రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి | engineering student died in an accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Published Fri, Feb 13 2015 2:31 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

కుత్బుల్లాపూర్(హైదరాబాద్): హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు అఖిల్, శశాంక్, వేణు బైక్‌పై వెళుతుండగా మహారాష్ట్రకు చెందిన ఓ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. అఖిల్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన శశాంక్, వేణును స్థానిక బాలాజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అఖిల్ సికింద్రాబాద్ వాసిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement