తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మియాపూర్ ఆల్విన్ కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. కాలనీలోని 122 నంబర్ ప్లాట్ లో తలుపులు, బీరువాలు పగలగొట్టిన దుండగులు.. 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.