కల్తీకల్లు తాగి ఇద్దరి మృతి | two died over Adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు తాగి ఇద్దరి మృతి

Published Mon, Nov 16 2015 8:22 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

రంగారెడ్డి జిల్లా తాండూరులో కల్తీ కల్లు మరోసారి పంజా విసిరింది.

తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో కల్తీ కల్లు మరోసారి పంజా విసిరింది. సోమవారం ఒక్కరోజే 60 మంది బాధితులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రిలో  చేరారు.

బాధితుల్లో మేరెడ్డిపల్లికి చెందిన భీమప్ప(40), అంజమ్మ(50) మృతిచెందారు. బాధితుల పిచ్చి చేష్టలతో, అరుపులతో జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పలువురు ఫిట్స్ రోగుల్లాగా కొట్టుకుంటుండగా.. మరి కొంత మంది వింత చేష్టలు చేస్తున్నారు. కల్తీ కల్లు తాగడం వల్ల ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని... అది దొరక్క పిచ్చి చేష్టలు చేస్తున్నారని తెలుస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement