
సీఎంకు అవార్డు ఇచ్చింది కేంద్ర సంస్థ కాదు: శ్రవణ్
ముఖ్యమంత్రి కేసీఆర్కు అవార్డు ప్రకటించిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనేది విత్తనాల బ్రోకర్
అది ప్రైవేటు సంస్థ అనే విషయం తెలుసుకోకుండా గవర్నర్ అభినందనలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిని వెంటనే ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులకు బేడీలేసినందుకు ఈ అవార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో రైతును ముంచిన కంపెనీలకు అండగా ఉన్న కేసీఆర్ అవార్డుకు ఎలా అర్హుడవుతారని నిలదీశారు. భూసేకరణచట్టాన్ని అమలుచేయకుండా పోలీసులతో సీఎం దాడులు చేయించారన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ మాట్లాడటం సరికాదన్నారు.