తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది.
యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరై విద్యార్థులకు డిగ్రీలను అందచేస్తారు. తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.బలరామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేస్తారు.
ఈ స్నాతకోత్సవం సందర్బంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు వేయి మందికి డిగ్రీలను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం మహతి ఆడిటోరియంలో ఈ నెల 30 ఉదయం 10 గంటలకు జరుగుతుందని యూనివర్సిటీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.