అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్ సమావేశమయ్యారు.
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్ సమావేశమయ్యారు. భారత్-అమెరికా సంబంధాల గురించి చర్చించారు.
క్లింటన్ దంపతులు సుమారు 45 నిమిషాల పాటు మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఇటీవల అమ్మమ్మతాతాయ్యలు అయిన క్లింటన్ దంపతులను మోడీ, సుష్మా అభినందించారు.