చైనాలో మన న్యూస్​ సెన్సార్ | Indian websites not accessible in China | Sakshi
Sakshi News home page

చైనాలో మన న్యూస్​ సెన్సార్

Published Tue, Jun 30 2020 2:09 PM | Last Updated on Tue, Jun 30 2020 2:50 PM

Indian websites not accessible in China - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్ వెబ్​సైట్స్, పత్రికలను చైనా సెన్సార్ చేస్తోంది. వర్చువల్​ ప్రైవేట్​ నెట్​వర్క్(వీపీఎన్​)కు కూడా లొంగని అత్యంత శక్తిమంతమైన ఫైర్​ వాల్​ను రక్షణగా నిలిపి, న్యూస్​ సెన్సార్​కు పాల్పడుతోంది. (మీ ఫోన్‌లోని ‘టిక్​టాక్’​ ఏమవుతుంది?)

ప్రస్తుతం చైనాలో ఇండియన్​ టీవీ చానెళ్లను మాత్రమే ఐపీ టీవీ ద్వారా చూడటానికి కుదురుతోందని అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు రోజులుగా ఎక్స్​ప్రెస్​ వీపీఎన్​ ఐఫోన్​, డెస్క్​టాప్​లలో కూడా పని చేయడం లేదని వెల్లడించారు. (అమెజాన్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు)

సెన్సార్​షిప్​కు గురైన వెబ్​సైట్​లోని సమాచారాన్ని రహస్యంగా చూడటానికి వాడే అత్యంత శక్తిమంతమైన టూల్​ వీపీఎన్​. కానీ, రెండ్రోజులుగా చైనాలో ఇది కూడా పని చేయడం లేదు. హాంకాంగ్​ ఉద్రిక్తతల నడుమ ‘హాంకాంగ్ ప్రొటెస్ట్​’అనే పదాన్ని చైనా సెన్సార్ చేసింది. దీంతో ఆ పదంతో రాసిన వార్తలు చైనాలో కనిపించలేదు.

తాజాగా గల్వాన్ లోయ ఉద్రిక్తతల నడుమ భారత వార్తలను సగటు చైనా పౌరుడిని చేరనీయకుండా డ్రాగన్ జాగ్రత్త పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement