ఇనుప కమ్మీలు గుచ్చుకుని కూలీ మృతి | Worker killed in the iron rods piercing | Sakshi
Sakshi News home page

ఇనుప కమ్మీలు గుచ్చుకుని కూలీ మృతి

Published Mon, Jul 11 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులో ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఇనుప చువ్వలు గుచ్చుకుని రమణ అనే కూలి మృతిచెందాడు.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులో ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఇనుప చువ్వలు గుచ్చుకుని రమణ అనే కూలి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు కృష్ణా పుష్కరాల పనులకు వెళ్లేందుకు ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఎక్కారు. కమ్మీలపై కూర్చుని ప్రయాణం చేస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కమ్మీలు గుండెలో గుచ్చుకుని రమణ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిలిగిన నలుగురు క్షేమంగా బయటపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement