ఓయూ చేజేతులా.. చేజార్చుకుంది! | Indian Science Congress goes to manipur | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 27 2017 4:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Indian Science Congress goes to manipur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకమైన భారత జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు మణిపూర్‌కు తరలిపోయాయి. ఫిబ్రవరి నెలలో మణిపూర్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఈ సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాంగ్రెస్‌ సమావేశాలు జరగాల్సి ఉంది. వచ్చే నెల 3 నుంచి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు నిర్వహించలేమంటూ ఓయూ చేతులెత్తేసింది. ఓయూలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, భద్రతా కారణాల రిత్యా ఈ సమావేశాలు నిర్వహించలేమని పేర్కొంది. దీంతో ఓయూలో జరగాల్సిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు మణిపూర్‌కు తరలిపోయాయి.

హైదరాబాద్‌ నగరంలో ఇటీవల అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును, తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలందుకుంది. అంతేకాకుండా ఓయూలో ఇటీవల వందేళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఓయూలో ఘనంగా నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా సమావేశాలు నిర్వహించలేమంటూ ఓయూ చేతులు ఎత్తేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement