పాలకులు చెబుతున్నా.. ఏటా అంతంతమాత్రంగానే పనులు జరగడం పరిపాటిగా మారిపోయింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో పనులు కూడా చకచకా జరిగా యి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆధునికీకరణపై దృష్టి సారించకపోవడంతో నిధులు మురిగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పాలనలోనూ ఆధునికీకరణ పనులు నామమాత్రంగానే జరిగాయి. అధ్వానంగా పంట కాలువలు పశ్చిమ డెల్టా పరిధిలో 11 ప్రధాన కాలువలు, వాటి బ్రాంచ్ కెనాల్స్ కింద 5,29,962 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో నికర ఆయకట్టు 4,60,000 ఎకరాలు కాగా చేపల చెరువులు 69,962 ఎకరాలు ఉన్నాయి. పదేళ్లుగా దాదాపు అన్ని కాలువలు పూడుకుపోవడం, కర్రనాచుతో నిండిపోవడం, గట్లు బలహీనంగా మారడంతో ముంపు సమయంలో గండ్లు పడే పరిస్థితి ఉంది. కొన్ని కాలువలు చెత్తాచెదారాలతో మురుగు కాలువలను తలపించేలా మారిపోయాయి. ఆయా కారణాలతో పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. నీరు ఉధృతంగా వచ్చినప్పుడు కొన్నిచోట్ల కర్రనాచు వల్ల నీరు ముందుకు పారక గట్లు తెగుతున్నాయి. అటువంటి సమయాల్లో పొలా ల్లోకి ముంపు నీరు చేరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితమెప్పుడో కాలువ పూడికతీత పనులు జరిగాయి. ఆ ఆతర్వాత ఎన్నడూ పూరిస్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు. పనులు నామమాత్రం డెల్టా కాలువల ఆధునికీకరణ పనులకు నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అంతంతమాత్రంగానే జరిగాయి. అధునికీకరణ పేరు చెప్పి ఒక వియ్యర్ నిర్మాణం చేపట్టడం, ఒకటి, రెండు గట్లను పటిష్టం చేయడంతో సరిపెడుతున్నారు. జారిపోతున్న గట్లకు రివిట్మెంట్ నిర్మాణ పనులు చేయడం లేదు. ఈ ఏడాది రూ.30 కోట్ల వరకు.. ఈఏడాది వేసవిలో కాలువల ఆధునికీకరణకు సుమారు రూ.30 కోట్ల వరకు నిధులు మంజూరైనట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సక్రమంగా బిల్లులు రాకపోవడంతో ఇరిగేషన్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు మక్కువ చూ పడం లేదు. దీంతో టెండర్లకు స్పందన కరువయ్యింది. ఈ ఏడాదీ అనుమానమే..! జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు అవకాశం లేదు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పిలుస్తారా? లేక అధికారులు నేరుగా టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈక్రమంలో వేసవి ఆధునికీకరణ పనులపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఆధునికీకరణ పనులు జరగకపోతే సాగునీటి ఇక్కట్లు తప్పవని, కాలువ గట్లు తెగిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.} డ్రెయినేజీ శాఖలోనూ ఇదే తంతు పశ్చిమ డెల్టా పరిధిలో మురుగు నీటి డ్రెయిన్లూ అధ్వానంగానే ఉన్నాయి. పూడుకుపోయి, తూడు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. దీంతో ముంపు సమయాల్లో పొలాల్లో నీరు బయటకు పారడం లేదు. డ్రెయినేజీ గట్లు బలహీనంగా ఉండటంతో పాటు చాలాచోట్ల ఆక్రమణలో ఉన్నాయి. డ్రెయినేజీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లుల పెండింగ్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది డ్రెయిన్ల అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.50 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే రూ.20 కోట్ల పనులకు టెండర్లు దాఖలు కాలేదు. ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులు మరోమారు టెండర్లు పిలవనున్నారు. పూడిక తీత పనులు చేపట్టాలి మా గ్రామం ఆయకట్టు జీ అండ్ వీ పంట కాలువ నీటిపై ఆధారపడి ఉంది. అయితే పంట కాలువలో కర్రనాచు తీవ్రంగా ఉండటం వల్ల సాగునీరు కిందకు పారడం లేదు. దీంతో నీరు గట్లు దాటి పైకి రావడంతో గండ్లు పడుతున్నాయి. మట్టి, కంకర బస్తాలతో అడ్డుకట్ట వేసుకుంటున్నాం. కాలువ పూడిక తీసి సుమారు 10 ఏళ్లు కావడంతో పూడుకుపోయింది. ఈ వేసవిలో అయినా కాలువ పూడికతీత పనులు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – పోలుకొండ మోహన్రావు, రైతు, కొండేపూడి స్పందన అంతంతమాత్రం కాలువల ఆధునికీకరణ కోసం ఎన్నికల కోడ్కు ముందు కొబ్బరికాయ కొట్టిన పనులు జరుగుతున్నాయి. నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో కాలువలకు సంబంధించి పనులు చేస్తున్నాం. పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు సుమారు రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన తక్కువగా ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ టెండర్లు పిలుస్తాం. అత్యవసరమైన పనులను చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎం.దక్షిణామూర్తి, ఇరిగేషన్ శాఖ ఈఈ, శెట్టిపేట, నిడదవోలు మండలం ఎవరూ ముందుకు రాలేదు ఈ ఏడాది డ్రెయినేజీ అభివృద్ధి పనుల నిమిత్తం సుమారు రూ.10 కోట్లకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరు ముందు రాలేదు. మళ్లీ టెండర్లు పిలవడానికి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. కాంట్రాక్టర్లు ముందుకువస్తే వారికి పనులు అప్పగించి డ్రెయిన్లు అభివృద్ధి చేస్తాం. కాంట్రాక్టర్లు ముందుకురాకపోతే ఉన్నతాధికారుల అదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – పి.నాగార్జునరావు, డ్రెయినేజీ శాఖ ఈఈ, భీమవరం -
మూగవేదన
అచ్చంపేట: పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నల్లమలలో వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో నీటి వనరులు వట్టిపోయాయి. ఐదేళ్లుగా నల్లమలలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో నీటివసతి ఉన్న ప్రాంతాలకు వన్యప్రాణులు వస్తున్నాయి. పంట పొలాలు, బోరు బావులు, చెరువుల వద్దకు వస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి నెల రోజుల ముందే ఎండలు ఎక్కువగా ఉండడంతో సమస్య మరింత ఉత్పనమైంది. అభయారణ్య ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎండకాలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ప్రతి ఏటా రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నామని బాహాటంగా చెబుతున్నా.. వాటికి నీరు అందడం లేదు. అటవీశాఖ పూర్తిస్థాయిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తే నీటి కోసం గ్రామాల వైపు జంతువులు ఎందుకు వస్తాయన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4కి.మీ. పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ. పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అటవీ సరిహద్దు గ్రామాలైన మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మిపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు, ఉడిమిళ్ల, తిర్మలాపూర్(బీకే) తదితర గ్రామాల్లో వ్యవసాయ పొ లాల్లో ఉండే బోర్ల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపా రు. బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్ర మే కొద్దిగా నీరు ఉంది. అత్యధికం గా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి. వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆర్భాటంగా ప్రకటించుకోవడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అటవీశాఖ చెబుతున్న ఏర్పాట్లు ఇవే.. వన్యప్రాణుల తాగునీటి సమస్య అధిగమించడానికి గతంలో అటవీశాఖ నల్లమ ల ప్రాంతంలో 36 సాసర్లు ఏర్పాటు చేశా రు. వన్యప్రాణులు, జీవరాశులు సంచరించే ప్రాంతాల్లో గతేడాది 428 సాసర్లు నిర్మించడంతో పాటు పాతవాటికి కూడా మరమ్మతులు చేపట్టారు. వీటిని అత్యధికంగా రోడ్డు, వాహనాలు వెళ్లగలిగే ప్రాం తాల్లో నిర్మించారే గానీ లోతట్టు ప్రాం తంలో ఏర్పాటు చేయడం లేదు. వీటితో చాలా వరకు ప్రయోజనం తక్కువగా ఉం టుంది. అత్యధికంగా ఇవి పర్హాబాద్ నుం చి వ్యూపాయింట్, అప్పాపూర్, మల్లాపూ ర్, భౌరాపూర్, రాంపూర్, మేడిమల్కల రోడ్డు మార్గంలో ఉన్నాయి. పర్హాబాద్ వ ద్ద ఏర్పాటు చేసిన సోలార్ డిఫ్వెల్ పం పింగ్ సిస్టమ్తో ట్యాంకర్కు నీటిని నింపి వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పిం చాలి. రోజుకు ఒక ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం అని అటవీ శాఖ అ«ధికారులకు చెబుతున్నా.. రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా వెళ్లడం లేదు. ట్యాంకర్ల ద్వారా అటవీ జంతులవుల దాహార్తి తీరుస్తున్నామని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి గానీ అదీ ఆచరణంలో సక్రమంగా అమలు కావడం లేదు. అత్యధికంగా వన్యప్రాణులు తిరిగే ప్రదేశమైన పిచ్చకుంట్ల చెరువు, రాళ్లవాగు, గుడేశ్వరం, తాళ్లచెరువు నీళ్లులేక ఎండిపోయాయి. లోతట్టు అటవీ ప్రాంతంలో సాసర్ల ఏర్పాటు లేకపోవడంతో అక్కడ తాగునీరు లేక వన్యప్రాణులు బయటికి వస్తున్నాయి. సాసర్లలో నీటిని పోయిస్తున్నాం.. జంతువులకు నీటికి ఇబ్బంది లేదు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్న అడవుల్లో 71 సాసర్లు, నాలుగు సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని అభయారణ్య ప్రాంతంలో అటవీశాఖ తరుఫున జంతువుల కోసం సాసర్లలో నీటిని పోయిస్తున్నాం. – గంగారెడ్డి, డీఎఫ్ఓ, మహబూబ్నగర్ -
దాహం.. దాహం
మూడేళ్లుగా వెంటాడుతున్న తీవ్ర వర్షాభావం.. తాగునీటి ఎద్దడి నివారణకు కొరవడిన ముందు చూపు.. కొత్తగా ఒక్కబోర్ వెల్ మంజూరు చేయకపోవడం.. సీపీడబ్ల్యూ స్కీం (తాగునీటి పథకాలు)లకు సంబంధించి కాంట్రాక్టర్లకు సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో పట్టణాలతో పాటు పల్లె సీమలు దాహంతో అల్లాడి పోతున్నాయి. బిందెడు తాగునీటి కోసం పనులు మానుకుని ఉండాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి ప్రజల సమస్యలను గాలికొదిలేసింది. నెల్లూరు(అర్బన్): జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఒనరుల జాడ కనిపించడంలేదు. ఎక్కువ శాతం బావులు అడుగంటి పోయాయి. చెరువులు ఎండిపోయాయి. ఇప్పటికే 41 నుంచి 42 డిగ్రీలతో ఎండలు మండుతున్నాయి. 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారే తప్ప ప్రజల తాగునీటి ఎద్దడికి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు మూగజీవాలకు గుక్కెడు నీరు, కాస్త దాణా అందించలేక ప్రజలు తమ పశువులను కబేళాలకు అమ్ముకుంటున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. మెట్ట ప్రాంతాల్లో మరీ దారుణం ప్రధానంగా ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు, దుత్తలూరు, వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్పేట, రాపూరు, డక్కిలి, వెంకటగిరి , సైదాపురం, పొదలకూరు తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి మరీ తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో బావులు అడుగంటి పోయాయి. ఉదయగిరిలోని బసినేనిపల్లి, కిష్టంపాడు తదితర ప్రాంతాల్లో పొలాల్లోకి రెండు కిలో మీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావలి, జలదంకిమండలాల్లో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. డీవీ సత్రం మండలంలో సముద్ర తీర ప్రాంతాల గ్రామాలైన మీజూరు, ఏరికాడు, కారికాడు తదితర ఏడు గ్రామాల్లో తాగునీటి కోసం తహ తహ లాడుతున్నారు. మూలన పడుతున్న సీపీడబ్ల్యూ స్కీంలు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రెండు నుంచి నాలుగు ఆవాసిత ప్రాంతాలకు కలిపి ప్రభుత్వం ఏర్పరచిన సమగ్రరక్షిత నీటిపథకాలు జిల్లాలో 35 ఉన్నాయి. వాటిలో ఒకదానిని మినీ పంపింగ్ స్కీంగా మార్చారు. మిగతా 34లో గూడూరు డివిజన్లోని తుమ్మూరు–విన్నమాల గ్రామం, కొండాపురంలో మరొక సీపీడబ్ల్యూ పథకాలు పూర్తిగా మూలన పడ్డాయి. మరమ్మతులకు కూడా పనికి రాకుండా పోయాయి. మిగతా 32 స్కీముల ద్వారా 134 హ్యాబిటేషన్స్లో రోజూ నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 30 గ్రామాల్లో రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం మీద 320 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొని ఉండగా కేవలం 134 ప్రాంతాల్లోనే సరఫరా చేస్తూ మిగతా ప్రాంతాల సంగతి గాలికొదిలేశారు. పంచాయతీల డబ్బు ప్రభుత్వం కబ్జా .. 8 నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూపులు గ్రామాల్లో తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14 వ ఆర్ధిక సంఘం నిధులను వినియోగిస్తున్నారు. తాగునీటి పథకాల నిర్వహణ కోసం పంచాయతీల దగ్గర సరిపడా ఆర్థిక సంఘం నిధులున్నాయి. వీటిని పంచాయతీ అధికారులు జిల్లా పరిషత్(జెడ్పీ) కార్యాలయానికి చెల్లిస్తున్నారు. జెడ్పీ అధికారులు తాగునీటి పథకాల నిర్వహణ కోసం వసూలు చేసిన డబ్బును ట్రెజరీలో జమ చేస్తున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల నిధులను ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం ఆ నిధులను కావాలనే ట్రెజరీలో జమ చేయాలనే నిబంధనలు తెచ్చిపెట్టింది. 26వ తేదీ డిశంబర్ 2018న సీపీడబ్ల్యూ స్కీం నిర్వహణ కాంట్రాక్టర్లకు నాలుగు నెలల బకాయిలు చెల్లించేందుకు జెడ్పీ అధికారులు చెక్కులిచ్చారు. ఆ చెక్కులను జనవరి –2019లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేసేసింది. ఇలా యాక్సెప్ట్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే కాంట్రాక్టర్ల ఖాతాలో నిధులు జమకావాల్సి ఉంది. అయితే నేటికీ జమకాలేదు. ఇప్పటికే ఎనిమిది నెలలుగా ఆ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నా ఒక్క పైసా విడుదల కాలేదు. కారణాన్ని పరిశీలిస్తే స్థానిక సంస్థల సొమ్మును ప్రభుత్వం కబ్జా చేసేసింది. ఇతర పథకాలకు డైవర్ట్ చేసింది. దీంతో కాంట్రాక్టర్లకు ఇవ్వలేక పోతోంది. ఇప్పటికే రూ.1.10 కోట్ల బకాయిలు జిల్లాలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఒక్కో కాంట్రాక్టర్కు 15 నుంచి రూ.20 లక్షల వరకు బకాయిలున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి నిర్వహణ చేపట్టాల్సి రావడంతో స్కీంల మరమ్మతులను గాలికొదిలేస్తున్నారు. దాహం తీర్చే చర్యలు ఏవీ? గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు అక్కడక్కడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అరకొర చర్యలు చేపట్టారే తప్ప పూర్తి స్థాయిలో గొంతు తడిపే చర్యలు చేపట్టలేదు. జిల్లాలో కొత్తగా ఒక్క చేతిపంపును ఏర్పాటు చేయలేదు. పాత చేతిపంపుల్లో పూడిక తీసే చర్యలు చేపట్టలేదు. కొన్ని గ్రామాల్లో రక్షిత నీటి ట్యాంకర్లను మంజూరు చేసినా అవి ఏళ్ల తరబడి పూర్తవ్వడం లేదు. ప్రభుత్వం నీటి కొరత తీర్చేందుకు అత్యవసరం కింద విడుదల చేసిన నిధులు శూన్యం. అరకొర విడుదల చేసినా అవి గత ఏడాది టాంకర్ల ద్వారా సరఫరా చేసిన కాంట్రాక్టర్లకే చాల్లేదు. కొన్ని ఉదాహరణలు ♦ కోవూరు సీపీడబ్ల్యూ స్కీంను నాసిరకంగా నిర్మించడంతో అది రెండు, మూడు రోజులకోసారి మరమ్మతులకు గురవుతోంది. ఇదే విషయాన్ని స్థానిక జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఇటీవల జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తి రచ్చ చేశాడు. ♦ ఉదయగిరి పంచాయతీలో వారం రోజులుగా తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. మండల కేంద్రమైన వరికుంటపాడులో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు రావడంలేదు. సీతారామపురం మండలంలో పలు చోట్ల పొలాల్లోని బావులవద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అక్కడ కూడా నీరు అడుగంటి అందడం లేదు. జలదంకి మండలం గట్టుపల్లిలో ఇదే పరిస్థితి ♦ డీవీ సత్రంలోని తొగరాముడి, ఏరికాడు, కారికాడు, ద్వారకాపురం, మీజూరులో తాగునీటికి అష్ట కష్టాలు పడుతున్నారు. కోట, వాకాడులో ఇదే పరిస్థితి నెలకొంది. ♦ ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లె బీసీ కాలనీ(చివరి ప్రాంతం) వాసులకు నీరందడం లేదు. ♦ దగదర్తి మండలం ఉప్పలపాడులో ఏడాది నుంచి తాగునీటి ట్యాంకర్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇక్కడ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటే దిక్కు. తాగునీటి ఎద్దడి నివారణకుప్రత్యేక ప్రణాళిక జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశాం. నిధుల కొరత లేదు. జనవరి వరకు ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేసిన వారందరికీ బిల్లులు ఇచ్చాం. ఇప్పటికే 134 ప్రాంతాల్లో తాగునీటిని టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా నీటి ట్యాంకర్లు అవసరమైతే ఎంపీడీఓ ద్వారా మండల కమిటీని కలిసి అర్జీ ఇస్తే చాలు. సమస్యను తీరుస్తాం. అలాగే పశువులకు నీటిని సరఫరా చేసేందుకు పశుసంవర్ధక శాఖ డాక్టర్ ద్వారా లెటర్ తెచ్చుకోవాలి.– నాగజ్యోతి, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈ -
పట్నానికి దూపైతాంది
సాక్షి, సిటీబ్యూరో :నగరం గొంతెండుతోంది. తాగునీటి కోసం తండ్లాడుతోంది. ఎండలు మండిపోతుండడంతో సమస్య తీవ్రరూపందాలుస్తోంది. జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నా...నిర్వహణ లోపాలతోనే ఈ పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ... ప్రజాఅవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. రోజు విడిచి రోజు సరఫరా జరగడం లేదనిధ్రువపడింది. ‘సాక్షి’ మంగళవారం నగరంలో పరిశీలించగా ఈ మేరకు వెల్లడైంది. బస్తీలు, కాలనీలకు అరకొర నీటిసరఫరా, కలుషిత జలాల సరఫరా తదితర సమస్యలు కళ్లకు కట్టాయి. వాస్తవానికి ప్రతి వేసవిలో ఉన్నతాధికారులు డివిజన్ల వారీగా పరిస్థితిని సమీక్షించాల్సి ఉన్నప్పటికీ కార్యాలయాలకేపరిమితమయ్యారనే విమర్శలు వినిపించాయి. కిందిస్థాయి సిబ్బందే సరఫరా రోజు, సమయాలు నిర్ణయించే పరిస్థితినెలకొందనే ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో గుడిసెకుమూడు బిందెలు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని నందగిరిహిల్స్ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్ మురికివాడలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నెల రోజులుగా సరిపోయేన్ని నీళ్లు సరఫరా కాకపోవడంతో స్థానికులు చుట్టుపక్కల అపార్టుమెంట్లకు వెళ్లి బిందెడు నీటిని అడుక్కోవాల్సి వస్తోంది. రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నా పావుగంట కూడా వదలకపోవడంతో ఒక్కో గుడిసెకు మూడు బిందెలు కూడా రావడం లేదు. ఇక్కడ బోర్ ఉన్నా భూగర్భజలాలు అడుగంటడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి.భారతి నివసించే రోడ్ నెం.14లోని లంబాడి బస్తీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మల్కాజిగిరి: నియోజకవర్గం పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్తో నీరు సరఫరా అవుతోంది. మరికొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితమవుతోంది. వినాయకనగర్ డివిజన్ వాజ్పేయి నగర్లో తాగునీటి సమస్యతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. లో ప్రెషర్తో నీరు సరఫరా అవుతోందని ఆరోపిస్తున్నారు. యాప్రాల్లో... రాజీవ్గృహకల్ప, భరత్నగర్లో నీటి పైప్లైన్ అసలే లేదు. ఏళ్ల తరబడి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. 15, 20 రోజులకు ఒక సారి ట్యాంకర్ వస్తోంది. దీంతో 4 నుంచి 5 డ్రమ్ములు ఒక కుటుంబం సరి పెట్టుకుంటున్నామని, ఈ నీటిని స్నానాలు, తాగేందుకు వినియోగించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. సమయపాలన లేదు చింతల్: చింతల్ వాటర్ వర్క్స్ డివిజన్ నాలుగు సెక్షన్ల పరిధిలో ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన నీటి సరఫరా అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఐదు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గాజులరామారం రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో దేవేందర్నగర్, మల్లారెడ్డినగర్, కైసర్నగర్, రోడామేస్త్రీనగర్, మెట్కానిగూడ తదితర ప్రాంతాల్లో ఐదురోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. అన్ని సెక్షన్లలో సమయపాలన పాటించడం లేదు. సూరారం తదితర ప్రాంతాల్లో 5 రోజులకు ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. మొదటి అరగంట కలుషితం అంబర్పేట: నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి లో ప్రెషర్తో నీటి సరఫరా జరుగుతోంది. ♦ అంబర్పేట డివిజన్ న్యూ ప్రేమ్నగర్లోని 2–3–647/ఎ/300 ప్రాంతంలో 10వ తేదీ నుంచి తాగునీటి సరఫరా లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ♦ బాగ్అంబర్పేట డివిజన్లో పోచమ్మబస్తీ సమీపంలో మంగళవారం కలుషిత తాగునీరు సరఫరా అయింది. ♦ బాగ్అంబర్పేట మల్లికార్జున్ నగర్లో ముందస్తు సమాచారం లేకుండా నీటి సరఫరా బంద్ చేశారు. ♦ నల్లకుంట డివిజన్లో విజ్ఞాన్పురి బస్తీలో.. తిలక్నగర్బస్తీ, చైతన్యనగర్ కాలనీ, భాగ్యనగర్లో ట్యాంకర్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. లో ప్రెషర్తో సరఫరా లో ప్రెషర్తో తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చే నీళ్లు కూడా గంటకంటే ఎక్కువగా రావడం లేదు. వేసవి కావడంతో ఇంట్లోని బోరు పూర్తిగా ఎండిపోయింది. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – ఎ.సుజాత, మోతిమార్కెట్ చాలీచాలని నీళ్లు అడ్డగుట్ట: ఒక పక్క చాలీచాలని నీళ్లు మరో పక్క కలుషిత నీటి సరఫరా కారణంగా అడ్డగుట్ట డివిజన్లోని బి సెక్షన్ వాసులు కష్టాలు పడుతున్నారు. అడ్డగుట్ట డివిజన్లోని బి సెక్షన్ ఇంటి నెం. 10–4–బి/146 సమీప ప్రాంతంలో లో ప్రెషర్తో నీళ్లు సరఫరా అవుతున్నాయి. నల్లా నీటిలో మురుగు నీళ్లు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐదు రోజులకోసారి.. కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు స్వతహాగా నీటి వనరులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జలమండలి ద్వారా నీటిని కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతానికి రోజుకు 50 లక్షల గ్యాలన్ల చొప్పున 11 వేర్వేరు రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బోయిన్పల్లి పరిధిలోని 1, 6 ఆరు వార్డుల్లో మినహా, మిగతా ఆరు వార్డులో మూడు నుంచి ఐదురోజులకోసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. పది రోజుల క్రితం జలమండలి ఎండీ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేసి అదనంగా రోజుకు 13 లక్షల గ్యాలన్ల చొప్పున విడుదల చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు నీటి మోతాదును పెంచితే అన్ని ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి నీరు విడుదల చేసే అవకాశముంది. మంగళవారం కంటోన్మెంట్లో మెజారిటీ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. కేవలం 20 శాతం బస్తీలు, కాలనీల్లో మాత్రమే నీటి సరఫరా జరిగింది. బిందెనక బిందెపెట్టి! ♦ బోయిన్పల్లిలో ఐదు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. ♦ జూబ్లీహిల్స్ డివిజన్లోని గురుబ్రహ్మనగర్ మురికివాడలో ఒక్కో గుడిసెకు కేవలం 3 బిందెల నీళ్లే వస్తున్నాయి. ♦ గచ్చిబౌలిలోని బంజారానగర్, దీప్తిశ్రీనగర్లలో కేవలం అరగంట పాటే నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి పాపిరెడ్డినగర్ కాలనీలో దుర్గామాత దేవాలయం సమీపంలో కనెక్షన్లు ఉన్నా నీటి సరఫరా జరగడం లేదు. ♦ కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో 23 ఎంజీడీ లు డిమాండ్ ఉండగా... 17–18 ఎంజీడీలే సరఫరా అవుతోంది. ♦ యాప్రాల్లోని రాజీవ్ గృహకల్ప, భరత్నగర్లలో నీటి పైప్లైన్లు అసలే లేవు. ఏళ్ల తరబడి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 15–20 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తోంది. ఒక్కో కుటుంబం 4–5 డ్రమ్ముల నీటిని పట్టుకొని వాటినే అన్ని అవసరాలకు సరిపెట్టుకుంటోంది. ♦ అంబర్పేట డివిజన్ న్యూప్రేమ్నగర్లోఈ నెల 10 నుంచి నీటి సరఫరా జరగడం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ♦ బాగ్అంబర్పేట మల్లికార్జుననగర్లో ముందస్తు సమాచారం లేకుండా నీటిసరఫరా ఆపేశారు. అరగంట మాత్రమే.. ఉప్పల్: ఉప్పల్, కాప్రా సర్కిల్, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల పరిధిలో నీటి కటకట మొదలైంది. కాప్రా సర్కిల్ పరిధిలో దాదాపు 50 శాతం గోదావరి జలాలు సరఫరా అవుతుండేవి.. అయితే మంజీరా, సింగూరు ఎండిపోవడం వల్ల గోదావరి జలాలను మళ్లించారు. దీంతో నీళ్లు సరిపోక ఇక్కడి ప్రజలు నీటికి తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో 23 ఎంజీడీల నీరు డిమాండ్ ఉండగా ప్రస్తుతం 17 నుండి 18 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. గోదావరి జలాలుమళ్లించడం వల్ల జలమండలి అధికారులు కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో రోజు విడిచి రోజు గంట సరఫరా చేసే బదులు కొన్ని ప్రాంతాల్లో అరగంట మాత్రమే సరఫరా అవుతోంది. ఉప్పల్ న్యూ విజయపురి కాలనీ, శాంతినగర్, విజయపురి కాలనీ, లక్ష్మారెడ్డి కాలనీ, సూర్యనగర్కాలనీ, సరస్వతినగర్, ఇందిరానగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్య తీవ్రంగా ఉంది. ఉప్పల్, కాప్రా సర్కిళ్ల పరిధిలో 63 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో 28 వేల నీటి కనెక్షన్లు ఉండగా కాప్రా సర్కిల్ పరిధిలో 35 వేల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు ఉప్పల్ సర్కిల్ పరిధిలో సమయపాలన లేకుండా నీరు వదలడంతో ఎందుకు ఉపయోగం కాకుండా పోతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి పైప్లైన్ చార్మినార్: పాతబస్తీలో నీటి కొరత ఎక్కువగా ఉంది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిజాం కాలం నాటి తాగునీటి పైపులైన్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రధాన రోడ్లలో ప్రాజెక్టు పనులు జరిగినా అంతర్గత బస్తీల్లో ఇంకా పాత పైపులైన్ ద్వారానే నీటి సరఫరా అవుతోంది. కుళాయిల్లో వచ్చే కలుషిత నీటి సరఫరాతో స్థానికులు అనారోగ్యాలకు గురవుతున్నారు. దాంతో 20 లీటర్ల నీటి క్యాన్లను బహిరంగ మార్కెట్లో ఖరీదు చేస్తున్నారు. నీటి సరఫరా ప్రారంభమైన చాలా సేపటి వరకు కలుషితంగా వస్తుండటంతో పాతబస్తీ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. చుక్క చుక్కకూ నిరీక్షణే... ఎల్బీనగర్: ఎల్బీనగర్జోన్ పరిధిలో నీటి సరఫరా అస్తవ్యస్థంగా ఉంది. రోజు విడిచి రోజు నీరు సరఫరా అవుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారిగా ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో 32ఎంజీడీ నీరు సరఫరా అవుతోంది. లో ప్రెషర్తో కారణంగా మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. చుక్క నీటికి నిరీక్షించాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ లింగోజిగూడ డివిజన్లోని మజీద్గల్లిలో మురుగు నీరు సరఫరా అవుతోంది. ♦ హయత్నగర్లో కలుషిత నీరు సరఫరా అవుతోంది. సమయపాలన లేకుండా.. కూకట్పల్లి (జోన్బృందం): కూకట్పల్లి సర్కిల్ పరిధిలో కొన్ని బస్తీల్లో సమయపాలన లేకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ నీటి కోసం నిరీక్షిస్తున్నారు. మరి కొన్ని బస్తీల్లో పూర్తిగా నీటి సరఫరా లేకుండా పోయింది. రిజర్వాయర్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాకు కనీసం పైపులైన్లు లేకపోవటం గమనార్హం. ♦ ఆల్విన్కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ, ఎన్టీఆర్నగర్లలో నీటి ట్యాంకు ఉపయోగంలో లేదు. ♦ జేఎన్ఎన్యుఆర్ఎం గృహ సముదాయాల్లో కనీసం నీటి పైపులైన్లు కూడా వేయడం మరిచారు. ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి నీటిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. ♦ వివేకానందనగర్ డివిజన్ రిక్షాపుల్లర్స్ కాలనీలో మురుగు చేరి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ♦ బాలానగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లో నాలుగు నెలల నుంచి మురుగు నీరు సరఫరా అవుతోంది. ♦ మూసాపేట డివిజన్లో అర్ధరాత్రి వేళలో సరఫరా అవుతోంది. ఏళ్లుగా అవే అవస్థలు మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిందిబస్తీ, ఆర్టీసీ కాలనీ, వినాయక్నగర్, ఎన్జీవోస్ కాలనీల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ♦ శామీర్పేట్ మండలంలోని ఉద్దెమర్రి, కేశవరం, లక్ష్మాపూర్, పొన్నాల్, అద్రాస్పల్లి, శామీర్పేట్ గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేదు. జవహర్నగర్లోని శాంతినగర్, అంబేడ్కర్నగర్, గబ్బిలాలపేట్, బీజేఆర్నగర్, మోహన్రావు నగర్, వికలాంగుల కాలనీ, మోహన్రావు నగర్ తదితర కాలనీల్లో నీటి సరఫరా సక్రమంగా లేదు. ♦ కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ గ్రామాల్లో నీటి కొరత నెలకొంది. ఆయా కాలనీవాసులు ప్రైవేటు ట్యాంకర్ల వద్ద నీటిని కొనుగోలు చేస్తున్నారు. ♦ ఘట్కేసర్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో నీటి సరఫరా కావడం లేదు. మెయిన్ రోడ్డులో ఉన్న హోటళ్లకు ఎక్కువ నీరు సరఫరా అవుతోంది. నీటి సరఫరా సమయంలో కొన్ని ఇళ్ల యజమానులు మోటార్లు బిగించడంతో చివరన ఉన్న ఇళ్ల వారికి నీరు సరఫరా కావడం లేదు. -
ప్రకటన సరే..చర్యలేవీ?
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలు తీవ్ర వర్షాభావంతో ఎండిపోయి పెట్టుబడి కూడా తీరక రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఖరీఫ్లో కరువు పీడిత జిల్లాగా ప్రకటిస్తూ 51 మండలాల్లో కరువు నెలకొన్నట్లు తెలిపారు. అయితే జిల్లా యంత్రాంగం 22 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తేల్చారు. రబీలో 51 మండలాలకు 43 మండలాలలో కరువు నెలకొన్నట్లు లెక్కలు కట్టారు.ప్రకటన కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నా ప్రభుత్వ తీరు పరిశీలిస్తే రైతులకు నిరాశ కలుగుతోంది. ప్రకటన వెలువరించాక సాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కలుగకపోవడాన్ని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2015నవంబరు, 2015 మే, 2016 డిసెంబరు నెలల్లో అకాల వర్షాల వల్ల పంటలు పోయాయి. దీనికి సంబంధించి రూ.60.55 ఇన్పుట్ సబ్సిడీ (పంట పెట్టుబడి రాయితీ) ఇంత వరకు ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి ప్రతి రోజు ఏదో ఒక మండలం నుంచి రైతులు అధికారుల వద్దకు రావడం ప్రభుత్వం నుంచి రాగానే మీ ఖాతాలకు పడుతుంది పొండి అని చెప్పగానే ఇంటికి దారి పట్టడం షరామూలుగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా రైతు ఖాతాలకు సొమ్ములు చేరిందిలేదు. సాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కరువు మండలాల్లో రైతులు నష్టపోయిన పంటలకు పరిహారాన్ని చెల్లించడం, ఇతరత్రా సాయం ప్రకటించడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం రైతులు వీటిని అడగకుండా ఉంటే చాలని అనుకుంటోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇన్పుట్ సబ్సిడీ, బీమా సొమ్ములు రైతులకు చెల్లించాలని జిల్లాకు మంగళవారం వస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషనర్ మురళీధరరెడ్డికి రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రూ.115.58 కోట్ల ఇన్ఫుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారో గత ఏడాది ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 51 మండలాల్లో 22 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 393 మిల్లీ మీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 202 మిల్లీమీటర్లు కురిసింది. ఈ సీజన్లో 1,33,556 హెక్టార్ల సాధారణ పంటల సాగు కావాల్సి ఉండగా కేవలం 47,171 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వానలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. వివరాలను సేకరించి పంపితే పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో 22 మండలాల్లో పంటలకు నష్టం జరిగిందని నివేదికలు తయారు చేసి కలెక్టర్ హరికిరణ్ ద్వారా ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ గత ఏడాది నవంబరు నెల 21న పంపింది. రూ.15.58 కోట్ల పెట్టుబడి రాయితీ రైతులు నష్టపోయారని నివేదికల్లో పేర్కొన్నారు. వెంటనే నివేదికలు పంపితే పరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడాన్ని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్తోపాటు 2015 నవంబరు నెలలో అకాల వర్షాల కారణంగా రూ.44 కోట్లు, 2015 మే నెలలో రూ.30 లక్షలు, 2016 డిసెంబర్లో 1.27 లక్షలు నష్టం సంభవించింది. మొన్న రబీలో 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, దనియాలు దెబ్బతిన్నాయి. అయితే పంట దిగుబడులను (క్రాప్ కటింగ్) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టమవుతోంది. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు రూ.100 కోట్లు నేలపాలయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నష్టం సంభవించినా ఇంతవరకు పరిహారం ప్రభుత్వం మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో బీమా నష్టం జరిగిందని జిల్లా నుంచి కాగితాలు పోగానే వెంటనే పరిహారం వచ్చేది. రుణమాఫీ కూడా ఒకేసారి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. నేను ఏటా ఐదు ఎకరాల్లో రబీలో బుడ్డశగన, ప్రొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నాను. 2012 నుంచి ఇప్పటి వరకు బీమా పూర్తి స్థాయి అందుకోలేదు. –సుధాకర్రెడ్డి, రైతు కొత్తపల్లె, పెండ్లిమర్రి మండలం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. బ్యాంకుల్లో అప్పులు చెల్లించలేక తంటాలు పడుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ నాలుగైదు సంవత్సరాలుగా రాలేదు. అయినా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.–సంబటూరు ప్రసాదరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం జిల్లాలో 2012 నుంచి 2018 వరకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సక్రమంగా చెల్లించలేదని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. పట్టించుకోలేదు. జిల్లాలోని రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించి ఏళ్ల తరబడి ఎదురు చూడాలా? ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.–చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం. -
భూగర్భ శోకం
జిల్లాలో వ్యవసాయ బోర్లు దాదాపు 1.75 లక్షలు ఉన్నాయి. భూగర్భజలాలు పడిపోవడం వల్ల ప్రస్తుతం చాలా వరకు ఎత్తిపోయాయి. మంచి వర్షాలు వస్తే గానీ ఇవి రీచార్జ్ అయ్యే పరిస్థితి లేదు. కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల భూగర్భ జలాలు పెరిగినా..అత్యధిక ప్రాంతాల్లో మాత్రం గత ఏడాదితో పోలిస్తే అట్టడుగుకు చేరుకున్నాయి. వెయ్యి అడుగులకు పైగా బోర్లు వేసినా నీటిధార బయటకు రావడం లేదు. జల సంరక్షణ పేరుతో మూడేళ్లుగా ఫాంపాండ్లు, చెక్డ్యాంల మరమ్మతులు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు తదితర పనులను చేపడుతున్నారు. మరోవైపు నీరు–చెట్టు కార్యక్రమం కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇవేవీ భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడలేదు. జల సంరక్షణ పనులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులన్నీ అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లినట్లు విమర్శలున్నాయి. వర్షాభావమే కారణం 2018–19లో నందికొట్కూరు, పాములపాడు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 52 మండలాల్లో వర్షాలు నామమాత్రంగానే కురిశాయి. ఆదోని డివిజన్లో 51 శాతం, కర్నూలు 39 శాతం,నంద్యాల డివిజన్లో 59 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తమ్మీద సాధారణం కంటే 48.3 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. దీనివల్ల చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. వర్షాలు తగ్గిపోవడం, జల సంరక్షణ పనులు అంతంత మాత్రం కావడంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 15తో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో సగటున 3.29 మీటర్ల మేర పడిపోయాయి. గత ఏడాది సగటున 8.86 మీటర్ల లోతులో ఉండగా..ఈసారి 12.15 మీటర్లకు చేరాయి. ఈ మండలాల్లో ఆందోళనకరం 14 మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. హొళగుందలో సగటున 15.02 మీటర్లు, ఆళ్లగడ్డ 17.30, మిడుతూరు 16.35, ఆస్పరి 15.87, కొలిమిగుండ్ల 19.26, రుద్రవరం 17.13, మద్దికెర 20.10, ఓర్వకల్లు 16.80, నందికొట్కూరు 23.55, బేతంచెర్ల 24.13, పాములపాడు 31.30, డోన్ 31.35, ప్యాపిలి 31.40, కోసిగిలో సగటున 32.90 మీటర్ల లోతుకు భూగర్భజలాలు తగ్గిపోయాయి. 147 ఫిజోమీటర్ల ద్వారా పరిశీలన 147 గ్రామాల్లోని బోర్లకు ఫిజో మీటర్లు అమర్చి.. వాటిని ఆన్లైన్తో అనుసంధానం చేశారు. వీటి ద్వారా భూగర్భజలాల పరిస్థితిపై వివరాలు ప్రతి రెండు గంటలకు ఒకసారి సీఎం డ్యాష్ బోర్డుకు చేరతాయి. ఫిజో మీటర్లతో పాటు గత నెల నుంచి మాన్యువల్గానూ భూగర్భజలాల స్థితిని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులు, నీటి పారుదల వసతి ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొంత మేర పెరిగినా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వేగంగా పడిపోతున్నాయి. దీనివల్ల వందలాది గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. 15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. గ్రామాల్లో దాహం దాహం పల్లెల్లో నీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే దాదాపు 90 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 50 గ్రామాలకూ ట్యాంకర్లు పంపాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద 250కు పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కర్నూలు, డోన్, గూడూరు తదితర పట్టణాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మరీ కష్టంగా మారుతోంది. పరిస్థితి ఆందోళనకరం భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హంద్రీ–నీవా, ఇతర నీటిపారుదల వల్ల ఆరు మండలాల్లో మెరుగ్గా ఉన్నా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆందోళనకరమే. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ సారి 3.26 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవిలో తాగునీటి అవసరాలకు మినహా ఇతరత్రా బోర్లు వేయరాదు. – రఘురామ్, డిప్యూటీ డైరెక్టర్,భూగర్భ జలవనరుల శాఖ మండలాల వారీగా భూగర్భజలాల పరిస్థితి 0–8 మీటర్ల లోతులో ఉన్న మండలాలు సి.బెళగల్, కృష్ణగిరి, కర్నూలు, వెలుగోడు, ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, మంత్రాలయం, బండిఆత్మకూరు, గోస్పాడు, కోవెలకుంట్ల, నంద్యాల, అవుకు 8–15 మీటర్లలో.. ఆత్మకూరు, గూడూరు, జూపాడుబంగ్లా, కల్లూరు, కోడుమూరు, కొత్తపల్లి, పగిడ్యాల, వెల్దుర్తి, ఆదోని, గోనెగండ్ల, కౌతాళం, నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, తుగ్గలి, ఎమ్మిగనూరు, బనగానపల్లె, చాగలమర్రి, దొర్నిపాడు, మహానంది, పాణ్యం, సంజామల, ఉయ్యలవాడ, శిరివెళ్ల, గడివేముల 15– 20 మీటర్లలో.. మిడుతూరు, ఓర్వకల్లు, శ్రీశైలం, ఆస్పరి, హొళగుంద, ఆళ్లగడ్డ, రుద్రవరం, కొలిమిగుండ్ల 20 మీటర్ల కంటే లోతులో.. బేతంచెర్ల, నందికొట్కూరు, పాములపాడు, ప్యాపిలి, డోన్, కోసిగి, మద్దికెర -
గుక్కెడు నీటికి.. కడివెడు కష్టాలు
గుక్కెడు నీటికోసం ‘అనంత’ అల్లాడిపోతోంది. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటగా బిందెనీటి కోసం జనం అష్టకష్టాలు పడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలన్నీ దిష్టిబొమ్మలుగా మారగా.. ప్రజలు పనులు మానుకుని నీటియుద్ధాలు చేస్తున్నారు. ఏటా ఇదే సమస్య నెలకొంటున్నా ఉన్నతాధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నం కాగా.. రెండు నెలలుగా పల్లెలు జలం కోసం ఘొల్లుమంటున్నాయి. అనంతపురం, టవర్క్లాక్ : భూగర్భజలం పాతాళంలోకి పడిపోయింది. కరువుకు నిలయమైన ‘అనంత’లో ఏటా అనావృష్టి నెలకొనడంతో జలం...జటిలంగా మారింది. జిల్లాలో 63 మండలాలుండగా.. 1003 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి వేసవిలోనూ పల్లెవాసులు నీటి చుక్కకోసం అష్టకష్టాలు పడుతున్నారు. పాతాళంలో జలం అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, రామగిరి, వజ్రకరూరు, పుట్లూరు. గుత్తి, గుంతకల్లు, కనగానపల్లి మండలాల్లో భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఈ మండలాల్లోని వారంతా వేసవి వచ్చిందంటే తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతారు. బిందె నీటికోసం మండుటెండలో కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా ఇదే సమస్య నెలకొంటున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం చూపని సర్కార్ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో మూడు నియోజకవర్గాలకు తాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. ఆ మేరకు నిధులు విడుదల చేసి పనులు కూడా వేగవంతంగా చేయించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. మరోవైపు వైఎస్సార్ హయాంలోనే రూపుదిద్దుకున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణను టీడీపీ సర్కార్ గాలికొదిలేయడంతో పల్లెలన్నీ గొంతుతడిపే చుక్కనీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా...అవి ఎందుకూ చాలడం లేదని జనం చెబుతున్నారు. పైగా అరకొర నీటి సరఫరా వల్ల నీటికోసం ఘర్షణ పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. డేంజర్ జోన్లో ఉన్న గ్రామాలు భూగర్భజలం పూర్తిగా అడుగంటడంతో జిల్లాలోని 31 గ్రామాలు డేంజర్జోన్లోకి వెళ్లిపోయాయి. అనంతపురం రూరల్ మండలంలోని ఎంబీపల్లి, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రోనిపల్లి, ఎర్రోనిపల్లి తాండకు, గంగినేపల్లి తండా, ఫ్యాదిండి, వెళ్ళుదుర్తి, రామగిరి మండలంలోని గరిమేకపల్లి, కొండాపురం, వజ్రకరూరు మండలంలో కొనకొండ్ల, పుట్టపర్తి మండలంలో సి.వెంగన్నపల్లి, పుట్లూరు, పి.చింతపల్లి, చింతలపల్లి, బాలపురం, ఎం.కాండాపురం, కుండగారికుంట, గోపరాజుపల్లి, చింతకుంట్ల, తుకపల్లి, నాగిరెడ్డిపల్లి, గుత్తి మండలం కె.ఊబిచెర్ల, ఉటకల్లు, బేదపల్లి, ఊబిచెర్ల, జక్కలచెరువు, టి.కొత్తపల్లి, గుంతకల్లు మండలంలో మల్లెనపల్లి, ఎన్.కొట్టాలకు, మొలకలపెంట, కనగానపల్లి మండలంలోని వేపకుంటల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులే చెబుతున్నారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ అరకొర నీటి సరఫరాతో అల్లాడిపోతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతున్నా...అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారని వాపోతున్నారు. -
జల గండం
జిల్లాలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పాలకుల నిర్లక్ష్యంతో ఉన్న నీటి వనరులను అందుబాటులోకి తీసుకురాలేని పరిస్థితి. ఎన్టీఆర్ సుజలం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.2లకే 20 లీటర్ల తాగునీరు ఇస్తామన్న చంద్రబాబు హామీ అటకెక్కింది. ఫలితంగా సామాన్యుడికి తాగునీటి కోసం అదనపు భారం తప్పడం లేదు. సాక్షి, తిరుపతి: జిల్లాలో 1,363 పంచాయతీలు, 11,189 గ్రామాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 1,965 గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అనధికారికంగా చూస్తే ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. అయినా అధికారులు మాత్రం తాగునీటి సమస్య తీవ్రతను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరి, ఏర్పేడు మండలంలోని నల్లపాలెం, చెన్నంపల్లి, పెన్నగడ్డం, పెనుమల్లం గ్రామాల్లో భూగర్భ జలాలు ఉన్నా.. గాజులమండ్యం పారిశ్రామిక వాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా నీరు కలుషితమైంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు ప్రతి రోజూ మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలుచేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగులు, వంకలు, నదుల్లో ఇసుకను విచ్చలవిడిగా తోడెయ్యడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. నిలువెత్తు నిర్లక్ష్యం పాలకులు, అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో అనేక బోర్లు మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయి. నీరు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి. గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకులు ఉన్నా నిరుపయో గంగా దర్శనమిస్తున్నాయి. వాటికి నీటిని సరఫరా చేయాల్సిన బోర్లు పనిచెయ్యకపోవడంతో ట్యాంకులు దిష్టిబొమ్మలా మారాయి. 1,965 గ్రామాలకు 1,641 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం మూడు నెలల కాలంలో రూ.6 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ గ్రామాల్లో కేవలం 25శాతం కుటుంబాలకు మాత్రమే నీరు అందుతోందని, మిగిలిన 75శాతం మంది కుటుంబాలకు నీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం..ప్రైవేటు ట్యాంకర్లకు కాసుల వర్షం కాలువలు, ప్రాజెక్టులు పూర్తి చేసి తాగునీటి సమస్య తీరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తుంటారు. హంద్రీ–నీవా కాలువకు నీరు ఇచ్చినా ఆ నీరు కేవలం కాలువ సాగడానికే సరిపోయాయి. ఐదేళ్ల కాలంలో పూర్తిచేసే అవకాశం ఉన్నా.. గాలేరు–నగరి పూర్తి చెయ్యలేదు. బాలాజీ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి కాలువలు పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులకు నీటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిని తోడుకుని అమ్ముకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. డబ్బాల్లో మురుగు నీళ్లు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నీటిని విక్రయిస్తున్నారు. పేరుకు మినరల్ వాటర్ ఆ నీరు తాగితో గొంతు నొప్పి.. జలుబు వంటి రోగాలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రకరకాల పేర్లతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వాటర్ ప్లాంట్ల యాజమాన్యం వద్ద నెలనెలా మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారు. మొత్తంగా జనం మంచినీటి సమస్యతో సతమతమవుతున్నా అటు పాలకులు.. ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం. -
పల్లెల్లో భగీరథ ప్రయత్నం
మెదక్ రూరల్: పల్లెల్లో తాగునీటి గోసను అధిగమించేందుకు గ్రామ సర్పంచ్లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నీటి సమస్యలు తలెత్తనీయకుండా జవాబుదారితనంగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు పల్లెల్లో కొనసాగుతున్న ప్రయత్నాల పై కథనం.. మెదక్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ వైపు భానుడి భగభగలు మరోవైపు నీటి కోసం తంటాలు పడటం ప్రజలకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ట్యాంకులను ఏర్పాటుచేసింది. పల్లెల్లో సింగూరు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాని కాలం కరుణించక ఈ సారి వర్షాలు సరిగ్గా కురువలేదు. దీంతో భూగర్భజలాల అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోయాయి. నీటి మట్టం అందనంత కిందికి పడిపోయింది. ప్రభుత్వ, ప్రవేట్ బోర్లు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో పల్లెల్లో నీటి కష్టాలు ప్రారంభమవుతున్న తరుణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అధికారుల సహకారంతో నీటి సమస్యను అధిగమించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటేసిన ప్రజలకు నీటి సమస్య తలెత్తనీయకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ప్రజలు నీటికోసం రోడ్డెక్కకుండా చర్యలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అందరికీ అందాలనే ఉద్ధేశ్యంతో పలు చోట్ల అవగాహన లేమితో కొందరు తొలగించిన చెర్రలను తిరిగి వేయింస్తున్నారు. దీంతో నీరు అందరికి సమానంగా వెళ్తాయి. అలాగే పాడయిన బోర్లను ఫ్లష్షింగ్ చేయించడం, అద్దెకు బోర్లు తీసుకోవడం, లీకేజీలను అరికట్టడం, కట్వాల్స్ ఏర్పాటు చేసి నీటినివిడుదల చేయడం వంటి ప్రయత్నాలను చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తనీయకుండా సర్పంచ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తుండటం పట్ల పలువరు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నాము. ఇప్పటికే రెండు బోర్లను అద్దెకు తీసుకోగా, ఇటీవల ఒక బోర్ను వేశాము. నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు చేపడుతున్నాము. గ్రామస్తులందరికీ నీటిని సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పైప్లైన్ కలిపాము. నీటి కోసం గ్రామస్తులు రోడ్డు పైకి రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాము. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. – దొడ్లె లక్ష్మి, సర్పంచ్, తిమ్మానగర్ నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు.. వేసవిలో నీటి సమస్యను అధిగమించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాము. పాడయిన బోర్లను ఫ్లష్షింగ్ చేయించాము. తొలగించిన మిషన్ భగీరథ చెర్రలను వేయించి నీటిని కంట్రోల్ చేశాము. దీంతో రెండు రోజులకోసారి మిషన్ భగీరథ నీళ్ళు అందరికి సమానంగా వస్తున్నాయి. కట్వాల్స్ ఏర్పాటు చేశాము. అద్దెకు ఓ బోరును మాట్లాడిపెట్టాము. అదనంగా పైప్లను సైతం వేయడం జరిగింది. నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకుంటున్నాము. – సరోజ, సర్పంచ్, మల్కాపూర్ -
అప్పుడు స్వర్ణయుగం.. ఇప్పుడు సర్వం నాశనం..!
సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మహానేత వైఎస్సార్ పాలన ఓ స్వర్ణయుగం..అడిగిన వాడికి..అడగని వాడికి లేదనకుండా పెట్టిన చేయ్యి అది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కోట్ల రూపాయలను ఖర్చు చేసి మహానేత వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మహానేత హయాంలో మర్రిపూడి, సీఎస్పురం, పామూరు, కనిగిరి, పెదచెర్లోపల్లి, వెలిగండ్ల మండలాల్లో తాగునీటి ఇక్కట్లు తీర్చేందుకు రూ.91 కోట్లతో పథకాన్ని రూపొందించి ప్రజల దాహార్తి తీరిస్తే.. ప్రస్తుత పాలకులు ఆ పథకాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా ఈ మండలాల పరిధిలోని గ్రామాలన్నీ దాహార్తితో అలమటిస్తున్నాయి. తాగునీటి కోసం ప్రజలు గొంతెతున్నా వారి గోడు ఆలకించే ప్రజాప్రతినిధులు, అధికారులు కరువవుతున్నారు. తాగునీటికి నిత్యం ఎన్ని తిప్పలో.. రామతీర్థం జలాలు అందకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధర వెచ్చించి బబుల్ నీరుకొనుగోలుచేయాల్సివస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఆ బబుల్ వాటర్ అందుబాటులో లేని వారు పీపాలు, బిందెలు పట్టుకొని ట్రాక్టర్ల సాయంతో పొలాల్లో ఉన్న బోర్ల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరికొందరు ద్విచక్రవాహనాలపై దూర ప్రాంతాలకు వెళ్లి తాగునీటికి తంటాలుపడుతున్నారు. వేసవి నేపథ్యంలో అధికారులు ట్యాంకర్ల సాయంతోనేనైనా గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు. పథకం లక్ష్యం..పక్కదారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పథకంలోభాగంగా ఏర్పాటు చేసిన పైపులు నిత్యం లీకులు కావడంతో నీరు కలుషితమై సక్రమంగా సరఫరా కాలేదు. దీనికి తోడు స్కీం నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనికి తోడు స్కీం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో వారు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నారు. మండలంలోని వల్లాయపాలెం, మర్రిపూడి, తదితర గ్రామ శివారుల్లో డీఆర్పీ 600 పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతున్నాయి. అలాగే గుండ్లసముద్రం, గంగపాలెం, కూచిపూడి తదితర గ్రామాల్లో పైపులు లీకై నీరు కలుషితం కావడం నిత్యకృత్యమైంది. దీంతో ఆ పథకం పరిధిలో 241 గ్రామాలకు రామతీర్థం నీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. రామతీర్థం రిజర్వాయర్ నుంచి రూ.91 కోట్లతో.. వైఎస్ హయాంలో మర్రిపూడిలో నిర్మించిన తాగునీటి పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో రూ.91 కోట్లు వెచ్చించి రామతీర్ధం రిజర్వాయర్ నుంచి మర్రిపూడి, సీఎస్పురం, పామూరు, కనిగిరి, పెదచెర్లోపల్లి, వెలిగండ్ల మండలాలకు పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. అందులో భాగంగా రూ. 5 కోట్లు వెచ్చించి మర్రిపూడి గ్రామశివారులో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రెండు లక్షల లీటర్లు శుద్ధిచేసి మండలంలోని 33 గ్రామాలకు తాగునీరు అందించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. ఆయన అకాల మరణం తరువాత ఈ పథకానికి నిర్లక్ష్యపు జబ్బు సోకింది. వైఎస్ అకాల మరణం తర్వాత అప్పటి నీటిపారుదల శాఖమంత్రి పిన్నమనేని వెంకటేశ్వర్లు మర్రిపూడిలో తాగునీటి పథకాన్ని ప్రారంబించారు. తాగునీటి పథకం ఫేస్ 1 కింద కనిగిరి, పీసీపల్లి, మర్రిపూడి మండలాలల్లోని 139 గ్రామాలకు, ఫేస్ 2 కింద వెలిగండ్ల, పామూరు మండలాలలోని 102 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే ఆ తరువాత పాలకులు పథకంపై పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. -
నెరవేరని హామీ.. తీరని దాహార్తి
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వవ్వేరు పైలెట్ ప్రాజెక్ట్ను మంజూరు చేశారు. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టడంతో మూణ్ణాళ్లకే పైపులైన్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2015 మార్చి 3న మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి ప్రజాప్రతినిధులు సమస్యను తీసుకెళ్లగా, వారం రోజుల్లోగా మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ప్రజల దాహార్తి తీరలేదు. మండలంలోని అన్ని పంచాయతీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏడేళ్ల క్రితం రూ.3.75 కోట్లతో జొన్నవాడ వద్ద పెన్నానదిలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించి నివేదికలు పంపారు. ఆ తరువాత ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. వవ్వేరు వద్ద రూ.2.5 కోట్లతో ప్రాజెక్ట్ను నిర్మించి కనిగిరి రిజర్వాయర్ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. కనిగిరి రిజర్వాయర్ నీటిని శుద్ధిచేసి పైప్లైన్ ద్వారా ట్యాంకులకు అందించి సరఫరా చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాసిరకంగా పైప్లైన్ నిర్మాణం పైలెట్ ప్రాజెక్ట్ను దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నాసిరకంగా చేశారు. ప్రాజెక్ట్ నుంచి వాటర్ట్యాంకులకు నీటిని సరఫరా చేసే పైపులైన్కు నాసిరకమైనవి వేశారు.దీనికితోడు భూమిలో రెండు అడుగుల లోతులో మాత్రమే పైప్లను అమర్చారు. దీంతో పైపులైన్లు తరచూ పగిలిపోతూ పైలెట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. దాహం..దాహం వేసవిలో మండల ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మేజర్ పంచాయతీతో పాటు నాగాయగుంట, మునులపూడి, కట్టుబడిపాళెం, పెనుబల్లి, కాళయకాగొల్లు, మినగల్లు, జొన్నవాడ, తదితర గ్రామాల్లో తాగునీరు అందడం కష్టంగా మారుతోంది. దీంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారం శూన్యం 2015 మార్చి 3న జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి పైలెట్ ప్రాజెక్టు సమస్యను ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు తీసుకొచ్చారు. వేసవిలో దాహార్తిని తీర్చడమే లక్ష్యమని చెప్పే మీరు, నిరుపయోగంగా ఉన్న పైలెట్ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్పందించిన పోలంరెడ్డి మాట్లాడుతూ వారంలోగా ప్రాజెక్ట్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో పైలెట్ ప్రాజెక్ట్ పూర్తిగా వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి అల్లాడుతున్నాం పైలెట్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు ట్యాంకులకు అందడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. మెయింట్నెన్స్ కింద లక్షలు విడుదలవుతున్నా ప్రజలకు మాత్రం తాగునీరు అందడం లేదు. – ఈదూరు నరేంద్రబాబు, కట్టుబడిపాళెం మాటలు తప్ప చేతలేవీ నేతలు, అధికారులు మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా పైలెట్ ప్రాజెక్ట్ నీటిని అందిస్తామని చెబుతూ ఉన్నారు..వింటూనే ఉన్నాం. ప్రతి వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఫలితం లేదు. – చంద్రగిరి రాజశేఖర్, నాగాయగుంట సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం పైలెట్ ప్రాజెక్టు పరిస్థితిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతాం. పైప్లైన్లు మరమ్మతులకు గురైన విషయం నా దృష్టికి వచ్చింది. మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. –డీవీ.నరసింహారావు, ఎంపీడీఓ -
సమస్యలు ఫుల్.. సౌకర్యాలు నిల్
సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): అభివృద్ధి అనేది ఆ కాలనీలో బూతద్దం వేసి వెతికినా కనిపించదు. నాలుగు తాటాకులతో వేసిన చిన్న చిన్న పూరి గుడిసెలు, ఏళ్ల తరబడి పూడుపోయిన మురుగు కాలువలు, మంచినీటి కోసం కిలోమీటర్ దూరం ప్రయాణం..ఇదీ ఊళ్లపాలెం ఎస్టీ కాలనీ దుస్థితి. ఏళ్ల తరబడి కనీస వసతులు కరువై కాలనీవాసులు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. మౌలిక వసతులు మృగ్యం.. ఎస్టీ కాలనీలో సుమారు 100 వరకు పక్కా గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఎస్టీలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వీరికి చదువు లేకపోవడంతో పాటు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కాక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదు. వీరు కూలినాలి చేసుకుని జీవిస్తుంటారు. తాగునీటికి తిప్పలు కాలనీవాసులు తీవ్ర తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి సుమారు అరకిలోమీటర్ దూరంలోని కొత్తపాలెం ఎన్టీఆర్ సుజల వాటర్ప్లాంట్ నుంచి 20 లీటర్ల క్యాన్ రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాడుకనీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నాలుగురోజులకు ఒకసారి మాత్రమే కుళాయిల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కాలనీకి మాత్రం ట్యాంకర్లు సక్రమంగా రావడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని మురుగుకాలువలను ఏళ్ల తరబడి పూడిక తీయలేదు. దీంతో మురుగునీరు పారే అవకాశం లేకుండా పోయింది. పూరి గుడిసెలే శరణ్యం.. బేస్మెంట్ దశలో నిలిచిపోయిన పక్కా గృహం కాలనీవాసులకు గతంలో సునామీ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్కా గృహాలు నిర్మించారు. ఇంకా చాలా మంది నేటికి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇటీవల సుమారు 30 మందికి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.2.25 లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే వీరికి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరికి ఇళ్లు కట్టిస్తానని ముందుకు వచ్చి కొంతమందికి పునాదుల కోసం గుంటలు తవ్వి వదిలేయగా, మరి కొంతమందికి బేస్మెంటు వేసి వదిలేశారు. అదేమంటే ఇటుకరాయి కావాలి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంతమొత్తం ఇచ్చుకునే స్థోమత లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని కాలనీవాసులు వాపోయారు. మరి కొంతమంది అయితే నివాసముంటున్న పూరి గుడిసె పూర్తిగా దెబ్బతినడంతో గత్యంతరం లేక స్వచ్ఛభారత్ కింద నిర్మించిన మరుగుదొడ్లలో నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనూ సమస్యలే కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు వాడుకనీటి కోసం నాలుగురోజులకు ఒకసారి వచ్చే రక్షితమంచినీటి పథకం కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలో బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చి కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
ఇంటింటి కుళాయి ఇంతేనా?
ఏటా జనాభా పెరుగుతున్నారు. నివాసాలు విస్తరిస్తున్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొత్త పథకాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రకటనలు... అనవసర సమావేశాల ఆర్భాటాలు... ఏమీ ఇవ్వకపోయినా.. ఏదో ఇచ్చామని నమ్మించే ప్రయత్నాలు... ఇవి తప్ప జనం బాధలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదు. వేసవి వచ్చిందంటే చాలు... జలజగడాలు పెరిగిపోతున్నాయి. నీటికోసం కిలోమీటర్ల దూరం ప్రయాణాలు తప్పనిసరిగా మారుతోంది. ఇదేదో కొండల్లోనో... గిరిజన ప్రాంతాల్లోనో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మైదాన ప్రాంతాల్లోనూ ఈ సమస్యలు తప్పడం లేదు. విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): వేసవి కాలం ముంచుకొస్తోంది. అప్పుడే పల్లెల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తాగునీటికోసం జనం అల్లాడిపోతున్నారు. అయినా ఇవేవీ పాలకులకు పట్టడం లేదు. అదనపు రక్షిత మంచినీటి పథకాలు మంజూరు చేసి ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పిన పాలకులు దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితం... పథకం లేని గ్రామాలు,ప్రజలు ఎక్కువగా ఉన్న చోట మొక్కుబడి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీరు చాలక నానా ఇబ్బందులు పడుతున్నారు. అదనపు పథకాల ఊసే మరిచారు పాలకుల ఆదేశాలతో అధికారులు జిల్లా వ్యాప్తం గా రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా ఎస్కోట, గజపతినగరం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాలకు మాత్రమే అదనపు రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.300 కోట్లు మంజూరయినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మంజూరు చేయకపోగా... మంజూరైన నియోజకవర్గాలలో ప««థకాల నిర్మాణానికి ఇప్పటికీ టెండర్లు పిలవలేదంటే దీనిపై ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది. అదనపు రక్షితమంచినీటి పథకాలు మంజూరైతే ఇంటింటి కుళాయి వస్తుందని, తాగునీటికి ఇబ్బం ది తీరిపోతుందని కలలు గన్న ప్రజల ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలకు అధి కారులు సుమారుగా రూ.120 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి పం పారు. ఏళ్లు గడుస్తున్నా అవి కాగితాలకే పరి మితమయ్యాయి. నియోజకవర్గానికి ప్రాతిని« ద్యం వహిస్తున్నది సాక్షాత్తూ మంత్రి సుజ య్కృష్ణ రంగారావు అయినా ఇక్కడి ప్రజల కు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సమావేశాల్లో అధికారులు ఏ సమస్యలూ లేవని చెప్తే అదే నిజమనుకుంటున్నారు తప్ప... క్షేత్రస్థాయిలో మహిళలు పడుతున్న అవస్థలేమీ పట్టించుకోవడం లేదు. ఊటనీటితో అనారోగ్యం పలు గ్రామాలు నదికి ఆనుకుని ఉన్నాయి. అక్కడివారు చెలమల్లో నీటిని తోడుకుని తెచ్చుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇదెంతవరకు సురక్షితమో అధికారులే చెప్పాలి. ఊట నీటితో రోగాలు విస్తరిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా వాటిని పెడచెవిన పెట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆ నీటినే తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి పల్లెల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామీణులు కోరుతున్నారు. నీటి సమస్య పట్టించుకోవట్లేదు మా గ్రామంలో మంచి నీటి పథకం పనులు ప్రారంభించి రెండేళ్లు అయింది. ఏదో పూర్తి చేశారంటే నీటిని మాత్రం సరఫరా చేయలేదు. తాగునీటికి నానా అవస్థలు పడుతున్నాం. మా గ్రామ సమీపంలో ఉన్న నర్సరీ యజమానులను బతిమలాడి మంచి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. పాలకులు కనీసం పట్టించుకోవడంలేదు.– ఐ.కళావతి, పాడివానివలస, రామభద్రపురం మండలం -
అప్పుడే నీటి కటకట..!
సాక్షి, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావపరిస్థితులతో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. అదేవిధంగా సాగునీరు అందక రైతులు పంటల సాగును తగ్గించారు. సాగుచేసిన పంటలకు కూడా సరిపడా నీరందని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. జిల్లాలో కేవలం బోర్లు, విద్యుత్ మోటార్ల కిందనే రబీ పంటలు సాగు చేపట్టారు. భూగర్భజలాలు అడుగంటడంతో పంటలకు సరిపడా నీరు అందటం లేదు. అదేవిధంగా వలస ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడింది. మారుమూల గ్రామాల ప్రజలు సమీపంలోని వాగులు, వంకలు ఎండిపోవటంతో అక్కడే లోతుగా చెలిమలు తీసి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితులుంటే మే నెలలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళనలో ప్రజలున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భూగర్భ జలాల క్షీణత గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి . జిల్లాలో భూగర్భ జలాల క్షీణత రోజురోజుకు ఎక్కువవుతుది. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో భూగర్భజలాల వినియోగం ఎక్కువైంది. రబీలో సాగుచేసిన పంటలకు నిరంతర ఉచిత విద్యుత్తో సాగునీరు అందిస్తున్నారు. దీంతో భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బోర్లలో నీరు రానటువంటి పరిస్థితులున్నాయి. గుండాల, పినపాక, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. రబీలో సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతుంది. వరిపంటకు నీటి ఎద్దడి తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేతకు అలమటిస్తున్న పశువులు వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు తగ్గిపోవటంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఒక ఎకరం మాగాణిలో వరిగడ్డి రూ.8 వేలు పలికింది. ఎండుగడ్డి కొరతతో పాటు పశువులు పొలాలకు వెళ్లి మేసేందుకు ఎక్కడా మేతలేదు. మేతకు వెళ్లిన పశువులు కనీసం తాగేందుకు వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. ఒక పశువు మేతకు రోజుకు యాభై నుంచి వంద రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులకు పశుపోషణ భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. మండుతున్న ఎండలు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మిషన్ భగీరథ పనులు పూర్తికాకపోవటంతో తాగునీటికి గ్రామాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. తాగు, సాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవసరముంది. అదేవిధంగా పశుగ్రాసం కొరతను నివారించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పశువుల మేత, దాణా అందించాలని రైతులు కోరుతున్నారు. -
గ్రామాల్లో దాహం కేకలు
సీతానగరం: మండలంలోని సువర్ణముఖీనదిపై బగ్గందొరవలస మంచినీటి పథకం పాడవ్వడంతో పలు గ్రామాల ప్రజలు పది రోజులుగా అవస్థలు పడుతున్నారు. బగ్గందొరవలస వద్ద 2007లో రూ. 7 కోట్ల వ్యయంతో 38 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేవిధంగా పైలెట్ ప్రాజెక్ట్ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే రెండు విడతలుగా పథకాన్ని నిర్మించాలని ఉన్నతాధికారులు భావించారు. మొదటి విడతగా 24 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడానికి వీలుగా బగ్గందొరవలస వద్ద ట్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు బగ్గందొరవలస నుంచి బగ్గందొరవలస, బీకే పురం, తామరఖండి, కాశీపేట, బక్కుపేట, అంటిపేట మీదుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చయ్యపేట వరకు.. చినబోగిలి జంక్షన్ నుంచి అనంతరాయుడుపేట, ఏగోటివలస, దయానిధిపురం, పీబీపేట గ్రామాల మీదుగా 12 కిలోమీటర్ల దూరాన ఉన్న జయంతిరాయపురం వరకు.. కాశీపేట జంక్షన్ నుంచి పణుకుపేట, రంగంపేట, 5 కిలోమీటర్ల దూరాన ఉన్న కె. సీతారాపురం వరకు.. అలాగే అంటిపేట నుంచి వెంకటాపురం మీదుగా వీబీపేట వరకు పైప్లైన్లు అమర్చారు. ఆయా గ్రామాల శివారుల్లో ఓవర్హెడ్ ట్యాంక్లు రూ. 3. 5 కోట్ల వ్యయంతో 2009 ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేసి 24 గ్రామాలకు తాగునీరు సరఫరా చేశారు. మరో ఐదు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నా సరఫరా కాలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి 19 గ్రామాలకు తాగునీరు తాగునీరు సరఫరా చేయాలని నిర్ధారించి పనులు చేపట్టారు. అప్పటినుంచి అరకొర నీటి సరఫరే తప్ప పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. ప్రస్తుతం మంచినీటి పథకం పాడవ్వడంతో బగ్గందొరవలస, బీకేపురం, తామరఖండి, కాశీపేట, బక్కుపేట, అంటిపేట, లచ్చయ్యపేట, చినబోగిలి, అనంతరాయుడుపేట, ఏగోటివలస, తదితర గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆ సంఘటన మరువలేం.. పైలెట్ ప్రాజెక్ట్ పథకం నీటి నుంచి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో 2014లో గ్రామ శివారున ఉన్న చెరువు నీరు తాగాల్సి వచ్చింది. ఆ సమయంలో చెరువు నీరు కలుషితం కావడంతో ఐదుగురు మృతి చెందారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకముందే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి.– పి. నాగభూషణరావు, మాజీ సర్పంచ్, అంటిపేట తప్పని ఇక్కట్లు మాగ్రామంలో ఉన్న బోర్లలో నీరు లభ్యత తక్కువ. దీంతో అంద రం బగ్గందొరవలస మంచినీటి పథకంపైనే ఆధారపడుతున్నాం. పది రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. విషయాన్ని అధికారులకు తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – వై. సత్యనారాయణ, రైతు, ఏగోటివలస -
నీళ్లో.. ప్రభాకరా!
నగరవాసి గొంతెండుతోంది.. నాలుగు బిందెల నీటికి నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడో మే నెలలో తలెత్తే నీటి ఎద్దడి ఈ సారి మార్చిలోనే చుట్టుముట్టింది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో జనం ‘చుక్కలు’ చూస్తున్నారు. రెండు రోజులకోసారి నీరు సరఫరా చేయడం.. అదీ అరగంటే కావడంతో నగరం లోని చాలా ప్రాంతాల్లో తాగునీటికోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా.. అవి అందరికీ సరిపడక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అనంతపురం న్యూసిటీ: నగరానికి తాగునీటి సమస్య తలెత్తకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లోనే రూ.67 కోట్లతో పీఏబీఆర్ పైప్లైన్ ఏర్పాటు చేశారు. 2.50 లక్షల పైచిలుకు జనమున్న ‘అనంత’కు రాబోయే 50 ఏళ్ల వరకు ఎలాంటి నీటి సమస్య రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటి పాలకులు నిర్లక్ష్యం..అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ప్రజలకు గుక్కెడు నీరందక అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండురోజులకోసారి వచ్చే నీరు సైతం సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా రూ.2 కోట్ల ఖర్చు చేసినా.. నగరానికి నీటి సరఫరా చేసేందుకు నగరపాలక సంస్థ ఏటా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. నగరంలో పైప్లైన్ నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రతినెలా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు. కనీసం చెడిపోయిన బోర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం లేదు. అందువల్లే పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులు మాత్రం రూ.వందల కోట్ల అభివృద్ధి చేశామని, ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్ల నీటిని అందిస్తున్నామని చెబుతున్నా... అది కాగితాలకే పరిమితమవుతోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మేలుకోకపోతే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. అదే జరిగితే జనం మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తాగునీరు కొనాల్సిందే నగరంలో 50 డివిజన్లు ఉండగా...అధిక సంఖ్యలోని ప్రజలు తాగునీటిని (మినరల్ వాటర్) కొనుగోలు చేస్తున్నారు. బిందె రూ 7, క్యాన్ రూ 10 చొప్పున వెచ్చించి కొంటున్నారు. నగరపాలక సంస్థ తాగునీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతోనే మినరల్ వాటర్ కొనాల్సి వస్తోందని చెబుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా నీరు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నా... చాలా ప్రాంతాల వారు నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. మంగళవారి కాలనీ, పాతూరు, ఆస్పత్రి వెనుకవైపు కొట్టాలు, కొవూర్నగర్, లక్ష్మీనగర్, ఎర్రనేలకొట్టాలు, మురికివాడలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు సాక్షాత్తు నగరపాలక సంస్థలోని నీటి సరఫరా అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు. చాలా ప్రాంతాలకు అరగంట మాత్రమే నీరు సరఫరా చేస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నగరంలో నీటి వ్యాపారం జోరందుకుంది. ప్రచార ఆర్భాటమే ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ప్రచార ఆర్భాటాలకే సమయం కేటాయిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పితే...జనానికి సరిపడా నీరందించలేని పరిస్థితిలో ఉన్నారు. సాక్షాత్తూ మేయర్ స్వరూప ప్రాతినిథ్యం వహిస్తున్న 20వ డివిజన్లోని మిస్సమ్మ కాలనీలోనే నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో ఉండే మంగళవారి కాలనీలో నీటి ఎద్దడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రజాప్రతినిధులకు ఇవేమీ పట్టడం లేదు. కెనాల్కు వెళ్లి తెచ్చుకున్నాం ఈమె పేరు రత్న. 9వ డివిజన్ భవానీనగర్లో ఉంటోంది. నగరపాలక సంస్థ నీరు సరఫరా చేయకపోవడంతో నీటిని కొనుగోలు చేసి తీసుకెళ్తోంది. రెండ్రోజులకోసారి కూడా నీళ్లు సరిగా సరఫరా చేయడం లేదని... ఇక తాగునీటి కష్టాలు చెప్పుకుంటే తీరేవి కావంటోంది. నీళ్లు రాక కెనాల్కు వెళ్లి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎగబడతారని, మూడేళ్లుగా నీరు సరిగా రాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సారి ఓట్లడిగేందుకొస్తే అప్పుడు చెబుతానని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాలు మున్నానగర్, రాణినగర్, బాపనవీధి, ఆసార్ వీధి, రాజమ్మ కాలనీ, వినాయకనగర్, ఉమానగర్, మంగళవారి కాలనీ, భవానీనగర్, భాగ్యనగర్, నీరుగంటి వీధి, అశోక్నగర్, బాలకృష్ణ కొట్టాలు, ప్రకాష్రోడ్డు, మల్లీశ్వరి రోడ్డు, హరిజన వాడ, కొవూర్నగర్, లక్ష్మీనగర్, 5, 6 రోడ్లలోని ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. అది కూడా అంతంతమాత్రమే కావడంతో జనం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తోడేస్తున్నారు..
