ఆకుపచ్చని గణేశుడు.. ఆండ్రాయిడ్‌లో ఒదిగాడు.. | lord ganesh in Android | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చని గణేశుడు.. ఆండ్రాయిడ్‌లో ఒదిగాడు..

Published Tue, Sep 15 2015 12:25 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ఆకుపచ్చని గణేశుడు..    ఆండ్రాయిడ్‌లో ఒదిగాడు.. - Sakshi

ఆకుపచ్చని గణేశుడు.. ఆండ్రాయిడ్‌లో ఒదిగాడు..

నగర వాసులకు పర్యావరణ స్పృహ అధికం. ప్రకృతిని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

నాచారం: నగర వాసులకు పర్యావరణ స్పృహ అధికం. ప్రకృతిని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను, ఎకో ఫ్రెండ్లీ ప్రతిమలను ప్రతిష్టించాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ విధానాన్ని గత కొన్నేళ్లుగా పాటిస్తున్నవారూ ఉన్నారు. నాచారం బాబానగర్‌కు చెందిన సూర్య శుభకర విఘ్న వినాయక అసోషియేషన్ ఆర్గనైజర్ సూర్యప్రకాష్ ఆరేళ్లుగా వినూత్న రీతిలో పర్యావరణ గణేష్ విగ్రహాలను రూపొందిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితికి 30 వేల దారం రీళ్లను వినియోగించి 12 అడుగుల ‘త్రెడ్ ఆండ్రాయిడ్ గణేష్’ను తయారు చేశారు. ఇందు కోసం ఆకుపచ్చని దారాన్ని వాడారు.

ఈ విగ్రహాన్ని బాబానగర్‌లో ప్రతిష్టించనున్నట్టు వివరించారు. అంతేకాదు.. పర్యావరణ ప్రేమికులు ఎవరన్నా కోరితే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేసి ఇస్తున్నారు. ఇందుకు కేవలం తయారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు లక్ష కుందన్స్‌తో ‘కుందన్ గణేష్’, 70 వేల శివలింగాలతో లింగ గణేష్, పేపర్ టీకప్స్ గణేష్‌ను కూడా తయారు చేశారు. ఈ పర్యావరణ సహిత విగ్రహాల తయారీలో తనకు మనోజ్, శేఖర్, బాలకృష్ణ, నర్సింగ్, సంజిత్, రాజు, పట్టి తదితర 15 మంది విద్యార్థులు సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement