Bill Clinton
-
కార్టర్కు కన్నీటి వీడ్కోలు
వాషింగ్టన్: దిగ్గజ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్కు అమెరికా ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. దేశ రాజధాని వాషింగ్టన్లో జరిగిన అధికారిక నివాళుల కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్ సెల్యూట్ చేసి తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. గురువారం వాషింగ్టన్ సిటీలోని జాతీయ చర్చికు కార్టర్ పార్థివదేహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక సంతాప కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నివాళుల కార్యక్రమంలో అధ్యక్షుడు బైడెన్తోపాటు అగ్రరాజ్య మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షులుగా సేవలందించిన ఐదుగురు అగ్రనేతలు ఇలా ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018 డిసెంబర్లో మాజీ దేశాధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ సంతాప కార్యక్రమానికి ఇలా ఒకే చోట ఐదుగురు అధ్యక్షులు హాజరయ్యారు. కార్టర్కు ఘనంగా అంజలి ఘటిస్తూ బైడెన్ తన సంతాప సందేశం చదివి వినిపించారు. ‘‘ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు తదనంతర కాలంలో ఎలాంటి నిరాడంబర జీవించాలో, హుందాగా ఉండాలో కార్టర్ ఆచరించి చూపారు. అంతర్జాతీయ సమాజానికి సేవ చేయాలన్న ఆయన సంకల్పానికి రాజకీయాలు ఏనాడూ ఆయనకు అడ్డురాలేదు’’ అని బైడెన్ అన్నారు. నివాళుల కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు సైతం పాల్గొన్నారు. మాజీ అధ్యక్షునిగా నివాళిగా సైనికులు తుపాకులతో ‘21 గన్ సెల్యూట్’ సమర్పించారు. 39వ అధ్యక్షుడిగా సేవలందించిన కార్టర్ 100 ఏళ్లు జీవించి డిసెంబర్ 29వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. కార్టర్ భౌతిక కాయాన్ని మూడు రోజులపాటు అమెరికా పార్లమెంట్ భవనంలో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గురువారం ఉదయం నేషనల్ క్యాథడ్రల్కు తీసుకొచ్చి ఈ అధికారిక నివాళుల కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ అధికారిక వీడ్కోలు కార్యక్రమం గురువారంతో ముగిసింది. తర్వాత కార్టర్ భౌతికకాయాన్ని గురువారం జార్జియాలోని స్వస్థలం పెయిన్స్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భార్య రొజలిన్ కార్టర్ సమాధి పక్కనే కార్టర్ను ఖననం చేస్తారు. రోజలిన్ 77 ఏళ్ల వయస్సులో 2023 నవంబర్లో కన్నుమూశారు. -
బిల్ క్లింటన్కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్హౌస్ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు.నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు. -
ఓస్లో ఒప్పందం – వాస్తవాలు
ఇజ్రాయెల్, పాలస్తీనాలు ‘రెండు దేశాలుగా బతకడమే దారి’ అనే శీర్షికతో వ్యాసం రాసిన (అక్టోబర్ 23న) ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ కొన్ని వాస్తవాలను విస్మరించారు లేదా తప్పుగా పేర్కొన్నారు. రెండు స్వతంత్ర దేశాలను ప్రతిపాదించిన 1993 నాటి నార్వే (ఓస్లో) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి సంతకం చేయగా అందుకు హమాస్, ఇరాన్ నిరాకరిస్తున్నాయన్నారు. ఆ ఒప్పందం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) అధ్యక్షునిగా యాసిర్ అరాఫాత్కు, ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్కు మధ్య జరిగింది.తర్వాత అరాఫాత్ 2004లో మరణించే వరకు 11 ఏళ్లపాటు అది అమలు కాకపోవటానికి కారణం ఎవరు? ఓస్లో ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలూ మొదటిసారిగా పరస్పరం గుర్తించుకున్నాయి. కానీ అది ఆ కాలంలో గానీ, ఈరోజుకు గానీ అమలు కాకపోవటానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్దేనని... స్వయంగా ఆ చర్చలకు సాక్షి అయిన ఆరన్ డేవిడ్ మిల్లర్ అనే అమెరికాకు చెందిన అగ్రస్థాయి నిపుణుడు, అమెరికా నుంచే వెలువడే ‘ఫారిన్ పాలసీ’ అనే సుప్రసిద్ధ జర్నల్లో ఇటీవలే రాశాడు. అంతేకాదు, ఆ ఒప్పందంలో అసలు ‘పాలస్తీనా దేశం’ అన్న మాటే లేదని వెల్లడిస్తూ, 1993 నుంచి ఆ మాత్రపు ఒప్పందాన్ని అయినా ఇజ్రాయెల్ ఎట్లా ఉల్లంఘిస్తూ వస్తున్నదో వర్ణించి చెప్పాడు.వ్యాస రచయిత ప్రస్తావించిన వాటిలో మరొకటి మాత్రం చూద్దాము. అరాఫాత్ మరణం తర్వాత పీఎల్ఓ లేదా ఫతా పార్టీ నాయకత్వం పాలస్తీనా అథారిటీ (పీఏ) పేరిట పాలిస్తూ పూర్తి నిష్క్రియాపరంగా, అవినీతిమయంగా మారినందు వల్లనే, అంత వరకు కేవలం నామమాత్రంగా ఉండిన హమాస్, బాగా బలం పుంజుకుని 2006 నాటి ఎన్నికలలో గెలిచి 2007లో అధికారా నికి వచ్చింది. ఆ పరిణామం ప్రజాస్వామిక ఎన్నికలలో జరిగిందే తప్ప బలప్రయోగంతో కాదు. ఇక ఇజ్రాయెల్ 1947 నుంచి మొదలు కొని ఈ 77 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయ స్థానంతో పాటు అనేకానేక ఇతర ప్రపంచ సంస్థలను, ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరిస్తూ ఈరోజున గాజాలో, వెస్ట్ బ్యాంక్లో ఏ వ్యూహాన్ని అమలు చేసి అసలు పాలస్తీనా అన్నదే లేకుండా చేయ జూస్తున్నదో కనిపిస్తున్నదే.– టంకశాల అశోక్సీనియర్ సంపాదకుడు, హైదరాబాద్ -
ఏకైక చాయిస్ హారిస్..
షికాగో: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఫక్తు షోమ్యాన్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు పూజ్యమన్నారు. బుధవారం డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్లో ఆయన ప్రసంగించారు. ‘‘మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజం. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావం. ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు’’ అంటూ దుయ్యబట్టారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించే ఆలోచించే జన నేతగా క్లింటన్ అభివర్ణించారు. ‘‘దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవమున్న హారిసే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్. అది సుస్పష్టం’’ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు.ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్..హారిస్ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్’గా బిల్ క్లింటన్ అభివర్ణించారు. ‘‘హారిస్ విద్యార్థి దశలో మెక్డొనాల్డ్స్లో పార్ట్టైమర్గా చాలాకాలం పని చేశారు. ‘మీకెలా సాయపడగలను?’ అంటూ ప్రతి కస్టమర్నూ చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఇప్పుడు అత్యున్నత అధికార హోదాలో కూడా ‘మీకెలా సాయపడగలను?’ అని అదే చిరునవ్వుతో ప్రజలందరినీ అడుగుతున్నారు. హారిస్ ప్రెసిడెంట్గా వైట్హౌస్లో అడుగు పెడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తా. ఎందుకంటే మెక్డొనాల్డ్స్లో అత్యధిక కాలం పని చేసిన ప్రెసిడెంట్గా నా రికార్డును బద్దలు కొడతారు’’ అంటూ ఛలోక్తులు విసిరారు. అనంతరం మాట్లాడిన సీనియర్ డెమొక్రటిక్ నేతలంతా ట్రంప్పై ముక్త కంఠంతో విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికాకు ట్రంప్ పెను ముప్పు. ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే’’ అని ఆక్షేపించారు.అభ్యర్థిత్వం స్వీకరించిన వాల్జ్..హారిస్ రన్నింగ్మేట్గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (60) లాంఛనంగా స్వీకరించారు. తనది అతి సాధారణ నేపథ్యమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు పారీ్టకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కమల చాలా గట్టి నాయకురాలు. అత్యంత అనుభవజ్ఞరాలు. అమెరికాకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలతో సన్నద్ధంగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజలందరి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరును ఆమె కొనసాగిస్తాన్నారు. ‘‘ట్రంప్ స్వయానా కుబేరుడు. కేవలం కుబేరులకు, అతివాద శక్తులకు ఉపయోగపడటమే ఆయన ఏకైక అజెండా’’ అంటూ దుయ్యబట్టారు.ట్రంప్ వయసుపై క్లింటన్ విసుర్లు..ట్రంప్ వయసుపై బిల్ క్లింటన్ చెణుకులు విసిరారు. 78 ఏళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు. దీన్ని ప్రస్తావిస్తూ, ‘‘రెండ్రోజుల క్రితమే నాకు 78 ఏళ్లు నిండాయి. నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయసు్కణ్ని. ట్రంప్కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట’’ అని క్లింటన్ చెప్పుకొచ్చారు. తద్వారా, వయసుపరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు.హారిస్కు ఓప్రా మద్దతు..వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్కు ప్రఖ్యాత అమెరికా టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే మద్దతు పలికారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో బుధవారం మూడో రోజు ఆమె ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. విన్ప్రే ఓ రాజకీయ వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి. ‘‘పుస్తకాలు ప్రమాదకరమని, రైఫిల్స్ సురక్షితమని, ప్రేమించడం తప్పుడు మార్గమనే విధ్వంసకర భావనలను మనపై రుద్దుతున్నారు. మనల్ని విభజించి, చివరికి జయించడం వారి లక్ష్యం’’అంటూ రిపబ్లికన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పేర్లు ప్రస్తావించకుండానే వారిని తూర్పారబట్టారు.‘‘హారిస్ను, ఆమె రన్నింగ్మేట్ టిమ్ వాల్జ్ను గెలిపించాలి. అదే అమెరికా గెలుపు’’అని పిలుపునిచ్చారు. ‘‘ఇల్లు అగి్నకి ఆహుతైతే ఆ ఇంటి యజమాని జాతి, మతం చూడం. భాగస్వామి ఎవరని అడగం. ఎవరికి ఓటేశారో చూడం. వాళ్లను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఆ ఇల్లు సంతానం లేని పిల్లిదైతే ఆ పిల్లిని కూడా రక్షిస్తాం’’అన్నారు. సంతానం లేని మహిళ అంటూ హారిస్ను వాన్స్ గేలి చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లేని పిల్లుల్లాంటి మహిళల సమూహం అమెరికాను పాలిస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విన్ఫ్రేకూ పిల్లల్లేరు. ‘‘అభ్యర్థులకు విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. హారిస్, వాల్జ్ మనకు హుందాతనం, గౌరవం అందిస్తారని నా మనస్సాక్షి చెబుతోంది’’ అన్నారు.డెమొక్రాట్ల సదస్సులో వైదిక ప్రార్థనలు..షికాగో: డెమొక్రటిక్ జాతీయ కన్వెన్షన్ (డీఎన్సీ) మూడో రోజు బుధవారం వైదిక ప్రార్థనతో ప్రారంభమైంది. ఇలా జరగడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘మనది వసుదైక కుటుంబం. సత్యమే మనకు పునాది. అదే ఎల్లప్పుడూ గెలుస్తుంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయం (అసత్యం నుంచి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి సాగుదాం). ఓం శాంతిః శాంతిః శాంతిః’’అంటూ భారత సంతతికి చెందిన అమెరికా పూజారి రాకేశ్ భట్ ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం విషయానికి వచి్చనప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.‘’మన మనసులు ఒకేలా ఆలోచించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన హృదయాలు ఒక్కటవ్వాలి. అందుకు మనల్ని శక్తిమంతులను చేయాలని, తద్వారా మనం ఐక్యమై, దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని చెప్పారు. మేరీలాండ్లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న భట్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమాలలో శిక్షణ పొందిన మధ్వా పూజారి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లి‹Ù, తుళు, సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. సంస్కృతం, ఆంగ్లం, కన్నడ భాషల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. ఉడిపి అష్ట మఠం, సేలంలోని బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో పని చేసి 2013లో మేరీలాండ్ శివవిష్ణు ఆలయంలో చేరారు. -
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
సీఎం షిండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బిల్ క్లింటనే తనపై ఫోకస్ చేశారంటూ..
శివసేనలో తిరుగుబాటుతో మెజార్టీ ఎమ్మెల్యేలతో, బీజేపీతో కలిసి ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా, నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. నెల క్రితం ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అతను అమెరికాలో నివాసం ఉంటాడు. అతడు బిల్ క్లింటన్కు సన్నిహితుడు. అయితే, అతడి బంధువు ఒకరు.. ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో బిల్ క్లింటన్ను కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా బిల్ క్లింటన్.. అతడిని నా గురించి అడిగారు. ఏక్నాథ్ షిండే ఎవరు?. అతడు ఏం చేస్తాడు?. ఎప్పుడు నిద్రపోతారు?. ఎప్పుడు తింటారు?. అని అడిగినట్టు చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. తానే ఏ రేంజ్లో ఉన్నాడో పరోక్షంగా చెప్పారు. అనంతరం, షిండే మాట్లాడుతూ.. కొంతమంది నా పని అయిపోందని అనుకుంటున్నారు. జర్నలిస్టు మిత్రులు కూడా నన్ను అడుగుతున్నారు. కానీ, అన్నీ చెప్పలేము కదా. నేనెప్పుడూ నటించలేదు. ప్రతీకారంతో ఎవరినీ దెబ్బకొట్టలేదు. నాకు అలాంటి మనస్తత్వం లేదు. భవిష్యత్త్లో ఏం చేస్తామో అందరూ చూస్తారు అని అన్నారు. అంతకుముందు కూడా షిండే.. ప్రపంచంలోని 33 దేశాలు తన తిరుగుబాటును గమనించాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #Maharashtra CM #EknathShinde claimed that even former US President Bill Clinton enquired about him. "Bill Clinton asked who is Eknath Shinde? How much he works? When does he eat? When does he sleep" Shinde said while speaking at an event in #Nagpur | @mieknathshinde pic.twitter.com/EDMSqEQgTp — Free Press Journal (@fpjindia) December 23, 2022 -
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు అస్వస్థత
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (75) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మాజీ అధ్యక్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడికల్ సెంటర్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల క్లింటన్ అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు వెల్లడించారు. డాక్టర్ అల్పేస్ అమీన్, డాక్టర్ లిసా బార్డాక్ నేతృత్వంలో క్లింటన్కు చికిత్స కొనసాగుతోంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్ మంగళవారం స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 1993 నుంచి 2001 మధ్య బిల్ క్లింటన్ అమెరికాకు 42వ ప్రెసిడెంట్గా పనిచేశారు. -
బైడెన్ ప్రమాణ స్వీకారం.. క్లింటన్ కునికిపాట్లు
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక బైడెన్తో పాటు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు వారాల క్రితం ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన క్యాపిటల్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. బైడెన్తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. అధ్యక్షుడుగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ కమలా హారిస్(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. (చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్) ఇక బైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుండగా.. వీటిలో ఒకటి మాత్రం నవ్వులు పూయిస్తోంది. ఈ ఫోటో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కి సంబంధించినది. ఇక దీనిలో ఆయన కునికిపాట్లు పడుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య హిల్లరీ క్లింటన్తో కలిసి బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బిల్ క్లింటన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లూ.బుష్ వెనక వరుసలో కూర్చోని ఉన్నారు. ఇక ఈ ఫోటోపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వృద్ధుడు అయ్యాడు కదా.. పాపం వదిలేయండి’’.. ‘‘జో బైడెన్ ప్రభుత్వం కల్పించిన నమ్మకం ఇది. ఇక మనం బహిరంగా కార్యక్రమాల్లో ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.. నా దిండు పంపిస్తాను’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్, బైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదు. (చదవండి: బైడెన్ టీం: మనకే అగ్ర తాంబులం) ఇక కార్యక్రమంలో లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఆ తరువాత, నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ ఒక పాటను ఆలపించారు. -
అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే
వాషింగ్టన్: గత వారం కాపిటల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రతినిధుల సభ అభిశంసించింది. దాంతో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇక ట్రంప్ అధ్యక్ష పదవి ముగియడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయన డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న సెనేట్ తీసుకువచ్చిన అభిశంసన చర్య విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రంప్ను తొలగించడానికి 232 మద్దతిచ్చారు. కాపిటల్ భవనంపై దాడి ఘటనలో ఐదుగురు మరణించడమే కాక అమెరికాలో ప్రజాస్వామ్య స్థానాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినందుకు గాను ట్రంప్పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్ను పదవి నుంచి తొలగించడానికి డెమొక్రాట్లలో చేరారు. ఇక ట్రంప్ కన్నా ముందు అమెరికా చరిత్రలో మరో ముగ్గురు అధ్యక్షులు కూడా అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్, రిచర్డ్ నిక్సన్. వీరిలో బిల్ క్లింటన్ని, ఆండ్రూ జాన్సన్ని సెనెట్ నిర్దోషులుగా తేల్చగా.. రిచర్డ్ నిక్సన్ ఓటింగ్కు ముదే రాజీనామా చేశారు. 1867లో ఆండ్రూ జాన్సన్పై తొలిసారిగా అభిశంసన తీర్మానం అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇక ఒక్క ఓటు తేడాతో ఆయన గట్టెక్కారు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. ఆయనపై 1867 పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాథమిక అభియోగంపై సభ 11 అభిశంసన పత్రాలను ఆమోదించింది. ఇక 1868లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క ఓటుతో ఆండ్రూ జాన్సన్ గట్టెక్కారు. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) 1999లో బిల్ క్లింటన్పై అభిశంసన తీర్మానం ఇక అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న రెండవ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ నిలిచారు. మోనికా లెవెన్స్కీ స్కాండల్లో బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానానికి ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్లో బిల్ క్లింటన్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దాంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు. (చదవండి: అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్) ఓటింగ్కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్ రిచర్డ్ నిక్సన్ అమెరికాకు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో వాటర్ గేట్ స్కాండల్ వెలుగుచూసింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలో ఏకంగా సోదాలు జరిగాయి. దాంతో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్కు చెడ్డపేరు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు రావడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక విచారణలో భాగంగా టెలిఫోన్ టేపులను ఇవ్వాలని కోరగా.. నిక్సన్ నిరాకరించారు. 1974 జూలైలో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంపీచ్మెంట్పై ఓటింగ్ జరగక ముందే నిక్సన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. -
‘ట్రంప్ ఎన్నికల’తో చరిత్ర తిరగబడేనా?
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినట్లయితే అమెరికా ఎన్నికల చరిత్ర తిరగబడినట్లే. దేశాధ్యక్షుడు రెండో సారి ఓడిపోవడం గత 28 ఏళ్లలో ఇదే మొదటి సారి అవుతుంది. 28 ఏళ్ల క్రితం అంటే, 1992లో బిల్ క్లింటన్ చేతుల్లో నాటి అధ్యక్షుడు జార్జి హెచ్డబ్లూ బుష్ ఓడిపోయారు. ఆ మాటకొస్లే 231 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 45 మంది దేశాధ్యక్షుల్లో కేవలం పది మంది మాత్రమే రెండోసారి విజయం సాధించకుండా పరాజయం పాలయింది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేదిదే..!) ప్రపంచంలోని పలు ప్రజాస్వామ్య దేశాల్లోలాగానే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అసమ్మతి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎక్కువగానే ఉంటుంది. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, ఆయన నిర్లక్ష్యమే అందుకు కారణమని అమెరికా ఓటర్లు భావిస్తున్నారు. అమెరికా వందేళ్ల చరిత్రలో 25 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా 11 సార్లు పాలకపక్ష పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. అందులో ఆరుసార్లు డెమోక్రట్లు, ఐదుసార్లు రిపబ్లికన్లు గెలిచారు. ఇక భారత్లో 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా, అందులో ఏడు ఎన్నికల్లో పాలకపక్ష పార్టీ లేదా సంయుక్త కూటములు ఓడి పోయాయి. అలాగే బ్రిటన్కు జరిగిన ఎన్నికల్లో 27 సార్లకుగాను పది సార్లు పాలకపక్షం ఓడిపోయింది. (మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?) అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 78 శాతం మంది పాలకపక్షం అభ్యర్థులే విజయం సాధించారు. అదే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్కు కలసొచ్చే అంశం అని విశ్లేషకులు భావిస్తుండగా, అసమ్మతి పవనాలు బలంగా వీస్తున్నప్పుడు పాలకపక్ష అభ్యర్థులు ఓడి పోవడం కూడా అంతే సహజమని వారు భావిస్తున్నారు. ట్రంప్ ఇటీల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోని నియమించడం ఆయనకు కలసొచ్చే అంశం. నియామకంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో రిపబ్లికన్లు–డెమోక్రట్ల బలం 6–3 నిష్పత్తికి చేరుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా విషయంలో ‘బుష్ వర్సెస్ గోర్’ వివాదం ఎలా చెలరేగిందో ట్రంప్, బైడెన్ విషయంలో అలాంటి వివాదమే ఏర్పడుతోందని, అప్పుడు సుప్రీం కోర్టు సానుకూల వైఖరి కారణంగా ట్రంప్ విజయం సాధిస్తారని విశ్లేషిస్తున్న వారు కూడా లేకపోలేదు. (పెద్దన్న ఎన్నిక ఇలా..) -
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్క్రియాటిక్ కేన్సర్తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. రూత్ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూత్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు. కొత్త రాజకీయ పోరాటం అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్ గిన్స్బర్గ్ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు. రూత్ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్ చేస్తామని ట్రంప్ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్ చేస్తారు. నవంబర్ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు. హక్కుల గళం అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్లోని బ్రూక్లిన్లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు. రూత్ తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్ గిన్స్బర్గ్తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్ సమక్షంలో రూత్ ప్రమాణం -
ట్రంప్ అంతకుమించి ఏమీ చేయలేరు!
వాషింగ్టన్: మహమ్మారి కరోనాను కట్టడి చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం విఫలమైందని అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ విమర్శించారు. ప్రాణాంతక వైరస్ కారణంగా లక్షా డెబ్బై వేల మంది అమెరికా పౌరులు మరణించారని, ఆర్థిక సంక్షోభం తలెత్తి వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. నిరుద్యోగం పెరిగిందని, లక్షలాది మంది యువత ఉపాధి లేక విలవిల్లాడుతున్నారని ట్రంప్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఇలాంటి విపత్కర సమయంలో కమాండ్ సెంటర్గా ఉండాల్సిన శ్వేతసౌధం.. అధ్యక్షుడి అనుచిత సలహాలతో తుపాను కేంద్రంగా మారిందంటూ విమర్శలు సంధించారు. మరో నాలుగేళ్లు ఆయనకు అధికారం అప్పగిస్తే ఎదుటి వారిపై నిందలు వేయడానికి, ఇతరులపై నోరు పారేసుకోవడానికే సమయం సరిపోదని, అలాంటి వ్యక్తి మెరుగైన పాలన ఎలా అందిస్తారంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలు అంటే ట్రంప్కు టీవీ చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపడం వంటి విషయమని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని వ్యక్తిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు. (ఇది నా జీవితానికి లభించిన అరుదైన గౌరవం: బిడెన్) కాగా అగ్రరాజ్యంలో నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ను నామినేట్ చేస్తూ డెమొక్రటిక్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బిడెన్ రన్నింగ్మేట్గా కమలా హారిస్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా బిల్ క్లింటన్ మాట్లాడుతూ.. అమెరికాకు పూర్వవైభవం రావాలంటే బిడెన్కు ఓటు వేయాలని కోరారు. ప్రతీ విషయంలోనూ బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ, దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లగల సత్తా ఆయనకు ఉందని పేర్కొన్నారు. ‘‘మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి గ్రామీణ అమెరికాను పట్టణాలతో కలపడం, నల్లజాతీయులు, స్థానిక అమెరికన్లు, మహిళలు, వలసదారులు, ఇతర వర్గాలన్నింటినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసి సమతౌల్య సమాజ నిర్మాణానికి పాటుపడటం, క్లైమేట్ చేంజ్, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం, వినూత్న ఆర్థిక విధానాలతో చిరు వ్యాపారులను ఆదుకోవడం వంటి అనేకానేక ప్రణాళికలతో బిడెన్ ముందుకు వచ్చారు. (డెమోక్రాటిక్ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్) ఇలాంటి పనిచేసే అధ్యక్షుడు కావాలో లేదా సోషల్ మీడియాలో ఇతరులను పదే పదే కాల్చుకు తింటూ తన వైఫల్యాలను ఇతరులపైకి నెట్టివేసే ట్రంప్ కావాలో మీరే నిర్ణయించుకోండి. దేశ భవిష్యత్తు మీ చాయిస్ మీదే ఆధారపడి ఉంది’’అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ.. అమెరికా గొప్పదనాన్ని, చరిత్రను నిలబెట్టగల సత్తా జో బిడెన్కే ఉందన్నారు. అనుభవం, ఇతరులతో హుందాగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నిజాయితీకి మారుపేరు. నిబద్ధతతో పనిచేసే నాయకుడు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినపుడు బాధ్యతాయుతంగా వ్యవహించే వ్యక్తి. ప్రస్తుతం దేశానికి ఇలాంటి నాయకుడే కావాలి. ఆయన అవసరం దేశానికి ఎంతగానో ఉంది’’అని పేర్కొన్నారు. -
క్లింటన్ వ్యవహారం బయటపెట్టిన మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్స్కీ మధ్య వివాహతర సంబంధముందని రుజువు చేసిన లిండా ట్రిప్(70) మంగళవారం(ఏప్రిల్ 7న) కన్నుమూశారు. ఆమె గతంలో మోనికాతో స్నేహం చేసి.. వారిద్దరి సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి, దాన్ని బయట ప్రపంచానికి వెల్లడించడం అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాక ఇది అతనిపై అభిశంసన తీర్మానం పెట్టడానికి ఆస్కారమైంది. అయితే ప్రతినిధుల సభలో బిల్ క్లింటన్ అభిశంసనకు గురైనప్పటికీ, సెనేట్లో ఆయనకు ఊరట లభించిన విషయం తెలిసిందే. (నిజం ఒప్పుకున్న బిల్ క్లింటన్) అయితే ఈ వ్యవహారంలో లిండాకు కొంతమంది మద్దతుగా నిలబడగా, మరికొందరు మాత్రం ఆమెను మిత్రద్రోహిగా అభివర్ణించారు. కాగా 48 ఏళ్ల వయసులో భర్త నుంచి విడాకులు తీసుకున్న లిండా ట్రిప్ అనంతరం కొలంబియాలో నివసించారు. ఆమె 2001 నుంచి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఒకప్పటి స్నేహితురాలు మోనికా లెవిన్స్కీ వైరాన్ని పక్కన పెట్టి ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఇంతలోనే ఏప్రిల్ 7న లిండా కన్నుమూశారు. ఇదిలా ఉండగా బిల్ క్లింటన్ ఈ మధ్యే ఆమె చేసిన ఆరోపణలను అంగీకరించిన విషయం తెలిసిందే. (‘మేడమ్ ఎక్కడా!!’?) -
అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్లపై 'హిల్లరీ' అనే పేరుతో రూపొందించిన నాలుగు గంటల డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. మోనికా లెవిన్స్కీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బిల్ క్లింటన్ మొదటిసారిగా ఒప్పుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ఇప్పుడు నిజాన్ని అంగీకరించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకే ఇలాంటి పనిచేశానని తెలిపారు. ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని పేర్కొన్నారు. అయితే కొన్ని విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయని.. ఇది కూడా అలాంటి తప్పేనని ఆయన అంగీకరించారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఎన్నో మలుపులకు దారితీసిందని చెప్పారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. దీంతో 1998, డిసెంబరు 19న అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఆయన చాలాసార్లు తన ఎఫైర్ వార్తలను ఖండించారు. తాజాగా అది నిజమేనని బిల్ క్లింటన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే బిల్ క్లింటన్తో అఫైర్ సాగిందని మోనికా లెవిన్స్కీ గతంలో వెల్లడించారు. తమ అఫైర్లో క్లింటన్ చొరవ తీసుకున్నారని ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని ఆవేదన చెందారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందని అప్పట్లోనే అన్నారు. చదవండి: ఎన్పీడీఆర్ఆర్ చైర్మన్గా అమిత్ షా అవినీతి అధికారులకు కేంద్రం షాక్ -
అగ్రరాజ్యాధీశుల భారతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం.. డ్వైట్ డి ఐసన్హోవర్, 1959 డిసెంబర్ 9 – 14 సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్హోవర్కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్మహల్ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రిచర్డ్ ఎం నిక్సన్, 1969 జూలై–31 1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్కే కొమ్ముకాశారు. జిమ్మీ కార్టర్, 1978 జనవరి 1 – 3 1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు. బిల్ క్లింటన్, 2000 మార్చి 19–25 ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బిల్ క్లింటన్కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. జార్జ్ డబ్ల్యూ బుష్, 2006 మార్చి 1–3 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది. బరాక్ ఒబామా 2010, 2015 2010, నవంబర్ 6–9 2015, జనవరి 25–27 అమెరికా, భారత్ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్తో టచ్లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్కు ప్రకటించారు. -
అమెరికా చరిత్రలో షట్డౌన్ రికార్డు
వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ రికార్డును శుక్రవారం రాత్రితో అధిగమించింది. మరోవైపు, మీ సెలవులు ముగించుకుని వైట్హౌస్కొచ్చి షట్డౌన్కు ముగింపు పలికండి అంటూ ప్రతిపక్ష డెమోక్రాట్ సభ్యులను ట్రంప్ చర్చలకు ఆహ్వానించారు. గోడ నిర్మాణానికి నిధులపై ఆమోదం లభించకుంటే మిగతా బడ్జెట్ బిల్లులపై తాను సంతకం చేయబోనని వ్యాఖ్యానించారు. ‘డెమోక్రాట్లకు, కాంగ్రెస్ ప్రతినిధులకు మీరైనా చెప్పండి. ‘షట్డౌన్కు ముగింపు పలకమనండి’ అంటూ తన 5.72 కోట్ల ట్విట్టర్ ఫాలోయర్లను కోరారు. -
అమెరికాను భయపెడుతున్న ‘ప్యాకెట్లు’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్ జార్జ్ సోరస్ ఇంటికి, సీఎన్ఎన్ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్లు వస్తున్నాయి. పార్శిల్ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికారాలు బయటపడుతున్నాయి. వీటిని చూసిన సీఎన్ఎన్ ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ అలారమ్ మోగించి తన సిబ్బందిని బయటకు పంపించింది. తొలుత ఈ ప్యాకెట్లు మంగళవారం బిల్ క్లింటన్ నివాసానికి, బుధవారం ఒబామా నివాసానికి వచ్చాయని ఎఫ్బీఐ ప్రకటించింది. అయితే ఈ ప్యాకెట్లు వచ్చిన సమయంలో హిల్లరి దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. వీటి గురించి దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్బీఐ అధికారులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. We are aware of a suspicious package found in the vicinity of the Clinton residence in Chappaqua, NY, and our JTTF has engaged with our federal, state and local partners to investigate. As this is an on-going investigation, we will have no further comment at this time — FBI New York (@NewYorkFBI) October 24, 2018 అయితే మాజీ అధ్యక్షులు, ప్రముఖుల ఇళ్లకు వస్తోన్న ఈ అనుమానాస్పద ప్యాకెట్ల అంశాన్ని వైట్ హౌస్ ఖండించింది. ఇలాంటి భయపెట్టే చర్యలు చట్ట వ్యతిరేకమైనవని, అసహ్యమైనవని పేర్కొంది. వీటికి పాల్పడే వారు ఎవరైనా సరే.. తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించింది. అంతేకాక ఈ ప్యాకెట్ వచ్చిన వారందరికి భద్రత కల్పిస్తామని వెల్లడించింది. -
ఆ అఫైర్ అధికార దుర్వినియోగం కాదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్హౌస్ తాత్కాలిక ఉద్యోగిని మోనికా లూయిన్స్కీ వివాహేతర సంబంధంపై క్లింటన్ భార్య హిల్లరీ స్పందించారు. క్లింటన్–లూయిన్స్కీల అఫైర్ అధికార దుర్వినియోగం కిందకు రాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. వివాహేతర సంబంధంపై కోర్టుకు అబద్ధం చెప్పినందుకు క్లింటన్ను అభిశంసన చేసి ఉండాల్సిందన్న వాదననూ హిల్లరీ ఖండించారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో న్యూయార్క్ సెనెటర్ క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ మాట్లాడుతూ.. ‘ అఫైర్ లేదని అబద్ధం చెప్పినందుకు హౌ స్ జ్యూడీషియరీ కమిటీ క్లింటన్ను అభిశంసించింది. అప్పుడే క్లింటన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య లపై హిల్లరీ స్పందించారు. ‘ అఫైర్ అనేది అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కిందకు రాదు. క్లింటన్–లూయిన్స్కీల మధ్య శారీరక సంబంధం ఏర్పడేనాటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. అప్పటికే ఆమె వయోజనురాలు. ఈ వ్యవహారంలో వాస్తవాన్ని సెనెట్ అప్పుడే తేల్చింది’ అని వ్యాఖ్యానించారు. -
అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట్లో ప్రమాదం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని చాపక్వాలో ఉన్న క్లింటన్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్టు మంగళవారం మధ్యాహ్నం సమాచారం అందినట్టు న్యూకాజిల్ పోలీసులు తెలిపారు. దాంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై క్లింటన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ నిక్ మెరిల్ స్పందించారు. స్పల్ప అగ్నిప్రమాదమే జరిగిందని, ఎవరికీ ప్రమాదం జరగలేదని ఆయన వెల్లడించారు. ప్రమాద సమయంలో క్లింటన్ దంపతులు ఇంట్లో లేరన్నారు. కాగా క్లింటన్, హిల్లరీలు 1999 లో ఆ ఇంటిని కొన్నారు. -
ఒకే వేదికపై.. ఐదుగురు మాజీలు
వాషింగ్టన్ : ఇటీవల కాలంలో అమెరికాను వణికించిన హార్వీ, ఇర్మా, మరియా తుఫాను బాధితులను ఆదుకేనుందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుఫానుల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, పోర్టారికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తుపాను బాధితుల నిధుల సేకరణకు రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ (సీనియర్) జిమ్మీ కార్టర్లు శనివారం టెక్సాస్లోని ఏఅండ్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. డెమోక్రాట్ పార్టీ నుంచి బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మి కార్టర్లు, రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జి హెచ్డబ్ల్యూ బుష్, జార్జి డబ్ల్యూ బుష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిన్ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ (93) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూనే చక్రాల కుర్చీలోనే కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డే విజేత లేడీ గాగా తన డ్యాన్స్తో అలరించారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 నుంచి ఐదుగురు మాజీ అధ్యక్షులు చేపట్టారు. ఇప్పటివరకూ 31 మిలియన్ డాలర్ల నిధులను వీరు సమకూర్చినట్లు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ అధికార ప్రతినిధి జిమ్ మెక్గ్రాత్ తెలిపారు. తుఫాను బాధితుల కోసం నిధుల సమకూరుస్తున్న ఐదుగురు మాజీ అధ్యక్షులను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అమెరికా అత్యున్నత ప్రజా సేవకులుగా వారిని ట్రంప్ అభివర్ణించారు. మాజీలెవరూ.. తమ ప్రసంగంలో ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. -
ఒకే వేదికపై అమెరికా మాజీ అధ్యక్షులు
వాషింగ్టన్: అమెరికాలో బీభత్సం సృష్టించిన హరికేన్ ఇర్మా, మరియా తుఫాను బాధితులకు చేయుతనిచ్చేందుకు ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులు ఒకే వేదికపై కలిశారు. తుఫాను బాధితులకు సాయంగా ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గోల్ఫ్ కప్-2017 టోర్నమెంట్ను మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్బుష్, బిల్క్లింటన్లు గురువారం ప్రారంభించారు. ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలి సారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ద్వైపాక్షిక టోర్నమెంట్లో అమెరికా జట్టు.. ఇతర దేశాలతో మొత్తం 30 మ్యాచ్లు ఆడనుంది. జెర్సీ సిటీలోని లిబర్టీ నేషనల్ గోల్ఫ్ కోర్సులో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. ప్రారంభ మ్యాచ్ను ఈ మాజీ దేశాధ్యక్షులు ఈ వేదికపై నుంచే తిలకించారు. గతంలో వీరు హరికేన్ ఇర్మా తుఫాను బాధితులను ఆదుకోవాలని అమెరికన్లను కోరుతూ ఓ వీడియా సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తుఫాను బాధితులకు సాయంగా అందించనున్నారు. -
క్లింటన్ డబ్బు ఇస్తానన్నారు: నవాజ్ షరీఫ్
-
క్లింటన్ డబ్బు ఇస్తానన్నారు: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్.. పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా ఉండేందుకు తనకు ఐదు బిలియన్ల డాలర్లు ఇవ్వజూపినట్లు చెప్పారు. దేశానికి విధేయుడిని కాకపోతే ఆ డబ్బు తీసుకుని అణు పరీక్షలను నిలిపివేసేవాడినని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్ మీటింగ్లో అణు పరీక్షల విషయాన్ని ప్రధాని షరీఫ్ బయటపెట్టారు. 1998లో తనను కలిసిన బిల్ క్లింటన్ అణు పరీక్షలు నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా ఐదు బిలియన్ డాలర్లను ఇస్తానని క్లింటన్ అన్నా.. తాను లొంగలేదని అన్నారు. అవినీతి కేసులో తీవ్ర చిక్కుల్లో ఇరుకున్న నవాజ్ షరీఫ్ అందులోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఆయుధంగా వాడుకుంటున్నారు. పనామా పేపర్ల కుంభకోణం ప్రధాని కుర్చీని కుదిపేస్తుండటం, రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతుండటంతో ఆయన ఇలా చేస్తున్నారని పాకిస్తాన్ మీడియా అంటోంది. -
క్లింటన్లగారింటి అమ్మాయి
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అదే ఇంట్లోని హిల్లరీ క్లింటన్.. అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేశారు. ఇక ఆ ఇంట్లో ఉన్నది ఒక్కరే... చెల్సీ క్లింటన్! ఒక్కగానొక్క కూతురు. ఈ క్లింటన్లగారింటి అమ్మాయి కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తుందా? తల్లి హిల్లరీ కలను తను నెరవేరుస్తుందా? చూడాలి. 2020లో... క్లింటన్ 3 వెర్షన్ వస్తుందేమో చూడాలి. రెండు ముక్కల్లో పూర్తి పేరు ⇒ చెల్సీ విక్టోరియా క్లింటన్ జననం ⇒ 1980 ఫిబ్రవరి 27 తల్లిదండ్రులు ⇒ బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ చదువు ⇒ బి.ఎ., ఎం.ఫిల్. డి.ఫిల్., ఎంపిహెచ్ వివాహం ⇒ 2010 జూలై 31 భర్త ⇒ మార్క్ మెజ్విన్స్కీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పిల్లలు ⇒ కూతురు షార్లెట్ (3), కొడుకు ఐడన్ (1) కొలువు ⇒ ఎన్.బి.సి. స్పెషల్ కరస్పాండెంట్(2011 నుంచి 2014 వరకు) వ్యాపకం ⇒ క్లింటన్ ఫౌండేషన్ రోడ్రిగొ డ్యుటార్టె నోట్లో నోరు పెట్టడానికి పెద్దపెద్దవాళ్లే ‘ఎందుకులేబ్బా’ అనుకుంటారు. డ్యుటార్టె ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు. చూడ్డానికి ఎన్కౌంటర్ స్పెషలిస్టులా ఉంటాడు. అమెరికాను, ఐక్యరాజ్యసమితినీ ఎవర్నీ లెక్క చెయ్యడు. అలాంటి వాడితో పడింది చెల్సీకి! చెల్సీ.. బిల్ క్లింటన్ కూతురు. రోడ్రిగో ఇటీవలే తన దేశంలోని దక్షిణ ప్రాంతంలో మార్షల్ లా విధించాడు. చిన్న స్పీచ్ కూడా ఇచ్చాడు. ‘‘మీరేమైనా చెయ్యండి. మీ బదులుగా నేను జైలుకు వెళతా. ఒకవేళ ఎవర్నైనా రేప్ చేయవలసి వస్తే ఆ పనీ చెయ్యండి. ఆ నేరాన్ని నా మీద వేసుకుంటా’’ అని సైనికులకు భరోసా ఇచ్చాడు. దీనిపై ప్రపంచంలో ఎవరూ మాట్లాడలేదు! చెల్సీ ఒక్కరే స్పందించారు. ‘డ్యుటార్టె మానవ హక్కులను విస్మరించిన భయంకరమైన వ్యక్తి’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డ్యుటార్టె ఊరుకుంటాడా? వైట్హౌస్ ఇంటెర్నీ మోనికా లెవెన్స్కీతో, మిగతా అమ్మాయిలతో మీ నాన్నగారు వివాహేతర సంబంధాలు నడిపిన విషయంపై నువ్వెప్పుడైనా నోరెత్తావా?’’ అని చెల్సీని విమర్శించాడు. అయితే చెల్సీ ఇప్పుడు వార్తల్లో ఉన్నది ఇందుకు కాదు. తిరిగి ఆమె డ్యుటార్టెకు ఎలాంటి రిటార్ట్ ఇవ్వబోతోందన్నదీ విషయం కాదు. కొన్నాళ్లుగా చెల్సీ తన ట్విట్టర్ ఫ్రొఫైల్కు పదును పెడుతున్నారు. ట్విట్టర్లో చెల్సీకి 10 లక్షల 70 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆన్ లైన్లోనే కాదు, ఆఫ్ లైన్లోనూ తరచూ ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన తల్లి హిల్లరీ క్లింటన్ గత అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ చెల్సీ వాయిస్ నిరంతరం ఎక్కడో ఒక చోట రెయిజ్ అవుతూనే ఉంది. ‘వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే’, చైల్డ్ మ్యారేజెస్ వంటి సామాజిక, లైంగిక ఆరోగ్య అంశాలపై ఆమె పరిశీలనలు, ట్రంప్ యంత్రాంగపు తీర్మానాలపై ఆమె ఆగ్రహ ప్రకటనలు ఆమెరికన్లను ఆకర్షిస్తున్నాయి. చెల్సీలోని ఈ క్రియాశీలత్వం ఇప్పుడు ఆ దేశపు మీడియాకు ఒక కొత్త సందేహాన్ని రేకెత్తిస్తోంది. చెల్సీ రాజకీయాలలోకి వస్తారా అన్నదే ఆ సందేహం. దీనికి కారణం ‘షి పెర్సిస్టెడ్’! ‘షి పెర్సిస్టెడ్’ అనేది.. గత మంగళవారం విడుదలైన చెల్సీ కొత్త పుస్తకం. ఆ పుస్తకం లోపల ఉన్న విశేష రచనల కన్నా, పుస్తకం పైన ఉన్న టైటిల్ ఇప్పుడు చెల్సీ రాజకీయ ప్రవేశానికి ఒక సంకేతంలా అమెరికన్ ప్రజలకు కనిపిస్తోంది! ‘షి పెర్సిస్టెడ్’ అంటే.. ‘ఆమె తగ్గలేదు’ అని అర్థం.ఈ పుస్తకం రాయడానికి చెల్సీకి ఇన్స్పిరేషన్ ఎలిజబెత్ వారెన్. 67 ఏళ్ల వారెన్ విద్యావేత్త, డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు, మసాచుసెట్స్ సెనెటర్. గత ఫిబ్రవరిలో సెనెట్ ఫ్లోర్లో ఈమెకు, సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మికానెల్ (75) కు పడింది. మికానెల్ది రిపబ్లికన్ పార్టీ. కెంటకీ సెనెటర్. ట్రంప్ తరఫున అటార్నీ జనరల్ పదవికి జెఫ్ సెషన్స్ (70) నామినేషన్పై ఫ్లోర్లో డిబేట్ జరుగుతున్నప్పుడు.. 1986లో ఇదే జెఫ్ సెషన్స్ను ఫెడరల్ జడ్జి పదవికి అడ్డుకుంటూ అమెరికన్ పౌరహక్కుల నాయకుడు స్వర్గీయ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భార్య కొరెట్టా స్కాట్ కింగ్ రాసిన ఉత్తరం కాపీని ఎలిజబెత్ వారెన్ నిండు సెనెట్లో చదవడం మొదలు పెట్టగానే ఆమెపై మిచ్ మికానెల్ విరుచుకుపడ్డారు. చదవడం ఆపేయమని ఒక గద్దింపులా ఆదేశించారు. అయితే ఆయన గద్దింపును ఎలిజబెత్ ఖాతరు చేయలేదు. మికానెల్ వెంటనే పోడియంలోకి వెళ్లి... జ్ఛి ఠ్చీటఠ్చీటn్ఛఛీ. జ్ఛి ఠ్చీటజజీఠ్ఛిn ్చn ్ఛ్ఠp ్చn్చ్టజీౌn. N్ఛఠ్ఛిట్టజ్ఛి ్ఛటట, టజ్ఛి p్ఛటటజీట్ట్ఛఛీ అన్నాడు. ‘ఆమెను హెచ్చరించాను. ఆమెకు వివరణ ఇచ్చాను. కానీ వినలేదు. ఆమె తగ్గలేదు’ అని అర్థం. మికానెల్ మాటల్లోని ‘షి పెర్సిస్టెడ్’ అన్న మాటనే చెల్సీ టైటిల్గా పెట్టుకున్నారు. ‘ఆమె తగ్గలేదు’ అనే మాటను యావత్ మహిళా ప్రపంచానికే సగర్వమైన మాటగా చెల్సీ భావించారు. ‘‘మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా?’’ అని పుస్తకం విడుదల తర్వాత చెల్సీని ఇప్పుడు అంతా అడుగుతున్నట్లే.. ఆమె మూడేళ్ల వయసులో తండ్రి ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ఉన్నప్పుడు ఎవరో అడిగారు. దానికి చెల్సి చెప్పిన సమాధానం.. ‘నాకింకా మూడేళ్లే కదా’ అని. ఈ 37 ఏళ్ల వయసులో ‘ఆ రోజు అలా అన్నాను’ అని మాత్రమే నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తున్నారు. అయితే చెల్సీ ఎంత దాటవేసినా.. 2020లో ఆమె ఏదో సాధించబోతున్నారని అమెరికన్ మీడియా విశ్వసిస్తోంది. ట్రంప్ తర్వాత ఆమె కుమార్తె ఇవాంక అధ్యక్ష పదవికి పోటీ పడితే కనుక, ఇవాంకను తట్టుకోగల శక్తి చెల్సీకి మాత్రమే ఉందన్నది ఇప్పటికే ఆ దేశంలో ఒక చర్చలా సాగడం మొదలైంది! ఈ సందర్భంగా చెల్సీ బ్రీఫ్ బయోగ్రఫీ. మూడు పుస్తకాలు ‘షి పెర్సిస్టెడ్’కు ముందు చెల్సీ రెండు పుస్తకాల రాశారు. ‘ఇటీజ్ యువర్ వరల్డ్: గెట్ ఇన్ఫార్మ్డ్, గెట్ ఇన్స్పైర్డ్ అండ్ గెట్ గోయింగ్’ అనే పుస్తకంలో మిడిల్–స్కూల్ పిల్లలకు సోషల్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు. ఇంకోటి గత జనవరిలో విడుదలైంది. ప్రపంచ ఆరోగ్యంపై చెల్సీ రాసిన ఆ పుస్తకం పేరు ‘గవర్నింగ్ గ్లోబల్ హెల్త్: హు రన్స్ ద వరల్డ్ అండ్ వై’. పుట్టకముందే పేరు! చెల్సీ అన్నది ఉత్తర లండన్లోని ఒక సంపన్న ప్రాంతం. చెల్సీ పుట్టడానికి ముందు 1978లో క్లింటన్ దంపతులు యుఎస్ నుంచి క్రిస్మస్ సెలవులకు చెల్సీకి వెళ్లినప్పుడు అక్కడ జోనీ మిచెల్ కచేరీలో ‘చెల్సీ మార్నింగ్’ అనే పాటను విన్నారు. ఆ పాట బిల్ క్లింటన్ మనసుకు హత్తుకుపోయింది. వెంటనే ఆయన ‘మనకు కూతురు పుడితే కనుక చెల్సీ అని పేరుపెట్టుకుందాం’ అని హిల్లరీతో అన్నారు. అన్నట్లే కూతురు పుట్టింది. చెల్సీ అని పేరూ పెట్టుకున్నారు. డాడీని నొప్పించింది చెల్సీకి డాన్స్ అంటే ఇష్టం. నాలుగేళ్ల వయసులోనే డాన్స్ మాయలో పడిపోయింది! వాషింగ్టస్ స్కూల్ ఆఫ్ బ్యాలేలో చాలా ఏళ్లు పాటు ప్రాక్టీస్ చేసింది. డాన్స్ కోసం సాఫ్ట్బాల్ని, సాకర్నీ వదిలేసింది. క్లింటన్కి కూతురి చాయిస్ నచ్చలేదు. చెప్పి చూశాడు. చెల్సీ వినలేదు. ఇక ఆమె దారిలోకే ఈయన వెళ్లాడు. కూతురు ఎక్కడ ప్రోగ్రాములు ఇస్తున్నా అక్కడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ‘నట్క్రాకర్’ ప్లేలో స్టేజీ మీద ‘ఫేవరేట్ ఆంట్’ పాత్రను అభినయిస్తున్న కూతుర్ని చూసి తెగ మురిసిపోయాడని హిల్లరీ ‘ఇట్ టేక్స్ ఎ విలేజ్’ అనే తన పుస్తకంలో రాసుకున్నారు. తల్లి మతమే తన మతం బిల్ క్లింటన్ సదరన్ బాప్టిస్టు. హిల్లరీ మెథడిస్టు విశ్వాసి. రెండూ ప్రొటెస్టెంట్ల విభాగాలే అయినా ఫిలాసఫీలో స్వల్పంగా మాత్రమే వ్యత్యాసం ఉండేది. అయితే చెల్సీ తన తల్లి మార్గానే అనుసరించేది. తన ఏజ్ గ్రూప్ (టీన్స్) వాళ్లతో కలిసి మెథడిస్ట్ చర్చికి వెళ్లి వచ్చేది. అయితే అందర్లోనూ ‘టెరిఫిక్ కిడ్’ లా ఉండేది. చర్చి లేనప్పుడు తన చర్చి మేట్స్ని బ్రేక్ఫాస్ట్లకు, లంచ్కి పిలుచుకొచ్చేది. కొన్నిసార్లు క్లింటన్ దంపతులు కూడా వాళ్లతో కూర్చునేవారు. కొందరైతే రాత్రి ఉండడానికి (స్లీప్–ఓవర్) చెల్సీతో పాటు వైట్ హౌస్కి వచ్చేసేవారు! అమ్మ కోసం ప్రచారం హిల్లరీ క్లింటన్ 2008లో అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో తల్లి అభ్యర్థిత్వానికి మద్దతుగా వందకు పైగా కాలేజీల్లో ప్రసంగించారు చెల్సీ. అప్పుడు ఎవరో ‘లెవిన్స్కీతో మీ నాన్న స్కాండల్, మీ అమ్మకు వ్యతిరేకంగా పనిచేస్తుందనుకుంటున్నారా?’ అని అడిగార్ట. ‘మీరు ఓటు వేయడానికి ఇదే ముఖ్యం అని భావిస్తే మీ భావనననుసరించి ఓటెయ్యండి. నేను అనుకోవడం ఏంటంటే.. హెల్త్ కేర్, ఎకనమిక్స్ అంశాల ఆధారంగా ఓటు వేసే వారూ ఉంటారని’ అన్నారు చెల్సీ. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లోనూ తల్లికి సపోర్టుగా ఉన్నారు. తల్లి ఓటమి చెల్సీని కదలించింది కానీ, తల్లి కదలిపోకుండా చూసేందుకే తన దృష్టినంతా కేంద్రీకరించారు. చెల్సీ కోడ్ నేమ్ ‘ఎన ర్జీ’ బిల్ క్లింటన్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు 1993 జనవరి 20న తల్లిదండ్రులతో పాటు చెల్సీ వైట్ హౌస్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీస్ ‘ఎనర్జీ’ అనే కోడ్నేమ్ ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు. క్లింటన్ దంపతులు తమ ఏకైక సంతానం అయిన చెల్సీని మీడియా కంటపడకుండా పెంచారు. ఈ విషయంలో హిల్లరీ.. కెనడీ భార్య జాక్వెలీన్ సలహాలను పాటించారు. ప్రభుత్వం తరఫున జరిగే సభలకు, సమావేశాలకు కూడా కూతుర్ని దూరంగా ఉంచారు. మీడియా అభివర్ణనలలోంచి తన వ్యక్తిత్వాన్ని చూసుకుని చెల్సీ వాటికి ప్రభావితం కాకుండా ఉండేందుకు క్లింటన్ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ క్లింటన్ అధ్యక్షుడిగా చేసిన ఎనిమిదేళ్లలోనూ చెల్సీపై ‘ది న్యూయర్క్ టైమ్స్’లో 32 కథనాలు, టీవీలలో 87 నెట్వర్క్ న్యూస్ స్టోరీలు వచ్చాయి. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుల పిల్లలందరిలోకీ ఎక్కువ మీడియా కవరేజీ వచ్చింది చెల్సీకే! ఐదవ ఏట రీగన్కి లెటర్ తండ్రి ఆర్కాన్సాస్ గవర్నర్గా పోటీ చేస్తున్నప్పుడు రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంది చెల్సీ! మూడేళ్లకే న్యూస్ పేపర్ చదవడం, ఉత్తరాలు రాయడం నేర్చుకుంది. ఐదో ఏట ఏకంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్కే ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం కాపీని క్లింటన్ ఇప్పటికీ భద్రంగా దాచి ఉంచారు. పశ్చిమ జర్మనీలోని నాజీ సైనికుల సమాధులను సందర్శించడానికి వెళ్లొద్దని చెల్సీ ఆ ఉత్తరంలో రాసింది! అమ్మానాన్నలతో చెల్సీ కొడుకుతో చెల్సీ దంపతులు -
క్లింటన్స్ ఫుడ్!
వేగన్ డైట్ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చిన్న కుర్రాడిలా అనిపిస్తుంటాడు. ఇటీవల తన ఆరోగ్య రహస్యం గుట్టు విప్పారాయన. డీన్ ఆర్నిష్, కాల్డ్వెల్ ఎస్సెల్స్టిన్.. వీళ్లు క్లింటన్ ఆహార సలహాదార్లు. బిల్ క్లింటన్ను ఒక విలేకరి ప్రశ్నిస్తూ ‘మీరు శాకాహారా?’ అని అడిగారు. దానికి బదులిస్తూ క్లింటన్ అన్న మాటలు ఆసక్తికరం. ‘శాకాహారం పేరిట కొందరు బటర్, చీజ్ వంటివి తీసుకుంటూ ఉంటారు. నేను ఆ పాల ఉత్పాదనలూ తీసుకోను. మాంసం ఎలాగూ తినను. ఇక చేపలు సైతం తినడం లేదు. నా ఆహారంలో నూనె దాదాపు లేనట్టే లెక్క. ఇలా పాల ఉత్పాదనలూ తీసుకోనంతగా శాకాహార నియమాలు పాటిస్తున్నాను. ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా నన్ను నేను బాధపెట్టుకుంటున్నానని కూడా అనుకోవడం లేదు. అయితే గతంలో కంటే ఇప్పుడు మరింత ఆరోగ్యంగా ఉన్నాను, అంతేకాదు... అప్పటి కంటే నాలో ఇప్పుడే ఎక్కువ శక్తి ఉన్నట్లుగా అనిపిస్తోంది’ అంటారు క్లింటన్. గతంలో బిల్ క్లింటన్ ఫాస్ట్ఫుడ్నూ, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేవారు. 2004లో ఆయనకు హార్ట్ బైపాస్ అయ్యింది. ఆర్నెల్ల తర్వాత మళ్లీ మరో ప్రొసీజర్ కూడా అవసరమైంది. 2010లో తన బైపాస్ విఫలమైందని తెలుసుకున్నారు క్లింటన్. అప్పుడు ఆయన డాక్టర్ ఎసెల్స్టిన్ పుస్తకమైన ‘ప్రివెంట్ అండ్ రివర్స్ హార్ట్ డిసీజ్’ అనే పుస్తకంపై ఆధారపడ్డారు. డాక్టర్ ఎసెల్స్టిన్ సూచించిన ఆహారం తీసుకున్న తర్వాత దాదాపు10 కిలోగ్రాములు బరువు తగ్గారు. ఇప్పుడు ఆయన తాను ఆహారం కోసం కేవలం మొక్కల నుంచి ఉత్పాదనలపై ఆధారపడుతున్న తీరుతెన్నులను సీఎన్ఎన్ ప్రతినిధి వూల్ఫ్ బ్లిట్జెర్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను తీసుకునే ఆహారాన్ని ప్లాంట్ బేస్డ్ డైట్గా పేర్కొన్నారు బిల్ క్లింటన్. ఈ తరహా శుద్ధ శాకాహారాన్ని వేగన్ డైట్ అంటారు. ఇతరులకూ అంతే ఆరోగ్యం అమెరికాలోని క్లీ్లవ్ల్యాండ్ క్లినిక్లో దాదాపు 35 ఏళ్లకు పైగా సర్జన్గా పనిచేసి రిటైర్ అయ్యారు కాల్డెవెల్ ఎస్సెల్స్టిన్. తాను సూచించిన ఆహారం తీసుకుంటే అసలు గుండెజబ్బులే రావంటున్నారు కాల్డ్వెల్ ఎస్సెల్స్టిన్. దీనికి ఉదాహరణగా షరోన్ కింట్జ్ కేస్ను ఉటంకిస్తారు. అమెరికాలోని గుండెజబ్బు రోగుల్లో ఆమె ఒకరు. ఆమెకు గుండెజబ్బు వచ్చింది. హార్ట్ వెస్సెల్స్ బ్లాక్ అయ్యాయి. గుండె ఆపరేషన్ చేయించకపోతే ఆర్నెల్లలో ఏదైనా అనర్థం జరగవచ్చు. ఆమె చనిపోవచ్చు కూడా. అయితే ఆమె ఆపరేషన్ వద్దన్నారు. కేవలం ఎస్సెల్స్టిన్ పేర్కొన్న ఆహారం మాత్రమే తీసుకుంటూ గుండెజబ్బులకు ఆహారాన్నే మందుగా ఉపయోగించాలని నిర్ణయించారు. తన ఆహారంలో మాంసాహారం మాత్రమే కాదు... చీజ్, బట్టర్ కూడా మానేశారు. అధిక కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉండే ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడామె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. బరువు తగ్గారు. గుండెజబ్బు తాలూకు లక్షణాలేమీ లేవు సరికదా అది ఉన్న దాఖలా కూడా కనిపించనంత హాయిగా ఉన్నానంటారామె. ఎస్సెల్స్టీన్ పేర్కొన్న తీసుకోకూడని ఆహారాలివే... మాంసం, పౌల్ట్రీ ఉత్పాదనలు, చేపలు, గుడ్లు. ∙పాల ఉత్పాదనలైన బటర్, చీజ్, క్రీమ్, ఐస్ క్రీమ్, పెరుగు, పాలు, స్కిమ్డ్ పాలు. నూనెలు : అన్ని రకాల నూనెలతో పాటు ఆరోగ్యకరమని భావించే ఆలివ్, కనోలా నూనెలు కూడా. ∙రిఫైన్డ్ ధాన్యాలు : వరి, పాస్తా, బ్రెడ్, బేక్డ్ ఫుడ్. ∙నట్స్ : వాల్నట్స్ మినహా అన్ని రకాల నట్స్ తీసుకోవాల్సిన ఆహారాలు : ఆకుకూరలు : అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవచ్చంటారు. ∙లెగ్యూమ్స్: బీన్స్ వంటి అన్నిరకాల కాయ ధాన్యాలు. →పొట్టు తీయని అన్ని రకాల ధాన్యాలు తీసుకోవచ్చని పేర్కొంటారు. అయితే ఒకవేళ బ్రెడ్ తీసుకునేవారు కేవలం పొట్టు తీయని ధాన్యం నుంచి తయారైన బ్రెడ్ను మాత్రమే తీసుకోవాలంటారు. →పండ్లు అన్ని రకాల పండ్లనూ తీసుకోవచ్చని చెబుతారు. ఒకవేళ పండ్ల రసం తీసుకుంటే తాజాపండ్లరసాన్ని మాత్రమే తీసుకోవాలని, అందులో చక్కెర మాత్రం వేసుకోకూడదని చెబుతారు. ద్రవాహారాలు: నీళ్లు, ఓట్మిల్స్, నో–ఫ్యాట్ సోయా మిల్క్ తీసుకోవచ్చు. కాఫీ, టీ చాలా పరిమితంగా తీసుకోవచ్చు. ఇలా ఆహారాన్నే ఒక ఔషధంగా ఉపయోగిస్తే గుండెజబ్బులే దరిచేరవంటారు కాల్డ్వెల్ ఎస్సెల్స్టిన్. -
హిల్లరీ ఓటమికి కారణం వారే!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓటమికి 'యాంగ్రీ వైట్మెన్' కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ పేర్కొన్నారు. సోమవారం న్యూయార్క్లోని వీక్లీ న్యూస్ పేపర్ 'రికార్డ్ రివ్యూ'తో మాట్లాడుతూ బిల్ క్లింటన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్కు పెద్దగా ఏమీ తెలియకున్నా.. యాంగ్రీ వైట్మెన్ ఓట్లు ఎలా గెలవాలో తెలుసు అని హిల్లరీ ఓటమి గురించి మాట్లాడుతూ బిల్ క్లింటన్ వ్యాఖ్యానించారు. అలాగే.. రష్యా హ్యాకింగ్, ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి సైతం హిల్లరీ ఓటమికి కారణమని విశ్లేషించారు. ఎన్నికలకు రెండు వారాల ముందు హిల్లరీ ఈ మేయిల్స్ వ్యవహారంపై ఎఫ్బీఐ పునర్విచారణ అనడం ఖచ్చితంగా ఫలితాలపై ప్రభావం చూపిందని బిల్ క్లింటన్ స్పష్టం చేశారు. -
హిల్లరీ గెలిస్తే.. ఆయన్ని ఏమని పిలవాలి?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. ఆమె భర్త బిల్ క్లింటన్ ఏమని పిలవాలా అని ప్రస్తుతం అమెరికన్ల మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంతకమున్నపెన్నడూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళలు చేపట్టలేదు. హిల్లరీ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో, తొలి మహిళా అధ్యక్షురాలి జీవిత భాగస్వామిగా బిల్ క్లింటన్ వైట్హోస్కు రానున్నారు. అంతేకాక బిల్ క్లింటన్ ఇంతకముందే అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయడంతో, వైట్హోస్కు రాబోతున్న తొలి మాజీ అధ్యక్షుడు కూడా ఇతనే కానుండటం గమనార్హం. దీంతో బిల్ క్లింటన్ను మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలవాలా? ఫస్ట్ జెంటిల్మ్యాన్ అని పిలవాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధ్యక్షురాలికి భాగస్వామిగా రాబోతున్న వారికి స్టేట్ లెవల్లో ఏమని అడ్రస్ చేయాలా అని సందిగ్ధత ఏర్పడిందని, ఇప్పటివరకు పురుష అధ్యక్ష భాగస్వామికి ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని అమెరికన్లు పేర్కొంటున్నారు. దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు సలహాలు ఇస్తున్నారు. అమెరికాలో ఆరుగురు మహిళా గవర్నర్లు ఉన్నారని, వారి భర్తలను అనధికారికంగా మొదటి జెంటిల్మ్యాన్గా పిలుస్తున్నారని చెప్పారు. కానీ అధ్యక్షురాలి భర్తలకు ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు. ఒక్కసారి ప్రెసిడెంట్ అయితే, ఆయన జీవితాంతం అధ్యక్షుడిగానే గుర్తింపు పొందుతారని పేర్కొంటున్నారు. ఒకవేళ హిల్లరీ అధ్యక్షుడిని పెళ్లి చేసుకుని ఉండకపోతే, ఆయన్ని మొదటి జెంటిల్మ్యాన్గానే పిలువబడేవాడని...కానీ అంతకమున్నుపే బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా పనిచేయడంతో, ఆయన మాజీ అధ్యక్షుడిగానే పరిగణించబడతారని కొందరు అంటున్నారు. -
ఒహయో, ఫ్లోరిడాలే కీలకం
హిల్లరీ, ట్రంప్ సుడిగాలి ప్రచారం వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రధాన ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్లు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్న కీలక రాష్ట్రాల్లో వందల కోట్లు ప్రకటనలపై ఖర్చుచేస్తున్నారు. హిల్లరీ ఈ-మెయిల్ వివాదాన్ని ఎఫ్బీఐ తిరగదోడిన నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్ తారుమారయ్యాయి. పలు జాతీయ సర్వేల్లో హిల్లరీ, ట్రంప్ల మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్లు ఉంది. ఒహయో, ఫ్లోరిడా రాష్ట్రాలు కీలకం కావడంతో హిల్లరీ, ట్రంప్, దేశాధ్యక్షుడు ఒబామాలు చివరి వారం ఈ రాష్ట్రాలపై దృష్టిపెడుతున్నారు. మంగళవారం హిల్లరీ ఫ్లోరిడా రాష్ట్రంలో 3 ర్యాలీల్లో ప్రసంగించగా... ఒబామా ఒహయోలో ప్రచారం చేశారు. ట్రంప్ వచ్చే రెండు రోజుల్లో ఫ్లోరిడాలో సుడిగాలి ప్రచారం చేస్తా రు. చివరి వారంలోనే ఇరు ప్రచార శిబిరాలు, వారికి మద్దతిస్తున్న గ్రూపులు దాదాపు రూ. 285 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు అంచనా. కాగా, నవంబర్ 8 ఎన్నిక కోసం ఇప్పటికే 2.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు.. హిల్లరీకి మరో చిక్కు వచ్చిపడింది. ఆమె భర్త బిల్ క్లింటన్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెల్జియం వ్యాపారి మార్క్రిచ్కు క్షమాభిక్ష పెట్టిన కేసులో 2001 నాటి విచారణ నివేదిక ఎఫ్బీఐ ట్విటర్ ఖా తాలో దర్శనమిచ్చింది.విచారణ 2005లోనే ముగించిన ఎఫ్బీఐ బిల్ క్లింటన్పై ఏ కేసూ నమోదు చేయలేదు. -
'కుక్కలు పట్టడానికి కూడా హిల్లరీ పనికిరాదు'
ఆంబ్రిడ్జ్: 'మీడియానే.. అంతా మీడియానే చేస్తోంది. ఒక్కసారి మీడియా పక్కకు తప్పుకుంటే అప్పుడు బయటపడుతుంది.. హిల్లరీ క్లింటన్ అసలు స్వరూపం. మీడియా సపోర్ట్ లేకపోతే కనీసం కుక్కలు పట్టే ఉద్యోగం కూడా దొరక్కపోయేది. అలాంటావిడా నన్ను విమర్శించేది?' అంటూ డెమోక్రటిక్ అభ్యర్థిపై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. పెన్సిల్వేనియా లోని ఆంబ్రిడ్జ్ లో మంగళవారం నిర్వహించిన ప్రచార సభలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఎప్పుడో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిన మాటల్ని వీడియోలు చేసి ప్రదర్శిస్తూన్నారని, మీడియా కూడా రెండు మూడు రోజులపాటు వాటినే హెడ్ లైన్స్ గా వేశాయని, ఇలాంటి వ్యర్థప్రయత్నాలు మానుకుంటే మంచిదని అన్నారు. ఇంత చెప్పినా వీడియోలు రిలీజ్ చేయడం మానుకోకపోతే.. హిల్లరీ కుటుంబానికి చెందిన రహస్యాలు బయటపెడతానని హెచ్చరించారు. 'హిల్లరీ భర్త బిల్ క్లింటన్.. ఓ సెక్స్ ప్రిడేటర్ (ఇతర జంతువులను చంపితినే జంతువు) అమెరికా అధ్యక్ష చరిత్రలోనే.. ఆయనంతగా మహిళల్ని ఎవ్వరూ వేధించలేదు. బిల్ క్లింటన్ బారినపడ్డ మహిళల్ని ఓదార్చకపోగా హిల్లరీ వాళ్లను మళ్లీ బెదిరించేది. నాపై విమర్శలు మానుకోకుంటే వాళ్ల బండారం బయటపెడతా' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
నువ్వా... నేనా!
అమెరికాలో పరస్పర ఆరోపణలతో వేడి పుట్టించిన రెండో డిబేట్ హిల్లరీ క్లింటన్ను జైల్లో పెట్టిస్తా • నావి కేవలం మాటలే.. బిల్వి అసభ్య చేతలు: ట్రంప్ • ముస్లింలపై ట్రంప్ ఆలోచనలు ప్రమాదకరం • మహిళలపై అసభ్య పదజాలం ట్రంప్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది: హిల్లరీ సెయింట్ లూయిస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య ఆదివారం రాత్రి జరి గిన రెండో డిబేట్ పరస్పర ఆరోపణలతో వాడీవేడిగా సాగింది. మొదటి డిబేట్లో పూర్తిగా వెనుకబడ్డ రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ ఈ సారి మాత్రం హిల్లరీపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తాను అధికారంలోకి వస్తే ఈమెయిల్ వివాదంలో హిల్లరీని జైల్లో పెట్టిస్తానంటూ హెచ్చరించారు. అంతకుముందు 2005లో మహిళలపై ట్రంప్ చేసిన అసభ్య వాఖ్యల్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తీవ్రంగా తప్పుపట్టారు. సెయింట్ లూయిస్లో వాషింగ్టన్ యూనివర్సిటీలో 90 నిమిషాల పాటు సాగిన చర్చలో ఇద్దరూ ఏమాత్రం తీసిపోకుండా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇస్లామాఫోబియా(ముస్లింలంటే అయిష్టం)పై వాగ్యుద్ధం అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధిస్తానన్న ట్రంప్ ఆలోచనలు సంకుచితం, ప్రమాదకరమని హిల్లరీ పేర్కొన్నారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ... ‘అమెరికాలో ముస్లింల ప్రవేశంపై నిషేధం ఎంత మాత్రం తన విధానం కాదు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారి పూర్వాపరాలు క్షుణ్నంగా తనిఖీ చేయడంగా ఆ నిషేధాన్ని అర్థం చేసుకోవచ్చు. బరాక్ ఒబామా వల్ల సిరియా వంటి దేశాల నుంచి పదులు, వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఒబామా కంటే హిల్లరీ 550 శాతం వారిని అనుమతించారు. మనదేశానికి వచ్చేవారెవరో మనకు తెలియడం లేదు. సిరియా నుంచి వందల, వేల మంది ఎవరో తెలుసుకోకుండా అనుమతించడాన్ని నేను అంగీకరించడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే స్పందించిన క్లింటన్... ‘మనం ఇస్లాంతో యుద్ధం చేయడం లేదు. అమెరికాకు ముప్పు అనుకునేవారిని అధ్యక్షురాలిగా దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లోను అమనుమతించను.వేల మంది శరణార్ధులు... ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్ని ముస్లింలుగా పేర్కొంటూ అనుమతి నిషేధించ లేం. పూర్వాపరాల విచారణను కఠినంతరం చేయాలి’ అని సమాధానమిచ్చారు. ఈమెయిల్స్ వివాదంపై విచారణ జరిపిస్తా: ట్రంప్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడటంపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ట్రంప్ చెప్పా రు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే హిల్లరీ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ‘ప్రత్యేక విచారణాధికారిని నియమించి ఈమెయిల్ వివాదంపై విచారణ జరిపిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ‘హిల్లరీ చేసిన పనికి ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. చేసిన పనికి ఆమె సిగ్గుపడాలి’ అంటూ డొనాల్డ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. క్లింటన్ జోక్యం చేసుకుంటూ... ‘ట్రంప్ అబద్ధాలాడుతున్నారని, ఆయన చెప్పేదంతా పూర్తిగా అవాస్తవాలు’ అని చెప్పారు. ఈ మెయిల్స్ అంశంలో తాను తప్పు చేశానని క్లింటన్ మరోసారి పేర్కొన్నారు. అసభ్య పదజాలంపై సిగ్గుపడుతున్నా.. ట్రంప్: 2005లో ట్రంప్ మహిళలపై చేసిన అసభ్య వాఖ్యలపై డిబేట్లో తీవ్ర వాదోపవాదాలు సాగాయి. ట్రంప్ పదజాలాన్ని హిల్లరీ తీవ్రంగా తప్పుపట్టగా... ప్రతిగా ఆమె భర్త బిల్ క్లింటన్పై ట్రంప్ విరుచుకుపడ్డారు. గతంలో కొన్ని దశాబ్దాల పాటు బిల్ క్లింటన్ మహిళలపై లైంగిక దాడులు చేశారంటూ విమర్శించారు. ‘మహిళల గురించి ట్రంప్ ఏం మాట్లాడారో మనమంతా విన్నాం, చూశాం. మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో... మహిళల పట్ల ఎలా ప్రవర్తించారో అన్నీ చూశాం. ఆయన వ్యక్తిత్వాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి’ అంటూ హిల్లరీ పేర్కొన్నారు. 2005లో తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ క్షమాపణలు చెప్పారు. అవి లాకర్ రూం సంభాషణలు మాత్రమేనని, వాటి విషయంలో కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పానని, అసభ్య పదజాలంపై చాలా సిగ్గుపడుతున్నానని ట్రంప్ తెలిపారు. చర్చలో మరింత వేడి పుట్టిస్తూ బిల్ క్లింటన్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘నావి మాటలు మాత్రమే. బిల్ క్లింటన్ ఏకంగా మహిళల విషయంలో అసభ్యకర పనులు చేశారు. మహిళలతో ఇంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అమెరికా రాజకీయాల్లో ఎవరూ లేరు’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తమపై బిల్ క్లింటన్ లైంగిక దాడి చేశారంటూ ఆరోపించిన నలుగురు మహిళల్ని డిబేట్కు ట్రంప్ తీసుకొచ్చారు. చర్చకు ముందు వారితో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ట్వీటర్లో అత్యధికమంది స్పందించిన అధ్యక్ష ఎన్నికల డిబేట్గా ఈ చర్చ నిలిచింది. 1.7కోట్ల ట్వీట్లు చేశారంటూ ట్వీటర్ ప్రతినిధి వెల్లడించారు. ట్రంప్ పిల్లల్ని గౌరవిస్తా.. హిల్లరీ: ట్రంప్, హిల్లరీలు చివర్లో ఒకరినొకరు పొగుడుకున్నారు. మీ ప్రత్యర్థిలో ఇష్టపడే మంచి లక్షణం చెప్పండన్న ప్రేక్షకుడి ప్రశ్నకు హిల్లరీ జోక్యం చేసుకుని ‘నేను ట్రంప్ పిల్లల్ని గౌరవిస్తాను. వారు పూర్తి సామర్థ్యం, అంకితభావం కలిగినవారు’ అంటూ కొనియాడారు. ఇక హిల్లరీని ట్రంప్ పొగుడుతూ... ‘ఆమె పోరాట యోధురాలు, చేపట్టిన దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. హిల్లరీలో ఆ అంశాన్ని తాను గౌరవిస్తా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. హిల్లరీ గెలుపు ఖాయం: సర్వేలు రెండో డిబేట్ అనంతరం హిల్లరీ అమెరికా తదుపరి అధ్యక్షురాలవడం ఖాయమంటూ కొన్ని పోల్స్ తేల్చిచెప్పాయి. సీఎన్ఎన్/ఓఆర్సీ సర్వేలో హిల్లరీకి 57 శాతం, ట్రంప్కు 34 శాతం మద్దతు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చరిత్ర ముగుస్తోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. వాషింగ్టన్ పోస్టు కూడా హిల్లరీకే విజయం కట్టబెట్టింది. ఎన్బీసీ-వాల్స్ట్రీట్ జర్నల్ సర్వే ప్రకారం... హిల్లరీ 14 పాయింట్లు ఎగబాకి 52 శాతంతో ముందజంలో నిలిచారు. ట్రంప్ 38 శాతం మద్దతే సాధించారు. -
మాజీ అధ్యక్షుడు మమ్మల్ని రేప్ చేశాడు!
సెయింట్ లూయిస్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తమపై లైంగిక దాడి జరిపాడంటూ నలుగురు మహిళలు ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్ కు ముందు ఈ నలుగురు మహిళలతో కలిసి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్ తమపై అత్యాచారం జరిపాడని ముగ్గురు మహిళలు ఆరోపించగా.. తాను బాలికగా ఉన్నప్పుడు అతను తనపై లైంగిక దాడి జరిపాడని మరో మహిళ ఆరోపించింది. ప్రస్తుతం డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్. మహిళలపై తాను లైంగికపరమైన దుర్భాషలు చేసిన వీడియో వెలుగులోకి వచ్చి దుమారం రేపుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఆమె భర్తపై ఆరోపణలు చేసిన మహిళలతో డొనాల్డ్ ట్రంప్ ఈ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నలుగురు మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడటం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం అధ్యక్ష డిబేట్ లో ట్రంప్-హిల్లరీ మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. -
క్లింటన్ పై ఒబామా గట్టిగా అరిచారు!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ నేత సిమోన్ పారిస్ అంత్యక్రియల సందర్భంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు వెళ్లారు. అక్కడ సిమోన్ అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు ఒబామా అప్పటికే విమానంలోకి చేరుకుని క్లింటన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపు ఎదురుచూసినా.. క్లింటన్ ఇంకా రన్వేపై ఎవరితోనే మాట్లాడుతుండటంతో అసహనానికి లోనైన ఒబామా ‘బిల్.. వెళదాం పద’ అంటూ బిగ్గరగా పిలిచారు. అది వినిపించుకోని క్లింటన్ ఇంకా మాటలు కొనసాగించారు. దీంతో విమానం డోర్ వద్దకు వచ్చి ఒబామా మరోసారి ‘బిల్.. నేను నిన్ను ఇంటికి తీసుకెళతా’ అని అన్నారు. అయినా క్లింటన్ ఆ మాటలు వినిపించుకోలేదు. దాంతో మరోసారి ‘బిల్ ఇక వెళదాం పద..’ అంటూ కాస్త కోపంతో ఒబామా బిగ్గరగా అరిచారు. అప్పుడు క్లింటన్ తాపీగా విమానంలోకి చేరుకున్నారు. ఇద్దరూ కరచాలనం చేసుకుని నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. -
ఇదీ మా లవ్ స్టోరీ: బిల్ క్లింటన్
-
చరిత్ర సృష్టించిన హిల్లరీ
అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు - ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు - నవంబర్ 8న ట్రంప్తో తలపడనున్న హిల్లరీ క్లింటన్ - విజయం సాధిస్తే దేశానికి తొలి మహిళా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఫిలడెల్ఫియా : హిల్లరీ క్లింటన్ చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కించుకున్న తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు. మంగళవారం ఫిలడెల్ఫియాలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో హిల్లరీ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీకి 4,764 మంది పార్టీ డెలిగేట్లు మద్దతు ప్రకటించారు. హిల్లరీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించిన ఏకగ్రీవ తీర్మానాన్ని.. ప్రైమరీల్లో ఆమెతో పోటీ పడిన బెర్నీ సాండర్స్ ప్రవేశపెట్టారు. 68 ఏళ్ల హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా, ప్రథమ మహిళగా, న్యూయార్క్ సెనెటర్గా గతంలో బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ.. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా, కమాండర్ ఇన్ చీఫ్గా హిల్లరీ రికార్డు సృష్టిస్తారు. డెమోక్రటిక్ సదస్సు రెండో రోజు తన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత.. హిల్లరీ న్యూయార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలయ్యే మార్గంలో తొలి అడ్డంకిని అధిగమించామని హిల్లరీ పేర్కొన్నారు. ‘‘మీరు నాకు ఇచ్చిన అద్భుతమైన గౌరవమిది. ఈ విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మీ అందరికీ కృతజ్ఞతలు. నా ఈ కలను నిజం చేసేందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది నిజంగా మీ విజయం. నా ప్రసంగం వినేందుకు ఎవరైనా బాలికలు నిద్రపోకుండా ఉంటే.. వారికి నేను చెప్పే మాట ఒక్కటే. నేను తొలి మహిళా అధ్యక్షురాలిని కావచ్చు.. కానీ ఆ తర్వాత మీలో ఒకరు అధ్యక్షురాలు అవుతారు’’ అంటూ ఉద్విగ్నంగా వేలాది మంది తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తున్నట్టుగా కన్వెన్షన్ను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా వర్జీనియా సెనెటర్ టిమ్ కెయిన్ను హిల్లరీ గత వారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే హిల్లరీ ఎంపికను నిరసిస్తూ పలువురు శాండర్స్ మద్దతుదారులు.. డెమోక్రటిక్ కన్వెన్షన్ జరుగుతున్న ప్రదేశం లోపలా.. బయటా నిరసనకు దిగారు. ఇదీ మా లవ్ స్టోరీ: బిల్ క్లింటన్ హిల్లరీ అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించడంపై ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్(69) హర్షం వ్యక్తం చేశారు. ‘1971 వసంతకాలంలో హిల్లరీని కలిశాను. పాలిటిక్స్, సివిల్ రైట్స్ క్లాస్లో తొలిసారి ఆమెను చూశాను. చూడగానే ఈమే నాకు సరైన జోడీ అనిపించింది. అందమైన ఒత్తై జుట్టు.. పెద్ద కళ్లద్దాలు.. మేకప్ లేదు.. ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం అమితంగా ఆకర్షించాయి. క్లాస్ పూర్తయిన తర్వాత ఆమెనే అనుసరిస్తూ వెళ్లా. అయితే పలకరించేందుకు ధైర్యం సరిపోలేదు. తర్వాత చాలా రోజులు ఆమె నాకు కనిపించినా మాట్లాడలేదు. ఓరోజు లా లైబ్రరీలో క్లాస్మేట్తో మాట్లాడుతున్నా. ఇంతలో లైబ్రరీలో హిల్లరీ కనిపించింది. నన్నే చూస్తోంది. చదువుతున్న పుస్తకం మూసేసి నా దగ్గరకు వచ్చింది. ‘‘నువ్వు నన్ను చూస్తున్నావని తెలుసు. అందుకే నేనూ నిన్ను చూస్తున్నా. కనీసం మనం ఒకరి పేరు మరొకరు తెలుసుకోవాలి కదా. నా పేరు హిల్లరీ రోథమ్. నువ్వెవరు?’ అని ప్రశ్నించింది. ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. చివరికి గొంతు పెగల్చుకుని పేరు చెప్పా. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. తను వెళ్లిపోయింది. అప్పుడు లైబ్రరీ నుంచి ఒకే ఒక్క గోల్తో బయటకు వచ్చా’ అని డెమోక్రటిక్ డెలిగేట్ల కరతాళ ధ్వనులు, నవ్వుల మధ్య బిల్.. హిల్లరీతో తన ప్రేమ కథ తెలిపారు. 45 నిమిషాల తన ప్రసంగంలో వారిద్దరి మధ్యా జరిగిన సరదాలు, విశేషాలను చెప్పారు. ‘అన్ని అర్హతలు ఉన్న హిల్లరీనే అధ్యక్ష పదవికి అర్హురాలు. అమెరికాలో మార్పును తీసుకురాగలిగేది ఆమెనే. మనందరినీ ఏకంచేసే సత్తా ఆమెకుంది. ఆమె దీని కోసం తన జీవితాన్ని ధారబోసింది. ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలి’ అని ప్రజలను కోరారు. -
ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.. ఆమెను పెళ్లాడాక..!
ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య , హిల్లరీ క్లింటన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె తన బెస్ట్ఫ్రెండ్ అని, 1971 వసంతకాలంలో ఆమెను చూడగానే తాను ప్రేమలో పడిపోయినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీకి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. తమ దాంపత్య జీవితంలోని ఎన్నో విషయాలను స్పృశిస్తూనే.. ఆమెను అమెరికా అధ్యక్షురాలిగా ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు.. ఆ వివరాలివి.. 1971లో వసంతకాలంలో హిల్లరీనితొలిసారి కలిశాను. చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డాను. బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆమెను పెళ్లాడాను. ఆమె చూపే తెలివితేటలు, శక్తిమంతమైన వ్యక్తిత్వం, ప్రేమ, శ్రద్ధ ఇప్పటికీ నన్ను విస్మయపరుస్తుఘుంటాయి. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత నేను సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను. ప్రజాసేవ గురించి నా కళ్లు తెరిపించి నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి నడిపించింది హిల్లరీనే. ఒసామా బిన్ లాడెన్ను గాలించడంలో అధ్యక్షుడు ఒబామాకు హిల్లరీ ఎప్పుడూ అండగా నిలిచింది. మీరు యువ ఆఫ్రికన్-అమెరికన్ అయితే ఆరుబయట స్వేచ్ఛగా నడిచేందుకు ఎవరూ భయపడని భవిష్యత్తును నిర్మించుకునేందుకు హిల్లరీకి అండగా నిలువండి. మీరు ముస్లిం అయితే, అమెరికాను, స్వేచ్ఛను ప్రేమిస్తే.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే.. ఇక్కడే ఉండండి. మేం గెలిచేందుకు అండగా నిలువండి. హిల్లరీ మార్పుసాధకురాలు. ఆమె ఎప్పుడూ యథాతథ స్థితిని అంగీకరించదు. భూగోళంపై అత్యంత గొప్ప దేశం మనది. మనం ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించాలి. మీరు హిల్లరీని ఎందుకు ఎన్నుకోవాలంటే ఆమె మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది కాబట్టి. హిల్లరీకి ప్రత్యర్థిగా పోటీలోకి దిగింది ఓ కార్టూన్ (ట్రంప్) మాత్రమే. -
నా భర్తకు పదవులు ఇవ్వను: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరఫున ముందున్న అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్ తన ప్రభుత్వంలో ఏ మంత్రి పదవిని చేపట్టరని పేర్కొంది. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చునే వ్యక్తి తానే అని హిల్లరీ భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు చెప్పవచ్చు. అధికారంలోకి వస్తే మీ భర్త బిల్ క్లింటన్ కు క్యాబినెట్ లో చోటుదక్కుతుంతా అని ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హిల్లరీని ఓ విలేకరి అడిగారు. ఈ ప్రశ్నపై హిల్లరీ స్పందించిన తీరుకు మీడియా వారు ఆశ్చర్యపోయారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్ క్లింటన్ కు క్యాబినెట్ లో చోటు ఉండదని స్పష్టం చేశారు. కోవింగ్టన్, కెంటుకి ఏరియాల్లో ఆదివారం జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా బిల్ క్లింటన్ కు ఉన్నత పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన భర్త ఆర్థికవ్యవస్థను గాడిలో పెడతాడంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరుసటి రోజు(సోమవారం) మీడియాకు ఆమె వివరణ ఇచ్చింది. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లోనూ తన భర్త క్లింటన్ రిటైర్ అవ్వరని అందుకు తన వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయంటూ చెప్పిన హిల్లరీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో అమెరికా వాసులు షాక్ తిన్నారు. -
రాజకీయ చరిత్రలో ఆయనే 'హీనుడు'
'ఆవిడగారు ఎవర్ని పెళ్లిచేసుకుందో చూడండి.. స్కర్ట్ కనిపిస్తే చాలు, వేధించడం మొదలుపెడతాడాయన. ఒక్కరా, ఇద్దరా, ఆయన బారిన పడ్డ మహిళల సంఖ్య చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే ఆయన.. రాజకీయ చరిత్రలో మహిళల పట్ల అతి హీనంగా ప్రవర్తించిన వ్యక్తిగా మిగిలిపోతాడు' అంటూ ట్రంప్ మరోసారి కంపు వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్, ఆమె భర్త, యూఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి అసభ్యకర పదజాలాన్ని వినియోగించారు. వాషింగ్టన్ లోని స్పోకనే కన్వెన్షన్ సెంటర్ లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ట్రంప్.. తన ప్రత్యర్థి పార్టీకి చెందిన హిల్లరీ వైవాహిక జీవితంపై మాటలదాడి చేశారు. 'క్లింటన్ చేతిలో పరాభవానికి గురౌన మహిళల పట్ల హిల్లరీ దారుణంగా వ్యవహరించారు. నిజానికి ఆ మహిళలకు క్లింటన్ చేసిన నష్టం కంటే హిల్లరీ చేసిన చేటే పెద్దది. ఎందుకలా జరిగిందంటే.. హిల్లరీది ఫక్తు కుటిల మనస్తత్వం' అని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారుచేసుకున్న ట్రంప్ ఇప్పుడు హిల్లరీనేకాక గతంలోనూ మహిళలను చులకనచేస్తూ మాట్లాడారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. మరో నెల రోజుల్లో రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల అభ్యర్థుల పేర్లు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇరు నేతలూ ప్రత్యర్థులపై సంధించేందుకు ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు 91 మిలియన్ డాలర్ల వ్యయంతో అన్ని టెలివిజన్ చానళ్లలో డెమోక్రాట్ అభ్యర్థి గురించిన ప్రచారాన్ని చేసేందుకు హిల్లరీ పీఏసీ(పొలిటికల్ యాక్షన్ కమిటీ) ప్రణాళికలను సిద్ధంచేసింది. ప్రచారంలో ఎక్కువ భాగం ట్రంప్ పై విమర్శలకే ప్రాధ్యాన్యం దక్కనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మహిళలను ఉద్దేశించి ట్రంప్ చేసిన కంపు వ్యాఖ్యల వివరాలను సేకరించిన హిల్లరీ పీఏసీ వాటిని జనానికి వినిపించి, ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయనుంది. -
'ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరపున ముందున్న హిల్లరీ క్లింటన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోవాలో డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్సియల్ డిబేట్లో పాల్గొన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తన భర్త బిల్ క్లింటన్ సలహాలు సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడుతాయని అంది. అయితే పాలనకు సంబంధించిన ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది అని సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు హిల్లరీ వెల్లడించారు. 'నాకున్న బెస్ట్ సలహాదారుడు బిల్. 1990 లలో అమెరికా పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగవడంలో అతని పాత్ర ఎంతో ఉంది. నేను తప్పకుండా బిల్ సలహాలు తీసుకుంటాను' అని హిల్లరీ తెలిపారు. అమెరికా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందని తెలిపిన ఆమె.. ముఖ్యంగా పేద ప్రజలు స్వతహాగా అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
భారత్ పై అణ్వాయుధాలు వేయాలనుకుంది!
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ అణు ఘాతుకానికి తెగబడాలని ప్రయత్నించిందట! భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నదని, వాటిని భారత్ పై వేసే అవకాశం కూడా ఉందని సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను హెచ్చరించినట్టు వైట్ హౌస్ మాజీ టాప్ అధికారి ఒకరు తెలిపారు. 1999 జులై 4 న అమెరికా పర్యటనకు వచ్చిన అప్పటి-ఇప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో క్లింటన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయనకు సీఐఏ ఈ విషయాన్ని తెలిపింది. రోజువారీ రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాల గురించి వివరించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి తెగబడి..కార్గిల్ ముట్టడికి ప్రయత్నించడం.. భారత్ సైన్యాలు పాక్ ఆర్మీ దాడిని తిప్పికొడుతున్న నేపథ్యంలో షరీఫ్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు కోరేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతామనే ఉద్దేశంతో ఆయన సామరస్యంగా ఈ యుద్ధాన్ని ముగించాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పటి క్లింటన్-షరీఫ్ భేటీలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి సభ్యుడు బ్రూస్ రీడెల్ అప్పటి విషయాలను వెల్లడించారు. 'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నది. వాటిని వాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కచ్చితమైన నిఘా సమాచారముంది. ఇందుకు సంబంధించి ఓవల్ ఆఫీస్ లో గంభీర వాతావరణముంది' అని సీఐఏ క్లింటన్ కు చెప్పిందని బ్రూస్ వివరించారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ బుధవారం క్యాన్సర్ తో మృతిచెందిన నేపథ్యంలో ఆయనకు స్మృతిలో రాసిన వ్యాసంలో బ్రూస్ ఈ విషయాలు తెలిపారు. పాకిస్థానే ఈ యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో అదే యుద్ధాన్ని ఎలాంటి పరిహరం కోరకుండా ఆపేయాలని, అప్పుడే మరింత ఉద్రిక్తతలు రేకెత్తబోవని షరీఫ్ కు చెప్పాలని క్లింటన్ కు సాండీ బెర్జర్ సూచించినట్టు ఆయన వివరించారు. -
'క్లింటన్ కూడా మా ఆయనలాంటివాడే!'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తాజా బాగోతం ఒకటి వెలుగుచూసింది. తన కన్నా 17 ఏళ్ల పెద్దదైన జాక్వలిన్ కెన్నడీని క్లింటన్ ప్రలోభపెట్టాలని చూశాడట. ఆమె నిరాకరిస్తున్నా.. బలవంతంగా ఆమెతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడట. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ భార్య అయిన జాక్వలిన్ తాజా పుస్తకంలో ఈ విషయాన్ని వివరించారు. అప్పుడు తన వయస్సు 60 ఏళ్లు అని, న్యూయార్క్లోని తన అపార్ట్మెంట్కు వచ్చిన క్లింటన్ తనను ప్రలోభపెట్టాలని చూశాడని, దీంతో తమ మధ్య 'కుస్తీ పోటీ'లాంటి పెనుగులాట జరిగిందని, అతి కష్టం మీద అతన్ని దూరం తోసేసి ఈ అఘాయిత్యం నుంచి బయటపడ్డానని జాక్వలిన్ పేర్కొన్నట్టు ఈ పుస్తకం తెలిపింది. 'బిల్ అండ్ హ్యారీ: సో దిస్ ఈజ్ దట్ థింగ్ కాల్డ్ లవ్' అనే పుస్తకంలో రచయితలు డార్విన్ పార్టర్, డాన్ఫోర్త్ ప్రిన్స్ ఈ విషయాలను వెల్లడించారు. క్లింటన్ కూడా తన భర్త జాన్ ఎఫ్ కెన్నడీ లాంటివాడేనని, లైంగిక సంబంధాలలో పేరుమోసిన ఇద్దరూ 'నో' అనే సమాధానం వస్తే సహించేవారు కాదని జాక్వలిన్ ఓ సందర్భంలో తన స్నేహితురాలితో చెప్పిందని పుస్తకంలో పేర్కొన్నారు. బిల్ క్లింటన్ చిన్నప్పటి నుంచి జాన్ ఎఫ్ కెన్నడీని విపరీతంగా అభిమానించేవాడు. 1963లో వైట్హౌస్కు వచ్చి.. అప్పటి అధ్యక్షుడైన కెన్నడీని కలిశాడు కూడా. ఆ తర్వాత 1992లో క్లింటన్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆయనకు దివంగత కెన్నడీ భార్య జాక్వలిన్ బాగా సహాయం చేశారు. అయితే, ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఈ పుస్తకం తెలిపింది. -
ఆ నేడు సెప్టెంబర్ 13, 1993
కదిలింది శాంతిరథం... ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ యాసర్ అరాఫత్లు వైట్హౌజ్లోని సౌత్లాన్లో జరిగిన కార్యక్రమంలో పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పాలస్తీనాకు పరిమితమైన స్వయంప్రతిపత్తికి మార్గం సుగమం చేసే ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బిల్క్లింటన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఇప్పటి వరకు జరిగిన రక్తపాతం, కాలువలు కట్టిన కన్నీళ్లకు అడ్డుకట్టవేద్దాం’’ అన్నారు రాబిన్ ఆ సమావేశంలో. ‘‘ఈ ప్రక్రియ మా జీవితాల్లో అత్యంత కీలకమైనది’’ అన్నారు అరాఫత్. ‘‘భవిష్యత్ శాంతి చర్చలకు ఇదో పునాదిరాయిలాంటిది’’ అన్నారు రాజకీయ విశ్లేషకులు.అయిదు ఇరు వర్గాలలోని అతివాదులకు మాత్రం ఈ శాంతిప్రక్రియ బొత్తిగా నచ్చలేదు. ఈ శాంతికరచాలనం ఆ తరువాత కాలంలో ఏ మేరకు సత్ఫలితాలను ఇచ్చింది అనేది వేరే విషయంగానీ...పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రెండు వర్గాల ప్రతినిధులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం, శాంతివచనాలు వల్లించడం...ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమావేశం ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది. -
'నా జీవితమే ఆమె'
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ పై ప్రశంసలు కురిపించాడు. తన కష్టంలో ఎప్పుడూ హిల్లరీ చేదోడు వాదోడుగా నిలవడమే కాకుండా.. కుటుంబానికి పెద్ద అండగా నిలబడుతూ వస్తుందని బిల్ క్లింటన్ స్పష్టం చేశారు. భార్య హిల్లరీ కంటే ఏ కార్యక్రమమూ కూడా తనకు ఎక్కువ కాదన్నారు. హిల్లరీతో జీవిత భాగస్వామ్యం గురించి ఓ ఇంటర్యూలో మాట్లాడిన క్లింటన్ పై విధంగా స్పందించాడు. 'మా 40 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ హిల్లరీ నా వెంటే ఉంది. నా కెరీర్ అభ్యున్నతికి భార్య హిల్లరీ ఎంతగానో సాయపడింది. కొన్ని సంక్లిష్ట సమయాల్లో నాపై ఆమె తీసుకునే జాగ్రత్త నిజంగా అద్భుతం' అని క్లింటన్ పేర్కొన్నారు. తామిద్దరం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే తమ మధ్య ప్రేమ బంధం బలపడుతూ వస్తుందన్నారు. అయితే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్నహిల్లరీ క్లింటన్ కు ఇప్పటివరకూ బిల్ క్లింటన్ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. కాగా, శనివారం నుంచి హిల్లరీ ప్రారంభిస్తున్న తొలి ర్యాలీలో బిల్ క్లింటన్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. -
క్లింటన్కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా?....ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు జాతీయ మీడియా యావత్తు రాజస్థాన్లోని దౌసా గ్రామానికి దౌడ్ తీసింది. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కే తలపాగా చుట్టిన చరిత్ర గజేంద్రసింగ్కు ఉంది. దీంతోపాటు.. ఆయన స్వగ్రామంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యపానానికి, వరకట్నానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్న గజేంద్ర సింగ్కు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. బీజేపీతో మొదలైన ఆయన రాజకీయాలు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మీదుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలే ఆ రైతు ఆత్మహత్య పట్ల పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దౌసా గ్రామస్థుల కథనం ప్రకారం: గజేంద్ర సింగ్ 2003లో బీజేపీలో చేరారు. తహసిల్లో జరిగిన పలు పార్టీ సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ టెక్కెట్ ఆశించి భంగపడ్డాడు. దాంతో సమాజ్వాదీ పార్టీ టెక్కెట్పై అసెంబ్లీకి పోటీచేశాడు. బీజేపీ అభ్యర్థి అల్కాసింగ్ చేతుల్లో ఓడిపోయాడు. 2013 వరకు ఆయన ఆ పార్టీలోనే కొనసాగి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సమితి క్రియాశీలక సభ్యుడిగా కొనసాగాడు. తర్వాత అసెంబ్లీ టిక్కెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో టిక్కెట్ రాకపోవడంతో చివరకు ఆమ్ ఆద్మీని ఆశ్రయించాడు. గజేంద్ర సింగ్ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ఆయనది విశాలమైన పక్కా భవంతి. దాదాపు 8 ఎకరాల వ్యవసాయ భూమి. జామ, ఉసిరి తోట ఉంది. ఇంటి ఎదురుగానే టేకు వనం ఉంది. ఇటీవలి అకాల వర్షాల వల్ల గోధుమ, ఆవాల పంట నాశనం అయింది. ఆ పంట నష్టం కూడా 25 శాతానికి మించి ఉండదని జిల్లా అధికారులు తెలిపారు. గజేంద్రకు 12వ తరగతి చదువుతున్న ఒ ఆడపిల్ల, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆత్మహత్య చేసుకునేంత మనోదౌర్బల్యం కూడా లేదు. పది మందికీ సహాయం చేసే మంచి గుణం కూడా ఉంది. ఆయన వ్యవసాయాన్ని కూడా అంతగా పట్టించుకునేవాడు కాదట. జైపూర్లో పర్యాటకులకు రాజస్థాన్ సంప్రదాయ తలపాగా చుట్టడమే పనిగా పెట్టుకొని అలా వచ్చే డబ్బులతో అక్కడే ఎక్కువకాలం జీవించేవాడు. కేవలం 20 సెకడ్లలో తలపాగా చుట్టే నేర్పరిగా పేరు తెచ్చుకున్న గజేంద్ర రాజస్థాన్ సాంస్కృతిక శాఖ నుంచి 'మిస్టర్ డిసర్ట్' అనే టైటిల్ కూడా అందుకున్నారు. బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో రాజస్థాన్లో పర్యటించినప్పుడు ఆయనకు తలపాగా చుట్టారు. ఇంకా పలువురు విదేశీ నేతలకు తలపాగా చుట్టిన ఆయన గతంలో వాజపేయి, ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా తలపాగా చుట్టిన ఫొటోలను ఆయన మిత్రులు చూపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా కృషిచేస్తానని ఢిల్లీ వెళ్లేముందు గ్రామస్థులకు మాట ఇచ్చాడట. కేజ్రీవాల్ను స్వయంగా కలుసుకునేందుకు మూడు రోజులు ముందుగానే ఢిల్లీ వెళుతున్నానని చెప్పాడని ఆయన మేనల్లుడు అమిత్ సింగ్ తెలిపాడు. జంతర్ మంతర్ వద్ద చెట్టెక్కి టీవీలను ఆకర్షించినప్పుడు 'చూస్కో నేను టీవీలో కనిపిస్తున్నాను' అని తనకు ఫోన్చేసి చెప్పాడని ఆయన తమ్ముడు విజేంద్ర సింగ్ తెలిపాడు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా కుటుంబ సమస్యలు ఉన్నాయని, పలుసార్లు ఇల్లు విడిచి వెళ్లి పోవాలనుకున్నాడని కొంత మంది గ్రామస్థులు తెలిపారు. ఏదేమైనా ఆత్మహత్య చేసుకునే బలహీనుడు మాత్రం గజేంద్రసింగ్ కాడని గ్రామస్థులు ఏకమాటగా చెప్పారు. దీంతో ప్రమాదవశాత్తు ఆయన చెట్టుమీది నుంచి జారిపడ్డాడా? అనే కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. ఈ దిశగా కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
తాత అయ్యారుగా.. కంగ్రాట్స్!
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకునేందుకు న్యూయార్క్ పాలెస్ హోటల్కు వచ్చారు. వారికి మోదీ, భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ సాదరంగా స్వాగతం పలికారు. సుష్మా, హిల్లరీలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యలైనందుకు క్లింటన్ జంటను మోదీ, సుష్మాలు అభినందించారు. అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు వారు సమావేశమై, భారత్, యూఎస్ సంబంధాలపై చర్చించారు. ‘ఆర్థికరంగ అభివృద్ధికి సంబంధించి మీ కున్న పరిజ్ఞానం ముందు ఎవరైనా దిగదుడుపే’ అని మోదీని బిల్ క్లింటన్ ప్రశంసించారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అలాగే, గంగానది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడాన్ని కూడా క్లింటన్ ప్రశంసించారని తెలిపారు. ‘అది పవిత్రమైన కార్యక్రమం. మీ ఈ చర్య ఆసియాలోని ఇతర దేశాలకు ఒక స్ఫూర్తినిస్తుంది’ అని క్లింటన్ అన్నారని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. బిల్, హిల్లరీల కూతురు చెల్సియా గతవారం పాప చార్లట్కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్ పోటీపడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ జరగడం విశేషం. -
మోడీతో క్లింటన్ దంపతుల భేటీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్ సమావేశమయ్యారు. భారత్-అమెరికా సంబంధాల గురించి చర్చించారు. క్లింటన్ దంపతులు సుమారు 45 నిమిషాల పాటు మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఇటీవల అమ్మమ్మతాతాయ్యలు అయిన క్లింటన్ దంపతులను మోడీ, సుష్మా అభినందించారు. -
బిల్ క్లింటన్ తాతయ్యాడు...
అమెరికా :దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా (34) శుక్రవారం రాత్రి పాపకు జన్మనిచ్చింది. పాపకు జన్మనివ్వడం తనకెంతో ఆనందంగా ఉందని చెల్సియా ట్వీట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీతో చెల్సియా కు 2010 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నారు. 2014 ఏప్రిల్లో చెల్సియా తల్లి కాబోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘జీవితంలో అంతుచిక్కని విషయాలు జరుగుతుంటాయి. పుట్టబోయే బిడ్డ కూతురో, కొడుకో తెలుసుకోకూడదని నేను, నా భర్త నిర్ణయించుకున్నాము. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నాము. పుట్టబోయేది ఎవరైనా ప్రపంచంలోని గొప్ప మహిళా నాయకుల మధ్య పెరుగుతారని చెప్పగలను.’’ అని ఆమె తెలిపారు. -
బిల్ క్లింటన్ కు సవాల్ విసిరిన జార్జ్ బుష్!
వాషింగ్టన్: 'ఐస్ బకెట్ ఛాలెంజ్' ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటీలు తడిసిముద్దవుతున్నారు. ఓ వైరల్ ఫీవర్ లా ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రముఖులను వెంటాడుతోంది. తాజాగా అమెరికా మాజీ ఆధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ ఛాలెంజ్ లో భాగస్వామి అయ్యారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన బుష్.. ఐఎస్ వాటర్ బకెట్ ను తన మీద కుమ్మరించుకున్నారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు బుష్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా తన కూతరు జెన్నా బుష్ హెగర్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా రాశారు. లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసిరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్
లాస్ ఏంజెలెస్: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా నిర్ధారణ అయింది. బెల్టుతో ఆయన ఉరేసుకున్నాడని మారిన్ కౌంటీ అధికారి వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయనేమైనా విషపదార్థాలు సేవించారా, లేదా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు. రాబిన్ విలియమ్స్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. శ్వాసావరోధం కారణంగానే ఆయన మృతి చెందినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణయిందని తెలిపారు. సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్లో సొంతిట్లో రాబిన్ విలియమ్స్ ఆకస్మికంగా మృతిచెందారు. నిరాశ, నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. కాగా, రాబిన్ మరణం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతాపం ప్రకటించారు. గొప్ప నటున్ని, స్నేహితున్ని కోల్పోయానని పేర్కొన్నారు. -
జైపూర్ చేరుకున్న బిల్ క్లింటన్!
జైపూర్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక చార్డెట్ విమానంలో జైపూర్ చేరుకున్నారు. లక్షలాది మంది పాఠశాల విద్యార్ధులకు భోజన ఏర్పాటు చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లింటన్ పాలుపంచుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి జైపూర్ చేరుకున్న క్లింటన్ ఒబెరాయ్ రాజ్ విలాస్ లో బస చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న అక్షయ పాత్ర అనే స్వచ్చంద సంస్థ నిర్వహించే అతిపెద్ద వంటశాలను బుధవారం క్లింటన్ సందర్శిస్తారని నిర్వహకులు, పోలీసులు వెల్లడించారు. జైపూర్ జిల్లాలోనే ప్రతి రోజు 1100 పాఠశాలల్లో 1.25 లక్షల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్ర ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా జైపూర్ లోని 20 వేల అంగన్ వాడి కార్యకర్తలకు, 4 వేల రోజువారి కూలీలకు కేవలం 5 రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జైపూర్ లోనే కాకుండా రాజస్థాన్ లోని నతద్వారా, జోధ్ పూర్, బరాన్ పట్టణాల్లో వంటశాలలను నిర్వహిస్తోంది. జైపూర్ లోని ప్రతాప్ నగర్ లో సంస్కృత వేద పాఠశాలను కూడా క్లింటన్ సందర్శిస్తారని నిర్వహాకులు తెలిపారు. గురువారం ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో పర్యటించనున్నారు. -
పరస్పర అవగాహనతోనే క్లింటన్ తో అఫైర్: మోనికా
వాషింగ్టన్: ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో అఫైర్ సాగిందని వైట్ హౌజ్ సేవకురాలు మోనికా లెవిన్ స్కీ అన్నారు. తమ అఫైర్ లో క్లింటన్ చోరవతీసుకున్నారని మోనికా వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని అన్నారు. 1990 లో జరిగిన సంఘటన కారణంగా బిల్ క్లింటన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వానిటీ ఫెయిర్ పత్రిక కోసం రాసిన వ్యాసంలో అప్పుడు జరిగిన సంఘటనల్ని పేర్కొన్నారు. శారీరక సంబంధానికి తొలుత క్లింటన్ ఒప్పుకోలేదని మోనికా తెలిపారు. ఆతర్వాత తన పదవిని కాపాడుకోవడానికి తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. -
వివరం: ఉన్నట్టా? లేనట్టా?
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో - ‘‘గ్రహాంతరవాసులు అనేవాళ్లు కనుక భూమి మీదకు వస్తే నేను పెద్దగా ఆశ్చర్యపడను’’ అన్నారు. ‘‘అంటే ఏలియన్స్ ఉన్నారని మీ ఉద్దేశమా?’’ అన్నప్పుడు, ‘ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాకపోవచ్చు’’ అన్నారు! దీంతో ఏలియన్స్ మళ్లీ ఒకసారి చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ ఏలియన్స్... ఉన్నట్టా... లేనట్టా.... గ్రహాంతర వాసులపై అదే మీమాంస! పది వేల నుంచి 20 వేల కోట్ల పాలపుంతలు... ఒక్కో పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు... కొన్ని నక్షత్రాలకు ‘తగిన’ దూరంలోనే భారీ గ్రహాలు.. అయినా బుద్ధిజీవి మనిషి ఒక్కడేనా? ఈ సువిశాల విశ్వంలో మరెవ్వరూ లేనే లేరా! చిత్రమైన విషయమేమిటంటే... గ్రహాంతర వాసులు ఉన్నారనేందుకు ఎంత అవకాశముందో... లేరని గట్టిగా వాదించేందుకూ అంతే అవకాశముంది! గ్రహాంతరవాసుల కోసం మనం ప్రయత్నిస్తున్నట్లు విశ్వాంతరాళాల్లో ఇలా మనకోసమూ ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో?! ఒక్కటైతే నిజం... సైన్స్ దృష్టితో చూస్తే ఇప్పటివరకూ భూమికి అవతల గ్రహాంతర వాసుల మాట అటుంచితే... అస్సలు జీవం అన్నదే లేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మనిషి ఇప్పుడిప్పుడే విశ్వాన్ని చూడటం మొదలుపెట్టాడు కాబట్టి! కొన్ని దశాబ్దాల క్రితం వరకూ మనిషికి సౌరకుటుంబానికి ఆవల ఏముందో తెలిసేది కాదు.. ఆ తరువాత అవతల కూడా నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయని గుర్తించగలిగాడు. గత దశాబ్ద కాలపు పరిశోధనలను పరిగణనలోకి తీసుకుంటే... కేవలం మనమున్న మిల్కీవే గెలాక్సీలోనే 50 శాతం నక్షత్రాల పరిధిలో గ్రహాలు ఉన్నాయన్న అంచనాకు రాగలిగాడు. వీటిల్లో భూమిని పోలినవి దాదాపు వెయ్యి వరకూ ఉన్నాయని గుర్తించాడు కూడా. ఇంకో విషయం... మనిషి ఇప్పటివరకూ మనకు కేవలం నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని దాటి వెళ్లింది కూడా లేదు. ఏతావాతా తేలేది ఏమిటంటే... ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు వాటిల్లో ఏదో ఒకదాంట్లో జీవం ఉండేందుకు అవకాశాలు మెండు అని! జీవానికి ఆధారం నీరు... గ్రహాంతర వాసుల గురించి ఆలోచించేటప్పుడు జీవం మనుగడకు అత్యవసరమైన అంశమేమిటో కూడా యోచించుకోవాలి. ఇక్కడే కాదు... ఎక్కడైనా జీవం ఉనికికి అత్యంత కీలకమైన విషయం నీరు. సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల్లో నీటి ఛాయలు పెద్దగా లేవని ఇప్పటికే స్పష్టమైంది. అంగారకుడి గర్భంలో, గురుగ్రహపు ఉపగ్రహం యూరోపాపై కొన్ని ఇతర ఉపగ్రహాలపై కూడా నీరు ఉందనేందుకు ఆధారాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ భూమ్మీద మాత్రమే జీవం ఉంది. సుమారు 450 కోట్ల ఏళ్ల వయసున్న భూమిపై 340 కోట్ల ఏళ్ల క్రితమే జీవం ఆనవాళ్లు ఉన్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో లభ్యమైన స్టోమాటోలైట్స్ బ్యాక్టీరియా శిలాజాలు ఇందుకు నిదర్శనం. జీవశాస్త్ర పరంగా కొంచెం సంక్లిష్టమైన నిర్మాణమైన బ్యాక్టీరియా కంటే ముందు కూడా ఏదో ఒక రూపంలో జీవం ఉండేందుకు అవకాశాలు ఎక్కువే. దీన్నిబట్టి జీవ ఆవిర్భావం మరీ అంత క్లిష్టమైన అంశమేమీ కాదని స్పష్టమవుతుంది. కాకపోతే ఇతర గ్రహాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ వేగంతో జీవ పరిణామం సంభవించిందని చెప్పుకోవచ్చు. మండే లావాలో...ఎముకలు కొరికే చలిలోనూ... భూమ్మీద అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల జీవజాతులు మనుగడ సాగిస్తున్న విషయం శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలోనే గుర్తించారు. సలసల కాగే అగ్నిపర్వత బిలాలు మొదలుకొని అత్యంత శీతల పరిస్థితుల్లోనూ ఇప్పటివరకూ గుర్తించని జీవజాతులను మనిషి గుర్తించాడు కూడా. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే... అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ జీవం పురుడు పోసుకోవచ్చు అని. ఇదే పోలిక గ్రహాంతర వాసులకూ వర్తిస్తుంది. సౌరకుటుంబానికి ఆవల ఉన్న కోటానుకోట్ల గ్రహాల్లో ఉన్న పరిస్థితులేమిటన్నది మనిషి ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ అవి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ జీవం ఉండేందుకు అవకాశాలు మాత్రం ఉంటాయన్నది సుస్పష్టం. ఆశ రేకెత్తించిన ఒకే ఒక్క సందేశం... గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తించేందుకు... మనిషి తన ఉనికిని చాటుకునేందుకు ఇప్పటివరకూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. 1977లో తొలిసారి వాయేజర్ ఉపగ్రహం ద్వారా గ్రహాంతర వాసులను ఉద్దేశించి మనిషి ఒక సందేశం పంపాడు. బంగారు రేకులపై మనిషి రూపురేఖలను, భూమి స్థానాన్ని సూచించే గుర్తులు, కొన్ని శబ్దాలను పొందుపరిచి పంపిన ఈ సందేశంపై ఇప్పటివరకూ ప్రత్యుత్తరం లేదు. అలాగే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరస్టియల్ లైఫ్ (సెటీ) భూమ్మీద ఉన్న అత్యంత భారీ రేడియో టెలిస్కోపుల సాయంతో సుదూర గ్రహాలకు సంకేతాలు పంపుతూనే ఉంది. గ్రహాంతర వాసులెవరైనా ఉంటే ఈ సంకేతాలు అందుకుని స్పందించకపోతారా? అన్న అశతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1977 ఆగస్టు 15న అందిన ఒక్క సందేశం మాత్రం గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని పెంచేలా చేసింది. ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ టెలిస్కోపు ద్వారా అందిన ఈ సంకేతాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్త అదే కాగితంపై ‘వావ్’ అని రాశాడంటే అదెంత ఆసక్తికరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంకేతాన్ని మరోసారి పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక 1974లో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పూర్టరికోలోని ఆర్సిబో వేధశాల నుంచి 210 బైట్ల సైజున్న ఓ సందేశాన్ని ఎం13 నక్షత్ర మండలంవైపు పంపించారు. మానవుల, కీలకమైన రసాయన అణువుల, డీఎన్ఏ రసాయన నిర్మాణం వంటి వివరాలతో కూడిన ఈ సందేశం వన్వే ట్రాఫిక్ మాదిరిగానే మిగిలిపోయింది. డ్రేక్స్ ఫార్ములా... 1961లో సెటీ తొలి అధికారిక సమావేశంలో ఫ్రాంక్ డ్రేక్ ప్రతిపాదించిన ఓ ఫార్ములా... మిల్కీవే పాలపుంతలో ఎన్ని నాగరిక సమాజాలు ఉండేందుకు అవకాశముందో తెలియజేసింది. ఒక నాగరికత అభివృద్ధి చెందేందుకు పట్టే సగటు కాలం, నక్షత్రాలు తద్వారా గ్రహాలు ఏర్పడేందుకు తీసుకునే సమయం.. వాటిల్లో భూమిని పోలిన పరిస్థితులు ఉండే గ్రహాల శాతం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా ఆధారంగా మన పాలపుంతలో కనీసం 12 వేల నాగరికతలు ఉండేందుకు అవకాశముందని తేల్చారు. అయితే తరువాతి కాలంలో చాలామంది శాస్త్రవేత్తలు దీంతో ఏకీభవించలేదు. సెటీ ఉద్యమానికి మూలస్తంభంగా భావించే కార్ల్ సెగాన్ పది లక్షలకుపైగా గ్రహాంతర వాస నాగరికతలు ఉంటాయని అంచనా వేస్తే... డ్రేక్స్ ఫార్ములాలో ఉపయోగించిన విలువలు చాలా తక్కువని, ఎక్కువ చేసి లెక్కిస్తే ఈ పాలపుంతలో మనం ఒక్కరమే ఉండేందుకు అవకాశమున్నట్లు తేలుతుందని ఇంకొందరు వాదించారు. అందుకేనేమో... ఏలియన్ సందేశాల కోసం చెవులు రిక్కించి వింటోన్న సెటీ శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను గుర్తించేందుకు, వారితో మాట్లాడేందుకు ఇంకో ఇరవై ఏళ్లు పడుతుందని అంటూ 40 ఏళ్లు గడిపేశారు. ఫెర్మీ ప్రశ్నలకు బదులు ఏదీ? అణుభౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ 1950 ప్రాంతంలో గ్రహాంతర వాసులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. గ్రహాంతర వాసులు ఉన్నారని, వారు ఇప్పటికే భూమిని సందర్శించి పోయారని, అడపదడపా ఫ్లైయింగ్ సాసర్లలో వచ్చిపోతున్నారని వాదిస్తున్న వారిని ఉద్దేశించి వేసిన ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి... 1. ఈ విశ్వంలో గ్రహాంతర వాసులు ఉంటే వారు మనతో ఎందుకు మాట్లాడటం లేదు? 2. భూమ్మీదకు ఎందుకు రావడం లేదు? 3. రహస్యంగా వచ్చిపోతున్నారని అనుకుంటే కనీసం వేడి, విద్యుదస్కాంత శక్తి వంటి ఆనవాళ్లయినా వదిలి వెళ్లాలి కదా? అవెక్కడ? అన్న ఈ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. ఈ సందేహాలన్నిటినీ ఇలా ఉంచి, వేల ఏళ్ల నాటి జాడలను బట్టి చూస్తే... టెక్నాలజీలో, కమ్యూనికేషన్లో మన ‘అవతార్’ టైపు మూవీలను, నానో టెక్నాలజీలను దాటి వేల ఏళ్లు ముందుకు వెళ్లి ఉండాలి ఏలియన్స్. మరి అంత ఫాస్ట్గా ఉన్నప్పుడు మనతో ఏలియన్స్కి కమ్యూనికేషన్ ఎందుకు ఏర్పడడం లేదు? బహుశా సిగ్నల్ పంపే టెక్నాలజీ ఏలియన్స్ దగ్గర ఉండొచ్చు. ఆ సిగ్నల్స్ను అందుకునే టెక్నాలజీ మన దగ్గర లేదేమో! అయితే ‘సెటి’ ఖగోళశాస్త్రవేత్త సేథ్ షోస్టాక్ మరో రకమైన ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గూగుల్లో ఉన్న డేటానంతా విశ్వంలోకి డంప్ చేయిస్తే ఏనాటికైనా మనుషుల గురించి ఏలియన్స్కి తెలుస్తుందనీ, ఆ విధంగా జీవులున్న గ్రహాల మధ్య సంబంధాలు ఏర్పడి సరికొత్త సౌభ్రాతృత్వం మొదలౌతుందని సేత్ ఆకాంక్ష. చరిత్రలో గ్రహాంతర వాసుల ఊసులు... గ్రహాంతర వాసుల ప్రస్తావన ఈ రోజు కొత్తగా పుట్టిందేమి కాదు. చరిత్ర పుటల్ని తరచిచూస్తే... ఎన్నెన్నో తార్కాణాలు కనిపిస్తాయి. ఎగిరే పళ్లాలను చూశామని, గాల్లో ఈదే గ్రహాంతర వాసులను చూశామన్న వారి ఆనవాళ్లూ ఉన్నాయి. కొన్ని అక్షరబద్ధమైతే... మరికొన్ని సచిత్ర సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అటువంటి ప్రస్తావనల్లో మచ్చుకు కొన్ని... - క్రీస్తు శకం 373లో అలెగ్జాండ్రియాలోని ఓ మతగురువు సెయింట్ ఆంటోనీ జీవిత చరిత్రను రాశారు. అందులోని ఒక భాగంలో ‘ఎడారిలో ఒక డిస్క్’ పేరుతో ఫై ్లయింగ్ సాసర్ను పోలిన వర్ణన ఉంది. వెండితో చేసిన ఓ భారీ పళ్లెం లాంటి నిర్మాణాన్ని సైతాన్... ఆంటోనీకి చూపాడని, సైతాను దురుద్దేశాన్ని గ్రహించిన ఆంటోనీ ఆ పళ్లెంలోని రాక్షసుడితో పోరాటం చేశాడని ఉంది. - రోమన్ సామ్రాజ్యాన్ని థియోడిసిస్ పరిపాలిస్తున సమయంలో (క్రీ.శ.393) ఓ భారీ ప్రకాశవంతమైన గోళం... దానితోపాటు మరెన్నో చిన్న గోళాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. వాటిని చూసి పౌరులు భయంతో వణికిపోయారని రోమన్ రచయిత జూలియన్ ఒబ్సీక్వీన్స్ తన రచనల్లో ప్రస్తావించారు. - ప్రపంచం నలుమూలల్లో లభ్యమైన అనేక పురాతన వస్తువుల వయసును కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ధారించినప్పుడు అనేక -ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయి. ఈ పురాతన వస్తువుల్లో కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటివిగా స్పష్టమైంది. క్రీ.శ.747లో చైనాలో ‘నిప్పులు చిమ్ముతూ ఎగిరే డ్రాగన్లు’ పేరుతో గ్రహాంతర వాసుల ప్రస్తావన ఒకటి ఉంది. మానవుల్లాంటి వారు.. విమానంలో ఎగురుతూ కనిపించారని ప్రజలు పేర్కొన్నట్లుగా ఉంది. అంటే... మనిషి విమానాన్ని తయారు చేసేందుకు సుమారు 1200 ఏళ్ల క్రితమే అలాంటి వాటిని మనుషులు చూశారన్నమాట! - తొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ఆర్చిబిషప్ ఆఫ్ లైన్స్ తాను ముగ్గురు పురుషులు.. ఒక మహిళ ఎగిరే పళ్లెం నుంచి కిందకు దిగుతూండగా చూశానని... వీరిని చూసిన ప్రజలు ఆందోళనకు గురై వారిపై రాళ్లు విసిరానని పేర్కొన్నారు. మేఘాల్లోంచి కిందకు దిగిన వీరు చర్చి సభ్యులను భయకంపితులను చేశారని రాసుకున్నారు. - ఖగోళ శాస్త్రవేత్తలు మార్గరెట్ టర్న్బుల్, జిల్ టార్టర్ (కార్నెగీ ఇన్స్టిట్యూషన్, వాషింగ్టన్ డీసీ)లు మన చుట్టుపక్కల్లో సంక్లిష్ట జీవం ఉండేందుకు అవకాశమున్న గ్రహాల జాబితాను తయారు చేశారు. ఇలాంటి గ్రహాలు 17129 వరకూ ఉన్నాయని తేల్చారు. - 300 కోట్ల ఏళ్లకంటే పురాతనమై నక్షత్రాల చుట్టూ తిరిగే.. తక్కువ ద్రవ్యరాశి, ఇనుము తదితర లోహాలు ఎక్కువగా ఉన్న గ్రహాలపైనే జీవం పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది టర్న్బుల్ అంచనా. - ఇలాంటి గ్రహాల్లో మనకు అతిదగ్గరగా ఉన్నది... ‘ఎప్సిలాన్ ఇండీ ఏ’. భూమి నుంచి దీని దూరం దాదాపు 11.8 కాంతి సంవత్సరాలు. - గ్రహాంతర వాసుల అన్వేషణలో మీరూ భాగం కావాలనుకుంటే... సెటీ అందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం సెటీ వెబ్సైట్ నుంచి ఒక సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మీ కంప్యూటర్ శక్తిని ఉపయోగించుకుని సెటీ సుదూర విశ్వం నుంచి చేరుతున్న రేడియో సంకేతాలను విశ్లేషిస్తుంది. దాదాపు రెండు లక్షల మంది ఈ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకున్నారు. - 2006 సెప్టెంబరు 19న ఫ్రెంచ్ సెంటర్ ఫర్ నేష నల్ స్పేస్ స్టడీస్ గ్రహాం తర వాసుల కోసం ఓ టీవీ కార్యక్రమాన్ని అంతరిక్షం లోకి ప్రసారం చేసింది. భూమికి 45 కాంతి సంవత్స రాల దూరంలో ఉన్న ఎరాయి అనే నక్షత్రం వైపు ప్రసారం చేసిన ఈ వీడియో అక్కడికి చేరేందుకు మరో 37 సంవత్సరాలు పడుతుంది! - ‘‘నా మనసులో ఎలాంటి సందేహం లేదు. గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారు. బహుశా మన చంద్రుడి మీదకు వచ్చి వెళ్లి ఉంటారు కూడా’’ - మిచియో కాకూ, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త - ‘‘యూఎఫ్ఓలు దాంట్లో గ్రహాంతర వాసులు ఉండేందుకు అవకాశముంది. చాలామంది ప్రజలు అనుకుంటున్నట్లు ఈ విషయాలను ప్రభుత్వాలు బయటకు రాకుండా చేస్తున్నాయి’’ - స్టీఫెన్ హాకింగ్, ఖగోళ శాస్త్రవేత్త - క్రీ.శ.393 నాటి బంగారు నాణెంపై రోమన్ చక్రవర్తి థియోడిసిస్, ఆయన మంత్రివర్గం గ్రహాంతరవాసుల కోసం వాయేజర్ ఉపగ్రహం 1977లో అంతరిక్షంలోకి పంపిన బంగారు రేకు - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
ఆర్జితం: మాటలు కోట్లు దాటాయి!
మాటలు కోటలు దాటుతుంటాయి కానీ అడుగులు గడప దాటవు అని ఓ చక్కటి సామెత ఉంది. తమాషా ఏంటంటే... మాటలు కోటలు దాటితే చాలు... నువ్వే కోటీశ్వరుడివి అంటోంది ప్రపంచం. అలాంటి మాటల మరాఠీలైన బలియనీర్లు వీళ్లంతా. వీరి సంపాదన మన రూపాయల్లో ఎంతో చూద్దామా! మాట్లాడటం ఒక కళ. ఆ ఒక్క కళ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో విషయాలు సాధించేలా చేస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయో, లేదో తెలియదు గాని కొందరి మాటలకు మాత్రం కోట్లు రాలుతున్నాయి. ప్రపంచంలో కేవలం మాటలతో గంటల్లో లక్షలు, కోట్లు సంపాదించే వారున్నారు. ఈ జాబితాలో ఉన్న వారంతా మీకు ఇంతకుముందు వేరే కారణాలతో పరిచయం అయినవారే. బిల్ క్లింటన్-హిల్లరీ క్లింటన్ ఒకప్పటి అమెరికా అధ్యక్షుడై బిల్ క్లింటన్ టాప్ పెయిడ్ పబ్లిక్ స్పీకర్. ఒక ప్రసంగానికి ఆయన రెండున్నర కోట్ల వరకు తీసుకుంటారట. తక్కువలో తక్కువ అంటే 90 లక్షల రూపాయలకు తగ్గడట. ఆయన భార్య హిల్లరీ కూడా తక్కువేం తినలేదు. ఆమె ఫీజు రూ.1.20 కోట్లు. టోనీ బ్లెయిర్ ఈయన బ్రిటన్ మాజీ ప్రధాని మాత్రమే కాదు గ్రేట్ స్పీకర్ కూడా. ఈయన ప్రధానిగా పదవి చేపట్టాక ప్రసంగాల్లో రాటుదేలారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రసంగాలు ఇస్తూ సంపాదించేస్తున్నారు. టోనీ ఒక ప్రసంగానికి వసూలు చేసే ఫీజు కోటిన్నర. రూడీ గిలాని గతంలో న్యూయార్క్ మేయర్గా పనిచేశారు. ప్రపంచంలో ఓ పెద్ద నగరానికి మేయరుగా పనిచేసిన అనుభవంతో ఎంతో విషయపరిజ్ఞానం సంపాదించిన రూడీ స్వతహాగా మంచి మాటకారి. విషయం ఉన్నవాడు. అందుకే ఆయన తన ప్రసంగానికి కోటీ అరవై లక్షల ఫీజు వసూలు చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఈయన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెలివిజన్ పర్సనాలిటీ. అమెరికాకు చెందిన డొనాల్డ్ గలగలా మాట్లాడటంలో ఎంత అనుభవం సంపాదించారు. ఈయన ప్రసంగాలు బుక్ చేసుకోవడానికి ఎన్నో కంపెనీలు క్యూలో ఉండే పరిస్థితి. డబ్బు మాత్రం ప్రసంగానికి రూ.కోటి తీసుకుంటారు. లారీ సమ్మర్స్ లారీ ఒక ఆర్థిక వేత్త. వైట్హౌస్ ఎకనమిక్ కౌన్సిల్కు ఒకప్పుడు డెరైక్టర్గా కూడా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాలు, సిద్ధాంతాలపై విపరీతమైన పట్టున్న లారీ హెన్రీ సమ్మర్స్ ప్రసంగానికి 80 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తారట. వీరితో పాటు వర్జిన్ గ్రూప్కు చెందిన ఇంగ్లండ్ బిజినెస్మ్యాన్ సర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికన్ ఆర్థిక వేత్త అలాన్ గ్రీన్స్పన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, పర్యావరణ వేత్త అల్గోరె, మాజీ అలస్కా గవర్నర్ అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సారాపాలిన్లు ఒక్కొక్కరు లక్ష డాలర్లు అంటే దాదాపు 60 లక్షల రూపాయలు ఒక్క ప్రసంగానికి తీసుకుంటారు. ఇంతకీ వీరంతా ఇంత పెద్దమొత్తం తీసుకుని ఏం చెబుతారు అనేదేగా మీ అనుమానం. వ్యాపార విధాన రూపకల్పన, వ్యక్తిత్వ వికాసం, పీపుల్ మేనేజ్మెంట్, ఒప్పంద నిర్వహణ, కార్యనిర్వహణ సామర్థ్యాలు, సమాజం, పర్యావరణం, ఆర్థిక వ్యవహారాలు వంటి అంశాలలో చక్కటి అనుభవ పాఠాలు, తెలివైన సలహాలు ఇస్తుంటారు. 1. రూడీ గిలాని 2. బిల్ క్లింటన్ 3. అలాన్ గ్రీన్స్పన్ 4. హిల్లరీ క్లింటన్ 5. అల్ గోరె 6. రిచర్డ బాన్సన్ 7. టోనీ బ్లెయిర్ -
బిల్ క్లింటన్ తాత కాబోతున్నాడు
మోనికా లూయిన్ స్కీతో వివాహేతర సంబంధం విషయంలో విశ్వవిఖ్యాతి పొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తాత కాబోతున్నారు. బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ త్వరలో తల్లి కాబోతోంది. భర్త మార్క్ తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చెల్సియా ఈ విషయం తెలియచేసింది. చెల్సియా ప్రస్తుతం బిల్ క్లింటన్ ఫౌండేషన్ లో మహిళా సాధికారికతకి సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఆమె ఈ సమావేశంలో మాట్లాడుతూ తాను గర్భవతి అన్న విషయాన్ని వెల్లడించింది. 'ఆడైనా, మగైనా నాకు ఒక్కటే. ఒక్క మాట మాత్రం నిజం. నాకు పుట్టే బిడ్డ శక్తివంతులైన మహిళా నేతల మధ్య ఎదుగుతుందని మాత్రం నేను చెప్పగలను,' అన్నారు చెల్సియా. -
'బిల్ క్లింటన్ తో అఫైర్ వార్తలు అవాస్తవం'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో గత సంవత్సర కాలంగా ఆఫైర్ నడిపిందని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ టామ్ సైజ్ మోర్ చేసిన వ్యాఖ్యల్ని బ్రిటన్ సినీ తార ఎలిజబెత్ హార్లీ ఖండించారు. బిల్ క్లింటన్ తో తనకు అఫైర్ ఉందని చేసిన వ్యాఖ్యలు చాలా తెలివి తక్కువ పని. అవాస్తవం. నా లాయర్లు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు అని హ్యార్లీ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు తనకు భయంకరమైన రోజు అని ట్విటర్ లో పేర్కోన్నారు. 'నేను ఎప్పుడు బిల్ క్లింటన్ ను కలువలేదు' అని హ్యార్లీ తెలిపింది. 1998లో వైట్ హౌజ్ లో 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్ర ప్రదర్శన అనంతరం తాను ఎలా క్లింటన్ కు పరిచయం చేశానో అనే విషయాన్ని సైజ్ మోర్ తెలిపారు. 1992 లో రూపొందించిన పాసింజర్ 57 అనే చిత్ర సందర్భంగా ఏర్పడిన పరిచయంతో హ్యార్లీ, సైజ్ మోర్ లు కొంత కాలం డేటింగ్ చేశారు. Ludicrously silly stories about me & Bill Clinton. Totally untrue. In the hands of my lawyers. Yawn. — Elizabeth Hurley (@ElizabethHurley) February 5, 2014 -
పలుకే బంగారం!
హిల్లరీ క్లింటన్... పరిచయం అక్కర్లేని పేరు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ భార్యగా, అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడిన సెనెటర్గా గుర్తింపు ఉన్న హిల్లరీకి యునెటైడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఆ పదవిలోకి జాన్ కెర్రీ వచ్చారు. అప్పటి నుంచి హిల్లరీ ఏం చేస్తున్నారు? పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం హిల్లరీ సోషియో ఆంత్రొపాలజిస్ట్గా పేరు తెచ్చుకొన్నారు. ఎన్నో పదవులను సమర్థంగా నిర్వహించిన అనుభవంతో హిల్లరీ క్లింటన్ గొప్ప వక్తగా మారారు. నిర్వాహకులు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ ఆమెను సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. న్యూయార్క్టైమ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రస్తుతం హిల్లరీ ఒక్కో ప్రసంగానికి రెండు లక్షల డాలర్లు తీసుకుంటున్నారు. వైట్హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ లేడీస్లో ఎవరికీ ఈ స్థాయి డిమాండ్ లేదని న్యూయార్క్టైమ్స్ పత్రిక పేర్కొంది. అమెరికాతో పాటు కెనడా, కొన్ని యూరోపియన్ దేశాల నుంచి హిల్లరీకి ‘ప్రత్యేక అతిథి’ గా ఆహ్వానాలు వస్తున్నాయి. అందుకోసం హిల్లరీకి ప్రైవేట్ విమానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. వ్యవస్థీకృత అంశాల గురించి విశ్లేషణాత్మకంగా ప్రసంగిస్తున్న హిల్లరీ, మంచి డిప్లొమాట్గా పేరు తెచ్చుకొన్నారు. తన అనుభవాల ను ప్రస్తావిస్తూ, ‘లీడర్ షిప్ ఈజ్ ఏ టీమ్ స్పోర్ట్’, ‘యూ కెన్ విన్’, ‘విష్పర్ కెన్ బీ లౌడర్ దేన్ షౌట్’ అంటూ ఒక వ్యక్తిత్వవికాస నిపుణురాలిలా మాట్లాడుతున్నారామె. సాధారణంగా అమెరికా అధ్యక్షపీఠం నుంచి వైదొలగి, వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ప్రెసిడెంట్ల ప్రసంగాలకు, వాళ్లు రాసే పుస్తకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. హిల్లరీ భర్త బిల్ క్లింటన్కు కూడా అలాంటి డిమాండే ఉంది. మిస్టర్ క్లింటన్ ప్రసంగాల ద్వారానే ఏడాదికి దాదాపు కోటిన్నర డాలర్ల డబ్బును సంపాదిస్తున్నారు. మిసెస్ క్లింటన్ ఈ విషయంలో ఆయనకు పోటీనిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అమెరికన్ అధ్యక్ష పీఠం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మరోసారి క్లింటన్ ఫ్యామిలీ వైట్హౌస్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే హిల్లరీ గిరాకీ డబులవదూ! -
‘ఎక్సయిటింగ్’ లీడర్!
విశ్లేషణం బిల్క్లింటన్... ప్రజానాయకుడు కావాలని పదహారేళ్ల వయసులోనే నిర్ణయించుకుని, కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్లనుంచి ప్రేరణ పొంది, ప్రజాజీవితంలోకి ప్రవేశించి, రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు. హిల్లరీని ప్రేమించి, పెళ్లాడిన ప్రేమికుడు. క్లింటన్ ఫౌండేషన్ స్థాపించి సేవ చేస్తున్న మానవతావాది. మరి మోనికా లూయిన్స్కీ విషయంలో తప్పుటడుగు ఎందుకు వేశాడు? అధ్యక్షుడిగా ఉండి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి ఆయన వ్యక్తిత్వమే కారణమా? చాలామంది నాయకులు తమ ఉపన్యాసం తయారులో చూపించే శ్రద్ధ.. బాడీలాంగ్వేజ్ విషయంలో చూపించరు. కానీ నిజానికి ఎంత బాగా మాట్లాడాం, ఎంతమందిని ఆకట్టుకున్నామనేదానిలో భాష పాత్ర ఏడు శాతం మాత్రమే. మిగతా 93 శాతం బాడీ లాంగ్వేజ్పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం క్లింటన్కు బాగా తెలుసు. ఉపన్యాసకళలో ఆయన నిష్ణాతుడు. అందుకే మాట్లాడేటప్పుడు ఆయన నిల్చునే తీరు, కదలికల్లో ఈజ్ కనిపిస్తుంది. తరచుగా చిరునవ్వులు చిందిస్తాడు. మాట్లాడటాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ ఆయనో విజువల్ పర్సనాలిటీ అని చెప్తాయి. మాట్లాడేటప్పుడు చేతులు, వేళ్లు రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ రిలాక్సేషన్ మొహంలో కూడా కనిపిస్తుంది. అలాగే హస్తాన్ని పైవైపుకు ఉంచి చూపుడువేలును చూపిస్తారు. ఇది ఆయన ఓపెన్గా, సపోర్టివ్గా ఉంటారని, తననుంచి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారని వెల్లడిస్తుంది. చేతులు ఓపెన్గా ఉండటమనేది ఆయన్ను సులువుగా చేరవచ్చనే భావనను కలిగిస్తుంది. మాటలు తెలిసిన నేత... ఉపన్యాసాన్ని ఎలా మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో క్లింటన్కి బాగా తెలుసు. ప్రజల మనసుల్లోకి చేర్చాలనుకున్న విషయం గురించి మాట్లాడేటప్పుడు పదాలను నిదానంగా, స్పష్టంగా పలుకుతారు. ఆ విషయాన్ని ఒకటికి నాలుగుసార్లు చెప్పి ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా చేస్తారు. ‘‘మనందరం కలిస్తే మరింత సాధించగలం. మనమధ్య విభేదాలు నిజమే, కానీ మనందరిలోనున్న మానవత్వం మరింత నిజం’’ అంటూ ‘నేను’ అనే పదం కన్నా ‘మనం’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా తానూ అందరిలో ఒకడినే అన్న భావనను కలిగిస్తారు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా కాసిన్ని జోకులు వేసి బ్యాలెన్స్ చేస్తారు. జర్నలిస్టులా అందరికీ అర్థమయ్యేలా విషయాన్ని వివరిస్తారు. ప్రశ్నలు వేసి, తానే సమాధానం చెప్పి, అదే అందరికీ కావాల్సిందని ఒప్పిస్తారు. వీటన్నింటిలోనూ ఆయన శరీర కదలికలకు, మాటలకు మధ్య లయ కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి ఆయన మాట్లాడేది నిజమేనన్న విశ్వాసాన్ని కలుగజేస్తాయి. అధికారంకన్నా లక్ష్యం ముఖ్యం క్లింటన్ ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన, కరిష్మా ఉన్న నాయకుడు. తన అప్పియరెన్స్తో, మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తారాయన. చుట్టూ ఉన్నవారిని నిరంతరం గమనిస్తుంటారు. వారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టి, తను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించకుండా చెప్పేస్తారు. ఆయనకు తన అధికారంకన్నా తానేమి సాధించాననేది ముఖ్యం. అలాగని లక్ష్యసాధనలో మొండిగా వ్యవహరించరు. అందరినీ కలుపుకుపోతారు. తనకు వచ్చిన సమాచారం, ఫీడ్బ్యాక్ ఆధారంగా లక్ష్యసాధన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. సాధించిన విజయాల నుంచి ప్రేరణ పొందుతారు. నిర్ణయాలు తీసుకునేప్పుడు తాను నిర్దేశించుకున్న ప్రమాణాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎక్సయిట్మెంట్ కోసం ఆరాటం క్లింటన్ బహిర్ముఖుడు (ఎక్స్ట్రావర్ట్). కలివిడిగా మాట్లాడతారు. సెంటర్ ఆఫ్ అటెన్షన్గా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడతారు. ఈ క్షణంలో జీవించేందుకు ఇష్టపడతారు. ప్రతి క్షణాన్నీ ఆనందించాలనుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఆనందాలు, ఎక్సయిట్మెంట్స్ పొందాలనుకుంటారు. ఆ క్రమంలో అత్యుత్సాహంగా (ఇంపల్సివ్) వ్యవహరిస్తారు. తాను చేస్తున్నది ఓ సాహసమనుకుని, దాన్నుంచి ఆనందాన్ని పొందుతారు. ఈ ఆనందాన్ని, ఎక్సయిట్మెంట్ను పొందేందుకు అవసరమైతే సంప్రదాయాలను, అంతరాత్మను పక్కన పెట్టేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి సాహసాల్లో ఒకటే మోనికా లూయిన్స్కీతో ప్రణయకలాపం. ఈ విషయంపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా... అది ఆయన జీవితంలో ఓ మచ్చగానే మిగిలిపోయింది. - విశేష్, సైకాలజిస్ట్ -
ఆత్మీయ క్షణాలు...
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి ఆఫ్రికన్దేశం ఉగాండాలో పర్యటించాడు. ఆ సమయంలో అక్కడ ఒక గ్రామాన్ని సందర్శించాడు. ఆ వేళా విశేషంలో తనకు పుట్టిన పిల్లాడిని అమెరికా అధ్యక్షుడి చేతిలో పెడుతూ అతడి చేత నామరణం చేయించి, క్లింటన్ పేరే తన కొడుకుకూ పెట్టుకొంది ఒక తల్లి. కొంతకాలానికి క్లింటన్ అధ్యక్ష పదవీ కాలం ముగిసింది. క్లింటన్ యూనెస్కోతో కలిసి పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా మరోసారి ఉగాండా వెళ్లాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకొంది. క్లింటన్ వస్తున్న విషయం తెలుసుకొన్న ఒక 14 యేళ్ల కుర్రాడు విమానాశ్రయంలోనే ఆయనను కలిసేందుకు అనుమతి తీసుకొన్నాడు. విమానం దిగిన క్లింటన్కు తనను తను పరిచయం చేసుకొంటూ, తన పేరు కూడా క్లింటన్ అని చెప్పి ‘నాకు పేరు పెట్టింది మీరే..’ అంటూ ఒకప్పటి ఫోటోలను చూపించాడు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకొన్న క్లింటన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ ఆత్మీయ క్షణంలో ఆ ఇద్దరూ భావోద్వేగానికి లోన య్యారు.. క్లింటన్ పొత్తిళ్లలో చిన్నారి ఒదిగి ఉన్న ఫొటో 1998లో తీసింది, రెండో ఫొటో 2012లో తీసింది.