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): జిల్లాకు సాగు నీటి గండం వచ్చింది. అవసరానికి మించి నీటిని తోడేస్తుండడంతోనే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన సాగు నీటి కొరత ఫిబ్రవరి చివరి నుంచే మొదలైంది. ఇప్పటికే వ్యవసాయ, బోరుబావుల్లో గణనీయంగా నీటి మట్టం తగ్గిపోయింది. ఏడు మండలాల్లో బోరుబావుల తవ్వకాలతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోవు రోజుల్లో పరిస్థితి మరింత జఠిలంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 28,000 వ్యవసాయ బోరుబావులు, 32,000 వ్యవసాయ బావులున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 24,768 హెక్టార్లు ఉండగా యాసంగిలో 23,728 హెక్టర్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 12,605 హెక్టార్లు, మొక్కజొన్న 9986 హెక్టార్లు, వేరుశనగ 553 హెక్టార్లరు. రైతులు ప్రధానంగా యాసంగిలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిరంతర ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సాగు నీటి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వర్షం నీటిని నిల్వ ఉంచకపోవడంతో కొరత ఏర్పడుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల మందుగానే సాగు నీటి సమస్య మొదలైంది. యాసంగిలో వేసిన పంటను కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేయించడంతోపాటు వ్యవసాయ బావులు తవ్విస్తున్నారు. పలు గ్రామాల్లో 600 ఫీట్ల వరకు బోరు వేసినా నీటి జాడ కనిపించడంలేదు. దీనిని బట్టి పరిస్థితి నీటి వినియోగం ఎమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా నీటి వినియోగం చేసే గ్రామాలు జిల్లాలో అత్యధికంగా సాగు నీటిని వినియోగి స్తున్న గ్రామాలను అధికారులు గుర్తించారు. అందులో భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగపూర్, భీమదేవరపల్లి, కొప్పుర్, కొత్తకొండ, మల్లారం, మాణిక్యాపూర్, ముల్కనూర్, ముస్తఫా పూర్, ముత్తారం, ధర్మసాగర్ మండలంలో జానకిపురం, మల్లక్కపల్లి, నారాయణగిరి, ఎల్కతుర్తి మండలంలో బావుపేట, దండెపల్లి, జీల్గుల, పెంచికల్పేట, తిమ్మాపూర్, వల్భాపూర్, హసన్పర్తి మండలంలో దేవన్నపేట, జయగిరి, లక్నవ రం, పెంబర్తి, ఐనవోలు మండలంలో గర్మిల్లపల్లి, ఐనవోలు, పంతని, పున్నేల, సింగారం, కమలా పూర్ మండలంలో భీంపల్లి, దేశరాజుపల్లి, గూనిపర్తి, ఖాజిపేట మండలంలో మడికొండ, తరాలపల్లి, ఖిలా వరంగల్ మండలంలో గాదేపల్లి, స్తంభంపల్లి, వసంతాపూర్, వేలేరు మండలం లో మల్లికుదుర్ల, వేలేరు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే తగ్గిన నీటి మట్టం జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో భూగర్భజల నీటి మట్టం 8.33 మీటర్లు ఉండగా ఈ ఏడాది 9.52 మీటర్లకు చేరింది. గతేడాదితో పోల్చుకుంటే 1.19 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటికే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తుండగా ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. దీంతో సాగు నీరు విషయం పక్కనబెటితే తాగు నీటికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పెలా లేవు. పైలెట్ ప్రాజెక్టుగా భీమదేవరపల్లి భూగర్జ జలాలను పెంపొందిచడంలో భాగంగా భీమదేవరపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. ఇందులో కొప్పుర్, గట్లనర్సింగపూర్, కొత్తకొండ, ముల్కనూర్, ముస్తఫాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో చెక్ డ్యాంలు, చెరువుల్లో కృత్రిమ ఇంకుడు బోరుబావులను నిర్మించనున్నారు. 150 ఫీట్ల వరకు బోరుబావులను తవ్వనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఖరీఫ్లో సాగు నీరు అధికం కావడానికి ఈ కృత్రిమ ఇంకుడు బోరుబావులు ఉపయోగపడునున్నాయి. ఒక్కో కృత్రిమ ఇంకుడు బోరుబావి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి ఎక్కడ కృత్రిమ ఇంకుడు బోరుబావుల తవ్వకం చేపట్టాలనే అంశంపై తీర్మానాలు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కొత్తకొండలో సమావేశం నిర్వహించారు. నూతన బోర్లు, బావులకు చెక్.. భూగర్జ జలాలు తగ్గిపోతుండడంతో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 37 గ్రామాలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ యా గ్రామాల్లో నూతనంగా బోరులు వేయొద్దని, బావుల తవ్వకం చేపట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వేసినట్లైతే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు సైతం విధించనున్నారు. -
గంగ.. బెంగ
రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భ జలమట్టాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే గ్రామాల్లో తాగునీటి కష్టాలు ఆరంభమయ్యాయి. సాగునీటి సంగతి దేవుడెరుగు గాని కనీసం గుక్కెడు తాగునీరు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి, వికారాబాద్:వరుసగా రెండేళ్లుగా వరుణుడు ముఖం చాటేయడంతో చెరువులు, కుంటల్లో నీరు రాలేని దుస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కరువు భయం జనాన్ని పట్టిపీడిస్తోంది. అదేవిధంగా జిల్లాలో భూగర్భ జలమట్టాలు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. ఈ సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు కేవలం 475 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. సుమారుగా 40 శాతం తక్కువ వర్షం కురిసింది. గత సంవత్సరం కంటే ఈ సీజన్లో సుమారుగా 6 మీటర్ల లోతుకు (18 అడుగులు) పైగా భూగర్భజలాలు పాతాళానికి వెళ్లాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 1నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తోంది. దీంతో రైతులు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్ పంపుసెట్లను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో భౌగోళిక పరిస్థితుల ప్రకారం వర్షాకాలంలో సగటున 6 మీటర్లు, వేసవిలో 12 మీటర్లలోపు భూగర్భ నీటి మట్టాలు ఉండాలి. అయితే, ప్రస్తుతం సగటున 40 మీటర్లకుపైగా పడిపోయా యి. ఇక ఎండల తీవ్రత పెరిగితే ఏప్రిల్, మే నెలలో గంగమ్మ మరింత లోపలికి వెళ్లిపోతుందేమోనని రైతులు ఆందోళనచెందుతున్నారు. నెలనెలా లోలోపలికి.. జిల్లాలోని భూగర్భ జలశాఖ ప్రతినెలా నీటి మట్టాలను నమోదు చేస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే నీటి మట్టాలు ప్రతినెలా పడిపోతున్నాయి తప్పా ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవు. జిల్లాలోని 18 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 4 మండలాల్లో 40 మీటర్ల లోతులో, మరో 7 మండలాల్లో 20 మీటర్ల కంటే లోతులో భూగర్భ జలాల లభ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మరో 6 మండలాల్లో నీటి లభ్యత 18 మీటర్ల లోతుల్లో ఉంది. ఈ లెక్కల ప్రకారం రానున్న సమీప రోజుల్లో నీటికి కటకట తప్పదేమోననే భావన కలుగుతోంది. గతేడాది జనవరిలో జిల్లాలో సాధారణంగా నీటి లభ్యత 11 మీటర్లలోతులో ఉండగా, ప్రస్తుతం అది 40 మీటర్లకు పైగానే చేరుకుంది. అంటే సుమారుగా 29 మీటర్లకు పైగా నీటి మట్టం తగ్గింది. వికారాబాద్, బంట్వారం, కొడంగల్, దోమ మండలాల్లో ఈ సీజన్లో భూగర్భజల నీటిమట్టం సుమారుగా 25 మీటర్లకు పైగా లోతులో ఉంది. అదేవిధంగా మోమిన్పేట ధారూరు, యాలాల, తాండూరు మండలాల్లో 22 మీటర్ల లోతులో ఉంది. రోజురోజుకూ గంగమ్మ పాతాళంలోకి వెళ్తున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బోరుబండ్లకు భలే గిరాకీ.. జిల్లాలోని ఆయా గ్రామాల్లో మొత్తం 55,436 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 3 వేలకు పైగా బోరుబావులు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. మరో 8వేల పైచిలుకు బోర్లలో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. ఇక పట్టణాల్లో గృహావసరాలకు సుమారుగా ప్రతి ఇంటికీ ఒక బోరు ఉంది. ఇకపోతే తాగునీటి అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 5వేల చేతిపంపులు, 775 రక్షిత మంచినీటి పథకాలు, 162 సీపీడబ్ల్యూ, ఎంపీడబ్ల్యూ నీటి సరఫరా పథకాలు కొనసాగుతున్నాయి. వీటితో జిల్లాలోని 9.4 లక్షల జనాభాకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఇప్పటికే సుమారుగా జిల్లాలోని 70 శాతం ఆవాసాలకు సరఫరా అవుతున్నాయి. వేసవిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడం, వ్యవసాయ బోర్లు, బావు లు వట్టిపోతున్న నేపథ్యంలో బోరు డ్రిల్లింగ్ వాహనాలకు భళే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం 1000 అడుగుల మేర తవ్వించినా నీరు రాలేదని పరిస్థితి నెలకొంది. ప్రతి ఫీట్ డ్రిల్లింగ్కు వంద ఫీట్ల వరకు రూ.60 ధర కాగా, ఆ తర్వాత ప్రతి అడుగుకు రూ.70 వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. ఈనేపథ్యంలో సుమారుగా రెండు లక్షలకు పైగా ఖర్చవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నీటి కష్టాలకు చెక్!
ఆదిలాబాద్రూరల్: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతీ సంవత్సరం వేసవిలో తాగునీటి సమస్య ఎదురైతే మున్సిపాలిటీ పరంగా పరిష్కరించేందుకు సాధారణ నిధులు కేటాయించి వేసవి ప్రణాళికను మున్సిపల్ ఇంజినీర్ అధికారులు రూపొందిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. త్వరలో జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుంది. ఆమోదం అనంతరం వేసవి ప్రణాళిక నిధుల వినియోగానికి లైన్ క్లియర్ అవుతుంది. మున్సిపాలిటీలో ప్రస్తుతం రెండురోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దాహార్తి తీర్చేందుకు ప్రణాళిక పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకుమున్సిపాలిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాకు రూ.10లక్షలు వినియోగించేందుకు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తీసుకోనున్నారు. అలాగే ఎక్కడైనా పైప్లైన్లు పగిలి నీటి సరఫరా నిలిచిపోతే వెంటనే వాటి మరమ్మతు కోసం అత్యవసరంగా ఈ నిధులు వినియోగించనున్నారు. పట్టణంలో 25 వేల కుటుంబాలు ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ పరిధిలో 2015 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 25 వేల కుటుంబాలు ఉన్నాయి. పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి మావల, లాండసాంగ్వి సమీపంలోని వాగుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలో రోజుకు ఒక్కొక్కరికి 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతీరోజు పట్టణానికి 19 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం. కానీ ప్రస్తుతం ఆయా సంప్హౌస్ల నుంచి కేవలం 12 మిలియన్ లీటర్ల నీళ్లను మాత్రమే పట్టణానికి సంప్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కొక్కరికి కేవలం 90 లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నారు. పాత పైపులైన్ కావడంతో లీకేజీలు అధికమవుతుండంతో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 25వేల కుటుంబాలు ఉన్నా కేవలం 13వేల కుటుంబాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 12వేల కుటుంబాల్లో నల్లాలు లేవు. రూ.100కే నల్లా కనెక్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వీరు కూడా కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు మరింత నీటి కొరత ఏర్పడనుంది. 11,700 కిలో లీటర్ల సరఫరా ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ పరిధిలో 25వేల కుటుంబాలు ఉండగా ఇందులో 1.17కోట్ల జనాభా ఉంది. వీరి దాహార్తి తీర్చడానికి 8 ఓహెచ్ఆర్ పాత ట్యాంకులు ఉండగా.. మరో 5 కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ట్యాంకులు ఈ వేసవిలోపు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ సారి కూడా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తేలా ఉంది. ఆయా ఓహెచ్ఆర్ ట్యాంకుల్లో ప్రతీరోజు 11,700 కిలో లీటర్ల సామర్థ్యం నీరు నిల్వ కానుంది. సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ (సీపీహెచ్ఈవో) ప్రకారం ప్రతీ ఒక్కరికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న జనాభాకు ప్రతీరోజు 19 మిలియన్ లీటర్ల (ఒక కోటి 90లక్షల) నీళ్లు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పట్టణంలో 170 కిలో మీటర్ల మేరకు పైపులైన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. ఇప్పటి వరకు 156 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం ప్రస్తుతం ఉన్న ఓహెచ్ఆర్ ట్యాంకుల ద్వారా పట్టణ ప్రజలకు ప్రతీరోజు నీటిని సరఫరా చేయలేం. అందుకే రెండు రోజులకో సారి చేస్తున్నాం. కొత్తగా 5 ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మిస్తున్నా ఇందులో ఒక ఓహెచ్ఆర్ ట్యాంకు మాత్రమే పూర్తయ్యేలా ఉంది. మిగతా ఓహెచ్ఆర్ ట్యాంకులు వేసవిలోగా పూ ర్తి అయ్యేలా కనిపించడం లేదు. పట్టణ ప్రజల దా హార్తిని తీర్చేందుకు రూ.10లక్షల వరకు అవసరమవుతాయి. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో జరగబోయే కౌన్సిల్లో ఆమోదం తీసుకుంటాం. – మారుతిప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
పాతాళానికి చేరిన భూగర్భజలం
ఇక్కడ కనిపిస్తున్న పొలం మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్రెడ్డిది. ఇతనికి 20 ఎకరాల పొలం ఉంది. నాలుగు బోర్లు ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా నాలుగు బోర్లలో రెండింట్లో నీటిమట్టం పడిపోయింది. మరో రెండు బోర్లలో అంతంతమాత్రంగానే నీళ్లు వస్తున్నాయి. ఇరవై ఎకరాల రైతు గత రబీ సీజన్లో నాలుగున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే ఈ ఏడాది రబీలో నీళ్లు లేక కేవలం అర ఎకరంలో సాగుచేస్తున్నాడు. రైతులందరికీ ఇదే పరిస్థితి. ప్రతిఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతుందనడానికి ఇదొక నిదర్శనం. వర్షాలు కురవక భూగర్భ జలాలు పడిపోతుండటంతో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ను మహబూబ్నగర్ రూరల్, కోయిలకొండ మండలాల్లోని చెరువుల్లోకి నింపితే రైతులు పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది. మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతోంది. ఆరేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా నీటిమట్టం పాతాళానికి చేరింది. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు సమస్య ఇలాగే ఉంది. 2013లో కురిసిన భారీ వర్షం తప్పా మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు కురవలేదు. అప్పటి నుంచి ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగులు, బోరుబావులు వట్టిపోయి పంటల సాగు కష్టతరంగా మారింది. ప్రస్తుత రబీ సీజన్లో సాగు చేసిన వరి, వేరుశనగ, జొన్న, శనగ తదితర పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవి రాకముందే.. వేసవి రాకముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడకపోవడం, మరోవైపు 24 గంటల విద్యుత్ సరఫరాతో బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి నీరు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చిన్ననీటి వనరులు చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. రైతులు రబీ పంటలపై ఆశలు వదులుకున్నారు. కనీసం పశువులకు నీరు దొరకే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. అన్నం పెట్టే రైతన్నకు వివిధ పంటల సాగులో చేతినిండా పని లేకుండా పోవడంతో ఇతర పనులపై ఆధార పడాల్సి వస్తోంది. కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది సాగుకు నీరు వదలరాదని సంబంధిత అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈ కారణంగా అక్కడ కూడా పంటల సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. బోరుబావుల కింద మాత్రం రైతులు సేద్యం చేస్తున్నారు. ఆ బోర్లు కూడా ఎప్పుడు ఎండిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతంలో ఐదు ఎకరాలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం రెండు ఎకరాలు కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడు రబీ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది వరి 22,500 హెక్టార్లు, వేరుశనగ 17వేల హెక్టార్లు, జొన్నలు 1000 హెక్టార్లు, శనగ వంటి చిరు ధాన్యాలు మొత్తం 1,930 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఏడు రబీ సీజన్లో వరి 15వేల హెక్టార్లు, వేరుశనగ 7,700 హెక్టార్లు, జొన్నలు 744 హెక్టార్లు, శనగలు 545 హెక్టార్లు, చిరు «ధాన్యాల వంటి పంటలు 1,415 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులంతా తమ బోరుబావుల్లో ఉన్న నీటిని బట్టి డ్రిప్ పద్ధతిని వినియోగిస్తూ ఆరుతడి పంటలు పండిస్తున్నారు. పాతాళానికి చేరిన జలం భూగర్భజలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరీ పాతాళానికి వెళ్లిపోయాయి. ఖరీఫ్ గట్టెక్కినా రబీ పరిస్థితి దారుణంగా ఉంది. సాగునీటితోపాటు తాగునీటికీ సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భ జలాలు 11.69 మీటర్ల వద్ద ఉండగా 2019 జనవరిలో 15.87 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 4.18 మీటర్లకు పడిపోయింది. నారాయణపేట మండలం అప్పారెడ్డిపల్లిలో భూగర్భజలాలు మరింత లోతుకు చేరాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా ఇక్కడ 15.79 మీటర్ల లోతుకు పడిపోయాయి. అదేవిధంగా గండీడ్ మండలం సల్కార్పేటలో 15.10 మీటర్లు, మహబూబ్నగర్ అర్బన్ మండలంలో 11.88 మీటర్లు, ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామంలో 8.65 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని 26 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే నీటి ఎద్దడి తప్పదు. వర్షపు నీటిని నిలువ చేస్తేనే.. వర్షపు నీటిని నిలువ చేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి వెళ్లే జీవనదులు, వాటికి అడ్డుగా ఆనకట్టలు కడితేనే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీదుగా వెళ్లే వరద నీటికి అడ్డుకట్ట వేసి సద్వినియోగం చేసుకుంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఉంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులు, పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. నీటిని పొదుపుగా డ్రిప్ను వినియోగిస్తూ ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు సేద్యం చేసుకుంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి -
ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు
వేసవి ఇంకా ప్రారంభం కాకనే తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 140 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఎండలు ముదిరితే పరిస్థితి ఏంటని తల్చుకుంటేనే గొంతులో తడారి పోతోందని ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ వేసవిలో ఉపశమనం కలిగించడానికి అధికారులు తమవంతు ప్రయత్నంగా వేసవి ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.17కోట్లు ఇస్తే వేసవిలో నీటిఎద్దడిని నివారించగలమని ప్రతిపాదనలు పంపారు. అనంతపురం సెంట్రల్: అనంతపురం అసలే కరువు జిల్లా. ఈ ఏడాది మరింత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 45శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ సమయానికి 18 మీటర్ల లోతులో ఉండాల్సిన భూగర్భజలాలు 23 మీటర్ల లోతులో ఉన్నాయి. వేసవిలో ఇంకా అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం వేసవి ఇంకా పూర్తిగా రానేలేదు. ఇప్పటికే 140 గ్రామాలకు నీళ్లను ట్యాంకర్లతో అందిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వర్షాభావం వల్ల భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం...దారి మళ్లిన నీళ్లు ఈ ఏడాది వర్షాభావానికి పాలకుల స్వార్థం తోడవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. హెచ్చెల్సీ, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు దారి మళ్లాయి. ముఖ్యంగా హంద్రీనీవా ద్వారా కొన్ని చెరువుల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఎన్నికల సమయం కావడంతో సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లాకు వచ్చి కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని కుప్పంకు మళ్లించారు. జిల్లాలో చెరువులన్నీ నింపిన తర్వాతే కుప్పంకు తీసుకుపోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. గతంలో కన్నా ఈ ఏడాది తక్కువ చెరువులు నింపారు. పీఏబీఆర్ కుడికాలువ కింద కేవలం 0.8 టీఎంసీలు వదిలి మమ అనిపించారు. చెరువులు కూడా తడపకుండానే ముగించారు. వేసవిలో నీటిఎద్దడి గ్రామాలు 500లకు పైమాటే ఈ ఏడాది జిల్లాలో 500 గ్రామాలకు పైగా తీవ్ర తాగునీటి ఎద్దడితో అగచాట్లు ప్రమాదం ఉన్నట్లు అంచనాలున్నాయి. అధికారికంగానే 350 గ్రామాలను గుర్తించారు. వాటన్నింటికీ ట్యాంకర్లతో నీరందించాల్సి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇలా సరఫరా చేసేందుకు కూడా సమీపంలో నీటి వసతి దొరకడం కూడా గగనంగా మారుతోంది. ఇదిలా ఉంటే గతేడాది నీరందించిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. దాదాపు రూ.4కోట్లకు పైగా బకాయి పడినట్లు తెలుస్తోంది. వాటిని చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది నీరు సరఫరా చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.17కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నీటి ఎద్దడిని నివారిస్తాం తాగునీటి ఎద్దడి నివారణకు రూ.17కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉంటే మా దృష్టికి వచ్చిన 24 గంటల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ఏ సమయంలోనైనా నా నెంబర్ 91001 22100కు ఫోన్ చేస్తే తక్షణం నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.– హరేరామనాయక్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
యాసంగి పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు
వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో యాంసంగి పంటకు సాగునీటిని అందించాలని సర్కారు నిర్ణయించింది. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు ఏటా రెండు పంటలకు సాగు నీటిని అందించే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు ప్రాంత ఎమ్మెల్యేలతో బుధవారం నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం నిర్వహించారు. రబీసాగుకు నీటి విడుదల, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనుల పురోగతిపై చర్చించారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎస్సారెస్పీపై హైదరాబాద్లో నిర్వహిం చిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో ఉన్న నీటి నిల్వలు, కాల్వల ద్వారా అందించేందుకు నీటి లభ్యత, సాగు విస్తీర్ణం పెంచేందుకు ఎస్సారెస్పీ సామర్థ్యం పెంపు పనుల పురోగతి, ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరిగింది. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ పనులు జూన్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. నిధులు వంద శాతం ఖర్చుచేయడంతో పాటు పనుల పురోగతి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు పునరుజ్జీవ పనులు వేగవంతంగా చేపట్టడంతో పాటు రబీలో చెరువులు, కుంటలు అధికారికంగా నింపి ఒక్క ఎకరం నేల కూడా ఎండిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. 14.40 లక్షల ఎకరాలకు నీరు.. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సారెస్పీ ద్వారా 14.4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఎత్తయిన ప్రాంతాలకు లిఫ్టుద్వారా సాగునీటిని అందించే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ సామర్థ్యం పెంపు కోసం ప్రాజెక్టు ఆ«ధునికీకరణకు కూడా నిధులు కేటాయించి సాగు విస్తీర్ణం పెంచుతున్నామన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో పాటు ఎస్సారెస్పీ కాలువల సామర్థ్యాన్ని 3000 క్యూసెక్కుల నుంచి 6000 క్యూసెక్కులకు పెంచడం జరిగిందని వెల్లడించారు. పునరుజ్జీవ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జూన్ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తే వర్షాకాలంలో ప్రాజెక్టు నీటితో కలకలాడే అవకాశం ఉందన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎండాకాలంలోపు గౌరవెల్లి వరకు... మిడ్ మానేరు నుంచి గౌరవెళ్లి వరకు జరుగుతున్న పనులు ఎండాకాలం లోపే పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులను కోరారు. కాలువల తవ్వకం కోసం భూసేకరణతో పాటు ఉన్న ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరినదిపై చేపట్టిన కాళేశ్వరం రివర్స్ పంపింగ్ నీళ్లు వర్షాకాలం వరకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు అందితే ఇక తెలంగాణలో నీటి కొరత అనేదే ఉండదని తెలిపారు. పోచంపాడ్ నుంచి ఖమ్మం వరకు 14.40 లక్షలతో పాటు ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్ల ద్వారా నీరు అందిస్తామని వెల్లడించారు. జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించారు. 10 నుంచి ఎల్ఎండీ నీటి విడుదల కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) కింద సాగయ్యే ఆయకట్టు పంటలకు ఫిబ్రవరి 10 నుంచి ఒక తడి నీరు విడుదల చేస్తామని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 5లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎస్సారెస్పీ ద్వారా 14లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని, రబీ పంటకు కూడా అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల కెపాసిటీ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు వదిలి పరీక్షించడం జరిగిందన్నారు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలన్నారు. తద్వారా భూగర్భ జలాలు, మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు. జూన్ 30 వరకు కేటాయించిన నిధులు 100 శాతం ఖర్చు చేయాలని, అవసరం అయితే మరిన్ని నిధులు తెచ్చుకుంటామన్నారు. కొన్ని చోట్ల భూ సేకరణలో సమస్యలు ఉన్నాయని, వాటిపైన పూర్తి దృష్టి సారిస్తామన్నారు. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని తెలిపారు. పనులు ఎక్కడా ఆగలేదని, వేగంగా జరిగేలా ప్రజాప్రతినిధులం కృషి చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్, సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, వి.సతీష్బాబు, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సీతక్క, ఆరూరి రమేష్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్రెడ్డి హాజరయ్యారు. -
జలం.. బహుదూరం
ఆకలేసినా, దప్పికేసినా చెప్పుకోలేని మూగజీవాలు అడవుల్లో విలవిలలాడిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అడవుల్లో చుక్కనీరు దొరక్క మూగజీవాల గొంతెండుతోంది. చర్యలు తీసుకోవాల్సినఅధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కి, వాహనాలుఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసంవిడుదలవుతున్న నిధులు ఏమవుతున్నాయో అంతుపట్టడం లేదు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు నియోజకవర్గంలో లంకమల అభయారణ్యం, పెనుశిల అభయారణ్యం, నల్లమల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి. సుమారు 30 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో వివిధ రకాల జంతుజాలం నివసిస్తోంది. వీటిలో అత్యంత అరుదైన కలివికోడి, పెద్దపులి, హనీబ్యాడ్జెర్ వంటి జంతువులు కూడా ఉన్నాయి. వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఆయా అడవుల్లోని జంతువులను సంరక్షించేందుకు ఏటా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. ఆ నిధులతో అడవుల్లో సాసర్పిట్లు ఏర్పాటు చేసి అందులో నీటిని నింపడం, అడవుల చుట్టూ వన్యప్రాణులు బయటికి రాకుండా కందకాలు తవ్వించడం వంటి పనులు చేపట్టాలి. అయితే ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడం, అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చర్యలు చేపట్టడం లేదు. జనావాసాల్లోకి .. అడవుల్లో వన్యప్రాణులకు నీరు అందించేందుకు గాను లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలలో సుమారు 65కు పైగా సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. అయితే సాసర్పిట్లలో నీటిని నింపి జంతువుల దాహార్తిని తీర్చాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చేసేది లేక నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని చనిపోవడం, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మరణించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. బద్వేలు రేంజ్ పరిధిలోని జంగంరాజుపల్లె బీటులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ వెనుకజల్లాల్లో ఉన్న ముత్తూటిసెల అటవీ ప్రాంతాల్లో నీటి కోసం వస్తున్న వన్యప్రాణులను నీటిలో విషపు గుళికలు కలిపి వేటాడుతున్నారు. అంతేకాకుండా జిల్లా సరిహద్దులోని గోపవరం మండల సమీపంలో, అట్లూరు మండల సమీపంలో వేటగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఉచ్చులు వేసి వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో అట్లూరు మండల పరిధిలో సుమారు నాలుగైదు పొడదుప్పిలు మృత్యువాతపడ్డాయి. అలాగే కాశినాయన మండలంలోని వరికుంట్ల గ్రామసమీపంలో తాగునీటి కోసం జనసంచారంలోకి వచ్చిన రెండు చిరుతలు విద్యుత్షాక్కు గురై మరణించాయి. ఇలా చెప్పుకుంటూపోతే నిత్యం ఎక్కడో ఒక చోట వన్యప్రాణులు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. అడవుల్లోని సాసర్పిట్లలో తక్షణమే నీరందించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే వన్యప్రాణుల వేటగాళ్లను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం. – గురుప్రభాకర్, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ -
గొంతులెండుతున్నాయ్.. దప్పిక తీర్చండి
కనిగిరి: మీరు ప్రజా సేవకులు.. పార్టీల కతీతంగా సమస్యలు పరిష్కరించండి.. రెండు వారాలుగా నీళ్లు కోసం ప్రజలు అల్లాడుతున్నారు.. సమస్య మీకు పట్టాదా.. ఎమ్మెల్యేకు తొత్తుగా పనిచేస్తే.. ప్రజలు ఇలానే రోడ్లక్కుతారంటూ వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అధికారులపై ధ్వజమెత్తారు. నీటి సమస్య పరిష్కరించాలంటూ కనిగిరి పట్టణంలోని దేవాంగనగర్వాసులు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకుని అక్కడి వచ్చిన కమిషనర్ కేవీ పద్మావతిని ప్రజలు నిలదీశారు. మేము కూలీ నాలి చేసుకుని జీవించే వాళ్లం కనీసం తాగటానికి, వాడుక నీరు ఇవ్వడం లేదు.. రెండు వారాలుగా మున్సిపల్ నీళ్ల ట్యాంకర్లు మా వార్డుకు రావడం లేదు.. ఆఫీసుకు వచ్చి చెప్తే సమస్య పట్టించుకోరు.. ఇప్పుడు ఎందుకొచ్చారంటూ కమిషనర్ను ప్రశ్నించారు. చైర్మన్ ఒక్క సారికూడా మా గ్రామానికి రాలేదు.. మేం మనుషులం కాదా అంటూ మండిపడ్డారు. చైర్మన్, ఎమ్మెల్యే ఇద్దరు వచ్చి మా సమస్య పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదలమంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కమిషనర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై డి.ప్రసాద్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రజల కోసం పనిచేయండి.. ఇంతలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ శ్రేణులు ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు. ప్రజలు నీటి సమస్యను బుర్రాకు వివరించారు. దీంతో ఆగ్రహించినా బుర్రా.. కమిషనర్ గారు.. మీరు ఏడాదికి కోటి రూపాయలు ట్యాంకర్ల ద్వార నీటి రవాణాకు ఖర్చు పెడుతున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు.. మరీ ప్రజలకు నీళ్లేవీ.. మీరు.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అందరు కలిసి నిధులు మింగుతున్నారా..? అధికార పార్టీ నాయకుల ఇళ్లకు రోజు ట్యాంకర్లు.. అధికారపార్టీ వార్డులకు రోజు నీళ్లు.. మరీ పేదల పరిస్థితి ఏంటీ.. వాళ్లు ప్రజలు కాదా..? అని నిలదీశారు. దీనికి కమిషనర్ బదులిస్తూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల తప్పు జరిగిందని.. రోజు ట్యాంకర్ల నీళ్లు సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమకు ట్యాంకర్ల ద్వారా కాకుండా కొళాయిల ద్వారా నీళ్లు ఇవ్వాలని స్థానికులు పట్టుబట్టారు. కాలనీ వాసులంతా చైర్మన్కు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. దీంతో కమిషనర్ కాలనీలో డీప్బోర్ వెల్ వేసి కుళాయిల ద్వారా నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు స్థల పరిశీలన చేశారు. దీంతో సమస్య తాత్కలికంగా సద్దు మణిగింది. ధర్నా కారణంగా అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. వివక్షత చూపితే ఆందోళన ఉధృతం చేస్తాం: బుర్రా మున్సిపల్ ట్యాంక్ల ద్వారా నీటి రవాణాలో అధికారులు వివక్షత చూపితే సహించేది లేదని బుర్రా మధుసూదన్ యాదవ్ హెచ్చరించారు. ధర్నా అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలు నీటి సమస్యపై అల్లాడుతుంటే అధికార పార్టీ నాయకులు అభివృద్ధి ఢంకా కొట్టుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో నీటి రవాణా మాటున కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తూ.. ప్రజా సమస్యలను గాలికి వదులుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు ఏక పక్షంగా వ్యహరించి.. ఎమ్మెల్యేకు, చైర్మన్కు తాబేదారులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దేవాంగనగర్లో నీటి సమస్య త్వరగా పరిష్కరించక పోతే.. మున్సిపల్ ఆఫీసు వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, న్యాయవాదులు ఎస్కే అబ్దుల్గఫార్, సీహెచ్ సాల్మన్రాజు, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కస్తూరిరెడ్డి, మండల అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవన్మరణ సమస్య!
శ్రీకాకుళం, వీరఘట్టం: జిల్లాలో ఏటా వేసవిలో వన్యప్రాణులకు జీవన్మరణ పోరాటం తప్పడం లేదు. ఇవే అడవుల్లో గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న ఏనుగులు.. దాహార్తిని తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు వచ్చినప్పుడు వీటి వల్ల ప్రజలకు ముప్పు తప్పడంలేదు. ఇటువంటి వింత పరిస్థితుల మధ్య వన్యప్రాణులు మత్యువాత పడుతుంటే.. ఏనుగుల గుంపు వల్ల ప్రాణ భయంతో పాటు ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా వన్యప్రాణులకు నీటి వసతి కల్పిం చడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించడంతో జాతీ య సంపద అంతరించిపోతోంది. ప్రస్తుతం వేస వి సమీపిస్తున్న తరుణంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి తాపంతో దుప్పులు, జింకలు, అడవి పందులు దాహార్తిని తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు వచ్చి తరుచూ మత్యువాత పడుతున్నాయి. అలాగే వేటగాళ్ల తూటాలకు బలైపోయిన ఘటనలు ఉన్నాయి. వన్యప్రాణులు నిలయమైన వీరఘట్టం మండలం తూడి, వండువ కొండల్లో వీటి సంరక్షణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం కూడా మరో కారణంగా పేర్కొనవచ్చు. రూ.1.62 కోట్లు వృథా జంతువుల దాహార్తిని తీర్చేందుకని గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.1.62 కోట్లతో 55 కిలోమీటర్లు పొడవునా అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వా రు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజలు చెబుతున్నారు. వేసవిలో ఎండల తీవ్రతకు నదులు, గెడ్డలు, పెద్ద పెద్ద జలపాతాలే ఎండిపోతుంటే కందాకాల్లో నీరు ఎంతవరకు నిల్వ ఉంటుందనేది వారి వాదన. ఈ పరిస్థితుల్లో నీటి సౌలభ్యత లేక మైదాన ప్రాంతాలకు వస్తున్న మూగజీవాలు బలైపోతున్నాయి. మరోవైపు జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో అటవీ విస్తీర్ణం 616 చదరపు కిలోమీటర్లు. దీనిలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10.55 శాతం మాత్రమే ఉన్నాయి. ఫలితంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుండడంతో వన్యప్రాణులు మృతి చెందుతుండగా, ఏనుగుల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పై గణాంకాల ప్రకారం అటవీ సంపదను మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదీ పరిస్థితీ... జిల్లాలోని పాతపట్నం–టెక్కలి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుప్పి, జింక, గొండగొర్రె, కొండ మేక ఇలా నాలుగు రకాల జింకలు ఉన్నాయి. పాతపట్నంనకు సమీపంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుమ్మలగుండు(తోడేళ్లు) సంచారం ఉంది. అలాగే ఇదే అటవీ రేంజ్లో రేసు కుక్కల సంచారం కూడా ఉంది. మొళియాపుట్టి మండలం జాడుపల్లి అటవీ ప్రాంతంలో కనుజులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అలాగే వీరఘట్టం మండలంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తూడి, వండువ కొండల్లో వందలాది వన్యప్రాణులు ఉన్నాయి. దుప్పి, అడ వి పందుల గుంపులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి సమీపంలో ఉన్న జీడి తోటలు, వరి చేలల్లో ఆహా రం కోసం తరుచూ వస్తుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో కొండలపైనే ఉన్నా.. వేసవి వచ్చిం దంటే మైదాన ప్రాంతాలకు నీటి కోసం వస్తుంటాయి. ఇటువంటి సమయాల్లో కొంతమంది వేటగాళ్లు మాటు వేసి, వన్య ప్రాణులను ప్రాణాలను హరిస్తున్నారు. గత నాలుగేళ్లలో... ♦ 2014లో వీరఘట్టం మండలం బొడ్లపాడు సమీపంలోని తోటల్లో వరి కంకులు తినడంతో దుప్పి మృతి చెందింది. ♦ 2015 నవంబర్లో తూడి తోటలో వరి కంకులు తిని, నీరందక మరో దుప్పి మృతి చెందింది. ఇవన్నీ స్ధానికులు గుర్తించినప్పుడు బయటపడినవి. అదే ఏడాది అడారులో మర్రి చెట్టు తొర్రలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఈ నాటు బాంబులు వన్యప్రాణుల వేటకేననే అరోపణలు వ్యక్తమయ్యాయి. ♦ 2016 మార్చి 30న తలవరంలో దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన ఓ జింక కుక్కల బారినపడి గాయాల పాలయ్యింది. పరిస్థితిని గమనించిన గ్రామస్తులు జింకను రక్షించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ♦ 2017 ఏప్రిల్ 4న తూడి కొండ నుంచి దాహార్తి కోసం మైదాన ప్రాంతానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో దుప్పి మృత్యువాత పడింది. ♦ అదే ఏడాది పాతపట్నం, మొళియాపుట్టి, సారవకోట ప్రాంతాల్లో అనేక దుప్పులు మృతిచెందాయి. ♦ 2018లో మొళియాపుట్టి వద్ద ఓ ఎలుగుబంటి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ♦ పాతపట్నం మండలం జోడికొండ నుంచి దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పి మృతి చెందింది. కందకాల వల్ల ఎద్దడి తగ్గుతుంది గతేడాది కొండ ప్రాంతాల్లో తవ్విన కందకాలలో చాలా చోట్ల నీటి తడులు చేరాయి. వీటి వల్ల వన్య ప్రాణులకు వేసవిలో దాహార్తి తీరుతుంది. ఏనుగులు సంచారంపై అప్రమత్తంగా ఉన్నాం. తూడి–వండవ కొండల్లో నీటి తొట్టెల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం.– డి.జగదీష్, అటవీశాఖ రేంజ్ అధికారి, పాలకొండ -
పంటలు, గొంతులు ఎండుతున్నాయ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాగార్జునసాగర్లో నీరు ఉన్నా.. ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు అందించని ప్రభుత్వం కనీసం వేసవిలో తాగునీరు అయినా అందిస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పశ్చిమ ప్రకాశం పరిధిలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండపి, కందుకూరు ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చగా సాగర్ కుడికాలువ పరిధిలోని ప్రాంతంలోనూ సాగుతో పాటు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. సాగర్లో నీరున్నా ప్రభుత్వం తగినంతగా విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని రామతీర్థం ప్రాజెక్టుతో పాటు 228 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీరు లేదు. తక్షణం వీటిని నింపితేనే కనీసం కొంత ప్రాంతానికైనా తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణం నీటి విడుదలకు కృషి చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ఇప్పటికే నీరు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు ట్యాంకర్ల ద్వారా నిత్యావసరాలతో పాటు క్యాన్ల ద్వారా తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పలేదు. వేసవి వస్తుండడంతో నీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా మొక్కుబడిగా మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఒకటి లేదా రెండు ట్యాంకర్ల నీటిని మాత్రమే ఇస్తుండడంతో అవి ఏమూలకు సరిపోవడం లేదు. నీటి సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలే అధికంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా ఉన్న రైతుల బోర్ల నుంచి ప్రజలకు తాగునీటిని అందించాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవిలో ఇది మరింత ఆందోళన కరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ కుడి కాలువ పరివాహక ప్రాంతంలోనూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే జిల్లాలోని 228 సమ్మర్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. సత్వరం చెరువులు సాగర్ జలాలతోనింపితేనే ప్రజలు తాగునీరు అందే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటితో నిండాయి. సాగర్కు 582 అడుగుల మేర నీరు చేరింది. దీంతో వరితోపాటు ఆరుతడి పంటలకు నీటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం సైతం ప్రకటించింది. వరిసాగు చేసుకోవాలని రైతులను ఆదేశించింది. ఏడాది ప్రారంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టులకు నీరు చేరడంతో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అందరూ ఆశించారు. అయితే ప్రభుత్వం సాగర్ ఆయకట్టులో సగం ఆయకట్టుకు కూడా నీరివ్వక చేతులెత్తేసింది. ఇక తాగునీటిని కూడా పూర్తి స్థాయిలో జిల్లాకిచ్చే పరిస్థితులు కానరావడం లేదు. తాగునీటి కోసం 10 టీఎంసీలకు ప్రతిపాదన.. రామతీర్థం ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు వట్టిపోయింది. 1.5 టీఎంసీల నీటిని రామతీర్థంలో నింపితేనే ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, కొండపి ప్రాంతాలకు తాగునీరు అందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 128 చెరువులను యర్రగొండపాలెం, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని 100 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మొత్తం 228 ట్యాంకులను నీటితో నింపాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 4.5 టీఎంసీల నీరు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. గురువారం రాత్రికే బుగ్గవాగు నుంచి నీటిని విడుదల చేస్తే ఈనెల 19 శనివారం నాటికి జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్దకు నీరు చేరుకుటుందన్నది అధికారుల అంచనా. అదే సమయంలో అటు ఏబీసీ పరిధిలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని చెరువులను నీటితో నింపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కాలువ నుంచి జిల్లాకు నీరు చేరిన వెంటనే తొలుత రామతీర్థం ప్రాజెక్టులో కనీసం 1.3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీరు కావాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు కనీసం 10 టీఎంసీల నీటిని సాగర్ నుంచి కుడి కాలువకు విడుదల చేయాల్సి ఉంది. ఇది జిల్లాకు ఎప్పటికి చేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. నిండుకున్న ఎస్.ఎస్.ట్యాంకులు.. ఒంగోలు నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోనూ నీరు అడుగంటింది. తక్షణం రామతీర్థం రిజర్వాయర్ ద్వారా ఇక్కడికి నీటిని తరలించాల్సి ఉంది. అలా అయితే ప్రజల దాహార్తి తీర్చే అవకాశం ఉంటుంది. మరో వైపు కుడి కాలువ పరిధిలో రైతులు సాగు చేసిన వరి, మిరప, సువాబుల్, జామాయిల్ ఇతర పంటలు సక్రమంగా నీరు అందక ఎండి పోతున్నాయి. దిగువకు తాగునీటి అవసరాల కోసం సాగర్ జలాలను విడుదల చేస్తే రైతులు ఆనీటిని పంటలకు మల్లించే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో ఇటు ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉంది. సాగర్లో ఈ ఏడాది తగినంతగా నీరు చేరింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందు జాగ్రత్త వహించి ఇప్పటికే రామతీర్థంతో పాటు ట్యాంకులను నీటితో నింపాల్సి ఉంది. కాని ఆదిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం ఎగువన నీరు లేదంటూ అడ్డంకులు పెడుతోంది. తక్షణం నీరు ఇవ్వక పోతే సాగైన పంటలు ఎండిపోవడంతో పాటు ఇటు ప్రజలకు తాగునీరు అందక మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒట్టిమాటలతో ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి జిల్లాకు తగినంత నీటిని విడుదల చేయించేందుకు కృషి చేయాలి. -
స్మార్ట్ బాల్తో లీకేజీలకుచెక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న విలువైన తాగునీటి వృథాకు కారణమైన పైప్లైన్ లీకేజీలకు చరమగీతం పాడాలని జలమండలి నిర్ణయించింది. దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పైపులైన్ల నాణ్యత, మన్నికను త్వరలో పరిశీలించనున్నారు. అమెరికా, సింగపూర్, ఇజ్రాయిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ‘స్మార్ట్బాల్’ టెక్నాలజీ ఆధారంగా పురాతన తాగునీటి పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలని నిర్ణయించింది. ప్రధానంగా ఎనిమిదవ దశకంలో ఏర్పాటుచేసిన సింగూరు, మంజీరా పైపులైన్లతోపాటు 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణా మొదటిదశ పైపులైన్లను ప్రయోగాత్మకంగా ఈ సాంకేతికత ఆధారంగా పరిశీలించనున్నారు. దీంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్కు తరలిస్తోన్న విలువైన తాగునీరు పైపులైన్ల లీకేజీలతో వృథా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనుండడం విశేషం. తాగునీటి వృథా..వ్యథ ఇదీ.. మహానగరానికి వందలకిలోమీటర్ల దూరం నుంచి తరలిస్తోన్న సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి జలాల్లో సుమారు 40 శాతం విలువైన తాగునీరు లీకేజీలు, చౌర్యం కారణంగా వృథా అవుతోంది. నిత్యం జలమండలి సరఫరా చేస్తున్న 440 మిలియన్ గ్యాలన్లలో 40 శాతం మేర సరఫరా నష్టాలున్నాయి. అంటే సుమారు 176 మిలియన్ గ్యాలన్ల జలాలు వృథాఅవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నీటిని తరలించే పురాతన తాగునీటి పైపులైన్లే. వీటిలో ఆర్సీసీ(రీ ఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్)తో తయారైనవే అధికంగా ఉన్నాయి. పైపులైను మార్గంలో వాటి పైనుంచి భారీ వాహనాలు వెళ్లిన ప్రతీసారీ లీకేజీలు ఏర్పడి ఫౌంటెన్లను తలపిస్తున్నాయి. పలుమార్లు ఈ నీరంతా ప్రధాన రహదారులపైకి చేరి ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు, మూడు రోజులు పలు ప్రాంతాలకు నీటిసరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తింది. సుమారు 100 కి.మీ మార్గంలో పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరోవైపు పాతనగరంలో సుమారు 1100 కి.మీ మార్గంలో దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పంపిణీ చేసే పైపులైన్లు (చిన్నపరిమాణంలోనివి)ఉన్నాయి. వీటికి కూడా లీకేజీల పరంపర తప్పడంలేదు. స్మార్ట్ బాల్ సాంకేతికత పనిచేస్తుందిలా... రాడార్, జీపీఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేసే బంతి ఆకృతిలో ఉన్న పరికరాన్ని పురాతన తాగునీటి పైపులైన్లలోనికి తీగ ద్వారా ప్రవేశపెడతారు. పైపులైన్ లోపలకు వెళ్లిన ఈ పరికరం భూగర్భంలో ఉన్న తాగునీటి పైపులైన్ గోడలను క్షుణ్ణంగా తనిఖీచేస్తుంది. జీపీఆర్ఎస్ సాంకేతికత ఆధారంగా ఈ దృశ్యాలను పైన ఉన్న కంప్యూటర్కు గ్రాఫ్ రూపంలో చేరవేస్తోంది. ఈ గ్రాఫ్ను నిపుణులు పరిశీలించడం ద్వారా పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, దాని సామర్థ్యం, మన్నిక వంటి అంశాలను నిర్ధారించవచ్చు. అవసరమైన చోట మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పురాతన భారీ ఆర్సీసీ పైపులైన్ల స్థానంలో మైల్డ్స్టీల్(ఎంఎస్), చిన్న పరిమాణంలో ఉన్న ఆర్సీసీ పైపులైన్ల స్థానంలో డక్టైల్ ఐరన్(డీఐ)పైపులైన్లను ఏర్పాటుచేయాలని జలమండలినిర్ణయించింది. లీకేజీలకు చరమగీతం పాడేందుకే తాగునీటి పైపులైన్ల లీకేజీలను సమూలంగా నివారించేందుకు ముందుగా పురాతన పైపులైన్ల నాణ్యత,మన్నికను నిర్ధారించాలని నిర్ణయించాము. తద్వారా విలువైన తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కలుషిత జలాల నివారణ,తాగునీటి సరఫరాలో తరచూ తలెత్తే అంతరాయాలను పూర్తిగా నివారించవచ్చు. స్మార్ట్బాల్ సాంకేతికత వినియోగంతో సత్ఫలితాలుంటాయని భావిస్తున్నాము. – ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
చేతి పంపులకు మరమ్మతులేవీ?
సరైన వానలు లేక ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు , బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతి పంపు నీటితో నైనా గొంతు తడుపు కుందామనుకుంటే అవిమొరాయిస్తున్నాయి. నిధులను అధికారులు ఎక్కడ ఖర్చుచే స్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహచేస్తున్నారనేఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. సాక్షి, యాడికి: చేతి పంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 4 మండలాల్లోని గ్రామాలన్నింటిలో మొత్తం దాదాపు 300 పైనే చేతి పంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వారా నీరందించే బోర్లు మరో 200దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250బోర్లకు ఒక మెకానిక్ ఉండాలి. 500 బోర్లకు కూడా ఒక మెకానిక్ లేడు. దీంతో చేతి పంపుల నీటిపైనే ఆధారపడే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. మెకానిక్ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకులు స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది. యాడికి మండలంలో 154 చేతిపంపులు ఉంటే వాటిలో 45 బోర్లు పనిచేస్తున్నాయి. మిగిలిన 89 బోర్లు మరమ్మతులకు లోనయ్యాయి. నిధులు కరిగిపోయినా పనిచేయని బోర్లు నియోజక వర్గంలో మొత్తం300 దాకా బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి. అయితే వీటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడి తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ.2వేల (ఆరు నెలలకోసారి1000) చొప్పున విడుదల చేస్తోంది. ఈ సీజన్కు సంబంధించి ఒక్కో బోరుకు రూ.1000 చొప్పున అక్టోబర్లోనే ఎంపీడీఓ ఖాతాలోక్లి నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్(కాంట్రాక్టర్æ)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత అవసరాలకు సామగ్రి జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు , చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్ళారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు పశువుల పాకలకు, రేకుల షెడ్లకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. చాలా బోర్లు పనిచేయడం లేదు గ్రామంలో చాలా బోర్లు పనిచేయడంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు పైపులు కావాలని అధికారులకు చెప్పినా పట్టించు కోవడంలేదు. వీరారెడ్డిపల్లె బస్టాండులోనీరు దప్పిక ఐతే రెండు కి.మీ. దూరం వరకు పోయి దప్పిక తీర్చుకోవాల్సిందే. బస్టాండు దగ్గర ఉన్న చేతిపంపును మరమ్మతు చేయిస్తే నీటిసమస్య ఉండదు.–భీమేశ్వరెడ్డి, కమలపాడు తాజా మాజీ సర్పంచు, యాడికి సిబ్బంది లేక ఇబ్బందులు అక్కడక్కడా చేతి పంపులు దుస్థితికి చేరిన విషయం తెలిసిందే. చేతిపంపులు దెబ్బతిన్న విషయంపై సర్వే చేయిస్తాం. ఎక్కడైనా నీరుండి బోర్లు శిథిలమై ఉంటే వాటిని మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఐతే మరమ్మతులు చేసేందుకు అవసరమైన సిబ్బందిలేరు. వీలైనంత వరకు వాటిని మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, యాడికి -
పల్లెకు ఎక్కిళ్లు!
కర్నూలు(అర్బన్): వేసవి రాకముందే జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మెజారిటీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనివల్ల తాగునీటి సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 562.14 మిల్లిమీటర్లు కురవాల్సి ఉండగా, కేవలం 294.34 మి.మీ. కురిసింది. ఈ నేపథ్యంలో అనేక గ్రామాల్లో బిందెడు నీటి కోసం రెండు, మూడు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికితోడు ఆయా గ్రామాల్లో గతంలో ఎప్పుడో నిర్మించిన వాటర్ ట్యాంకులు విస్తరించిన గ్రామాల పరిధికి అనుగుణంగా నీటిని అందించలేకపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్యాంకుల నిర్మాణం కూడా చేపట్టడం లేదు. ఈ కారణంగానూ గ్రామీణులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నదీతీర గ్రామాల్లోని ప్రజలను సైతం నీటి సమస్య వేధిస్తోంది. పనుల కోసం కాకుండా నీటి కోసం వ్యవసాయబోర్లు, బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. మేజర్ గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోనూ సమస్య అధికమవుతోంది. నిన్నటి వరకు కోడుమూరు మేజర్ పంచాయతీలో పది రోజులకు ఒకసారి నీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీకి విడుదల చేయడంతో వారానికి రెండు సార్లు సరఫరా చేయగలుగుతున్నారు. గాజులదిన్నె నీరు కూడా హంద్రీకి డిసెంబర్ 15 వరకు మాత్రమే విడుదలయ్యే సూచనలుకనిపిస్తున్నాయి. అప్పటిలోపు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుంటే తిరిగి కష్టాలు తప్పవు. వెల్దుర్తి మేజర్ పంచాయతీలో నీటి సరఫరా పరిస్థితి తాత్కాలికంగా కొంత మెరుగైనా, అనేక వార్డుల్లో ఇంకా కష్టాలు తీరలేదు. ఇదే మండలంలోని క్రిష్ణాపురం, కలుగొట్ల గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 9 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా ఇప్పటికే జిల్లాలోని తొమ్మిది ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదోని డివిజన్లోని ఆరేకల్, తొగలగల్లు, దొడగొండ, బైలుపత్తికొండ, రాళ్లదొడ్డి, మూగతి, కర్నూలు డివిజన్లోని కే నాగులాపురం, కాజీపేట, చౌట్కూరు ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. డోన్ సబ్ డివిజన్ పరిధిలోని ఆవులదొడ్డి, రాచెర్ల గ్రామాలకు హైరింగ్ (బోర్లను అద్దెకు తీసుకుని) ద్వారా నీటిని అందిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం నంద్యాల వాటర్ స్కీం పనిచేయకపోవడంతో నాలుగున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. వాడుకునేందుకు నీటిని సమీపంలోని వ్యవసాయ బోర్లు, బావుల నుంచి తెచ్చుకుంటున్నాం. తాగునీరు మాత్రం ప్రతి రోజు డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు.– కె.నాగన్న, మాజీ సర్పంచ్, మల్లాపురం -
నీళ్ల కోసం జగడం
తొర్రూరు రూరల్: వరి చేలు పాలు పోసుకుంటున్నాయి.. ఆరుగాలం చెమట తీసిన రైతన్న గట్టెక్కే రోజుల దగ్గరపడ్డాయి. ఎదుగుతున్న పంట చేనును చూసి రైతన్న మురిసిపోతున్నాడు.. ఇంకో రెండు తడులు పెడితే చాలు పంట చేతికి అందుతుంది. ఎరువుల బస్తాల అప్పులు, షావుకారు మందు డబ్బాల బాకీలు, పోరగాండ్ల బడి ఫీజులు అన్నీపోనూ ఇంకో రూ.పది, పదిహేను వేలు మిగులుతాయని అన్నదాతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లోగా అనుకోని ఆప ద.. దిగువకు నీళ్లు ఇవ్వొద్దని జగిత్యాల రైతుల ఆందోళన మొదలైంది. రైతు ఐక్య వేదిక పేరుతో కాల్వ నీళ్లకు అడ్డం పడ్డరు. రైతాంగానికి అక్కడి రాజకీయ పార్టీ నేతలు మద్దతు పలికారు. కాల్వల నీళ్లు ఆగిపోతాయేమోనని ఇక్కడి రైతన్న గుండె పగులుతున్నాడు. దక్షిణ వరంగల్ ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. వరుసగా వర్షాలు లేక పాలకుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్ ప్రాంతా ల్లో పంట భూములు బీడువడ్డాయి. అప్పట్లో రబీ పంటలకు ఎస్సారెస్పీ జలాలు తీసుకొస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే హోదాలో ఎర్రబెల్లి దయాకర్రావు రైతులకు మాట ఇవ్వటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతులంతా పంటలు సాగు చేశారు. ఎర్రబెల్లి మాట ఇచ్చినట్లుగానే ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసింది. అధికారులు ఒక్కో చెరువు నింపు తూ వస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందరూ పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టు మేర రైతాంగం సాగు చేసుకుంది. చెరువులకు జల కళ.. డీబీఎం–60ప్రధాన కాల్వ ద్వారా రోజుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీటిని కాల్వల్లోకి వదిలారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లోని 49 చెరువులను నింపేలా 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 45 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాల్వ ద్వారా నీటిని వివిధ గ్రామాల చెరువులకు సరఫరా చేస్తున్నారు. డీబీఎం–57 పరిధిలో రాయపర్తి మండలంలోని 6, తొర్రూరు మండలంలోని 3 చెరువులకు 100 ఎంసీఎఫ్టీ, బయ్యన్న వాగు రిజర్వాయర్కు నీటి మళ్లింపు ద్వారా డీబీఎం 61 పరిధిలోని 6 చెరువులు, డీబీఎం 63 పరిధిలోని 4 చెరువులు, డీబీఎం–61, డీబీఎం–67 పరిధిలోని కొడకండ్ల, పెద్దవంగర మండలాల్లోని ఒక్కో చెరువుకు 200 ఎంసీఎఫ్టీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలకు అనుబంధంగా ఉన్న ఉప కాల్వల ద్వారా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ జలాలు వెళ్తున్నాయి. ఇల్లంద సమీపంలోని డీబీఎం గేటు తీయడంతో ఉప కాల్వ నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి చెరువులు సైతం నిండుతున్నాయి. రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్కు భారీగా నీరు చేరుతుండడంతో ఈ మండలానికి సాగునీరు సమృద్ధిగా లభిస్తోంది. ఇక్కడ నుంచి బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా సూర్యపేట జిల్లాకు సైతం నీటిని విడుదల చేస్తున్నారు. 145 చెరువులకు జీవం.. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 11 మండలాలకుగాను సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గోదావరి జలాలను వదిలారు. భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉండటంతో దాని నుంచి బయటపడేందుకు నీటిని కాల్వల్లోకి వదులుతున్నారు. దాదాపు 145 చెరువులు నీటితో నిండుతున్నాయి. రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,18,174 ఎకరాల ఆయకట్టు, వరంగల్ రూరల్ జిల్లాలో 32,636 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఉత్తర తెలంగాణకు సాగు నీరందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్తోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతోంది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ద్వారా ఐదు పాత జిల్లాలకు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. జగిత్యాల రైతుల ఆందోళన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు వచ్చే నీళ్లను నిలిపివేసి అక్కడి రైతాంగానికి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాలు పోసుకునే దశలో ఉన్న వరి చేలు ఎండిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ దక్షిణ ప్రాంత రైతాంగం జల పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో ఉంది. గతంలో దేవాదుల ఎత్తిపోతల ద్వారా చలివాగు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించి మోటార్ల ద్వారా పాలకుర్తి, జనగామ ప్రాంతాలను నీళ్లందిస్తుండగా అక్కడి రైతులు ఓ రాజకీయ పార్టీ అండతో అప్పట్లో మోటార్లను బలవంతంగా బంద్ చేయించడంతో ఇక్కడి రైతుల పంట పొలాలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసే.. మాది కరువు ప్రాంతం. వానలు సరిగా కురవవు. పంటను కాపాడుకోలేక రైతన్న పడుతున్న కష్టాన్ని స్వయంగా చూసిన. నేరుగా సీఎంను కలిసి రైతుల కన్నీటి గాథను వివరించిన. ఎస్సారెస్పీ నీళ్లు ఇచ్చి ఆదుకోండని ప్రాథేయపడిన. ఆయన తక్షణమే స్పందించి రోజుకు 900 క్యుసెక్కుల నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. చెరువులు నిండాయి. వరి చేలకు నీరందుతోంది. ఒక్క నా నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందుతోంది. రైతులు సంతోషంగా ఉన్నారు. పైన రాజకీయపరమైన ఆందోళనలు ఏవో జరుగుతున్నాయని తెలుస్తోంది. రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎర్రబెల్లి దయాకర్రావు, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే నీళ్లాపితే సావే దిక్కు.. ఇప్పుడైతే ఎస్సారెస్పీ నీళ్లు అందుతున్నాయి. వరి చేను పాలువోసుకుంటోంది. చెరువులకు నీళ్లు వచ్చి పంటకు పారుతోంది. కానీ ఎగువన రాజకీయం జరుగుతుందట. నీళ్లు ఆపుతారనే పుకార్లు అస్తున్నాయి. గీ టైంలో నీళ్లు ఆపితే సచ్చిపోవుడు తప్ప ఇంకోటి లేదు. – వెంకటసాయిలు, వెలికట్ట, తొర్రూరు బోరు బాగా పోస్తుంది.. గతంలో బోరు సన్నగా పోసేది. ఎకరాకు కూడా నీరు సరిపోయేది కాదు. ఎస్సారెస్పీ జలాలతో భూమిలో నీరు పెరిగి బోరు బాగా పోస్తుంది. మూడెకరాల మేర సాగు చేసిన పంటలకు నీరు సరఫరా అవుతున్నాయి. ప్రతి సీజన్లో గోదావరి నీరు సరఫరా చేస్తే బాగుంటుంది. – వెంకన్న, రైతు, మైలారం, రాయపర్తి నా పంట బయటపడ్డట్టే.. గోదావరి నీళ్లతో చెరువు నిండింది. నా వరి పంట చేతికి అందుతోంది. ఎప్పుడో వర్షాలు పడితే చెరువులోకి నీళ్లు వచ్చేవి. లేకుంటే చెరువు ఎండిపోయేది. ఇక నా పంట చేతికి అందినట్టే. –జక్కుల ఐలయ్య, రైతు, ఈరవెన్ను -
గుంటూరు గొంతులో గరళం
గుంటూరు నగరం గొంతులో గరళం నింపుకొంది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనులతో రోడ్లను యథేచ్ఛగా తవ్వేశారు. ఈ పనులతో తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా పైపులైన్లలోకి మురుగుచేరి తాగు నీరు కలుషితమవుతోంది. కుళాయిల నుంచి వస్తున్న నీరు భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. సోమవారం పలు ప్రాంతాల్లో పైపులైన్ల నుంచి ఎర్రటి నీరు వచ్చింది. తాగునీటి సరఫరా ఇంత అధ్వానంగా ఉన్నా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చి నెలలో తాగునీరు కలుషితమై అతిసార వ్యాధి ప్రబలి సుమారు 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు అయినా అధికారులు స్పందించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంపాలెం(గుంటూరు): గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో గత మార్చి నెలలో మంచినీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెంది దాదాపు 30 మంది మరణించినా నగరపాలక సంస్థ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. నగరంలో ఇంకా పలు ప్రాంతాల్లో కలుషితనీరు సరఫరా అవుతూనే ఉంది. నీరు దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. కలుషిత నీరు తాగటం వలన చిన్నపిల్లలు, వృద్ధులు తరుచుగా రోగాల బారిన పడుతున్నారు. దీంతో భయాందోళనతో రోజూ రూ.30 నుంచి 40 వెచ్చించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నామని నగరవాసులు వాపోతున్నారు. యూజీడీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలు నెలల తరబడి పూడ్చకపోవటంతో వాటిల్లో మురుగునీరు చేరి లీకుల ఉన్న పైపుల ద్వారా ఇళ్లలోకి కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయి. దీనితో పలు ప్రాంతాల్లో తరుచు కలుషిత నీరు సరఫరా అవుతుంది. పట్టాభిపురంలో ఎర్రమట్టి నీరు సరఫరా పట్టాభిపురం ప్రాంతంలో సోమవారం మంచినీటి పైపులైన్లో ఎర్రమట్టి నీరు రావటంతో స్థానికుల్లో కలకలం రేగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇక్కడ నీరు సరఫరా అవుతుంది. తరుచుగా ఇక్కడ దుర్వాసన, మట్టితో కూడిన నీరు సరఫరా అవుతుండగా సోమవారం మాత్రం పూర్తిగా ఎర్రమట్టితో కూడిన నీరు సరఫరా అయింది. దాదాపు గంటన్నర వరకు పూర్తిగా మట్టినీరు వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేరు. సమీప ప్రాంతంలో ఆదివారం కేబుల్ నెట్వర్క్ పనులు కోసం పైపులు ఏర్పాటు చేస్తుండగా పట్టాభిపురం 4వ లైనుకు మంచినీరు సరఫరా చేస్తున్న 90ఎంఎం డయా పైపులైను అడుగున్నర పైనే పగిలిపోయింది. ఈ విషయం ఇంజినీరింగ్ అధికారులు గమనించకుండా నీటిని విడుదల చేయటంతో కుళాయిల్లో ఎర్రమట్టి నీరు సరఫరా అయింది. నిర్లక్ష్యంగా ఇంజినీరింగ్ అధికారులు నగరంలో నీటిసరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. నగరంలోని శ్యామలానగర్, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, కేవీపీ కాలనీ, పాతగుంటూరు, ఐపీడీ కాలనీ, శివనాగరాజుకాలనీ, రాజీవ్గాంధీనగర్, గుంటూరువారితోట, శారదాకాలనీ, ముత్యాలరెడ్డి నగర్లోని చాలా వరకు ప్రాంతాల్లో కలుషితనీరు, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని తరుచుగా ఫిర్యాదులు అందుతున్నాయి. గత మార్చిలో డయేరియా సంఘటన జరిగిన తరువాత ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ సైతం నీటి సరఫరా సమయంలో సంబంధిత రిజర్వాయర్ ఏఈలతో పాటు, డీఈలు, ఈఈలు, ఇంజనీరింగ్ సిబ్బంది వార్డుల్లో పర్యటించి పర్యవేక్షించాలన్నారు. పైపులైను లీకులు గమనిస్తే వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, మురుగుకాల్వలో నుంచి వెళుతున్న మంచినీటి పైపులైనులు పక్కకు మార్చాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవేమీ అమలుజరగటం లేదు. నామమాత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పీహెచ్ వాల్యూను పరీక్షలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. సంబంధిత ఏఈలు సైతం డివిజన్లలో లీకులు గుర్తించటం, పాడైపోయిన పైపుల స్థానంలో నూతన పైపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయటం వంటివి చేయడం లేదు. ఇక డివిజన్లలో యుజీడీ, సైడుకాల్వల ఏర్పాటుకు, ప్రైవేటు టెలికం సంస్థలు గుంతలు తీస్తున్నప్పుడు వారికి పైపులైన్లపై కనీస సమాచారం కానీ, క్షేత్రస్థాయిలో వారి పనులను పర్యవేక్షించటం కాని జరగటం లేదు. దీనివలనే ఎక్కువ ప్రాంతాల్లో పైపులకు లీకులు, మరమ్మతులు గురవుతున్నాయి. మురుగునీరు సరఫరాపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఇంజినీరింగ్ అధికారులు సక్రమంగా స్పందించటం లేదు. పురసేవ, 103 ద్వారా వచ్చే ఫిర్యాదులకు సైతం నూతన పైపులైన్లు ఏర్పాటు చేస్తాం అని, పాత పైపులు కాబట్టి లీకులు అవుతున్నాయని సమాధానం ఇచ్చి ఫిర్యాదులను పరిష్కరించకుండానే క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. -
దేవుడా.. ఈ నీళ్లు తాగి ఎలా బతకాలి
తాగునీరు డ్రైనేజీ నీరును తలపిస్తోంది.. రంగుమారి దుర్గంధం వెదజల్లుతోంది..దేవుడా ఈ నీళ్లు ఎలా తాగాలంటూ గూడూరు పట్టణవాసులు ఘోషిస్తున్నారు.గూడూరు పట్టణంలో డిమాండ్ తగ్గట్టుగా తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేదిఅరుదు. అరకొరగా సరఫరా అవుతున్న నీరు కూడా దారుణంగా ఉంటోందనిప్రజలు ఆగ్రహిస్తున్నారు. నీటి సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులుస్పందించడం లేదు. తరచూ పైపులైన్లు పగిలిపోతుండడంతో కండలేరునుంచి సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోంది. వర్షాలు సక్రమంగాకురవక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మున్సిపల్ నీరేదిక్కయింది. మురుగు నీరొస్తోందని అధికారులను ప్రజలు అడుగుతుంటేసమాచారం లేదంటూ తప్పించుకుంటున్నారు. గూడూరు: గూడూరు పట్టణానికి కండలేరు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. పైపులు నాసిరకంగా ఉండడంతో అవి తరచూ పగిలిపోతూ కలుషిత నీరు వస్తోంది. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ లీకులను సరి చేయకపోవడంతో సరఫరా అవుతున్న నీరు కూడా కలుషితంగా మారి, మురుగు నీటిని తలపించేలా ఉంది. ఆ నీరే పట్టణ ప్రజలకు దిక్కవుతోంది. అసలే జ్వరాల తీవ్రతతో ఆస్పత్రుల పాలై అల్లాడుతుంటే, సరఫరా అవుతున్న కలుషిత నీరు తాగితే మరిన్ని జబ్బులు వచ్చి మంచాన పడతామని వారు వాపోతున్నారు. దీంతో విధి లేక క్యాన్ వాటర్నే కొని తాగాల్సి వస్తోందని, దీంతో ఖర్చు మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం గూడూరు పట్టణ జనాభా 78,700 ఉండగా 12,400 ఇళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో పట్టణానికి ఒక రోజుకు 10 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంది. సగటున ఒక్కొక్కరికీ 100 లీటర్ల నీటిని అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం అధికారికంగా 5,541 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా అదే సంఖ్య ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. పగులుతున్న పైప్లైన్లు కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని సరఫరా చేసే పైపులు నాసిరకమైనవి ఏర్పాటు చేయడంతో అవి పలు ప్రాంతాల్లో తరచూ పగిలిపోయి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. అలా పగిలిపోయిన పైప్లను తిరిగి మరమ్మతులు చేసే క్రమంలో సక్రమంగా చేయకపోవడంతోనే ఆ ప్రాంతంలో లీక్ అయి మురుగు నీరు పైపుల్లోకి ప్రవహించి దుర్గంధభరితమైన తాగునీరు సరఫరా అవుతోంది. ఒక్కోసారి అసలు తాగునీరే సరఫరా కాక వాటి కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోం దని పట్టణ ప్రజలు వాపోతున్నారు. స్పందించాల్సిన ప్రజాత్రినిధులు, అధికారులు మిన్నకుండిపోతున్నారు. -
చట్టం.. వారి ఇష్టం!
ఉన్న చట్టాలనే సరిగా అమలు చేయడంలేదు.. మళ్లీ కొత్త చట్టాలతో బోలెడు నిబంధనలు.. ముందస్తు చర్చలు శూన్యం.. వారి నిర్ణయమే శిరోధార్యం.. టీచర్ అడ్మినిస్ట్రేషన్ (ఉపాధ్యాయ పాలన), టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (ఉపాధ్యాయ బదిలీలు) ప్రత్యేక చట్టాలకు సంబంధించి ఇటీవల ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. దీనిపై ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. కొత్త చట్టాలను తీసుకొస్తూ తమ జీవితాలతో ఆడుకుంటోందని, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయులు, సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప ఎడ్యుకేషన్/బద్వేలు: ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్న చట్టాలను ప్రభుత్వం అమలు చేయకపోగా కొత్తవి తేవడంపై ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొంతన లేని నిర్ణయాలతోపాటు కొత్తకొత్త చట్టాలను తీసుకొస్తూ తమ జీవితాలతో ఆటలాడుకుంటుందని వాపోతున్నారు. టీచర్ అడ్మిషన్(ఉపాధ్యాయ పాలన), టీచర్స్ ట్రాన్సఫర్ యాక్ట్ (ఉపాధ్యాయ బదిలీలు) ప్రత్యేక చట్టాలకు సంబంధించి ఇటీవల ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో బిల్లును ఆమోదించి, చట్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో మాటమాత్రమూ చర్చింకుండానే విద్యాశాఖ ఏకపక్షంగా బదిలీల ముసాయిదా చట్టాన్ని రూపొందించడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విషయంలో కోర్టులు సైతం జోక్యం చేసుకోవడానికి వీలులేకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని ఆరోపిస్తుస్తున్నారు. గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలతో జిల్లాలో పలు యాజమాన్యాలలో పనిచేస్తున్న దాదాపు 12 వేలమంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపనుంది. సౌకర్యాలు శూన్యం జిల్లాలోని పలు పాఠశాలలకు సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోక పోగా ఉపాధ్యాయులకు కొత్తకొత్త చట్టాలెందుకని పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించి తర్వాత ఉపాధ్యాయుల అడ్మినిస్ట్రేషన్ , బదిలీల చట్టాల గురించి ఆలోచించాలని వారు హితువు పలుకుతున్నారు. సర్వీస్ ఆధారంగా ఉపాధ్యాయులకు సంబంధించి పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులకు సంబంధించిన హక్కులను అమలు చేసి తర్వాత నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు. బదిలీ విధానం ఇలా.. గత ఏడాది ఆగస్టు 2017 జరిగిన బదిలీల్లో ఉపాధ్యాయుల సర్వీస్పాయింట్లతోపాటు ప్రతిభ ఆధారిత పాయింట్లద్వారా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. పనితీరు సూచికలు తొలగించాలని కోరుతూ ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. బదిలీలపైన ఇంత గందరగోళం జరిగినా, ఉపాధ్యాయులు, సంఘాలురోడ్డు ఎక్కి ఆందోళన చేసినా ప్రభుత్వం అవన్నీ మరచిపోయి తిరిగి శాశ్వత బదిలీల చట్టం పేరుతో తీసుకొచ్చిన ముసాయిదాలో మళ్లీ అవే పాయింట్లు 70 శాతం మేర తీసుకోవడం వివాదాస్పదం అవుతుంది. ఉపాధ్యాయుల బయోమెట్రిక్హాజరుకు 10 పాయింట్లు, సంగ్రహణాత్మక పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యానికి 15 పాయింట్లు ఫ్రొఫిసిడల్ డెవలఫమెంట్ 15 పాయింట్లు, జాతీయ, రాష్ట్ర అవార్డులు పొందిన వారికి 5 పాయింట్లు, రీసోర్సు పర్సన్లుగా పనిచేసిన వారికి 5 పాయింట్లు, డిజిటల్ విద్యాబోధనలో పాల్గొన్నందుకు 15 పాయింట్లు, సైన్సు, లెక్కల ప్రదర్శన శాలలకు 5 పాయింట్లు స్టూడెంట్ ఎన్రోల్మెంట్కు 5 పాయింట్లు, మధ్యాహ్నం భోజన వివరాలను ఆన్లైన్లో పంపినందకు 5 పాయింట్లు, పాఠశాల యాజమాన్య సమావేశాలు నిర్వహించినందుకు 5 పాయింట్లు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు 4 పాయింట్లు, విద్యార్థులను డ్రాపౌట్స్గా మారకుండా చూసినందుకు 8 పాయింట్లు ఇలా వందపాయింట్లను ప్రామాణికంగా తీసుకుని బదిలీలు చేపట్టనున్నారు. నియంతలా వ్యవహిరిస్తున్నప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ పాలన ఉపాధ్యాయుల మనోభావాలకు విరుద్ధంగా ఉంది. ఉపాధ్యాయ సంఘాల వాదనను పెడచెవిన పెడుతూ నియంతలా వ్యవహరిస్తోంది. ఎటువంటి శాస్త్రీయత లేని అసంబద్ధమైన విషయాలను ప్రమాణికంగా తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు ముడిపెట్టడం సరైయిందికాదు. చాలా పాఠశాలల్లో సర్వర్లు పనిచేయక బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది ఎదుర్కొంటుంటే పాయింట్లు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు. – శ్యాంసుందర్రెడ్డి, ఏపీటీఎఫ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆందోళన చేస్తాం గత బదిలీల్లో ప్రతిభ ఆధారిత పనితీరు సూచికలు తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం తిరిగి అవే నిబంధనలనే బదిలీల చట్టంలో పొందుపరచడం అంటే ఉపాధ్యాయులను భయాంధోళనకు గురి చేయడమే. చట్ట నిబంధనలను సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం. – రమణారెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాఠశాలకు సౌకర్యాలు కల్పించాలి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి. నేటికి చాలా పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు, మంచీనీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నిర్వహణ పేరుతో ఇచ్చే గ్రాంటు కరెంటు బిల్లులకు సరిపోవడం లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఉపాధ్యాయుల గురించి ఆలోచిస్తుంది. ఇదెక్కడి న్యాయం – బాలగంగిరెడ్డి, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయులకు ప్రత్యేకమా...? కొంత కాలంగా పాయింట్ల విధానాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017 బదిలీలలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. మరోసారి తెరపైకి పాయింట్ల విధానాన్ని తీసుకురావటం సరికాదు. ఏశాఖకు లేని పాయింట్ల విధాననం మాకే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు. దీనిపై మా సంఘం రాష్ట్ర నాయకులకు వ్యతిరేకత తెలియజేస్తాం. – సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విభేదాలు వచ్చే అవకాశముంది చాలా సార్లు యాప్లు సరిగా పని చేయక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి సంబంధించిన అంశాలు అన్లైన్లో నమోదు కావు. హెచ్ఎంలకు పాయింట్లు వచ్చే అవకాశముంది. దీంతో పాయింట్లు రాని ఉపాధ్యాయులకు హెచ్ఎంలతో విభేదాలు ఏర్పడే అవకాశముంది. పాయింట్ల విధానంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తే బాగుంటుంది. – రామక్రిష్ణారెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు -
లెక్క తేలుస్తున్నారు..!
సాక్షి కడప : ప్రతి మనిషికి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ ఎంతమందికి సమకూరుతున్నాయి. ప్రజలకు సంబంధించి సౌకర్యాల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమిటి? ప్రభుత్వాలు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయా? లేదా ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? అంగవైకల్యానికి సంబంధించి బాధితులెందరు? ఇతర అనేక సమస్యలకు జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) సంస్థ ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రతి ఏడాది అనేక అంశాలపై సర్వే చేస్తున్న కేంద్రం పరిధిలోని నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయ సిబ్బంది జులై నుంచి జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంగవైకల్యం, స్వచ్ఛబారత్ లాంటి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకుంటున్నారు. ప్రాధాన్యత అంశాలపై సర్వే ఈ ఏడాది జులైలో మొదలైన సర్వే డిసెంబరు వరకు తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యం, అంగవైకల్యం తదితర ప్రాధాన్యత అంశాలపై కొనసాగుతుంది. ప్రజలు వ్యాధుల బారిన పడటం.. శిశు మరణాలు కూడా అధికంగా ఉండటాని కి కారణం సురక్షితం కాని తాగునీటి వినియోగం, బహిరంగ మల విసర్జన, మురుగు నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోవడమేనని చెప్పవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం ప్రక్షాళన చేపట్టడం ప్రభుత్వాల కర్తవ్యం. అయితే ఇవి ఎంతమాత్రం గ్రామీణ, పట్టణ స్థాయిలో అమలవుతున్నాయో తెలుసుకోవడంతోపాటు ఇతర కారణాలను కూడా సేకరిస్తున్నారు. అంగవైకల్యంపై వివరాల సేకరణ ఆధునిక సమాజంలో అంగవైకల్యం గల వారు సామాజికంగా, ఆర్థికంగా అసమానతలకు గురవుతున్నారు. పలు సంక్షేమ పథకాలు వారి కోసం అమలు చేస్తున్నారు. అయితే కుంటి, గుడ్డి, శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యత, అటిజం తదితర మానసిక వైకల్యం రావడానికి పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా అంగవైకల్యం గల వారికి పునరావాసం కల్పించే విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాల వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు తీరు తెన్నులపై జిల్లాలో సర్వే సాగుతోంది. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులతోపాటు వాటి ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు అనుగుణంగా నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం 76వ విడత సర్వేలో భాగంగా అనేక కీలక అంశాలను సేకరిస్తోంది స్వచ్ఛ భారత్కు సంబంధించిన మరుగుదొడ్లతోపాటు బహిరంగ మల విసర్జన, స్థానిక పరిస్థితులు, వనరులపై క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. నిష్ణాణుతులైన సిబ్బందితో సర్వే నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం సుశిక్షితులైన క్షేత్రస్థాయి సిబ్బందిని ఎంపిక చేసుకుని సర్వే చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10 గ్రామీణ ప్రాంతాలతోపాటు ఎనిమిది పట్టణ ప్రాంతాల్లో బ్లాక్లలో తిరుగుతూ వివరాలు సేకరిస్తారు. సంబంధిత ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను కలిసినా....వాటిలో లెక్కవేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసిన కొన్ని కుటుంబాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి సంబంధిత షెడ్యూల్లలో నింపుతారు. ఇందుకోసం దాదాపు 10 మంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఆరుగురు సూపర్వైజర్లు, 175 శ్యాంపిళ్లను సేకరించనున్నారు. సేకరించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సర్వేతో ఎన్నో ప్రయోజనాలు ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆరు నెలల్లో సర్వేను పూర్తి చేసి సంబంధిత ఉన్నత కార్యాలయాలకు నివేదికలు పంపిస్తారు. దాని ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. సర్వే ఆధారంగా అక్కడి పరిస్థితులను అంచనా వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కలుగుతుంది. ప్రజలు సహకరించాలి సరైన సమాచారం లేకుండా ఏ విషయంపైనైనా విధాన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ఈ సర్వే విజయం, లక్ష్యసాధన ప్రజలు అందించే సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది. అసంపూర్తి, అసత్య సమాచారాన్ని అందించడం వల్ల ప్రణాళిక రూపకల్పన దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ప్రజలంతా ఈ సర్వే ప్రాముఖ్యతను గుర్తించి తమ వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు, కచ్చితమైన సమాచారాన్ని అందించి విజయవంతం చేయాలి. – మనోహర్, డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ఓ సర్వే -
జల జగడం
జక్రాన్పల్లి (నిజామాబాద్ రూరల్): మండలం లోని పెద్దవాగులో నిర్మించిన చెక్డ్యాం నుంచి నీ టి విడుదల గ్రామాల మధ్య జల జగడానికి దారి తీసింది. ఇరువైపుల నుంచి ప్రజలు పెద్ద సంఖ్య లో తరలి రావడంతో శనివారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నీరు వదలాలని ఒకరు, వదలద్దని మరొకరు పట్టుబట్టడంతో పెద్ద వాగులో వాదులాట జరిగింది. అయితే, అధికారులు వేగంగా స్పందించడంతో ప్రస్తుతానికైతే జల వివాదం సద్దుమణిగింది. జక్రాన్పల్లి మండలంలోని కలిగోట్, చింతలూర్ గ్రామాల మధ్య గల పెద్దవాగులో ప్రభుత్వం రూ.3.50 కోట్లతో చెక్ డ్యాం నిర్మించింది. ఈ చెక్ డ్యాంకు కుడి వైపున మాటు కాలువ ద్వారా నడ్కుడ చెరువులోకి నీరు వెళ్లేలా ఆరు అడుగులతో కూడిన ఒక గే టు(షట్టర్)ను బిగించారు. అయితే, ఇటీవలి వర్షాలకు చెక్డ్యాం నిండడంతో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చెక్ డ్యాంను ప్రారంభించి, షట్టర్ను తెరిచి నడ్కుడ చెరువులోకి నీటిని విడుదల చేశారు. గేటు మూసేయడంతో వివాదం.. అయితే, చెక్డ్యాంలో నిలువ ఉన్న నీరు వెళ్లిపోతుండడంతో కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు శనివారం ఉదయం చెక్ డ్యాం వద్దకు వెళ్లి షట్టర్ను మూసివేశారు. ఈ విషయం తెలిసి నడ్కుడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలిగోట్ వద్దకు తరలి వచ్చారు. అప్పటికే అక్కడ కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు ఉండడంతో ఏం జరుగుతుందోన్న ఆందోళన నెలకొంది. వాగులో గుమి గూడిన ఆయా గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. సమాచారమందుకున్న నీటిపారుదల శాఖ ఈఈ రాధాకిషన్రావు, డీఈలు నాగేశ్వర్రావు, గోపినాథ్, జక్రాన్పల్లి, వేల్పూర్ తహసీల్దార్లు సతీశ్రెడ్డి, అర్చన, ఆర్మూర్ రూరల్, ధర్పల్లి సీఐలు పాలగొల్లు రమణారెడ్డి,« చందర్రాథోడ్, జక్రాన్పల్లి, వేల్పూర్ ఎస్సైలు సురేశ్కుమార్, ప్రభాకర్ అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. అనంతరం ఒక్కో గ్రామం నుంచి పది మంది చొప్పున ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, మంది రైతులతో అధికారులు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. నీళ్లు వదలాలి: నడ్కుడ వాసులు.. ఇరవై ఏళ్లుగా తాగు, సాగునీటికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, చివరకు ప్రజాప్రతినిధుల సహకారంతో చెక్ డ్యాం నిర్మించుకుంటే ఇ ప్పుడు వచ్చి నీటిని అడ్డుకోవడం సరికాదని నడ్కుడ వాసులు తెలిపారు. 250 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న చెరువులో ప్రస్తుతం ఒక్క నీటి బొట్టు లేదని, తాగునీరు కూడా దొరకడం లేదన్నారు. చె క్డ్యాం నిర్మాణ సమయంలోనే అడ్డు చెప్పకుండా కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు ఇప్పుడు నీళ్లు వదలకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. చెక్ డ్యాంకు నిర్మించిన గేటును తెరిచి నడ్కుడ చెరువులోకి నీటిని వదలి ఆదుకోవాలని కోరారు. ఒప్పుకోబోమన్న కలిగోట్, చింతలూరు గ్రామస్తులు.. అయితే, చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని కలిగోట్, చింతలూరు ప్రజలు స్పష్టం చేశారు. చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీరు కాకుండా అదనపు నీటిని వదిలితే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. వాగు ప్రవ హించినప్పుడు, రామడుగు ప్రాజెక్టు సర్ప్లస్ వా టర్ వచ్చినపుడు మాత్రమే షట్టర్ ద్వారా నీళ్లు వదలాలని సూచించారు. వాగు పారకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని, తాగు, సాగునీరుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అధికారులు పరిశీలించి ఇరు గ్రామాల రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అధికారులు ఉన్నతాధికారులకు ఫోన్లో పరిస్థితిని వివరించారు. అయితే, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఇరు గ్రామాల ప్రజలు రెండు గంటల పాటు వేచి చూశారు. అనంతరం ఆర్మూర్ సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల కు విన్నవించామని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం చెబుతామన్నారు. ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం ఇరు గ్రామాల ప్రజలు నడుచుకోవాలన్నారు. ఇరు గ్రామాల ప్రజలు సంయమ నం పాటించాలని, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవని సూచించారు. ఎలాంటి నిర్ణయం వచ్చినా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇరు గ్రామాల ప్రజలు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తాగునీటి కోసం ధర్నా
కొడంగల్ రూరల్ వికారాబాద్ : ‘వారం రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్నాం. కొన్నాళ్లు బోరు సమస్య, మరికొన్నాళ్లు విద్యుత్ సమస్యతో నీటి కటకట ఏర్పడింది. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో ధర్నాకు దిగాం.. ఓపిక నశించి రోడ్డెక్కాం’.. అంటూ బొంరాస్పేట మండలంలోని రేగడిమైలారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి ఇబ్బందులను తీర్చాలని కోరుతూ గురువారం బీజాపూర్– హైదరాబాద్ అంతర్రాష్ట్ర హైవేపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. రేగడిమైలారం పటేల్చెర్వు వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వారమైంది. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. దీంతో మండిపోయిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినదించారు. వీరి నిరసనతో వాహనాల రాకపోకలు స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించారు. ట్రాఫిక్ ఎస్ఐ మల్లారెడ్డి ట్రాన్స్కో ఏఈతో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ సమస్య తీరుస్తా మని ఏఈ సాంబయ్య హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు. ట్రాన్స్కో ఏఈ సందర్శన తాగునీటి సమస్యకు విద్యుత్ సమస్య అంతరా యం ఏర్పడిన విషయంపై ట్రాన్స్కో ఏఈ సాం బయ్య పరిశీలించారు. ఎస్ఐ మల్లారెడ్డితో మాట్లా డి విద్యుత్ సమస్య నెలకొన్న కాలనీలో విద్యుత్ తీగలను సరి చేయించారు. కానీ ట్రాన్స్ ఫార్మర్ చెడిపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయించి విద్యుత్ సమస్య తీరుస్తామని ఏఈ హామీ ఇచ్చారు. స్నానాలకూ తిప్పలే తాగునీటి కోసం నేను నిత్యం నడవలేకపోతున్నా. రోడ్డు దాటి అవస్థలు పడుతుంటే ప్రజాప్రతినిధులు చూసి కూడా స్పందించడం లేదు. వృద్ధులు, చిన్నారులు నిత్యం అవస్థలు పడుతూ నీళ్లు తెచ్చుకుంటున్నాం. స్నానాలకు కూడా తిప్పలే ఉంది. తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలి. – ఆంజనేయులు, దివ్యాంగుడు, ఎస్సీకాలనీ వంటకు నీళ్ల కరువు తాగడానికి నీళ్లు లేక వానకాలంలోనూ ఇబ్బంది పడుతున్నాం. ఒక దిక్కు నీళ్ల కోసం, మరో దిక్కు రోడ్డు పనులు జరుగుతున్నాయి. బిందెడు నీళ్ల కోసం దూరంలో ఉన్న బోరు నుంచి తెచ్చుకుంటున్నాం. ఇట్లా ఎన్నిరోజులు అవస్థలు పడాలే. వంట చేసుకునేందుకు చెంబెడు నీళ్లు లేని పరిస్థితి. – సులోచన, బండమీది కాలనీ సమస్య పరిష్కరించాలి గ్రామంలో మిషన్ భగీరథ, రోడ్డు విస్తరణ పను లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో రోడ్డు కు ఇరువైపులా రాకపోకలు పెరిగి తాగునీటి పైపులైన్లు తెగాయి. తాగునీటి సమస్య ఏర్ప డింది. తాగునీటి బోర్లకు విద్యుత్ సరఫరా లైన్లు వేరేగా ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలి. – మొగులయ్య, రేగడిమైలారం -
నీటి కోసం పోటీ!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వినియోగంపై వేడి మొదలైంది. ఎగువ నుంచి దిగువ శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తుండటం, ప్రాజెక్టు నిండేందుకు మరో 100 టీఎం సీలే అవసరం ఉండటంతో ఆ నీటిపై తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించాయి. వీలైనంత ఎక్కువ నీరు పొందేలా పావులు కదుపుతున్నాయి. తమకు 21.5 టీఎంసీల మేర కావాలని కృష్ణా బోర్డుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విన్నవించగా.. వచ్చే 4 నెలల కాలానికి 115 టీఎంసీలు అవసరమని తెలంగాణ వివరించింది. అయితే ప్రస్తుతానికి 2 నెలల అవసరాల ఇండెంట్ మాత్రమే ఇవ్వాలని బోర్డు సూచించడంతో ఆ వివరాలు పంపే పనిలో తెలంగాణ నిమగ్నమైంది. సాగర్ సాగుకు 65 టీఎంసీలు శ్రీశైలానికి ఇప్పటికే 88 టీఎంసీల కొత్త నీరు చేరడంతో ఆ నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. ఏపీ ఇప్పటికే తన అవసరాలకు సంబంధించి కృష్ణా బోర్డుకు ఇండెంట్ సమర్పించింది. పోతిరెడ్డిపాడు కింద 9 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద 7.4 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీల చొప్పున తక్షణం కేటాయించాలని కోరింది. ఇండెంట్ సమర్పించిందే తడవుగా హంద్రీ–నీవా కింద 1,248 క్యూసెక్కుల నీటిని బుధవారం నుంచి తరలిస్తోంది. తెలంగాణ కూడా కల్వకుర్తి, సాగర్ కింద తాగు, సాగు నీటి అవసరాల వివరాలు తెప్పించుకుంది. కల్వకుర్తి కింద 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినందున దానికి 33 టీఎంసీలు, తాగునీటికి 7 టీఎంసీలు కలిపి 40 టీఎంసీలు కావాలని అధికారులు నివేదించారు. నాగార్జునసాగర్ కింద సాగునీటి అవసరాలకు 50 టీఎంసీలు, ఏఎంఆర్పీ కింద సాగుకు 15 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి మరో 10 కలిపి 75 టీఎంసీలు కోరారు. కానీ ఆగస్టు అవసరాల వరకే పంపాలని బోర్డు సూచించడంతో ఆ మేరకు లెక్కలు కుదించి గురువారం తెలంగాణ లేఖ రాసే అవకాశం ఉంది. లేఖలు అందగానే బోర్డు సమావేశం ఏర్పాటు చేసి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనుంది. రోజుకు 22 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు ఈసారి పూర్తి జలకళను సంతరించుకుంటోంది. 215.81 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో గతేడాది ఈ సమయానికి 19.41 టీఎంసీలే నిల్వ ఉండగా ప్రస్తుతం 117.2 టీఎంసీల నీరు ఉంది. ఈ వారంలో సగటున రోజుకు 12 టీఎంసీలకుపైగా నీరొచ్చింది. ప్రస్తుతం 2.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. అంటే రోజుకు సగటున 22 టీఎంసీలు. ఎగువ ఆల్మట్టి నుంచి 1.45 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1.52 లక్షల క్యూసెక్కుల మేర స్థిరంగా ప్రవాహం వస్తుండటం.. దీనికి తుంగభధ్ర నుంచి 56 వేల క్యూసెక్కుల నీరు తోడవడంతో మరో ఏడెనిమిది రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. అదే జరిగితే గతేడాదికి భిన్నంగా అక్టోబర్కు బదులు జూలై చివర్లోనే నాగార్జునసాగర్కు నీటి విడుదలయ్యే అవకాశం ఉంది. సాగర్ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 133.37 టీఎంసీల నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు (టీఎంసీల్లో), ప్రవాహాలు (క్యూసెక్కుల్లో) ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్ఫ్లో ఔట్ఫ్లో గతేడాది ఇదేరోజు నిల్వ ఆల్మట్టి 129.72 113.56 1,45,000 1,45,696 98.67 నారాయణపూర్ 37.64 32.61 1,44,796 1,52,765 32.95 తుంగభద్ర 100.86 93.54 66,363 56,625 31.27 జూరాల 9.66 8.73 1,80,000 1,94,986 6.70 శ్రీశైలం 215.81 117.2 2,46,164 6,338 19.41 సాగర్ 312.05 133.37 0 460 117.21 -
నీటి కష్టాలు వీడితే ఒట్టు!
సూళ్లూరుపేట: పట్టణంలో ప్రతి కుటుంబం తాగునీరు కొనుగోలు చేసి తాగాల్సిందే. పేట జనాభా సుమారు 48 వేలమంది. 15 వేల కుటుంబాలున్నాయి. జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. మొత్తం పది ఓవర్హెడ్ ట్యాంకులున్నాయి. ఇందులో కొన్ని శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చివేశారు. అధికారుల సమాచారం ప్రకారం సమ్మర్ స్టోరేజీ నుంచి, ఇతరవాటి నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్లు ఇవ్వాలి. ఈ లెక్కన 48 వేల మందికి సుమారు 34 లక్షల లీటర్లు ఇవ్వాలి. అయితే 10 లక్షల లీటర్లు కూడా అందించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెనీరు అందడం గగనంగా మారింది. కొనాల్సిందే.. పట్టణంలో ప్రస్తుతం నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. మున్సిపాలిటీ 30 ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తోంది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్ల రూపాయలు గడిస్తుంటే ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కళాక్షేత్రలో స్వజలధార కింద మున్సిపల్ స్థలంలో మున్సిపాలిటీ వనరులు, నీరు వాడుకుంటూ డాక్టర్స్ వాటర్ అనే సంస్థ నీటి వ్యాపారం చేస్తోంది. బిందెనీటిని రూ.4కు, 20 లీటర్ల క్యాన్ను రూ.15 విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా ప్రకటనలకే పరిమితమైంది. 1వ వార్డు, 15వ వార్డు, 13వ వార్డుల్లో ప్లాంట్స్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో క్యాన్ను రూ.20కు, బిందెనీటిని రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. ఓ అంచానా ప్రకారం నెలకు రూ.కోటి పైనే నీటి వ్యాపారం జరుగుతోంది. -
హాస్టల్లో నీళ్ళు లేక స్మశానంలో స్నానాలు..
-
అకటా.. తాగునీటికి కటకట..!
వర్షాకాలం ప్రారంభమైనా పల్లెలు దాహార్తితో అల్లాడుతున్నాయి. తాగునీటి కోసం కొన్ని గ్రామాల్లో ట్యాంకులను ఆశ్రయిస్తుండగా, ఇంకొన్ని గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు లేక డైరెక్ట్ పంపింగ్ చేస్తుండడంతో కరెంటు ఉన్నపుడే నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో మోటార్లు, తాగునీటి బోర్లు మరమ్మతులకు గురై నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలమనేరు: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 పంచాయతీలుండగా 500దాకా గ్రామాలున్నాయి. ఇందులో 55 గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పలమనేరు మండలంలో పాలమాకులపల్లి, కమాలపురం, నడిమిదొడ్డిపల్లి, ఊసరపెంట, కృష్ణాపురం, సుబ్బనాయుడు ఇండ్లు, తొప్పనపల్లి తదితర గ్రామాల్లో నీటికి సమస్యలు తప్పడం లేదు. బైరెడ్డిపల్లి మండలంలోని బేలుపల్లి, గంగవరం మండలంలో పెద్ద ఉగిని, పెద్దపంజాణిలో అప్పినపల్లి, పెద్దవెలగటూరు తదితర గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందిగా ఉంది. తాగునీటి సమస్య తాండవం పీలేరు: పీలేరు మండలంలో పీలేరుటౌన్, ఇంది రమ్మ కాలనీ తోపాటు కావలిపల్లె, జాండ్ల పంచా యతీల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. కేవీపల్లె మండలంలో కుమ్మరపల్లె, తోటిహరిజనవాడ, రాములవారిపల్లె, గర్నిమిట్ట తదితర గ్రామాల్లో సమస్య అధికం. గుర్రంకొండ మండలంలోని రామాపురం, వంకాయలవారిపల్లె, గంగిరెడ్డిగారిపల్లె, రెడ్డివారిపల్లె, మామిళ్లవారిపల్లెలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ఎగువ అమిలేపల్లి, టి.రాచపల్లె, కొత్తపల్లె, మర్రిపాడు, బోడుమల్లువారిపల్లె, మర్రిపాడు, భూమక్కవారిపల్లె, దళితవాడ, శ్రీనివాసపురం, నడిమికండ్రిగ, గెరికుంటపల్లె గ్రామాల్లోని తాగునీటి బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. వాల్మీకిపురం మండలంలో నగిరిమడుగు, బురుజుగడ్డ, కొత్తపల్లె, దిగువబూడిదవేడు, సాకిరేవుపల్లె, విఠలం కుందేలువారిపల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కలికిరి మండలంలో గుండ్లూరు, మల్రెడ్డిగారిపల్లె, చెరువుముందరకురవపల్లె, కొటాల, మహల్కొత్తపల్లె, కలికిరి ఇందిరిమ్మ కాలనీ, జంగంపల్లె, కర్రేవారిపల్లెలో సమస్య జటిలంగా ఉంది. తాగునీటి సమస్యపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలంలోని మోటుమల్లెల గ్రామ పంచాయతీలోని వడ్డేవాండ్లపల్లె, వంకిరెడ్డిగారిపల్లె, పెద్దమల్లెల గ్రామంలోని దుస్సావాండ్లపల్లెలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే చిచ్చిలివారిపల్లె పంచాయతీలోని రావిళ్లవారిపల్లె, లోకవారిపల్లె గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. రావిళ్లవారిపల్లెలో తాగునీటి సమస్యపై 15 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే వంకిరెడ్డిగారిపల్లెలోనూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారం రోజుల క్రితం గ్రామంలో పర్యటించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ తాగునీటి బోరు వేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. వరదయ్యపాళెంలో.. వరదయ్యపాళెం: మండలంలోని పెద్దపాండూరు పంచాయతీ వెంగారెడ్డికండ్రిగ దళితవాడ, చిన్నపాండూరు పంచాయతీ రామలక్ష్మమ్మ కండ్రిగలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వెంగారెడ్డికండ్రిగలో రెండునెలల క్రితం బావిలో పూడిక పేరుకుపోవడంతో మోటార్లు కాలిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అప్పట్నుంచి తాగునీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. దాహం తీర్చే వారేరీ..? సోమల: మండలంలోని తమ్మినాయునిపల్లె పంచాయతీ కురవపల్లె, నాయనివారిపల్లె, దళితవాడ సోమల పంచాయతీలోని బీసీ కాలనీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తాగునీటి సమస్య రాజ్యమేలుతోంది. తమ్మినాయునిపల్లె పి.చెరుకువారిపల్లెకు రెండేళ్లుగా తాగునీటి సమస్య ఉంది. బీసీ కాలనీకి నీటి సరఫరా పైపులైన్లు సక్రమంగా లేక, తరచూ బోరు మరమ్మతుకు గురవుతుండడంతో గ్రామస్తులు పొలాల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న బోరు మరమ్మతుకు గురై తహసీల్దార్, ఉపాధి, వెలుగు, గృహనిర్మాణ శాఖ, భవిత కార్యాలయాలతో పాటు దిడ్డివారిపల్లె గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కష్టాలు తప్పేనా..? శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో పలు ప్రాంతా ల్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పట్టణంలో చెంచులక్ష్మికాలనీతో పాటు కాగితాల హరిజనవాడ, కైలాసనగర్కాలనీ, ఎంఎంవాడ తదితర ప్రాంతాల్లో ఇక్కట్లు పడుతున్నారు. శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతంలో గొల్లపల్లి, మంగళపురి, గుండ్లకండ్రిగ, మేలచ్చూరు, టీఎంవీకండ్రిగ గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఎంవీకండ్రిగలో తరచూ పంచాయితీ మోటార్ మరమ్మతులకు గురికావడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏర్పేడు మండలంలోని పాగాలి, పాతవీరాపురం, మోదుగమాల, తొట్టంబేడు మండలంలోని శేషమనాయుడుకండ్రిగ, పిల్లమేడు, కల్లిపూడి, బోనుపల్లి, రేణిగుంట మండలం కరకంబాడి, తారకరామనగర్, రేణిగుంటలో తాగునీటికి కటకటలాడుతున్నారు. -
నీళ్లు లేవు.. మీ పిల్లల్ని తీసుకెళ్లండి
‘‘పాఠశాలలో నీళ్లు లేవు.. మీ అమ్మాయి ఇబ్బందులకు గురవుతోంది. స్కూల్కు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లండి. మళ్లీ నీటి పునరుద్ధరణ జరిగిన అనంతరం ఫోన్ చేస్తాం. అప్పుడు తీసుకురండి’’ అంటూ కస్తూర్బాగాంధీ పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చెబుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితి మోమిన్పేట మండలం చంద్రాయన్పల్లిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఉంది. మోమిన్పేట: నెల రోజులుగా తాగునీరు, వినియోగించడానికి నీరు లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రోజులకోమారు స్నానాలు చేస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. స్వయంగా ఉపాధ్యాయులే విద్యార్థినిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లలను కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్లమని పురమాయిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. గ్రామానికి దూరంగా అడవిలో ఉన్న పాఠశాల కావడం నీరు లేక వ్యక్తిగత పనులకు ఆరు బయటకు వెళ్తున్నారు. రాత్రివేళ బహిర్భూమికి వెళ్లేందుకు విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దెబ్బకు విద్యార్థులు పాఠశాలను వీడుతున్నారు. పాఠశాల ఖాళీ అవుతున్నా ఉన్నతాధికారులు నెల రోజులుగా పట్టించుకోకపోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇది.. మోమిన్పేట మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 240 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 11 మంది ఉపాధ్యాయులు, 8 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ పాఠశాల అంతటికి ఒకటే బోరు బావి ఉంది. గత ఏప్రిల్ వరకు బోరుబావిలో బాగానే వచ్చిన నీరు అకస్మాత్తుగా రావడం లేదు. జూన్లో పాఠశాల పునఃప్రారంభం కాగానే బోరులో ఉన్న మోటారు పని చేయడం లేదు. కొత్తగా ఇంకో మోటారు బిగిస్తే గంటకు 2 బిందెల నీరు కూడా రావడం లేదు. బోరుబావి అడుగున కూలిపోవడంతో నీటికి కటకట ఏర్పడింది. తిరిగి ఫ్లషింగ్ లేదా కొత్త బోరు వి తవ్వించాలి. నెల గడుస్తున్నా చర్యలు ఏవి తీసుకోకపోవడంతో విద్యార్థినుల బాధలు చెప్పలేనివి. పాఠశాల ఇన్చార్జి ప్రత్యేకాధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చలనం లేదు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల కష్టం చూడలేక వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లండి.. ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వారంలో పాఠశాల పూర్తిగా ఖాళీ కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే దీనిపై విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే పదో తరగతి విద్యార్థినిల సంగతేమిని ప్రశ్నిస్తున్నారు. సమస్య వెంటనే పరిష్కరించి విద్యార్థులకు సక్రమంగా బోధన కొనసాగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బాలకృష్ణపై మహిళల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. తాగునీటి సమస్యను తెలియజేస్తూ మహిళలు ఖాళీ బిందలతో ఆయన ముందు నిరసన తెలిపారు. నియోజవర్గంలోని చిలమత్తూరులో శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చాలా మంది మహిళలు తమ సమస్యలు తెలియజేయడానికి రాగా.. వారిని పట్టించుకోకుండా ఆయన ప్రసంగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాగు నీటి సమస్యను విన్నవించేందుకు ఖాళీ బిందెలతో వచ్చిన మహిళల నుంచి సీఐ వెంకటేశ్వర్లు వాటిని లాక్కున్నారు. సీఐ, ఎమ్మెల్యే తీరుపై నియోజక వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తీరంలో తాగునీటికి కటకట
మొగల్తూరు : జిల్లాకు సుదూరంగా ఉన్న మండలం మొగల్తూరు. ఈ తీరప్రాంత మండలంలోని 17 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా ఈ మండలంలోని గ్రామాల ప్రజలకు తాగునీరందడం లేదు. కాలువలో పుష్కలంగా నీరున్నా గుక్కెడు నీరందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఏ గ్రామం చూసినా తాగునీటి సమస్యే. తాగునీటి సమస్య తీర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సమస్య పరిష్కరించామని ప్రజాప్రతినిధులు చెప్పుకుంటుండగా వారికి అధికారులు వంత పాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చుట్టూ నీరున్నా తాగేందుకు ఉపయోగం లేక గుక్కెడు నీటి కోసం రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సమస్యే మండలంలోని కేపీ పాలెం, కాళీపట్నం, మొగల్తూరులో భారీ మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. శేరేపాలెం, కొత్తపాలెం, జగన్నాథపురం గ్రామాల్లో పంచాయతీ చెరువులున్నాయి. కేపీ పాలెం ప్రాజెక్టు ద్వారా కేపీ పాలెం నార్త్, కేపీపాలెం సౌత్, పేరుపాలెం నార్త్, పేరుపాలెం సౌత్, ముత్యాలపల్లి, మోడి, వారతిప్ప, కొత్తకాయలతిప్ప గ్రామాలకు నీరందించాల్సి ఉంది. కాళీపట్నం ప్రాజెక్టు ద్వారా కాళీపట్నం తూర్పు, పడమర, పాతపాడు, జగన్నాథపురం, కోమటితిప్ప, వారతిప్ప గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కాళీపట్నం ప్రాజెక్టులో పైపులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వారం రోజులుగా నీరందడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నా తమ దాహార్తిని తీర్చడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగల్తూరు ప్రాజెక్టులో ఇలా.. ఇక మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు 32 శివారు ప్రాంతాలకు నీరందించాల్సి ఉంది. ప్రస్తుతానికి మొగల్తూరుకు మాత్రమే నీరందిస్తున్నారు. విద్యుత్ మోటార్ సమస్య కారణంగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది.తాగునీటిని టిన్నులతో కొనుగోలు చేసుకుంటున్నారు. ముత్యాలపల్లి పంచాయతీకి సరఫరా కావల్సిన తాగునీరు గత వారం రోజులుగా అందకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని చుక్కనీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. వారానికోసారి నీరిచ్చినా గ్రామస్తులు అనేకమంది అనధికారికంగా మోటార్లు బిగించుకోవడంతో దిగువ ప్రాంతానికి నీరందడంలేదని, అనధికారకంగా బిగించుకున్న మోటార్లు తొలగించాలని కోరుతున్నారు. అనధికారిక మోటార్లు తొలగించాలి తమ ప్రాంతంలో అనేకమంది అనధికారిక మోటార్లు వేసుకోవడంతో దిగువ ప్రాంతానికి నీరందడంలేదు. ఈ విషయాన్ని అ«ధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లినా స్పందించడంలేదు. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుంటే తాగు నీరందించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.– మల్లాడి కొండమ్మ, కాళీపట్నం -
కందకాల పుణ్యమా అని బోర్లలో కంటిన్యూగా నీళ్లు!
కందకాలు తవ్వుకున్నందు వల్లనే ఈ వేసవిలో తమ తోటలో నీటికి కరువు లేకుండా బోర్లు నిరాటంకంగా నీటిని అందిస్తున్నాయని ఉద్యాన తోటల ప్రకృతి వ్యవసాయదారుడు మంచికట్ల సత్యం ఘంటాపథంగా చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్గూడెం వద్ద 13 ఎకరాల్లో బొప్పాయి, దానిమ్మ, జామ, మామిడి తోటలను ఆయన సాగు చేస్తున్నారు. వాననీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన ఈ రైతు.. పండ్ల మొక్కలు నాటక ముందే కందకాలు తవ్వుకొని సాగునీటి భద్రత పొందడం విశేషం. 2016 జూలైలో భూమిని కొనుగోలు చేశారు. కందకాల గురించి ‘సాక్షి సాగుబడి’ ద్వారా తెలుసుకున్న ఆయన తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్రెడ్డి(94407 02029)లను వెంటబెట్టుకెళ్లి వారి సూచనల ప్రకారం కందకాలు తవ్వించుకున్నారు. 3 బోర్లు వేయించారు. కందకాలలో నుంచి పొంగిపొర్లిన నీరు వృథాగా పోకుండా చూసుకోవడానికి నీటి కుంటను సైతం తవ్వించారు. భూమి వాలు ఎక్కువగా ఉన్నచోట 30 మీటర్లకు ఒక వరుసలో, వాలు తక్కువగా ఉన్నచోట 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున పొలం అంతటా కందకాలు తవ్వించారు. కందకాల మధ్యలో ట్రాక్టర్లు, బండ్లు వెళ్లడానికి 20 మీటర్ల మేరకు ఖాళీ వదిలారు. కందకాలు తవ్విన తర్వాత అనేకసార్లు వర్షాలు కురవడంతో నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకిందని, అందువల్లనే ఈ ఎండాకాలం కూడా తమ బోర్లు ఒకటిన్నర ఇంచుకు తగ్గకుండా, నిరంతరాయంగా నీటిని అందిస్తున్నాయని సత్యం వివరాంచారు. 2017లో నెలరోజులు వర్షాలు అదేపనిగా కురిసినప్పుడు కూడా చుక్క నీరు తోట దాటి బయటకుపోలేదని, అందువల్లే సాగునీటికి ఢోకాలేకుండా ఉందన్నారు. బోర్ల నుంచి ముందు నీటిని ప్లాస్టిక్ షీట్ వేసిన నీటి కుంటలోకి తోడి పెట్టుకొని.. అవసరం మేరకు పండ్ల తోటలకు అందిస్తున్నారు. తమ ప్రాంతంలోని తోటల్లో బోర్లు కొన్ని ఎండిపోగా, మిగతావి ఆగి ఆగి పోస్తున్నాయని, తమకు ఆ సమస్య రాకపోవడానికి కందకాలే కారణమని సత్యం భావిస్తున్నారు. భూమి మీద పడిన ప్రతి చినుకునూ కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకింపజేసుకుంటే రైతులకు నీటి కొరత అనే సమస్యే రాదన్నారు. అయితే, రైతులు కందకాల ప్రాధాన్యం గురించి తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని సత్యం(79810 82542) అంటున్నారు. -
ఎమ్మెల్యే మణిగాంధిపై విరుచుకుపడ్డ జనం
బురాన్దొడ్డి(సి.బెళగల్) : ‘‘అయ్యా మేము నాలుగేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వడం లేదు. మేము సచ్చాక పింఛన్ ఇవ్వాలనుకున్నారా..?’’ అంటూ వృద్ధులు ఎమ్మెల్యే మణిగాంధీని, అధికారులను నిలదీశారు. బుధవారం మండల పరిధిలోని బురాన్దొడ్డిలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ నోడల్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనెనాయక్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ సిద్ధాలింగమూర్తి, తహసీల్దార్ అన్వర్హుసేన్, ఆర్అండ్బీ ఏఈ ఫణీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులు గంగన్న, జాన్, వితంతువులు వరలక్ష్మి, సువర్ణ, మైబూబాబీ, గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ పింఛన్కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో తాగడానికే నీళ్లు లేవని గ్రామస్తులు దేవరాజు, మాదన్న, ఆనంద్ తదితరులు అధికారులను నిలదీశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీలకు శ్మశానానికి స్థలం కేటాయించాలని చంద్రన్న, సుంకన్నలు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమనెమ్మ, అధికారులు పాల్గొన్నారు. -
నగరానికి ఎక్కిళ్లు !
బెజవాడలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఓ పక్క మండుటెండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో పక్క గుక్కెడు నీరు దొరక్క నగరవాసుల గొంతులెండిపోతున్నాయి. ట్యాంకర్ల వద్ద బిందెడు నీరు పట్టుకోవాలంటే భగీరధ ప్రయత్నం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. రెండు మూడు రోజులకొకసారి కూడా నీళ్లు రాకపోవడంతో రోజువారీ అవసరాలూ తీర్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గొంతు తడవక ఎక్కిళ్లు వస్తున్నాయంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని నేపథ్యంలో నగరంలో ప్రస్తుత జనాభా దాదాపు 15 లక్షల వరకు చేరింది పెరుగుతున్న జనాభాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరగటం, శివారు ప్రాంతాల్లో నూతన గృహ సముదాయాలు ఏర్పడటంతో తాగునీటి డిమాండ్ పెరిగింది. శివారు ప్రాంతాల్లోని రామలింగేశ్వరనగర్, ప్రకాష్నగర్, భవానీపురం, కరెన్సీనగర్లో ఇటీవల కాలంలో భవన నిర్మాణాలు ఎక్కువయ్యాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా కావడం లేదు. కొండప్రాంతాలైన వన్టౌన్లోని ఆంజనేయవాగుసెంటర్, చిట్టినగర్, భవానీపురం, ఎర్రకట్ట, గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతం, మాచవరం, గుణదల, మొగల్రాజపురం, క్రీస్తురాజపురం ప్రాంతాలతోపాటు పటమట, ఆటోనగర్, భవానీపురం, కృష్ణలంక, ప్రకాష్నగర్, సింగ్నగర్లోని ఇందిరానాయక్నగర్ ప్రాంతంలో తాగునీటి కోసం జనం అలమటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పాత పైపులైన్లు ద్వారానే నీటి సరఫరా కొనసాగుతోంది. డిమాండ్కు అనుగుణంగా నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. చాలా ప్రాంతాల్లో మూడు–నాలుగు అంగుళాల పైపులే ఉంటున్నాయని, వీటిని తొలగించి ఆరు అంగుళాల పైపులు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పురోగతి లేని పనులు... కార్పొరేషన్ పరిధిలోని 59 డివిజన్లలో అ«ధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీటి ఎద్దడిని నిరోధించటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలొచ్చాయి. 14వ ఫైనాన్స్ కమిటీ నుంచి నిధులు ఖర్చు చేయటానికి పాలకపక్షం సిద్ధమయినప్పటికీ కొండప్రాంతాల్లో, స్లమ్ ఏరియాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, వాటర్ట్యాంకుల నిర్మాణాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటీవల మేయర్ కోనేరు శ్రీధర్కు కార్పొరేటర్ల నుంచి పలు ప్రతిపాదనలు వచ్చాయి. 32వ డివిజన్లో 5 ఎంజీడీ ప్లాంట్కు ఇన్టెక్వెల్ నిర్మాణం, హెడ్ వాటర్వర్క్స్లోని 5 ఎంజీడీ ప్లాంట్ నిర్మాణం, 28వ డివిజన్లోని హౌసింగ్బోర్డు కాలనీలో 1500 కేఎల్ఎస్ఆర్ నిర్మాణం, 53వ డివిజన్లో ఎక్సెల్ప్లాంట్ హౌసింగ్, పక్కనే ఉన్న గద్దె వెంకటరామయ్యనగర్లో 1000 కేఎల్ కెపాసిటీ తాగునీటి నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఇప్పటి వరకు పనుల పురోగతి లేదు. 2వ డివిజన్లోని కనకదుర్గా నగర్ కాలనీ, రామచంద్రనగర్, ఇతర క్రాస్ రోడ్లకు 400 ఎంఎం డయాట్రంక్లైన్ వేయటం, 12వ డివిజన్లోని పటమట లంకలోని 1500 కెఎస్ఎస్ఆర్ నిర్మాణం, 2వ డివిజన్లోని గురునానక్కాలనీలో 1000 కేఎల్ కెపాసిటీ ఈఎల్ఎస్ఆర్ నిర్మాణం, 19వ డివిజన్లోని నిమ్మతోట కొండ ప్రాంతంలో 200 కేఎల్ కెపాసిటీ జీఎల్ఎస్ఆర్ నిర్మాణం చేపట్టేదుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేసవి ముగుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ తలపెట్టిన పనుల్లో ఎలాంటి çపురోగతిలేదు. కొండపైకి నీరు కష్టమే... ఆయా ప్రాంతాల్లో సమ్మర్ యాక్షన్ప్లాన్ కింద రూ. 15 కోట్లు నిధులు ఖర్చుచేస్తున్నట్లు పాలకులు చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. ఇప్పటి వరకు సమ్మర్ యాక్షన్ప్లాన్లో కొండప్రాంతాల్లో నీరు కొండపైకి ఎక్కేందుకు బూస్టర్లు కొత్తవి ఏర్పాటు చేయటం, పాతవి మరమ్మతులుకు చేయాలని ప్రకటించారే తప్పా వాటి ఆయా యంత్రాలు యథాతథంగా మరమ్మతులు జరుగుతునే ఉన్నాయి. ఆయా పనులకు, బూస్టర్ల కొనుగోలు/మరమ్మతులు, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ. కనీసం రూ. 5 కోట్లు కూడా ఖర్చుచేసిన దాఖలాలు లేవని ప్రతి పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. కొండ ప్రాంతవాసులంటే చులకన కొండప్రాంతవాసులంటే ప్రభుత్వానికి, అధికారులకు చులకన భావం ఉన్నట్లుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలు నివసించే ప్రాంతంలో అర్ధరాత్రిపూట తాగునీరు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు నీళ్లు ఇచ్చేది కూడా గంట మాత్రమే. అవసరమైన మేరకు నీరు సరఫరా చేయటంలో అధికారులు విఫలమయ్యారు. వేసవిలో ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్న మూడు–నాలుగు రోజులకు ట్యాంకర్లు వస్తున్నాయి. మా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. – కె. ఆంజనేయులు, చిట్టినగర్ -
తాగునీటి సౌకర్యం కూడా లేదు
సీసలి గ్రామ మహిళలు మాది సీసలి సమీపంలోని ఎస్సీ కాలనీ. సుమారు 700 కుటుంబాలకు ఇళ్లు లేక, తాగునీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం అంటూ వడ్ల మాణిక్యం, గారం మరియమ్మ, బూడి స్వరూపాణి తదితరులు జగన్మోహన్రెడ్డిని కలుసుకుని తమ గోడు చెప్పుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేయాలంటూ జననేతకు విజ్ఞప్తి చేశారు. -
తాగునీటి ఎద్దడి తీవ్రం
నెల్లూరు(అర్బన్): గత సమావేశాలకు భిన్నంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. దర్గామిట్టలోని నూతన జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సంతాప సభలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాల్సి ఉండటంతో అత్యవసరమైన నీటి ఎద్దడి అనే అంశంపై మాత్రమే సభ్యులు చర్చిం చాలని కోరారు. మిగిలిన అంశాలను వాయిదా వేశారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పొంగూరు నారాయణ తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేయాలని కోరారు. నీటి ఎద్దడి, ఉన్న నిధులు, తాగునీటి పథకాలపై మా ట్లాడాల్సిందిగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డికి బొమ్మిరెడ్డి సూచించారు. రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ఏడాది మే, జూన్ నెలల్లో 300 గ్రామాల్లో తాగునీటి సమస్యలు వస్తాయని అంచనా వేశామని, ఎద్దడి నివారణ కోసం రూ.9.05 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని కృష్ణారెడ్డి బదులిచ్చారు. మూడు నెలల క్రితం జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని చెప్పారని, ఇప్పుడూ అదే చెప్పడం సరికాదని జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయా..? మీ దగ్గర ఎంత నిధులున్నాయో సభలో మంత్రుల ముందే చెప్పాలని కోరారు. తమ వద్ద రూ.రెం డు కోట్లు ఉన్నాయని, సమస్య ఉన్న చోట వాడుకోవచ్చని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తెలిపారు. కొత్తగా బోర్లు వేసే దానికి అనుమతి లేదని, ప్రస్తుతం 20 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. దీం తో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ.. అనుమతుల్లేవని ఎలా అంటారంటూ పొంతన లేకుండా మాట్లాడారు. అత్యవసరమైతే బోర్లు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్తో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించాలని జేసీ వెట్రిసెల్వికి సూచించారు. పొంతన లేని సమాధానాలు ఫ్రీజింగ్తో తాగునీటి పథకాలకు 14వ ఆర్థిక సంఘ నిధులను ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడటం దారుణమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సైతం ఫ్రీజింగ్ వల్ల తాగునీటికి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో సోమిరెడ్డి అడ్డు తగులుతూ.. ఫ్రీజింగ్ను తొలగించామని, ఆర్థిక సంఘానికి చెందిన 30 శాతం నిధులను గ్రామాల్లో తాగునీటి సరఫరా, పైపుల మరమ్మతులకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని సభలో తెలపాలంటూ ఎస్ఈకి సోమిరెడ్డి సూచించడ ంతో.. ఫ్రీజింగ్ తొలగించారని ఇక ఇ బ్బ ంది లేదని బదులిచ్చారు. దీంతో మరో సారి మంత్రుల మాటలకు అధికారుల చె ప్పే దానికి పొంతన లేకుండా పోయిం ది. సీపీడబ్ల్యూ స్కీమ్ అవినీతిపై దుమారం జిల్లాలో ఏర్పాటు చేసిన సమగ్ర తాగునీటి పథకం(సీపీడబ్ల్యూ)లో అవినీతి రాజ్యమేలిందని అధికార పార్టీకి చెందిన కోవూరు జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. జిల్లాలో 35 చోట్ల ఒకే కాంట్రాక్టర్ పనులు చేపట్టారని, 2015లో కోవూరులో రూ.ఐదు కోట్లతో ప్రారంభమైన పథకంలో మోటార్ ఆన్ చేస్తే పైప్లైన్లు పగిలిపోతున్నాయని విమర్శించారు. అలాంటి కాంట్రాక్టర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని సోమిరెడ్డి ఆదేశించారు. మొదట ఎంత అవినీతి జరిగిందో నిగ్గుతేల్చాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. పెన్నా బ్యారేజీకి దిగువన ఉన్న 17 గ్రామాల్లో భూగర్భజలాలను పెంచేందుకు, కలుషిత నీటిని అరికట్టేందుకు నదిలో నీటిని వదలాలని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ ఎస్ఈకి మందలింపు 20 రోజుల క్రితం వచ్చిన పెనుగాలులకు తమ పంచాయతీలో ఒక విద్యుత్ స్తంభం నేలకొరిగిందని, ఇప్పటికీ స్తంభాన్ని మార్చలేదని దుత్తలూరు జెడ్పీటీసీ మల్లికార్జున తెలిపారు. వెంటనే స్తంభాన్ని మార్చాల్సిందిగా మంత్రి సూచించారు. పాఠశాల స్థాయిలో ప్లస్ 2 బోధన ప్రారంభించాలి గత జెడ్పీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిరుపేద విద్యార్థులకు ఈ ఏడాది నుంచే పాఠశాల స్థాయిలో పది నియోజకవర్గాల్లో ఇం టర్ విద్యను ప్రారంభించాలని మంత్రి పొం గూరు నారాయణకు బొమ్మిరెడ్డి సూచిం చారు. గతంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, ప్లస్ 2 విద్యను ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ బీద రవి చంద్ర కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుం టానని మంత్రి నారాయణ తెలిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష, సీఈఓ సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు తదితరలు పాల్గొన్నారు. ఆనం వివేకాకు ఘన నివాళి నెల్లూరు(అర్బన్): సుదీర్ఘ రాజకీయ చరిత్ర, తనకంటూ ఒక ప్రత్యేకతను చా టుకొని జిల్లా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి మృతికి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో స భ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులర్పి ంచారు. తొలుత రెండు నిమి షాలు మౌనం పాటించారు. అనంతరం ఆనం కుటుం బసభ్యులకు తమ సా నుభూతిని తెలియజేశారు. తొలుత జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో విలక్షణ నా యకుడు ఆనం వివేకా అన్నారు. చిన్నపిల్లల్లో పిల్లాడిగా, వీఆర్ విద్యా సంస్థల కార్యదర్శిగా, కరస్పాండెంట్గా, సిం హపురి సేవాసమితి స్పోర్ట్స్ స్థాపకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారంలో చు రుకైన నాయకుడిగా ఆనం వివేకానందరెడ్డి పేరుపొందారన్నారు. రాజకీయంగా విభేదాలున్నా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కలిగిన ప్రజా మనిషి అని మంత్రి సోమిరెడ్డి గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మా ట్లాడుతూ.. వివేకానందరెడ్డి మృతి జిల్లా ప్రజానీకానికి, వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని లోటన్నారు. నెల్లూరు కోసం, కుటుంబం కోసం ఉన్నత రాజకీయ పదవులు వదులుకున్న వ్యక్తి, అపర చాణక్యుడు అన్నారు. తాను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు సభకు వచ్చి అనేక సూచనలిస్తూ తన ఉన్నతికి సలహాలిచ్చేవారని గుర్తుచేసుకున్నారు. జెడ్పీటీసీలు వెంకటశేషయ్య, చేజర్ల వె ంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ సత్యనారాయణ సంతాపం తెలియజేశారు. -
నీటి సమస్యతో విశాఖ వాసుల ఇక్కట్లు
-
పానీపాట్లు..
చింతలమానెపల్లి(సిర్పూర్): పల్లె ప్రజల గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. అందులోనూ మహిళల అవస్థలు వర్ణానాతీతం. ఆ గ్రామంలో తాగునీటి ఇక్కట్లకు ఈ చిత్రాలే నిదర్శనం. చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నీరు కలుషితంగా మారగా.. తాగేందుకు వినియోగించలేని పరిస్థితి. దీనికి తోడు గ్రామంలో చేతి పంపుల చుట్టూ మురుగు నీరు నిలిచి ఉండడంతో వాటినీ ఉపయోగించడం లేదు. దీంతో కొత్తవాడ, కమ్మరివాడ, సాత్పుతె వాడ ప్రజలు స్థానిక ఉన్నత పాఠశాలలోని చేతిపంపునీటిని తాగునీటిగా వినియోగిస్తున్నారు. కాగా పాఠశాలకు వేసవి సెలవుల కారణంగా గేటుకు తాళం వేయడంతో మహిళలు ఇలా గోడ దూకి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దాహార్తి తీర్చాలని మహిళల ఆందోళన
విస్సన్నపేట(తిరువూరు): మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని రాజీవ్కాలనీవాసులు మంగళవారం సత్తుపల్లి– విస్సన్నపేట ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీబిందెలతో రాస్తారోకో చేశారు. తమ కాలనీకి గత నెల రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒహెచ్ఆర్ ద్వారా పంచాయతీ ఆధ్వర్యంలో నీరు సరఫరా కావటం లేదని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే వేసవి ఎండలు అధికంగా ఉన్నాయని, తాగేందుకు నీరు దొరక్క దాహార్తితో అలమటిస్తున్నామని ఆవేదన చెందారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. పంచాయతీ ఈవో సరోజిని దృష్టికి సమస్య తీసుకెళ్లినా తగిన రీతిలో స్పందించలేదని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని చెప్పారు. మహిళలకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఎస్ఐ బి.తులసీధర్ రాస్తారోకో ప్రదేశానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పి విరమింపజేశారు. అధికారులను పిలిపించి మాట్లాడారు. ఈవోపిఆర్డీ శంకరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చక్రధర్ స్థానికులతో సంప్రదింపులు చేశారు. త్రీపేజ్ కరెంట్తో మోటారు నడుస్తున్నందున తగిన విధంగా విద్యుతు సరఫరా లేకపోవటంతో ఓహెచ్ఆర్ నిండటం లేదని వారు చెప్పారు. రాజీవ్కాలనీలో ఉన్న చేతి పంపునకు సింగిల్పేజ్ మోటారు అమర్చి తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. -
కన్నీటి పాట్లు
సాక్షి, మెదక్: జిల్లాలో అధికారికంగా 160 గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ వాస్తవంగా 200 పైచిలుకు గ్రామాల్లో నీటి సమస్య ఉంది. దీనికి తోడు భగీరథ పనులు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇటీవల పనులను పరిశీలించిన మంత్రి హరీశ్రావు పనుల పురోగతి దృష్ట్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే కాంట్రాక్టర్కు జరిమానా విధించాలని ఆదేశించారు. దీన్ని బట్టి అర్థంచేసుకొవచ్చు పనులు జరుగుతున్న తీరు. ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 19 మీటర్ల లోతుకు చేరింది. గత ఏడాదికంటే 3 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. పాపన్నపేట మండలంలో 27 గ్రామాలు, హవేళిఘణాపూర్లో 23, మెదక్లో 37, రామాయంపేటలో 26, నిజాంపేటలో 19, చిన్నశంకరంపేటలో 28 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. అయితే చేగుంట, రేగోడ్, అల్లాదుర్గం, రేగోడ్, మనోహరాబాద్, కౌడిపల్లి, చిల్పిచెడ్ మండలాల్లో సైతం నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ మండలాల్లో అన్ని కలిపి వంద గ్రామాల్లో నీటి సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. పాపన్నపేట కేజీబీవీలో ఉన్న బోరుబావి ఎండిపోవడంతో విద్యార్థులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోరోజు విద్యార్థినులు స్నానం కూడా చేయలేని పరిస్థితి. నర్సాపూర్ ఎమ్మెల్యే సొంత గ్రామం కౌడిపల్లిలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మొక్కుబడిగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారే తప్ప సరిపడా మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికే హవేలిఘణాపూర్ మండలంలోని పోచమ్మరాల్, పోచమ్మరాల్ తండాలో మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు రెండుసార్లు మెదక్ – బోధన్ ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు. సమస్య తీవ్రంగా ఉంది.. చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయితండా, మిర్జాపల్లి, శేరిపల్లి, గవ్వలపల్లి, సంకాపూర్, ఖాజాపూర్ గిరిజన తండాలు. హవేళిఘణాపూర్ మండలంలో పోచమ్మరాల్, పోచమ్మరాల్ తండా, బూర్గుపల్లి, హవేళిఘణాపూర్ తండా, గంగాపూర్, సర్థన. చేగుంట మండలంలో కంసాన్పల్లి, చిన్నశివనూరు. రేగోడ్ మండలంలో పెద్దతండా, పాపన్నపేట మండలంలో నర్సింగరావుపల్లి, లింగాయపల్లి, సోమ్లా, డాక్యా, రజ్యా, దూమ్లా తండా మెదక్ మండల పరిధిలోని శివాయిపల్లి తండా, మల్కాపూర్, మల్కాపూర్ తండా, పాతూర్, రాయిన్పల్లి, కోంటూరు, వెంకటాపూర్, రాయిన్పల్లి, మక్తాభూపతిపూర్ , నర్సాపూర్ మండలంలో కౌడిపల్లి, కూకుట్లపల్లి కాగా బ్రాహ్మణపల్లి, నాగులపల్లి తదితర గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా ప్రజలకు సరిపడా నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిట్కుల్, గౌతాపూర్ తండా, ఫైజాబాద్, కొల్చారం మండలంలో రంగంపేట, అంసాన్పల్లి, తుక్కాపూర్, వరిగుంతం, కొంగోడు, తోపాటు పలు తండాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి ఇబ్బందులతో సతమతం మా తండాలో తీవ్రమైన నీటి కొరత ఉంది. ఇక్కడ మూడు మినీ ట్యాంకులు ఉన్నాయి. కానీ వాటికి నీటి çసరఫరా లేదు. తండాలోని మహిళలు, చిన్న, పెద్ద అందరూ నీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నాం. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ఐనా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. –రాట్ల నిర్మల, ఎర్రమట్టి తండా -
ముందుంది ముప్పు !
గద్వాల : ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు పనిచేయడం లేదు. రిజర్వాయర్లు వట్టిపోయాయి. కృష్ణానదిలో నీటి ప్రవాహం కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బావులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలోని గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో వేసవికి ముందే తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయినా, ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు కరువయ్యాయి. తీరా అత్యవసర సమయంలో నిధులు మంజూరుకాకపోవడం, కేటాయింపు అరకొరగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు వేసవి రాకముందే పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు అరకొర నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని ప్రాం తాల్లో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అయిజలో తాగునీటి సమస్య జఠిలం అయిజలో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. అక్కడ ఉన్న బోరుబావులు అ డుగంటాయి. భూగర్భజలాలు వేగంగా పడిపోతుండటంతో తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు సరిపోవడంలేదు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. గద్వాల పట్టణ ప్రజలకు తాగునీటిని అందించడానికి కృష్ణా ఫిల్టర్బెడ్, జమ్ములమ్మ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. నదిలో నీరు లేకపోవడంతో కృష్ణా ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా అయ్యే కాలనీలకు తాగునీరు అరకొరగా అందనుంది. జమ్ములమ్మ రిజర్వాయర్లో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అడుగంటే పరిస్థితి ఉంది. ఇప్పటికే జూరాల కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతోపాటు గద్వాల పట్టణ శివారులో తాగునీటి ఇక్కట్లు నెలకొన్నాయి. ఇక్కడ తాగునీటి సరఫరా అరకొరగా ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక పట్టణాల గుర్తింపేదీ? గద్వాల, అయిజ పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించాల్సి ఉండగా... ఆ దిశగా కార్యాచరణ చేయలేదు. గతేడాది మాత్రం ఆయా పట్టణాల్లో తాగునీటి కోసం ఎక్కువగా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ ఏడాది ముందుగానే ఎద్దడి మొదలైన తాగునీటి అవసరాలపై చర్యలు లేకపోవడం ఆ ప్రాంతవాసులకు ఆందోళన కలిగిస్తోంది. మిషన్ భగీరథ మీదనే భారం... నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ కిందనే నీటిని అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆ నీటిని తీసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. జూరాల దగ్గర ఉన్న గ్రిడ్ ద్వారా ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటిని మున్సిపాలిటీలకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గద్వాల పట్టణ శివారులో నిర్మించిన ట్యాంకులు, సంపుల్లోకి నీటిని తీసుకొని, అక్కడి నుంచి పాత పద్ధతిలోనే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారు. అయిజ పట్టణానికి మాత్రం భగీరథ నీరు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నీటి అవసరాలు తీరేనా? గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి అవసరాలు తీవ్రంగా మారగా.. అధికారులు మాత్రం ఈ వేసవిలోనే మిషన్భగీరథ కింద నీటిని అందించాలని నిర్ణయించారు. నీటి అవసరాలు తీర్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికీ అనుమానంగా ఉంది. అయితే ప్రతి వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఆయా పట్టణాల్లో కనిపించడం లేదు. ప్రతిపాదనలు పంపిస్తాం నీటి ఎద్దడి నివారణ చర్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. గతేడాది తరహాలోనే ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు నివేదిస్తాం. మిషన్ భగీరథ కింద నీటిని ఇవ్వడానికి సైతం ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. – ఇంతియాజ్ అహ్మద్, డీఈ, గద్వాల మున్సిపాలిటీ సమస్య తీరడంలేదు తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. తాగునీరు సరఫరా కాకపోవడంతో చాలామంది అయిజలో ఫిల్టర్ నీటిని కొని తాగుతున్నారు. దుర్గానగర్కు ఇంతవరకు కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. చేతిపంపులు ఎండిపోయాయి. ఒకటే బోర్వెల్లో నీళ్లున్నాయి. దానికి పవర్మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తున్నారు. మోటార్ కాలిపోయినప్పుడల్లా నీళ్లు దొరకవు. ఎండాకాలంలో అధికారులు వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – మాణిక్యమ్మ, దుర్గానగర్, అయిజ