Army Chief
-
Sarath Fonseka: శ్రీలంక అధ్యక్ష బరిలో మాజీ ఆర్మీ చీఫ్
కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా(73) ప్రకటించారు. అధ్యక్షుడైతే అవినీతిని రూపుమాపి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17–అక్టోబర్ 16 తేదీల మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సె సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఎలీ్టటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురా కుమార దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. మనోజ్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్ఫాంట్రీ బ్రిగేడ్కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్లోని పల్లన్వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు. -
నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: తన భార్య జైలుపాలు కావడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ కారమంటూ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష పడినందుకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలన్నారు. అవినీతి కేసుకు సంబంధించి బీబీ బుష్రా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా భార్య బుష్రాకు జైలు శిక్ష పడటంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కోర్టులో న్యాయమూర్తిపై అసిమ్ మునీర్ ఒత్తిడి తెచ్చారు. నా భార్యకు ఏదైనా జరిగితే.. అసిమ్ను వదిలిపెట్టను. నేను బతికి ఉన్నంతవరకు అసిమ్ను అస్సలు వదిలేయను. అసిమ్ చేసిన చట్టవ్యతిరేక చర్యలన్నీ బయటపెడతాను. ..పాకిస్తాన్లో ఆటవిక రాజ్యంలో కొనసాగుతోంది. అడవి(పాకిస్తాన్) రాజు(నవాజ్ షరీఫ్) తల్చుకుంటే అన్ని కేసులు మాఫీ చేయబడుతాయి. లేదంటే ఐదు రోజుల్లో మూడు కేసులు బనాయిస్తారు. శిక్ష కూడా పడుతుంది. ఆటవిక రాజ్యంలో పెట్టుబడలు రావు. పెట్టుబడుల పెట్టడానికి సౌదీ అరేబియా ముందురావటం మంచిదే. కానీ, చట్టబద్ద కల్పించరు’ అని ఇమ్రాన్ మండిపడ్డారు. -
ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం -
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
Sudan crisis: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు
ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సూడాన్లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సూడాన్లో ఎందుకీ ఘర్షణలు ? దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్– బషీర్ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు కలిపారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ రెండేళ్లకే అధికార బదలాయింపులో సమస్యలు మిత్రులైన ఆ మిలటరీ జనరల్స్ను శత్రువులుగా మార్చింది. వారే సూడాన్ ప్రస్తుత పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు, ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ దగలో (హెమెడ్తీ) . వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా ఆ పని చేయలేదు. ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమెడ్తీ పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్ఎఫ్సీ)తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమెడ్తీ, ఎఫ్ఎఫ్సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు, ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్న వారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు. ఆర్ఎస్ఎఫ్ను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉంటారన్నది సవాల్గా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హానా భావించారు. ఫలితంగా ఈ నెల 15న ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. అయిదు రోజులుగా నరకం సూడాన్లో వారం రోజులుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. పోరాటమంతా రాజధారి ఖర్టూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది. సూడాన్ జనాభా 4.6 కోట్లు అయితే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే 1.2 కోట్ల మంది నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునే వారే లేరు. విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి 3 గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీసుకి వెళ్లడం కూడా అందరికీ కష్టమవుతోంది. ఇల్లు కదిలి కాలు బయట పెడితే ప్రాణాలతో బతికి ఉంటారన్న నమ్మకం లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా వీధుల్లో వినిపిస్తున్న కాల్పుల మోతలతో బయటకి అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదని 65 ఏళ్ల వయసున్న అబ్బాస్ చెప్పారు. సూడాన్ పాలకులకు ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం కూడా లేదని ఆయన మండిపడ్డారు. ‘‘వేలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నా, మంచినీరు, కరెంట్, మందులు వంటివి లేకపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు’’అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టిర్క్ చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు బషీర్ పాలనలో అంతర్యుద్ధంలోనే ప్రజలు గడిపారు. పేదరికం, అణచివేతను ఎదుర్కొంటూ దుర్భర పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్న వారి ఆశలు అడియాసలుగా మారాయి. ఎవరిది పై చేయి? బుర్హాన్, హెమెడ్తీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇద్దరికి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు బడుతున్నారు. మరోవైపు హెమెడ్తీ బుర్హాన్ను క్రిమినల్గా అభివర్ణిస్తున్నారు. బషారీ పాలన నుంచి విముక్తి పొందినా దేశంలో శాంతి స్థాపన జరగకపోవడానికి ఆయనే కారణమని నిందిస్తున్నారు. సూడాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులతో వైమానిక బలగం కూడా దాని సొంతం. ఆర్ఎస్ఎఫ్లో లక్ష మంది సైనికులే ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎఫ్కు సూడాన్ పశ్చిమ ప్రాంతంలో గిరిజన తెగల అండదండలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇద్దరు బలవంతులు కొట్టుకుంటూ ఉంటే ఎలా స్పందించాలో తెలీక మౌనం వహిస్తోంది. మానవీయ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సలహా ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతోంది. సూడాన్ జనాభా: 4.6 కోట్లు కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నవారు: 1.2 కోట్లు మానవీయ సాయం కావాల్సిన వారు: 1.6 కోట్ల ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు: 1.17 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అని, అతని నిర్ణయాలే అందరూ అనుసరిస్తారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ అధికారంలోకి రాకుండా బహిష్కరించేందుకు అవినీతి మాఫియాకు మద్దతిస్తోందంటూ సైనిక వ్యవస్థపై మండిపడ్డారు. ఈ మేరకు ఖాన్ జమాన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు సుప్రీం కోర్టుకి అండగా నిలబడాలని కోరారు. తాను అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే సైనిక వ్యవస్థ అవినీతి మాఫియా అయిన షరీఫ్లు, జర్దారీలకు అండగా ఉందని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి పెను విషాదంగా అభివర్ణించారు. ఈ దిగుమతి చేసుకున్న ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని, ఈ తరుణంలో సుప్రీం కోర్టుకు అండగా నిలవాలని దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం పాక్లో ప్రజాస్వామ్యం సుప్రీం కోర్టు అనే దారంతో వేలాడుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ దానికి అండగా నిలబడాలని చెప్పారు. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానేయాలని అన్నారు. మే 14న పంజాబ్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని దిక్కరిస్తూ ఉంటే ఈద్ తర్వాత వీధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని ఖాన్ పిలుపునిచ్చారు. ముందు నుంచి తాను దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అవినీతి పాలకులను అంగీకరించమని ప్రజలను బలవంతం చేయలేమనే విషయాన్ని సైనిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే ఒక దేశం పురోగమిస్తున్నప్పుడూ హింసాత్మక వ్యూహాలు పనిచేయవనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. ఇంతకుముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతదారులను సైలంట్ చేసేలా హింసాత్మక కార్యకలాపాలకు దిగారని, ఐతే అవి పనిచేయలేదన్నారు. ఇక మీదట కూడా అవి పనిచేయవని నొక్కి చెప్పారు ఖాన్. తనను చంపడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయకూడదని అప్రకటిత నిషేధం విధించడం గమనార్హం. (చదవండి: నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు) -
మహోజ్వల భారతి: దేవుడు, దాసుడు
బందా సింగ్ బహదూర్ (1670–1716) సిక్కు సైన్యాధ్యక్షుడు. మహా యోధుడు. లక్ష్మణ్ దేవ్, బందా బహదూర్, లక్ష్మణ్ దాస్, మాధవ్ దాస్ అనే పేర్లతోనూ ఆయన ప్రఖ్యాతి చెందారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరి ఆయన జన్మస్థలం. పదిహేనవ యేట ఇల్లు విడిచి సన్యసించి, ‘మాధవ్ దాస్’ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలోని నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. 1708 సెప్టెంబరులో ఆయన ఆశ్రమాన్ని గురు గోవింద సింగ్ సందర్శించారు. అనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని తయారుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో మొఘల్ ప్రావిన్షియల్ రాజధాని సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదు చేశారు. పంజాబ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేపు (జూన్ 9) ఆయన వర్ధంతి. (చదవండి: స్వతంత్ర భారతి: భారత రత్నాలు) -
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తానన్నారు. ఆదివారం సౌత్బ్లాక్లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్తో కలిసి జనరల్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతే నా ప్రథమ ప్రాధాన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. రక్షణ విషయంలో స్వావలంబన సాధించడంతోపాటు ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత విస్తృతం చేసేందుకు సంస్కరణలు, పునరి్నర్మాణంపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్లో కలిసి చదువుకున్నవాళ్లే కావడం విశేషం. నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లు తన క్లాస్మేట్లేనని జనరల్ పాండే అన్నారు. త్రివిధ దళాల సమష్టి కార్యాచరణకు, సహకారానికి ఇది శుభారంభమన్నారు. ఇది కూడా చదవండి: అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు -
భారత ఆర్మీకి కొత్త చీఫ్ ఖరారు
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు. బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ పోస్ట్ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణె ఏప్రిల్ చివరినాటికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్గా.. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్న మనోజ్ పాండే నియామకం ఖరారు అయ్యింది. విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్ మనోజ్ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్ సెక్షన్లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే.. ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కాబూల్ ఎయిర్పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్, నెటిజన్ల ఫైర్!
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ వలీ మహ్మద్ అహ్మద్జై దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్పోర్టులో ప్రవేశం కొరకు మిగతా ప్రయాణికులతో కలిసి ఆయన వరుసలో నిల్చొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు కూడా పారిపోతే ఎలా? దేశంలోనే ఉంటూ పంజ్షీర్ వంటి రెసిస్టెన్స్ ఫ్రంట్కు అండగా నిలవవచ్చు కదా!’’ అని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి వాళ్ల అసమర్థ నాయకత్వం వల్లే తాలిబన్లు.. దేశాన్ని ఆక్రమించుకోగలిగారు’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అఫ్గన్ తాలిబన్ల స్వాధీనం అయిన నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ చీఫ్గా పనిచేసిన వలీ సైతం అదే బాటలో నడవడం గమనార్హం. కాగా తాలిబన్ల విజృంభణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ.. గత నెలలో వలీని సైన్యాధిపతిగా తొలగించి, ఆయన స్థానంలో హిబాతుల్లా అలీజైని నియమించారు. అయితే, క్రమేణా ఆఫ్గన్ సైన్యంపై పైచేయి సాధించిన తాలిబన్లు ఆగష్టు 15న రాజధాని కాబూల్లో ప్రవేశించి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అశ్రఫ్ ఘనీ యూఏఈ పారిపోయి ఆశ్రయం పొందుతుండగా.. పలువురు ఇతర నేతలు సైతం దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక అఫ్గనిస్తాన్లో నివాసం ఉంటున్న విదేశీయులు సహా అఫ్గన్ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. చదవండి: Afghanistan Crisis: పాకిస్తాన్ వల్లే ఇదంతా.. ఇండియా మా ఫ్రెండ్.. Former Afghan Army Chief Wali Muhammad Ahmadzai is standing in line at Airport to leave the country. pic.twitter.com/SBaQ3QYmTZ — Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2021 -
దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు. లద్దాఖ్లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్: ష్రింగ్లా లద్దాఖ్లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని, అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో దఫా మిలిటరీ చర్చలు భారత్– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్లోని చుషుల్లో శుక్రవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు. -
సరిహద్దు వివాదం: ఆర్మీచీఫ్ క్షేత్రస్థాయి పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఉద్రికత్తలు తీవ్రమవడంతో క్షేత్రస్ధాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మంగళవారం లేహ్, కశ్మీర్లను సందర్శిస్తారని సమాచారం. బలగాల సన్నద్ధతతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖల వెంబడి దళాల మోహరింపును ఆర్మీ చీఫ్ సమీక్షిస్తారు. తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత వారం భారత్-చైనా సైనికుల ఘర్షణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జనరల్ నరవణే లేహ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నరవణే సోమవారం ఢిల్లీలో ఉన్నత సైనికాధికారులతో భద్రత పరిస్థితిపై చర్చించారు. కమాండర్ల సదస్సు సందర్భంగా సైనికాధికారులు, కమాండర్లు దేశ రాజధానిలో అందుబాటులో ఉన్నారు. మరోవైపు సరిహద్దు వివాద పరిష్కారానికి, తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా భూభాగంలోని మోల్దో-చుసుల్ లోయలో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ల చర్చలు కొనసాగుతున్నాయి. చదవండి : నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి! -
భారత్పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం!
న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతంలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్ అభ్యంతరం లేవనెత్తడం వెనుక చైనా ప్రమేయం ఉన్నట్లు భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే సందేహం వ్యక్తం చేశారు. భారత్ పట్ల నేపాల్ నిరసన వైఖరి ఎందుకు ప్రదర్శిస్తుందో తనకు అర్థంకావడం లేదన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే... వేరొకరి తరఫున ఆ దేశం వకాల్తా పుచ్చుకున్నట్లుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. భారత్తో చైనా ప్రచ్చన్న యుద్ధంలో ఇదొక భాగమేనన్న సంకేతాలు ఇచ్చారు. కాగా భారత్- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్ ప్రభుత్వం లిపులేఖ్ తమ భూభాగానికి చెందినదే అని ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబారికి నోటీసులు సైతం పంపింది.(భారత్, చైనాలతో చర్చించేందుకు సిద్ధం: నేపాల్) ఇక ఈ విషయం గురించి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి మాట్లాడుతూ... లిపూలేఖ్ నేపాల్, భారత్, చైనా ట్రై జంక్షన్లో ఉందని.. ఈ విషయం గురించి భారత్తో పాటు చైనాతో చర్చిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్తో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన జనరల్ నరవాణే.. ‘‘కాళీ నది తూర్పు ప్రాంతం నేపాల్లో ఉంది. భారత్ చేపట్టిన రహదారి నిర్మాణం నది పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ విషయంలో వారికి అభ్యంతరం ఏముందో తెలియడం లేదు. వేరొకరి వాదనను వీరు వినిపిస్తున్నారేమో’’అని పేర్కొన్నారు. (తైవాన్పై చైనా పెత్తనం.. భారత్ సాయం కావాలి!) అదే విధంగా ఇండో- చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల ఘర్షణ గురించి కూడా నరవాణే ఈ సందర్భంగా స్పందించారు. లఢఖ్, సిక్కిం సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్రంగా పరిగణించదగ్గవి కాదన్నారు. రోజుకు పదిసార్లు ఇరు వర్గాలు తారసపడతాయని.. ఇలాంటి ఘటనలు అక్కడ సాధారణంగా జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కమాండర్లను మార్చినపుడు.. కొత్త వాళ్లతో గొడవకు దిగే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: చైనా స్పందన) -
శ్రీలంక ఆర్మీచీఫ్కు అమెరికా షాక్
వాషింగ్టన్: శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని అన్నారు. షవేంద్రతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించేందుకు అనర్హులని చెప్పారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాలంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది. (చదవండి: సీక్రెట్ చెప్పేసిన ప్రపంచ కురు వృద్దుడు) -
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను సమర్థించిన శివసేన!
ముంబై: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగం భారత్ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యలను శివసేన సమర్థించింది. తుక్డే-తుక్డే గ్యాంగ్(వామపక్షాలు, వారికి మద్దతు తెలిపే వారిపై విమర్శల దాడి చేయడానికి బీజేపీ, రైట్ వింగ్ సభ్యులు తరచూ ఉపయోగించే పదం) అంటూ విమర్శలకు దిగే బదులు ఆర్మీ చీఫ్కు ఆదేశాలు జారీ చేయవచ్చు కదా అని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు..‘జనరల్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు. పీఓకేలో చాలా వరకు ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందుకే నరవాణే కొత్త విధానాన్ని మేం స్వాగతిస్తున్నాం. 1994 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్, పీఓకే భారత్లో అంతర్భాగమేనని పార్లమెంటు తీర్మానం చేసిందని నరవాణే చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ విమర్శలు చేయడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. దానికి బదులు ఆర్మీ చీఫ్నకు భారత్ పటం ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది’ అని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన కథనం వెలువరించింది.(పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం) అదే విధంగా పీఓకేపై భారత్ జరిపిన మెరుపు దాడులను ప్రస్తావిస్తూ... ఎన్ని దాడులు జరిగినా పాకిస్తాన్ తన అలవాట్లను మార్చుకోలేదని శివసేన విమర్శించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రం మంచి పని చేసిందని.. ఇప్పుడు నరవాణే కోరినట్లు పీఓకేపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘ మోదీ- షా నుంచి నరవాణేకు ఆదేశాలు అందిన వెంటనే పీఓకే మనదైపోతుంది. అప్పుడు అఖండ భారత్ను కోరుకున్న వీర్ సావర్కర్ విగ్రహం పూలమాలలతో నిండిపోతుంది. కాబట్టి ప్రధాని మోదీ వెంటనే నరవాణేకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. భారత ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు’ అని శివసేన కథనంలో పేర్కొంది. -
సియాచిన్లో ఆర్మీ చీఫ్
-
‘సరిహద్దు’పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ముకుంద్ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన దేశాలతో భారత్ సరిహద్దులు పంచుకుంటోందని..ఇరు దేశాలూ సమాన ప్రాధాన్యత కలిగినవేనని ఆయన అన్నారు. గతంలో మనం పశ్చిమ ప్రాంతంవైపే దృష్టిసారించామని, ఉత్తర ప్రాంతం కూడా అంతే ప్రాధాన్యత కలిగిఉందని గుర్తెరగాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనంపై రాజకీయ నేతలు తరచూ చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ అన్ని సవాళ్లు, వ్యూహాలపై సైన్యం విశ్లేషిస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని జనరల్ నరవనే పేర్కొన్నారు. సేనల ఆధునీకరణ ప్రణాళికలకు కీలక ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. సవాళ్లకు అనుగుణంగా దీర్ఘకాల వ్యూహాలతో ముందుకెళతామని, సేనలకు ఎదురయ్యే సవాళ్లలో మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. కాగా సీడీఎస్గా బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ స్ధానంలో దేశ 28వ ఆర్మీ చీఫ్గా జనరల్ నరవనే మంగళవారం నూతన బాధ్యతలు స్వీకరించారు. -
నూతన ఆర్మీ చీఫ్ నరవాణే కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: నూతన ఆర్మీ చీఫ్గా మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ను కట్టడి చేయడానికి భారత్ వద్ద పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవ్వడం పాక్ ఆర్మీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. చైనా సరిహద్దులో బధ్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని తెలిపారు. ఉగ్రవాదులపై పాక్ చూపిస్తున్న అలసత్వానికి ప్రపంచ దేశాలు కూడా పాక్కు దూరమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదం ఏ విధంగా నష్టదాయకమొ ప్రపంచ దేశాలు గ్రహించాయని తెలిపారు. దేశంలో భద్రత వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆర్మీని సిద్దం చేయడమే తమ లక్ష్యమని..మానవ హక్కులను కాపాడడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ముకుంద్ నరవాణే తెలిపారు. బిపిన్ రావత్ నుంచి నూతన ఆర్మీ చీఫ్గా మంగళవారం మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
'సీడీఎస్గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా
-
'సీడీఎస్గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్'
న్యూఢిల్లీ: దేశ తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్ను సీడీఎస్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీడీఎస్ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటయ్యే సైనిక వ్యవహారాల విభాగానికీ నాయకత్వం వహిస్తారు. అంతకుముందు ఆయన ఆర్మీ చీఫ్గా పదవీ విరమణ చేశారు. సీడీఎస్గా నియమితులైన బిపిన్ రావత్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పదవితో తనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. 28వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న నవరాణేకు రావత్ అభినందనలు తెలిపారు. కాగా, రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చదవండి: సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రస్తుతం ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్, చైనా సరిహద్దుల వద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని బిపిన్ తెలిపారు. ఇవాళే ఆర్మీ చీఫ్గా రిటైర్ అయ్యాను, ఆర్మీ చీఫ్గా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఇన్నాళ్లూ వాటిమీదే దృష్టి పెట్టాను. అయితే సీడీఎస్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన పాత్రపై కొత్త వ్యూహాన్ని రచించనున్నట్లు ఆయన తెలిపారు. 1978 డిసెంబర్లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి నేటి వరకు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కేంద్రం సీడీఎస్ పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల సీడీఎస్ పదవికి ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరిస్తారు. చదవండి: '3కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా' -
మీ పని మీరు చూసుకోండి
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం మండిపడ్డారు. తిరువనంతపురంలో నిరసన ర్యాలీలో చిదంబరం మాట్లాడారు. ‘రాజకీయ నాయకులుగా మేమేం చేయాలో మాకు తెలుసు. ఆర్మీ చీఫ్గా మీ పని మీరు చూసుకోండి. యుద్ధంలో ఎలా పోరాడాలో మేం మీకు చెబుతున్నామా? మీ ఆలోచనల ప్రకారం మీరు యుద్ధం చేయండి. రాజకీయ నాయకులుగా మా పని మేం చేస్తాం’అని స్పష్టం చేశారు. -
‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్లోని బాలాకోట్లోకి భారత వైమానికి దళం చొచ్చుకుపోయి ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఉగ్రవాదులు ఇటీవల పునుద్ధరించుకున్నారని భారత సైనిక చీఫ్ బిపిన్ రావత్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అసలు ఆ రోజున ఉగ్రవాదుల శిబిరం ఏ మేరకు ధ్వంసమయింది? అన్న అనుమానం నేడే కాదు, దాడులు జరిగిన రోజే కలిగాయి. అంతకుముందు, ఆ తర్వాత అంతర్జాతీయ శాటిలైట్లు తీసిన చిత్రాలను కూడా కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు ఉదహరిస్తూ భారత వైమానిక దళం దాడులు గురితప్పాయని ఆరోపించాయి. ఆ ఆరోపణలను, ఆ విమర్శలను భారత ప్రభుత్వ వర్గాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. తాజాగా చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా అకాడమీలో బిపిన్ రావత్ మాట్లాడుతూ నాడు భారత ధ్వంసం చేసిన ఉగ్రవాదుల శిబిరాన్ని వారు మళ్లి పునరుద్ధరించుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పడం ఎంత మేరకు నిజం? పాకిస్థాన్లోని టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బపడిందని, బాలాకోట్లోని వారి శిబిరాన్ని సమూలంగా నాశనం చేశామంటూ నాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంలో నిజం లేదా? ఈ రెండు నిజం అవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఒక్కటే నిజం కావాలి? 2016లో భారత సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా టెర్రరిస్టు లాంఛింగ్ పాడ్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అప్పుడు కూడా సైనిక వర్గాలుగానీ, ప్రభుత్వ వర్గాలుగానీ అందుకు సరైన సాక్ష్యాలు చూపించలేక పోయాయి. మళ్లీ ఈసారి కూడా బాలాకోట్ లాంటి దాడులు జరిపి భారత సైనిక వర్గాలు నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్ సరిహద్దుల్లో పాక్ సైనిక భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క కశ్మీర్ మిలిటెంట్లు ఉగ్రదాడులకు అవకాశాలు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదు. (చదవండి: బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది) -
బాలాకోట్ మళ్లీ యాక్టివేట్ అయింది: ఆర్మీ చీఫ్
చెన్నై: పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్ చేసిందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా గత ఫిబ్రవరిలో బాలాకోట్లోని జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ‘పాకిస్థాన్ ఇటీవలే బాలాకోట్ను యాక్టివేట్ చేసింది. బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిని, ధ్వంసమైన విషయాన్ని ఇది చాటుతోంది. భారత వైమానిక దళాలు జరిపిన దాడిలో బాలాకోట్ ధ్వంసమైన సంగతిని ఇది చాటుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు’ అని రావత్ పేర్కొన్నారు. చెన్నైలో యంగ్ లీడర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారు భారత్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంపై రావత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు చొరబాటుకు వీలుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దీనిని ఎలా ఎదుర్కోవాలో భారత్ సైన్యానికి తెలుసునని అన్నారు. -
ఇథియోపియా ఆర్మీ చీఫ్ హత్య
అదిస్ అబాబా: ఇథియోపియా సైన్యాధిపతి సియరే మెకొన్నెన్ హత్యకు గురయ్యారు. మెకొన్నెన్ అంగరక్షకుల్లో ఒకరు ఆయనను ఇంటిలోనే కాల్చి చంపారని ప్రభుత్వ ప్రతినిధి బిలెనె సియోమ్ తెలిపారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు ఉత్తరాన గల అంహరలో స్వయంప్రతిపత్తి మండలి ప్రభుత్వాన్ని (అటానమస్ రీజన్)కూల్చివేసేందుకు విఫలయత్నం జరిగిందని, ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంహర అధ్యక్షుడు అంబచ్యూ మెకనెన్ చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఆమె చెప్పారు. అయితే, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉన్నదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమన్నారు. అంహర రాజధాని బహిర్ దార్లో శనివారం మధ్యాహ్నం అధ్యక్షుడు అంబచ్యూ ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతుండగా, సైన్యాధికారి అసమిన్యూ నాయకత్వంలో కొందరు వారిపై దాడి చేశారు. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంబచ్యూతో పాటు ఆయన సలహాదారుడు కూడా చనిపోయారు .అసమిన్యూ తప్పించుకున్నారని ప్రభుత్వం తెలిపింది.ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు మెకొన్నెన్ హత్య జరిగింది. ఆ సమయంలో సైన్యాధిపతితో ఉన్న రిటైర్డ్ సైన్యాధికారి కూడా చనిపోయారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. గతంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకుగాను అసమిన్యూ అరెస్టయ్యారు. గత ఏడాదే క్షమాభిక్ష కింద విడుదలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. రాజధానిలో కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయని విదేశీ జర్నలిస్టు ఒకరు తెలిపారు. విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ఉండే బోలె జిల్లాలో మెకొన్నెన్ హత్య జరగడంతో ఆయా దేశాలు తమ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. అంహరలో పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జనాభా రీత్యా ఆఫ్రికాలో రెండో పెద్ద దేశమైన ఇధియోపియా ఆర్థికంగా ఎదుగుతోంది. ఏడాది క్రితం ప్రధాని పగ్గాలు చేపట్టిన అబి అహ్మద్ పలు సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. సైన్యానికి, నిఘా విభాగాలకు ఈ సంస్కరణలు రుచించకపోవడంతో వారు ప్రధానికి శత్రువులుగా మారారు. మరోవైపు అంహరా సహా దేశంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమవుతున్న జాతి పోరాటాలు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దేశంలో ఒరోమో, అంహర తెగల ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ప్రత్యర్థిపై పోరాటానికి సిద్దంగా ఉండాల్సిందిగా గత వారం అసమిన్యూ అంహర తెగ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అంహర సహా తొమ్మిది అటానమస్ రీజన్లు ఉన్నాయి. సరిహద్దు విషయంలో ఈ మండళ్లలో తెగల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఏ తెగకు ఆ తెగ స్వపరిపాలనకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్నాయి. -
లంక ఉగ్రవాదులకు కశ్మీర్లో శిక్షణ!
కొలంబో/శ్రీనగర్: శ్రీలంకలోని విలాసవంతమైన హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ 9 మంది బాంబర్లు భారత్లోని కశ్మీర్, కేరళ, బెంగళూరును సందర్శించారని శ్రీలంక ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేనానాయకే వ్యాఖ్యానించారు. వీరంతా శిక్షణ కోసం లేదా ఇతర విదేశీ ఉగ్రసంస్థలతో సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పర్యటనలు జరిపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సేనానాయకే బీబీసీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాడి వెనుక విదేశీ హస్తం.. ‘ఆత్మాహుతి బాంబర్లు అందరూ భారత్కు వెళ్లారు. కశ్మీర్, బెంగళూరు, కేరళ వెళ్లొచ్చారు. ఆత్మాహుతి దాడులు జరిగిన తీరును జాగ్రత్తగా గమనిస్తే దీని వెనుక బయటివారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది’ అని అన్నారు. భారత నిఘావర్గాల హెచ్చరికల్ని ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘ఉగ్రవాదుల కదలికలపై మా దగ్గర కొంత సమాచారం ఉంది. అలాగే అప్పటి పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఉండటంతో అంత సీరియస్గా తీసుకోలేదుæ’ అని స్పష్టం చేశారు. స్వేచ్ఛ ఎక్కువై భద్రతను మరిచారు.. ‘గత పదేళ్లుగా దేశం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు చాలా ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా 30 ఏళ్లు దేశం ఎలా అట్టుడికిందో వాళ్లు మర్చిపోయారు. ప్రశాంతతకు అలవాటుపడి జాతీయభద్రతను నిర్లక్ష్యం చేశారు’ అని అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈకి, ప్రభుత్వానికి మధ్య 30 ఏళ్లపాటు జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు లక్షమంది సమిధలయ్యారు. 2009లో శ్రీలంక బలగాలు ప్రభాకరన్ను హతమార్చడంతో అంతర్యుద్ధానికి తెరపడింది. ఎన్టీజే ఉగ్రవాదులు కశ్మీర్ను సందర్శించారన్న శ్రీలంక ఆర్మీ చీఫ్ సేనానాయకే వ్యాఖ్యలను భారత ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. -
‘అలాంటి వారిని ఆర్మీలోకి తీసుకోం’
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరకాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆర్మీలో మాత్రం ఇలాంటివి కుదరవంటున్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల్ని సైన్యంలోకి అనుమతించం అన్నారు. ఇలాంటి(ఎల్జీబీటీ) విషయాలు ఆర్మీలో ఆమోదయోగ్యం కాదని ఆర్మీ యాక్ట్లోని పలు సెక్షన్లలో ఉందని తెలిపారు. ‘మేం (ఆర్మీ)సుప్రీం కోర్టుకంటే అధికులమని కూడా కాదు.. దేశంలో ఉన్న చట్టాలు అందరికి సమానంగానే వర్తిస్తాయి. కానీ సైన్యంలోకి వచ్చేవారు మాత్రం కొన్ని హక్కులను, సంతోషాలను వదులుకోవాల్సి ఉంటుంద’న్నారు బిపిన్ రావత్. అంతేకాక ఎల్జీబీటీ వంటి విషయాల్ని జనాలు ఎలా స్వీకరిస్తారు.. అసలు ఇలాంటి వాటిని అంగీకరిస్తారా.. లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. గత ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వ హక్కును అది ఉల్లంఘిస్తోందంటూ 158ఏళ్ల నాటి చట్టాన్ని కోర్టు కొట్టేసింది. -
సిద్ధూ చేసింది తప్పే..
చండీగఢ్/లాహోర్ : అటు క్రికెట్లోను.. ఇటు రాజకీయాల్లోను నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వివాదాలు కొత్తేమీ కాదు. అయితే భారత్–పాక్ సంబంధాలు దిగజారిన ప్రస్తుత తరుణంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారంలో ఆ దేశ ఆర్మీ చీఫ్తో కౌగిలింతలు, ముచ్చట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాజ్పేయి మరణంతో విషాదంలో ఉన్న దేశ ప్రజల మనోభావాల్ని సిద్ధూ విస్మరించారని, అతను క్షమాపణ చెప్పాలని బీజేపీ, అకాళీదళ్లు ఇప్పటికే డిమాండ్ చేయగా.. ఇప్పుడు పంజాబ్ సీఎం అమరీందర్ కూడా తన కేబినెట్ సహచరుడి చర్య సమర్ధనీయం కాదంటూ గట్టి షాకిచ్చారు. సిద్ధూ మాత్రం తన తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు. నిజానికి సిద్ధూ పాకిస్తాన్ వెళ్లడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టలేదు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ను ఆప్యాయంగా హత్తుకుని ముచ్చటించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కన కూర్చోవడం వివాదాస్పమైంది. ఆర్మీ కెప్టెన్గా కూడా పనిచేసిన అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పట్ల సిద్ధూ వాత్సల్యం సరికాదు. ప్రతి రోజూ మన జవాన్లు అమరులవుతున్న విషయం అర్థం చేసుకోవాలి’అని ఘాటుగా స్పందించారు. సిద్ధూ పర్యటన అతని వ్యక్తిగతమని, అలాగే తన పక్కన కూర్చున్న వ్యక్తి పీఓకే చీఫ్ అన్న విషయం తెలిసుండకపోవచ్చని మరో ప్రశ్నకు అమరీందర్ సమాధానమిచ్చారు. దేశ ప్రతిష్టను సిద్ధూ ప్రమాదంలోకి నెట్టారని బీజేపీ విమర్శించగా.. పాక్ పర్యటనతో మన మర్యాదను మంటగలిపారని శిరోమణి ఆకాలీదళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే పీఓకే చీఫ్ పక్కన కూర్చున్నా: సిద్ధూ ఇక ఆదివారం అట్టారి– వాఘా సరిహద్దు వద్ద భారత్ భూభాగం చేరుకున్నాక సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకరు(పాక్ ఆర్మీ చీఫ్) నా వద్దకు వచ్చి.. మనం ఒకే సంస్కృతికి చెందినవారం. గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకల నాటికి పాకిస్తాన్లోని గురుద్వారా కర్తార్పూర్ షాహిబ్ సందర్శనకు మార్గం సుగమం చేయాలని కోరినప్పుడు నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కనే కూర్చోవడంపై వివరణిస్తూ.. ‘మీరు ఎక్కడికైనా అతిథిగా వెళ్తే.. వారు కేటాయించిన చోట కూర్చోవాలి. నిజానికి నేను వేరే చోట కూర్చున్నాను. అయితే నన్ను పీఓకే చీఫ్ పక్కన కూర్చోమన్నారు’అని చెప్పారు. భారత్ చేరుకోక ముందు లాహోర్లో మాట్లాడుతూ.. ‘ఇక్కడ లభించిన ప్రేమానురాగాలకు నేనెంతో ముగ్ధుడినయ్యాను. రెండు దేశాల మధ్య శాంతి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’అని సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు తాను సానుకూలమని.. ఐపీఎల్, పీఎస్ల్ విజేతల మధ్య పోటీ మంచి ఆలోచనని చెప్పారు. మరోవైపు వాఘా వద్ద సిద్ధూకు నిరసన సెగ తగిలింది. భారత్కు చేరుకునే సమయంలో ‘పగ్రీ సంబాల్ జట్టా’సంస్థకు చెందిన కార్యకర్తలు సిద్ధూకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. -
ఆయుధాలతో స్వతంత్రం రాదు: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ : కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఈ సందర్భంగా రావత్.. ‘ఆయుధాలతో స్వతంత్రం సిద్దించదు. ఉగ్రవాదులు సైన్యంతో పోరాడలేరు’ అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. భద్రతా దళాలు గత ఆదివారం జరిపిన కాల్పుల్లో కశ్మీరుకు చెందిన అధ్యాపకుడు మహ్మద్ రఫి భట్ మరణించిన సంగతి తెలిసిందే. రఫి మరణం తర్వాత బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘కశ్మీర్ యువతకు నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మీరు అనుకునే ఆజాది(స్వతంత్రం) ఎప్పటికి సిద్దించదు. మీరంతా ఆయుధాలు చేతపట్టినంత మాత్రాన జరిగేదేమీ ఉండదు. ఆజాదీ పేరుతో అరాచకం సృష్టించాలనుకుంటే మేము(సైన్యం) చూస్తూ ఉండం.. మీరు కోరుకునే స్వతంత్రం ఎప్పటికి రాదు’ అని బిపిన్ రావత్ తెలిపారు. కొన్ని దేశవిద్రోహక శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఫలితంగా వారు హింసా మార్గాన్ని ఎన్నుకుని ఆయుధాలను చేపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం 11 మంది యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం... భద్రతాబలగాలు ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం జమ్ముకశ్మీర్లోని షోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. దీని గురించి రావత్ ‘వారు(ఉగ్రవాదులు) కొత్తవారిని చేర్చుకుంటున్నారు.కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు. అంతేకాక ఉగ్రవాదుల దాడల్లో మరణిస్తున్న సైనికుల గురించి మాట్లాడుతూ ఎన్కౌంటర్లో ఎంత మంది సైనికులు మరణించారనే అంశాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ.. ఇది కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. -
మరణ దండనకు పాక్ ఆర్మీ చీఫ్ ఆమోదం
ఇస్లామాబాద్ : సూఫీ ప్రబోధకుడు అంజాద్ సబ్రిని కాల్చిచంపిన ఘటనతో సహా తీవ్ర నేరాలకు పాల్పడిన పది మంది కరుడుగట్టిన ఉగ్రవాదులకు మరణ శిక్ష విధించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఆమోదం తెలిపారు. భద్రతా దళాలపై దాడులతో పాటు పెషావర్లోని పెరల్ కాంటినెంటల్ హోటల్పై దాడి వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన కరుడుగట్టిన 10 మంది ఉగ్రవాదులు సైనిక న్యాయస్థానాల విచారణను ఎదుర్కొన్నారని మిలటరీ మీడియా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఉగ్రవాదులను మహ్మద్ ఇషాక్, రఫీక్, అరిష్, హబిబుర్ రెహ్మాన్, మహ్మద్ ఫయాజ్, ఇస్మాయిల్ షా, ఫజల్, హజ్రత్ అలీ, మహ్మద్ అసీం, హబీబుల్లాలుగా గుర్తించారు. మరో 5గురు ఉగ్రవాదులకు వివిధ శిక్షలను విధించారు. ఇషాక్, అసీంలు సబ్రీని హతమార్చిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటుండగా, వీరి దాడుల్లో 17 మంది అధికారులు మరణించారని సైనిక వర్గాలు వెల్లడించాయి. మత ప్రబోధకుడు సబ్రీ (45) 2016 జూన్ 22న కరాచీలో కారులో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు నేరుగా అతని తలపై కాల్పులు జరిపి హతమార్చారు. సబ్రీపై దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రాకీ తాలిబాన్ హకీముల్లా మసూద్ గ్రూప్ ప్రకటించింది. -
పాక్కు దిమ్మతిరిగేలా బదులిస్తాం..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి నలుగురు సైనికులను హతమార్చిన పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సంసిద్ధమైంది. ‘పాక్కు భారత్ దీటుగా బదులిస్తుంది..తమ చేతలే దీనిపై పాక్కు సమాధానం చెబుతా’యని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ పేర్కొన్నారు. ‘ప్రతీకారం తప్పకుండా ఉంటుంది..దానిపై నేనేమీ చెప్పను..మేము చేపట్టే చర్యలే దీనిపై మాట్లాడతాయి..పాక్కు గట్టిగా బుద్ధి చెప్పేలా ప్రతీకార చర్యలు కొనసాగుతాయి’ అన్నారు. పాక్ కుయుక్తులపై ఎన్డీఏ భాగస్వామ్యపక్షం శివసేన ప్రభుత్వ వైఖరిని నిలదీసిన క్రమంలో ఆర్మీ వైస్ చీఫ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ మనపై యుద్ధం ప్రకటించిందని..ఆ దేశానికి అదే రీతిలో బుద్ధిచెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మనం మౌనంగా ఉంటే ప్రపంచం ముంగిట భారత్ జవసత్వాలు కోల్పోతుందని రౌత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. -
పోలీసుల అదుపులో సైనికాధికారి కొడుకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై మీనంబాక్కం సైనిక అధికారుల శిక్షణ కేంద్రంలోని రహస్య సమాచారాన్ని సేకరించిన ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది మూడురోజులైనా అంతుబట్టలేదు. అదుపులోకి తీసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్ను తమ కస్టడీలో ఉంచుకుని పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. సైనికాధికారి కుమారుడు సైనిక దుస్తుల్లో ప్రవేశించడం, గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తుల కోసం రహస్య సమాచారాన్ని సేకరించడం సైనికవర్గాల్లో కలకలం రేపింది. వివరాలు.. చెన్నై మీనంబాక్కంలో సైనికాధికారుల శిక్షణ కేంద్రం ఉంది. సైనిక అధికారుల గృహవినియోగ వస్తువుల కోసం కేంద్రంలో ఏర్పాటుచేసి ఉన్న క్యాంటీన్లోకి ఓ యువకుడు సైనికయూనిఫాం దుస్తుల్లో వెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేశాడు. తిరిగి వెళుతుండగా అక్కడి సిబ్బంది అనుమానంతో అతడిని పట్టుకుని విచారణ జరపగా తికమక సమాధానాలు చెప్పాడు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందజేసి ఆ తరువాత అతడిని మౌంట్ పోలీసులకు అప్పగించారు. సైనిక దుస్తుల్లో చొరబడిన వ్యక్తి పేరు ప్రశాంత్, చెన్నైలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సైనికాధికారైన అతని తండ్రి రాజశేఖర్ కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో నివసిస్తున్న కారణంగా కుమారుడు ప్రశాంత్ను కాలేజీ హాస్టల్లో చేర్పించాడు. అయితే అతను బయటి హాస్టల్లో ఉంటున్నాడు. సైనికదుస్తుల్లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల ప్రశాంత్ను కలిసి ‘ మీ నాన్న బెంగళూరులో సైనిక అధికారిగా పనిచేస్తున్నాడు, అందుకని నిన్నుకూడా సైనిక అధికారిగా ఎంపికచేశామని నమ్మబలికారు. నీ నుంచి డబ్బులు ఆశించడం లేదు, అయితే సైనిక దుస్తులు ఇస్తాం, వాటిని వేసుకుని మీ తండ్రి క్యాంటీన్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగించే గుర్తింపు కార్డును దగ్గరపెట్టుకోవాల్సిందిగా సూచించారు. సైనిక శిక్షణలో భాగంగా తాము చెప్పిన రోజున సైనిక అధికారుల శిక్షణ కేంద్రానికి వెళ్లి అక్కడ ఏఏ ప్రదేశాల్లో ఏ కార్యాలయాలు ఉన్నాయి, శిక్షణ తరగతులు ఎక్కడ నిర్వహిస్తారు, క్యాంటిన్ ఎక్కడ ఉంది తదితర వివరాలు తమకు ఇవ్వాలని కోరారు. ఈ వివరాలను సక్రమంగా ఇవ్వడమే నీకు శిక్షణ అని చెప్పారు. ఇదంతా నిజమని నమ్మిన ప్రశాంత్ తండ్రికి చెప్పగా, డబ్బు కోసం ఎవరో మోసం చేస్తున్నారని అయన అన్నాడు. తన వద్ద వారు డబ్బులు ఏమీ తీసుకోలేదని తండ్రికి బదులిచ్చాడు. సరే ఏమీ జరుగుతుందో చూద్దామని ఇరువురు మిన్నకుండిపోయారు. ప్రశాంత్ సైనికదుస్తులు ధరించి సదరు ముగ్గురు వ్యక్తుల సూచన మేరకు సుమారు 12 సార్లు శిక్షణ కేంద్రంలోకి వెళ్లి అడిగిన సమాచారాన్ని అందజేశాడు. రెండురోజుల క్రితం క్యాంటిన్కు వెళ్లి తిరుగుముఖం పడుతుండగా అక్కడి సిబ్బంది అనుమానంతో నిలదీశారు. సైనిక శిక్షణలో భాగంగా ఇదంతా చేస్తున్నట్లు ప్రశాంత్ ఇచ్చిన సమాచారంతో బిత్తరపోయి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి నేతృత్వంలో విచారణ చేపట్టారు. పోలీసులు జరిపిన విచారణలో సదరు ముగ్గురు వ్యక్తుల గురించి వివరాలు రాబట్టలేక పోయారు. అయితే పచ్చయప్పాస్ కాలేజీ వెనుకవైపున ఉన్న అరుణాచలం వీధిలోని నివసించేందుకు తనను తీసుకెళ్లినట్లు చెప్పాడు. అయితే ఆ ఇంటిని ప్రశాంత్ సరిగా గుర్తించలేక పోయాడు. ప్రశాంత్ పట్టుబడగానే ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్ర హోంశాఖ, క్యూ బ్రాంచ్ పోలీసులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ అధికారులు వచ్చి చేరిపోయారు. వీరంతా ప్రశాంత్ను తీవ్రంగా విచారించారు. ప్రశాంత్ నుంచి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పొందిన సమాచారం వెనుక ఏదైనా విధ్వంస కుట్ర ఉందా, తీవ్రవాద చర్యల నేప«థ్యమా అని కోణంలో పోలీసులు కేసును పరిశోధిస్తున్నారు. -
తక్కువ వ్యవధిలోనే యుద్ధానికి సిద్ధం
హిండోన్(యూపీ): యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ ఆదేశాలు అందిన అతి తక్కువ వ్యవధిలోనే సమరానికి తాము సిద్ధంగా ఉంటామని వాయుసేన అధిపతి ఎయిర్చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా ఆదివారం వెల్లడించారు. వాయుసేన 85వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని హిండోన్లో ఉన్న వైమానిక స్థావరాన్ని ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్తో కలసి సందర్శించారు. దేశానికి భద్రత పరంగా ఎదురయ్యే ఏ సవాల్నైనా ఎదుర్కొని దీటుగా సమాధానమిచ్చేందుకు వాయుసేన సంసిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక–రాజకీయ వాతావరణం చూస్తోంటే స్వల్పకాలిక యుద్ధం రావొచ్చని తనకు అనిపిస్తోందని ధనోవా వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో డోక్లాంలో చైనా దుందుడుకుగా వ్యవహరించడం, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ధనోవా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో శుక్రవారం వాయుసేనకు చెందిన ఎంఐ–17 హెలికాప్టర్ కూలిపోయి ఏడుగురు సిబ్బంది మరణించడం తెలిసిందే. ఈ ప్రమాదానికి హెలికాప్టర్ వెనుకభాగంలో ఉండే ఫ్యాన్ తొలగిపోవడమే కారణమని భావిస్తున్నట్లు ధనోవా వెల్లడించారు. హెలికాప్టర్ ఇంజిన్ బాగా పనిచేస్తోందనీ, వెనుక ఫ్యాన్ హెలికాప్టర్ నుంచి విడిపోయిందని ఆయన పేర్కొన్నారు. -
ఏకం కావల్సిన సమయం ఇదే?!
రోహింగ్యాల మూలాలు లేవు వాళ్లంతా బంగ్లా వలసదారులే రోహింగ్యాలకు ఉగ్రవాదులతో సంబంధాలు యాంగాన్ : రోహింగ్యాల విషయంలో మయన్మార్ వాసులంతా ఏకం కావాలని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హలియాంగ్ ఆదివారంనాడు పిలుపునిచ్చారు. మయన్మార్లో రోహింగ్యాల మూలాలు ఎక్కడా లేవని.. ఆయన పేర్కొన్నారు. గత నెల 25న రోహింగ్యా మిలిటెంట్లు పోలీస్ పోస్ట్లపై క్రమపద్ధతిలో దాడులు చేశారని అన్నారు. ఈ ఘటన అనంతరమే సైన్యం ఉత్తర రఖైనే రాష్ట్రంలో మిలిటెంట్ల ఏరివేతకు దిగింది. మిలిటెంట్ల ఏరివేతకు ప్రయత్నిస్తున్న తరుణంలో భారీగా హింస చెలరేగింది. దీంతో సరిహద్దుల్లో ఉన్న 4 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారని.. చెప్పారు. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్నట్లు.. జాతి నిర్మూలనకు మా సైన్యం దిగలేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అసలు రోహింగ్యాల మూలాలు మా దేశంలో ఎందుకుంటాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. మయన్మార్కు స్వతంత్రం వచ్చాక.. నాటి తూర్పుపాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వలస వచ్చారని.. వారే తరువాత రోహింగ్యా ముస్లింలుగా స్థిరపడ్డారని ఆర్మీ చీఫ్ చెబుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సైన్యం వ్యతిరేక ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే స్థానిక బౌద్ధులు.. సైన్యానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశ సరిహద్దులు దాటి శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలను ఇక దేశంలోకి అనుమతించేదిలేదంటూ మయన్మార్ ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించింది. వలస వెళ్లిన రోహింగ్యాలకు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని సైన్యాధిపతి స్పష్టం చేస్తున్నారు. -
సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్
బెంగళూరు : ఆర్మీ చీఫ్పై సందీప్ దీక్షిత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆర్మీతో రాజకీయాలు చేయడం సరికాదని, దేశం కోసం సైనికులు పని చేస్తున్నారన్నారు. ఆర్మీ చీఫ్, సైనికుల జోలికి వెళ్లడం మంచిది కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సందీప్ దీక్షిత్ ఉపసంహరించుకున్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తక్షణమే సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సోనియా, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’
న్యూఢిల్లీ : తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వెనక్కి తగ్గారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆర్మీ చీఫ్ను సందీప్ దీక్షిత్ కించపరిచేలా మాట్లాడటం దారుణమన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆర్మీ ప్రతిష్టను కాంగ్రెస్ దిగజారుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ సైనికులు, తమ కుటుంబాలతో కలిసి రాజ్ఘాట్ వద్ద ఆందోళనకు దిగారు. -
రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ రాజీనామా
కాబూల్: అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రి అబ్దుల్లా హబీబీ, ఆర్మీ చీఫ్ కదమ్ షా షహీమ్ సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆమోదించినట్లు అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర అఫ్గాన్లోని మజర్ ఈ షరీఫ్ నగర సమీపంలో సైనిక స్థావరంపై శుక్రవారం తాలిబాన్లు దాడికి తెగబడి 100 మందికి పైగా సైనికులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన అఫ్గాన్ ప్రజలు..రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, ఇతర అధికారుల రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో వారు సోమవారం పదవుల నుంచి వైదొలుగుతూ రాజీనామా చేశారు. అమెరికాలోని సిగార్ వాచ్డాగ్ సంస్థ నివేదిక ప్రకారం ఆఫ్గానిస్తాన్ సైనికుల మరణాలు 35శాతం పెరిగాయి. ఒక్క 2016లోనే సుమారు 6500 మంది సైనికులు, పోలీసులు వేరు వేరు ఘటనలు, దాడుల్లోమరణించారు. -
సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారో...
-
సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారో...
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వీడియోలు పెడితే చర్యలు తప్పవని జవాన్లకు ఆర్మీ చీఫ్ వార్నింగ్ బిపిన్ రావత్ హెచ్చరిక జారీ చేశారు. సమస్యలు ఉంటే నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. ‘ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవొచ్చ’ని రావత్ స్పష్టం చేశారు. సైనికుల సమస్యలను తెలుసుకునేందుకు హెడ్ క్వార్టర్స్ లో ఫిర్యాదు పెట్టెలను పెడతామని చెప్పారు. వీటి ద్వారా జవానులు తాము ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసురావొచ్చని చెప్పారు. సోషల్ మీడియోలో వీడియోలు పెట్టొద్దని, సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఆర్మీ జవానుతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సైనికులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏకరవుపెడుతూ వీడియోలను సోష్టల్ మీడియా పోస్టు చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. -
దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతిలో..!
డెహ్రాడూన్: దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. మరేం లేదు.. దేశ రక్షణకు సంబంధించిన అత్యున్నత పోస్టులన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే కైవసం చేసుకున్నారు. సహజంగానే దైవ భూమి, వీరభూమి అనే పేరున్న పర్వతాలమయమైన ఉత్తరాఖండ్.. పౌరుషాలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి ఎంతోమంది భారత ఆర్మీలో, జాతీయ భద్రతా దళంలో, పోలీసు విభాగంలో ఉన్నారు. తాజాగా దేశ సైన్యాధ్యక్షుడిగా ఎంపికైన లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, రా బాస్ గా ఎంపికైన అలిల్ ధస్మానా కూడా ఉత్తరాఖండ్కు చెందిన వారే కావడం విశేషం. వీరిద్దరు కూడా పౌరీ గర్వాల్ జిల్లాకు చెందినవారు కావడం మరింత చెప్పుకోదగిన విషయం. ఇంకా జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ కూడా పౌరీ గర్వాల్లోని గిరి బానెల్సియన్ ప్రాంతానికి చెందినవారు. ఒక కోస్టు గార్డు చీఫ్ గా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ అనిల్ భట్ ఇలా చాలా మంది రక్షణ విభాగంలో ఉన్నతాధికారులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్డ్ అయిన మేజర్ జనరల్ బీసీ ఖండూరి స్పందిస్తూ ఇది తమ రాష్ట్రానికి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. -
ఆర్మీ కొత్త చీఫ్గా బిపిన్ రావత్
-
ఆర్మీ కొత్త చీఫ్గా బిపిన్ రావత్
వాయుసేనకు బీఎస్ ధనోవా ► ఐబీ, ‘రా’ లకూ కొత్త అధిపతులు న్యూఢిల్లీ: ఆర్మీ , వాయుసేనకు ప్రభుత్వం శనివారం కొత్త అధిపతులను ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ను ఆర్మీ చీఫ్గా, ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవాను ఐఏఎఫ్ చీఫ్గా నియమించింది. ప్రస్తుత అధిపతులు జనరల్ దల్బీర్ సింగ్, అరూప్ రాహాల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. డిసెంబర్ 31న ఇద్దరూ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీ తదుపరి చీఫ్గా రేసులో ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షిని తోసిరాజని రావత్ ఈ పదవికి ఎంపికవడం ఆశ్చర్యకరమే. రావత్కు 30 ఏళ్లుగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో, యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం నలువైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సైన్యాన్ని నడిపించేందుకు అతనే తగిన వ్యక్తని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐబీ అధిపతిగా రాజీవ్ జైన్: అలాగే నిఘా సంస్థలు ఐబీ, ‘రా’లకు కూడా నూతన చీఫ్లను నియమించారు. జార్ఖండ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ జైన్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి, అనిల్ ధస్మానాను రా(రీసెర్చీ అండ్ అనాలిసిస్ వింగ్)కు అధిపతులుగా ఎంపికయ్యారు. రాజీవ్, అనిల్ ఈ పదవుల్లో రెండేళ్లు ఉంటారు. ఐబీలో ప్రత్యేక డైరెక్టర్గా పనిచేస్తున్న జైన్ జనవరి 1న దినేశ్వర్ శర్మ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. 1980 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్కు చెందిన జైన్ రాష్ట్రపతి పోలీసు మెడల్ గెల్చుకున్నారు. ఐబీలో కీలక కశ్మీర్ డెస్కు సహా పలు విభాగాల్లో పనిచేశారు. ఎన్డీఏ హయాంలో కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరిపిన మధ్యవర్తి కేసీ పంత్కు సలహాదారుగా వ్యవహరించారు. ‘రా’ చీఫ్గా ఈ నెలాఖరున వైదొలగనున్న రాజిందర్ ఖన్నా స్థానంలో అనిల్ పగ్గాలు చేపడుతారు. ఆయన 1981 ఐపీఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. గత 23 ఏళ్లుగా ‘రా’లో పాకిస్తాన్ డెస్కు సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు. -
ఎన్నాళ్లీ అలసత్వం?
సీమాంతర ఉగ్రవాదం మరోసారి పడగ విసిరింది. మంగళవారం తెల్లవారుజామున మంచు ముసుగుకప్పిన చీకటి మాటున ఉగ్రవాదులు నగ్రోటా సైనిక స్థావరంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. సైనికాధికారుల నివాసాలుండే భవనంలో నక్కి స్త్రీలు, పిల్లలను బందీలను చేసి భారీ విధ్వంసాన్ని, మారణకాండను సృష్టిం చాలని ఉగ్రవాదుల పన్నాగం. మన భద్రతా బలగాలు చొరవతో చూపిన తెగువ, అధికారుల భార్యలు ధైర్యంగా ప్రదర్శించిన సమయస్ఫూర్తి వారి లక్ష్యాన్ని వమ్ము చేయగలిగాయి. అయితే ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు సహా ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. అదేసమయంలో జమ్మూకశ్మీర్లోనే సంబా జిల్లా రామ్గర్ సెక్టార్లోకి చొరబడాలని యత్నించిన ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మన బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకు 14 కిలోమీటర్ల దూరంలోని నగ్రోటా పట్టణం సమీపంలోని 16వ సైనిక విభాగం జమ్మూకశ్మీర్ లోని నాలుగు కమాండ్ కేంద్రాలలో ఒకటి. వెయ్యి మంది సైనికాధికారుల నివాసం కూడా అక్కడే. ఈ దురాగతానికి పాల్పడ్డ ఉగ్రవాద మూక ఏదో ఇంకా ఇదమి త్థంగా తెలియదు. కాని దాని చిరునామా దాయాది దేశమేనని చెప్పనక్కర్లేదు. పాక్ సైన్యం, గూఢచార సంస్థ (ఐఎస్ఐ) సహాయం లేనిదే అతి పెద్ద సైనిక స్థావరమైన నగ్రోటావైపు ఉగ్రవాదులు కన్నెత్తి చూడగలిగేవారు కారనేది స్పష్టమే. ఈ దాడి జరి గిన రోజునే పాకిస్తాన్ కొత్త ఆర్మీచీఫ్గా లెఫ్టినెంట్ ఖమర్ జనరల్ జావెద్ బజ్వా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సకాలంలో, సక్రమంగా ఒక ఆర్మీచీఫ్ పదవీ విరమణ చేయడం, మరొకరు ఆ బాధ్యతలు స్వీకరించడం సాఫీగా జరిగిపోవడం పాక్లో అరుదు. సీనియారిటీ రీత్యా నాలుగో స్థానంలో ఉన్న బజ్వాకు ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం పగ్గాలు అప్పగించడం విశేషం. సంచలనాలకు, దుందు డుకుతనానికి తావివ్వని వృత్తి నిపుణుడైన సైనికాధికారిగా ఆయనకు పేరుంది. పాక్కు ప్రధాన శత్రువు భారత్ కాదని, మిలిటెంట్లేనని ఆయన గతంలో ప్రక టించారు కూడా. ఆయన తనకు అనుకూలుడైన వ్యక్తిని ఐఎస్ఐకి అధిపతిగా తేనున్నారని తెలుస్తోంది. బజ్వా పదవిలో కుదురుకుని, మద్దతును కూడగట్టుకోగ లిగితే, పౌర ప్రభుత్వం భారత్తో సంబంధాలలో మార్పును కోరుకుంటే పరిస్థితి మారవచ్చు. ఏది ఏమైనా ఆధీన రేఖ వెంబడి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి ప్రయత్నిస్తానని బజ్వా చేసిన ప్రకటన ఆహ్వానించదగినది. అలా అని సరిహద్దుల నుంచి ఎదురవుతున్న పెను సవాలు పట్ల ఏమరుపాటు వహించవచ్చని కానే కాదు. భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి ఉదయం 5.30 సమయంలో నగ్రోటా దాడికి పాల్పడ్డారు. సరి హద్దులను దాటి 30 కిలో మీటర్ల దూరం చొచ్చుకు వచ్చి ఒక్క రోజులో చేసిన దాడి ఇది కానేకాదని నిపుణులు భావిస్తున్నారు. పథకం ప్రకారం ఇక్కడి వారి సహ కారంతో అందుకు సన్నాహాలు జరిగి ఉండాలని విశ్వసిస్తున్నారు. కనీసం వారం ముందుగానైనా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ఉండాలని ప్రాథమిక విచారణ వల్ల తెలుస్తున్నదని రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి తెలిపినట్టు ఒక వార్తా సంస్థ కథనం. సమీపంలోనే మకాం వేసి, స్థావరానికి సంబంధించిన సమాచారా న్నంతటినీ పక్కాగా సేకరించిన తర్వాతనే ఉగ్రవాదులు దాడికి దిగారని ఆయన అన్నారట. అదే నిజమైతే, సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో తీరుబడిగా సాగు తున్న సన్నాహాలను పసిగట్టలేని మన గూఢచార వ్యవస్థ ఘోర వైఫల్యానికి కారణమేమిటో కేంద్ర హోం మంత్రిత్వశాఖే సమాధానం చెప్పాలి. జనవరిలో పఠాన్కోటలోని మన వైమానిక స్థావరంపైనా, సెప్టెంబర్లో ఉడీ స్థావరంపైనా జరిగిన ఉగ్రవాద దాడుల తదుపరి... సరిహద్దులలోని మన స్థావరాల రక్షణకు హామీని కల్పించేలా వాటిని ఆధునీకరిస్తామని, ఆధునిక సాంకేతికతను, ఆయుధ వ్యవస్థలను అందించి సరిహద్దు భద్రతా దళాలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీలు ఏమైనట్టు? పొగమంచు అడ్డుతెరగా నిలవగా ఉగ్రవాదుల ఉనికిని కని పెట్టడం కష్టమైందంటున్న మన భద్రతా సిబ్బందిని తప్పు పట్టలేం. అందుకు తగ్గ ఆధునిక సాంకేతిక సాధనాలు వారివద్ద లేవు. కానీ మన భద్రతా వ్యవస్థకు బాధ్యత వహిస్తున్న పెద్దలు ఉగ్రవాదులు పేట్రేగడానికి అలాంటి పరిస్థితులు అనువైనవని ఊహించలేనంతటి అమాయకులా? భద్రతా బలగాల ఆధునీకరణలో, రక్షణ కొను గోళ్లలో క్షమార్హంకాని జాప్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శించడం మన ప్రభుత్వాల న్నిటికీ అలవాటు. అందుకు నేటి ప్రభుత్వం అపవాదం కాకపోవడమే విషాదం. ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత మన సైన్యం సెప్టెంబర్ 29న పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యిత దాడులు జరిపినప్పటి నుంచి పలుమార్లు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి వారిని నిలువరించాయి. అదేసమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లం ఘించి పాక్ సేనలు పదే పదే విచక్షణారహితంగా కాల్పులు సాగిస్తూ వాస్తవాధీన రేఖను అగ్ని గుండంగా మార్చాయి. సెప్టెంబర్ 29 తర్వాత ఇలా మన జవాన్లు 26 మంది బలైపోయారు. మన భద్రతా వ్యవస్థపై, సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకున్న అచంచల విశ్వాసం సడలేలా చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం. మన సైన్యంపైన, స్థావరాలపైన ఉగ్రవాదులు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నది అందుకే. అయినా మన భద్రతా వ్యవస్థను, గూఢచార వ్యవస్థను పటిష్టం చేయ కపోవడం, స్థావరాలను ఆధునీకరించలేకపోవడం అంటే మన జవాన్లను, అధి కారులను ఉగ్రమూకల తుపాకులకు ఆహారంగా వేయడమే అవుతుందని ఇప్పటి కైనా గుర్తిస్తారా? లక్ష్యిత దాడుల వంటి తీవ్ర చర్యను ప్రభుత్వం చేపట్టిందంటేనే ప్రతి చర్యలను ముందుగానే ఊహించి, మన స్థావరాలను, సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చి ఉంటుంది అని అనుకున్నాం. అది మన అత్యాశేనని నగ్రోటా దాడి రుజువు చేసింది. అత్యాధునిక సైనిక సంపత్తితో తమకు అనువైన సమ యంలో, అనువైన చోట అంతుబట్టకుండా దాడులు సాగిస్తున్న ఉగ్రవాదుల ఆట కట్టించడానికి మన భద్రతా బలగాల బలిదానాలే సరిపోవని ప్రభుత్వం ఇకనైనా గుర్తిస్తుందని ఆశిద్దాం. -
'పాక్తో జాగ్రత్త.. ఫుటేజీ విడుదల చేయొద్దు'
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడుల వీడియో ఫుటేజీలను విడుదల చేయాల్సిన పనిలేదని ఆర్మీ మాజీ సీనియర్ అధికారులు అంటున్నారు. సరైన ఆలోచనలు లేని స్టుపిడ్ ఫెలోసే అలాంటివి చూపించండని అడుగుతుంటారని, వారికోసం చూపించాల్సినవసరం లేదని చెబుతున్నారు. దాడులను నిరూపించుకోవాలని ప్రశ్నించేవారంతా ఒక వెర్రి ఆలోచనలో ఉన్నట్లే తాను భావిస్తామని అన్నారు. ఫుటేజీ విడుదల ద్వారా తమకు ఏమైనా లబ్ధి చేకూరుతుండొచ్చనే ఆలోచనతో పాక్ రెచ్చగొట్టి ఎదురుచూస్తుందని, పాక్ వ్యూహంలో చిక్కుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల వీపీ మాలిక్, జనరల్ జేజే సింగ్, జనరల్ శంకర్ రాయ్ చౌదరీ ఫుటేజీల విడుదలపై స్పందించారు. 'ఫుటేజీలను విడుదల చేయాలా వద్దా అనేది కేవలం ఆర్మీనే నిర్ణయించుకోవాలి. అది మాత్రమే ఏ సమయంలో విడుదల చేయాలనే విషయాన్ని నిర్ణయించాలి. ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. స్టుపిడ్ పీపుల్సే అలా కోరుకుంటారు. ప్రతి భారతీయుడు గర్వించేలాగా భారత సైనికులు మిషన్ పూర్తి చేశారు. ఎవరైతే ఆ దాడి చేసినట్లు నిరూపించుకోవాలని ప్రశ్నిస్తున్నారో వారంతా ఒక చెత్త లోకంలో జీవిస్తున్నవారవుతారు. పాకిస్థాన్ మీడియా అల్లే కథనాలను ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మొద్దు. ఫుటేజీ ద్వారా పాకిస్థాన్ లబ్ధి పొందాలని చూస్తోంది' అంటూ వారు హెచ్చరించారు. -
జమ్మూకశ్మీర్లో ఆర్మీ చీఫ్ పర్యటన
జమ్మూ: సర్జికల్ ఆపరేషన్స్ అనంతరం భారత్-పాక్ సరిహద్దులోని పరిస్థితులు వేడిమీద ఉన్న నేపథ్యంలో.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శనివారం కశ్మీర్లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలోని భద్రతా వ్యవహారాలను ఆయన సమీక్షించనున్నారు. ఎల్ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన అనంతరం జమ్మూకశ్మీర్లో భారత ఆర్మీ చీఫ్ తొలి పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉధంపూర్లోని ఉత్తర కమాండ్ హెడ్ క్వార్టర్స్లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్ఓసీ ప్రాంతంలో సైతం దల్బీర్ సింగ్ పర్యటించే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. -
ఆర్మీ మాజీ అధికారి అరెస్టు
న్యూఢిల్లీ: అక్రమంగా సేకరించిన కాల్ డిటెయిల్స్ రికార్డులను(సీడీఆర్) వేరే వారికి విక్రయించిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఆర్మీకి చెందిన ఓ అధికారి కూడా ఉన్నాడు. డీకే గిరి అనే కెప్టెన్ స్థాయిలో పనిచేసిన ఆర్మీ మాజీ అధికారి హైదరాబాద్లో షార్ప్ డిటెక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఓ ప్రైవేటు విభాగం ద్వారా సైంటిఫిక్ అప్రొచెస్తో పలు విచారణలు విజయవంతంగా చేసిన గిరికి గతంలో రత్న షిరోమణి అవార్డు కూడా వచ్చింది. అయితే, ఆయన మరో వ్యక్తి కలిసి అక్రమంగా కాల్ డిటెయిల్స్ రికార్డులను సంపాదించడమే కాకుండా వాటిని ఇతరులకు విక్రయించారంట. దీనినే ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సీడీఆర్ రాకెట్ గా పేర్కొంటూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రాకెట్ కేసు కింద ఎనిమిదిమందిని అరెస్టు చేశారు. వీరిలో జైపూర్ పోలీస్ సైబర్ సెల్లో పనిచేస్తున్న ఓ ఎస్సై కూడా ఉన్నాడు. రెండు రోజుల కిందట గిరిని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. -
కేంద్రమంత్రిపై ఆర్మీ చీఫ్ తీవ్ర ఆరోపణలు!
న్యూఢిల్లీ: తన పూర్వ ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీకే సింగ్ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తూ తన ప్రమోషన్ను అడ్డుకోవాలని, నిరంకుశంగా తనను శిక్షించాలనే ఆలోచనతోనే ఆయన ఇలా మిస్టిరియస్గా ప్రవర్తించారని దల్బీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు వ్యక్తిగత హోదాలో ఆయన బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. మాజీ ఆర్మీ చీఫ్ లేదా కేంద్రమంత్రిపై ఓ ఆర్మీ అధిపతి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2012లో అప్పటి ఆర్మీ చీఫ్గా ఉన్న వీకే సింగ్ తనను బాధితుడిని చేసేందుకు ప్రయత్నించారని, ఆర్మీ కమాండర్గా తనకు ప్రమోషన్ దక్కకూడదన్న ఏకైక ఉద్దేశంతో ఆయన ఇలా వ్యవహరించారని దల్బీర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరాధార, ఊహాజనిత, అసత్య ఆరోపణలతో మే 19, 2012న తనకు షోకాజ్ నోటీసు జారీచేశారని, ఆ తర్వాత అక్రమంగా తనపై క్రమశిక్షణ, విజిలెన్స్ (డీవీ) నిషేధాన్ని విధించారని ఆయన తెలిపారు. దల్బీర్ సింగ్ను ఆర్మీ కమాండర్గా నియమించడంలో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారంటూ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవీ దస్తానె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆయనను ఆర్మీ కమాండర్గా నియమించడంతో జనరల్ బిక్రం సింగ్ తర్వాత ఆర్మీ చీఫ్గా నియమించడానికి మార్గం సుగమమైంది. 2012 ఏప్రిల్, మే నెలల్లో దల్బీర్ సింగ్పై వీకే సింగ్ డీవీ నిషేధాన్ని విధించినా.. ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలవ్వగా.. ఈ కేసులో దల్బీర్ సింగ్ అఫిడవిట్ సమర్పించారు. -
సైనిక పాలన కావాలంటూ పోస్టర్లు
పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించాలని అక్కడి ఆర్మీచీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ను కోరుతూ 13 నగరాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. లాహరో, కరాచీ, పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్, సర్గోడా, హైదరాబాద్ నగరాలతో పాటు.. మరికొన్ని నగరాల్లో కూడా ఈ బ్యానర్లు కనిపించాయి. ‘మూవ్ ఆన్ పాకిస్థాన్’ అనే పార్టీ నేతృత్వంలో ఈ బ్యానర్లు పెట్టారు. ఇంతకుముందు ఇదే పార్టీ వాళ్లు షరీఫ్ను నవంబర్లో పదవీ విరమణ చేయొద్దంటూ ఓ చిన్నపాటి ఉద్యమమే నడిపించారు. అధికారుల ప్రభుత్వం ఇక చాలని.. ఆర్మీచీఫ్ నేతృత్వంలో సైనిక పాలన విధించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు ‘మాప్’ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజర్ అలీ హష్మీ తెలిపారు. జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా ప్రభుత్వాన్ని చూసుకోవాలని అన్నారు. దీనిపై ఆర్మీ అధికారిక వార్తా సంస్థ ఏమీ స్పందించకపోయినా.. అక్కడి రాజకీయ విశ్లేషకుడు అమీర్ రాణా మాత్రం ఇదంతా చూస్తుంటే త్వరలోనే సైనిక కుట్ర ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాత్రికి రాత్రే ప్రధాన నగరాలన్నింటిలో.. అందులోనూ కంటోన్మెంటు ప్రాంతాలలో కూడా ఈ పోస్టర్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. -
బాబోయ్... మా బంధువుల్ని సాగనంపండి..
గుంటూరు: తన ఇంట్లో తిష్టవేసిన బంధువుల బెడద తీర్చాలంటూ ఓ వ్యక్తితన గోడును పోలీసుల ముందు వెళ్లబోసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. స్థానిక ఆర్ఎంఎస్ కాలనీకి చెందిన మాజీ సైనికోద్యోగి ఒకరు సోమవారం పోలీసు స్టేషన్కు వచ్చారు. కొన్ని రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన బంధువులు తిరిగి వెళ్లేలాలేరని, వారిని ఎలాగైనా పంపించాలని విజ్ఞప్తి చేశాడు. వారితో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాత్రం ఇదేం కేసురా బాబూ..అంటూ తలలు పట్టుకున్నారు. -
గ్రేటర్ బరిలో మాజీ ఆర్మీ ఉద్యోగి
-
'ఆ విషయం సైనికునికే వదిలేయాలి'
-
'ఆ విషయం సైనికునికే వదిలేయాలి'
న్యూ ఢిల్లీ: పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రవాద దాడి ఘటనపై ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్ మూడు రోజులు సాగిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాల మధ్య పూర్తి సహకారం ఉందని దల్బీర్ సింగ్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కి ఉండటం వలన వారిని బయటకు రప్పించాల్సి రావడం, ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం మూలంగా కొంత సమయం తీసుకున్నామన్నారు. అయినా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఎంత సమయం తీసుకుంటారనే విషయం యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికునికే వదిలేయాలని దల్బీర్ సింగ్ స్పష్టం చేశారు. నిఘా వర్గాల వైఫల్యం వలనే ఉగ్రదాడి జరిగిందన్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ వర్గాలకు చిక్కకుండా ఉగ్రవాదులు ఎలా వచ్చారనే విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందన్నారు. ఈ దాడి ఘటన మనం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతోందన్నారు. -
'ఆర్మీలో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి'
చండీగఢ్: భారత ఆర్మీలో మహిళల సంఖ్య పెరగాలని, అందుకోసం బాలికలకు మంచి విద్య అందించడంతో పాటు వారిని ఆర్మీలో చేరేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పిలుపునిచ్చారు. దేశసేవలో పాల్గొనేందుకు బాలికలను ప్రోత్సహించాలన్నారు. 'సైనంలో చేరి సేవలందించేందుకు మగ పిల్లలతో సమానంగా మీ కూతుళ్లకు మంచి విద్య, అవకాశాలు కల్పించండి' అని సూచించారు. జులైలో భారత ఆర్మీ ఛీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం తొలి సారిగా ఆయన స్వగ్రామం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో గల బిషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై తన చిన్ననాటి సంగతులను నెమరు వేసుకున్నారు. అనంతరం తాను ప్రాధమిక విద్యను అభ్యసించిన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇదే పాఠశాలలో చదివిన తాను ఆర్మీ చీఫ్ అయ్యానంటే అక్కడ మీరు కూడా ఎదైనా సాధించవచ్చు అని అక్కడ ఉన్న విద్యార్థులలో స్పూర్తిని నింపారు. పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతియేటా స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తన గ్రామం నుంచి మరింత మంది ఆర్మీలో చేరి సేవలందించాలని కోరుకుంటున్నట్లు దల్బీర్ సింగ్ సుహాగ్ తెలిపారు. అయితే 2000 మంది జనాభా గల ఆ గ్రామంలో ఇప్పటికే 400 మంది ఆర్మీలో పనిచేస్తుండటం విశేషం. -
సమాజీ ఆర్మీ చీఫ్ వల్లే వివాదం
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల ఆరోపణ ముంబై: మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ వల్లే ‘ఆదర్శ్’ వివాదం చెలరేగిందని, నిజానికి అక్కడ స్థలవివాదం ఏమీ లేదని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆరోపించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 31 అంతస్తుల భవనం నిర్మించిన స్థలం నిజానికి రక్షణ శాఖకు చెందినది కాదని, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని తెలిపారు. భవనం నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు వివరించారు. ఈ సందర్భంగా వారు తాము సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం పొందిన డాక్యుమెంట్లను చూపించారు. సంబంధిత స్థలం రక్షణ శాఖకు చెందినది కాదని తేలడంతో సీబీఐ తమపై పెట్టిన క్రిమినల్ కేసు వీగిపోయిందన్నారు. ఇదిలా ఉండగా, కార్గిల్ యుద్ధ వీరుల నిమిత్తం మొదట ఇక్కడ ఆరు అంతస్తుల భవనం నిర్మించాలని భావించారు. కాని తర్వాత ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్కడ 31 అంతస్తుల భవనసముదాయాన్ని నిర్మించారు. దీంతో అది వివాదంగా మారింది. కాగా మాజీ ఆర్మీచీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంథోనీని ఈ విషయమై తప్పుదోవ పట్టించారని సొసైటీ అడ్హక్ చైర్మన్, రిటైర్డ్ బ్రిగేడియర్ టి.కె.సిన్హా ఆరోపించారు. -
మోడీ సర్కారుకు కొత్త చిక్కు!
