భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి మోడీకి వివరించారు.
దల్బీర్ కీలక విషయాలపై ప్రధానికి ప్రజెంటేషన్ సమర్పించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నట్టు చెప్పారు. ఆర్మీ చీఫ్ ఈశన్య వాస్తవాధీన రేఖను సందర్శించిన తర్వాత మోడీతో భేటీ అయ్యారు.