హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇష్టానుసారంగా నిర్వహించొద్దని తెంగాణలోని విపక్ష పార్టీల సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్నికోరారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని శనివారం కలిశాయి. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికలకు 45 రోజుల సమయం ఉండాలని విపక్షాలు ఈసీని కోరాయి.
జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ ముగించాలన్న హైకోర్టు ఆదేశాలను సవరించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఎలక్షన్ కమిషన్కి విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంలో తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామని విపక్షాలు తెలిపాయి.
'గ్రేటర్ ఎన్నికలు ఇష్టానుసారంగా నిర్వహించొద్దు'
Published Sat, Jan 2 2016 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM
Advertisement
Advertisement