ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి | one dies in road accident in balanagar | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

Published Thu, May 12 2016 11:04 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

one dies in road accident in balanagar

బాలానగర్ (హైదరాబాద్): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఐడీపీఎల్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... జగద్గిరిగుట్టకు చెందిన కెవెన్‌కుమార్ (19) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల్లో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

పనిమీద బాలానగర్ వచ్చి గుట్టకు తిరిగి వెళ్తుండగా ఐడీపీఎల్ కాలనీ యూటర్న్‌లో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement