హైదరాబాద్: కాల్ మనీ కేసులో మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి సోమవారం ఆరోపించారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. టీడీపీ మేనిఫెస్టోను రెండో ముద్దాయిగా ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందునే మహిళలు కాల్ మనీ రుణాలను ఆశ్రయించారన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరపాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
'మొదటి ముద్దాయి చంద్రబాబే'
Published Mon, Dec 14 2015 5:32 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement