మళ్లీ చార్‌ధామ్ యాత్ర... | ircumstances the trip again ... | Sakshi
Sakshi News home page

మళ్లీ చార్‌ధామ్ యాత్ర...

Published Fri, Mar 21 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

మళ్లీ చార్‌ధామ్ యాత్ర...

మళ్లీ చార్‌ధామ్ యాత్ర...

గత ఏడాది ఆకస్మిక వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ క్రమంగా తేరుకుంటోంది.

 గత ఏడాది ఆకస్మిక వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ క్రమంగా తేరుకుంటోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర పర్యటన అయిన చార్‌ధామ్ యాత్రను ఆ రాష్ట్ర పర్యాటకశాఖ పునఃప్రారంభించింది. ఈ ఏడాది మే 2న గంగోత్రి, యమునోత్రి, 4న కేదారనాథ్, 5న బదరీనాథ్‌లలో భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.


యాత్రికుల సౌకర్యార్థం యాత్రామార్గంలో ప్రతి 10-20 కి.మీ పరిధిలో సంచార హెల్త్ యూనిట్స్ ప్రారంభిస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ టవర్స్‌ను ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నారు. అత్యవసర హెలికాప్టర్ సేవలను ప్రయాణమార్గంలో యాత్రికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఏడాది 50 లక్షల నుంచి కోటి మంది దాకా చార్‌ధామ్ యాత్ర చేస్తారని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement