గ్రామ పంచాయతీలను పటిష్టం చేసేందుకు అవసరమైతే కొత్త చట్టం తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: గ్రామ పంచాయతీలను పటిష్టం చేసేందుకు అవసరమైతే కొత్త చట్టం తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆదివారం పంచాయతీరాజ్ శాఖఫై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల బాగోగుల బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కేసీఆర్ అన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం 25 వేల సైకిల్ రిక్షాల పంపిణీ చేయనున్నట్టు సీఎం వెల్లడించారు.