నేడు తుందుర్రుకు వైఎస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖి నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తుందుర్రు గ్రామానికి వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు.
– ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో ముఖాముఖి
– తణుకు సబ్జైల్లో సత్యవతికి పరామర్శ
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖి నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తుందుర్రు గ్రామానికి వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా తణుకు పట్టణానికి వస్తారు. 36 రోజులుగా అక్కడి సబ్జైలులో రిమాండ్లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని పరామర్శిస్తారు. అక్కడి నుంచి అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు చేరుకుంటారు. అక్కడ ఫుడ్పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖి మాట్లాడతారు.