కేంద్ర మంత్రి వీకే సింగ్ను తప్పుబట్టిన సైనిక ట్రిబ్యునల్ ►సుక్నా భూ కుంభకోణం కేసులో ఘాటు వ్యాఖ్యలు ►ఆర్మీ చీఫ్గా సైన్యానికి ఆయన మచ్చ తెచ్చారన్న కోర్టు ► సీనియర్ అధికారులను వేధించారు, కోర్టు మార్షల్నూ ప్రభావితం చేశారని మండిపాటు.. ఆర్మీ మాజీ అధికారి రథ్పై కోర్టు మార్షల్ రద్దు న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆయన కేబినెట్ సహచరుడు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ గతంలో సుక్నా భూ కుంభకోణం కేసులో వ్యవహరించిన తీరును సైనిక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైన్యానికి ఆయన మచ్చతెచ్చారని, సీనియర్ అధికారులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారిని వేధింపులకు గురి చేశారని, నిబంధనలను అతిక్రమించి మిలటరీ కోర్టును కూడా ప్రభావితం చేశారని సైనిక దళాల ట్రిబ్యునల్(ఏఎఫ్టీ) తాజాగా పేర్కొంది. సైన్యంలోని 33వ పటాళానికి చెందిన మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీకే రథ్పై జరుగుతున్న కోర్టు మార్షల్(సైనిక కోర్టు విచారణ)ను రద్దు చేసింది. ఇంతకాలం వేధించినందుకు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు ఆయనకు రూ.లక్ష చెల్లించాలని సైన్యాన్ని ఆదేశించింది. అసలేం జరిగింది? పశ్చిమబెంగాల్లోని సుక్నా ప్రాంతంలో మిలిటరీ కంటోన్మెంట్కు ఆనుకుని ఉన్న 70 ఎకరాల్లో విద్యాసంస్థను నెలకొల్పేందుకు ఓ ప్రైవేటు బిల్డర్కు నిరభ్యంతర పత్రము(ఎన్వోసీ) ఇచ్చారు. దీనిపై అప్పట్లో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా ఉన్న జనరల్ వీకే సింగ్ దీనిపై సైనిక విచారణ ప్రారంభించారు. రథ్ను దోషిగా తేల్చుతూ ఇందుకు శిక్షగా ఆయన రెండేళ్ల సీనియారిటీని తగ్గిస్తూ 2011లో కోర్టు మార్షల్ నిర్ణయించింది. విద్యా సంస్థ ఏర్పాటు అవసరాన్ని సిఫారసు చేసిన అప్పటి ఆర్మీ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అవదేశ్ ప్రకాశ్పైనా విచారణ కొనసాగించారు. అయితే దీనిపై జనరల్ రథ్ సైనిక ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. వీకే సింగ్ ఈ కేసుకు అనుచిత ప్రాధాన్యమిచ్చారని, ఆయన పుట్టిన సంవత్సరాన్ని 1951కి బదులు 1950గా అవదేశ్ ప్రకాశ్ తేల్చినందున ఆర్మీ చీఫ్గా సింగ్ పదవీ కాలం 8 నెలలకే పరిమితమైందని రథ్ తన పిటిషన్లో వివరించారు. దీంతో తమపై కక్ష పెంచుకుని ప్రతీకార చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ట్రిబ్యునల్... కోర్టు మార్షల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. సైన్యం పరిధిలో లేని భూమికి ఎన్వోసీ ఇవ్వడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కాగా దీనిపై జనరల్ రథ్ స్పందిస్తూ.. ఈ తీర్పుతో నా నిర్దోషిత్వం నిరూపితమైందన్నారు. ఇన్నేళ్లుగా తానెంతో వేదనను అనుభవించానన్నారు. సీనియర్ అధికారుల చేతిలో కింది సిబ్బంది బలికాకుండా, ఇలాంటివి పునరావృతం కాకుండా సైన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుపై వీకే సింగ్ ధ్వజం ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని వీకే సింగ్ కోరారు. సైనిక విచారణలో అంతా నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. ట్రిబ్యునల్ తనపై వ్యక్తిగత దాడికి దిగిందని, ఈ వ్యవహారంలో తాను అవినీతిని అడ్డుకోడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. 77 పేజీల తీర్పు మొత్తంలో ఎక్కడా స్కాం గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు. -
నరేంద్ర మోడీతో ఆర్మీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి మోడీకి వివరించారు. దల్బీర్ కీలక విషయాలపై ప్రధానికి ప్రజెంటేషన్ సమర్పించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నట్టు చెప్పారు. ఆర్మీ చీఫ్ ఈశన్య వాస్తవాధీన రేఖను సందర్శించిన తర్వాత మోడీతో భేటీ అయ్యారు. -
షరీఫ్.. పదవి నుంచి తప్పుకో..!
పాక్ ప్రధానికి ఆర్మీ చీఫ్ రషీద్ సలహా? * మీడియాలో వార్తలు * ఖండించిన ప్రభుత్వం, ఆర్మీ * సచివాలయం, ప్రభుత్వ టీవీ కార్యాలయాల్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఇస్లావూబాద్: పాకిస్థాన్లో తలెత్తిన రాజకీయు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఉద్రిక్తత ఇంకా సద్దువుణగలేదు. తెహ్రీకేఇన్సాఫ్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ పార్టీలకు కార్యకర్తలు సోమవారం కేంద్ర సచివాలయుం, ప్రభుత్వ టీవీ చానల్ కార్యాలయూలను ముట్టడించి లోపలికి దూసుకెళ్లారు. మరో పక్క తాజా సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ రషీద్ షరీఫ్, ప్రధాని నవాజ్ షరీఫ్తో భేటీ అయ్యూరు. సంక్షోభ నివారణకోసం పదవినుంచి తప్పుకోవాల్సిందిగా ఆర్మీ చీఫ్, ప్రధాని నవాజ్ షరీప్కు సలహా ఇచ్చినట్టు టీవీల్లో వార్తలు రావడంతో పాక్లో వాతావరణం వేడెక్కింది. అరుుతే దీనిని ప్రభుత్వంతోపాటు మిలిటరీ కూడా ఖండించింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలను నిగ్గుతేల్చడానికి స్వతంత్య్ర కమిషన్ విచారణకు వీలుగా మూడునెలలపాటు తాత్కాలికంగా పదవినుంచి తప్పుకోవాలని ఆర్మీ చీఫ్ ప్రధానికి సలహా ఇచ్చినట్టు దునియూ టీవీ వార్తలు ప్రసారం చేసింది. ఇవన్నీ నిరాధార వార్తలని ప్రధాని కువూర్తె మరియుమ్, ప్రభుత్వ ప్రతినిధి, మిలిటరీ ప్రతినిధి స్పష్టంచేశారు. ఉదయుం ఆందోళనకారులు గేట్లను విరగ్గొట్టి సచివాలయుంలోకి దూసుకెళ్లారు. భవనంలోకి రాకూడదని మిలిటరీ సిబ్బంది హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు పట్టించుకోలేదు. దాంతో ఆర్మీ జవాన్లు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయుువు ప్రయోగించారు. అరుునప్పటికీ ఆందోళనకారులను నిలువరించలేకపోయూరు. ఆందోళనకారులు పలు ప్రభుత్వ వాహనాలను, ఉద్యోగుల వాహనాలను ధ్వంసం చేశారు. తర్వాత ఆందోళనకారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్ చానల్ కార్యాలయుంలోకి దూసుకెళ్లారు. అక్కడ వారు కెమెరాలను ధ్వంసం చేయుడంతో కొద్దిసేపు ప్రసారాలకు అంతరాయుం ఏర్పడింది. అరుుతే ఆర్మీ సిబ్బంది వారిని బయుటకు తరిమేసి ఆఫీసును ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా తెహ్రీకే ఇన్సాఫ్ చైర్మన్ ఇవ్రూన్ ఖాన్ వూట్లాడుతూ, ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగాల్సిన సవుయుం వచ్చిందని అన్నారు. కాగా, తావుు హింసను ప్రేరేపించడం లేదని, ప్రధాని నివాసంలోకి, లేదా ప్రభుత్వ కార్యాలయూల్లోకి వెళ్లాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునివ్వలేదని స్పష్టంచేశారు. ఆర్మీ వుధ్యవర్తిత్వాన్ని తావుు కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. మరో పక్క పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ పార్టీ అధినేత ఖాద్రీ మాట్లాడుతూ, సంయమనంతో ఉండాలని కార్యకర్తలను కోరారు. కాగా, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని షరీఫ్ మరోసారి స్పష్టం చేశారు. పాక్ రాజకీయ పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని పేర్కొంది. -
ఆర్మీ చీఫ్గా జనరల్ సుహాగ్
న్యూఢిల్లీ: సైనికదళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్సింగ్ సుహాగ్ గురువారమిక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జనరల్ బ్రికమ్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 26వ ఆర్మీ చీఫ్గా నియమితులైన 59 ఏళ్ల సుహాగ్.. 30 నెలలపాటు ఆ పోస్టులో కొనసాగుతారు. గతేడాది డిసెంబర్లో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా నియమితులైన ఆయన్ను యూపీఏ సర్కారు గద్దె దిగే ముందు హడావుడిగా ఆర్మీ చీఫ్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలక నియామకాల విషయంలో అంత తొందర ఎందుకని, ఎన్నికలు పూర్తయ్యాక వచ్చే కొత్త ప్రభుత్వం ఇలాంటి అంశాలను చూసుకుంటుంది కదా అంటూ యూపీఏ నిర్ణయాన్ని బీజేపీ అప్పుడు తప్పుబట్టింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ సుహాగ్ నియామకాన్ని కొనసాగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. -
కార్గిల్ యుద్ద వీరులకు విక్రమ్ సింగ్ నివాళి
జమ్మూ: 1999 కార్గిల్ యుద్ద వీరులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ శుక్రవారం నివాళులర్పించనున్నారు. జూలై 31న రిటైర్ కాబోతున్న విక్రమ్ సింగ్ జమ్మూలోని ద్రాసా ప్రాంతాన్ని సందర్శించనున్నట్టు డిఫెన్స్ అధికారులు తెలిపారు. కేవలం ద్రాసాలోని విక్రమ్ సింగ్ పర్యటిస్తారని.. ఆ పర్యటన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. 1999 నుంచి లడక్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలోని జరిగిన పాకిస్థాన, భారత దేశాల మధ్య జరిగిన యుద్దంలో మరణించిన వీరులకు విజయ్ దివస్ పేరిట నివాళులర్పిస్తున్నామని అధికారులు తెలిపారు. -
దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే బడ్జెట్పై బీమా రంగంపై చాలా ఆశలే పెట్టుకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా జీవిత బీమా రంగం పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో ఈ బడ్జెట్ నుంచి వృద్ధి దిశగా అనేక ప్రోత్సాహకాలను ఆశిస్తోంది. బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై పన్ను మినహాయింపులను పెంచడంతో పాటు, ఏజెంట్లను ప్రోత్సహించే విధంగా టీడీఎస్ నిబంధనల్లో మార్పులు, అలాగే వ్యాపార విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఎఫ్డీఐ పరిమితిని పెంచడం వంటి అనేక అంశాలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నుంచి వరాలు వెలువడతాయని బీమా పరిశ్రమ ఎదురు చూస్తోంది. ఇప్పటికే బీమా కంపెనీల ప్రతినిధులు తమ కోర్కెల చిట్టాలను ఆర్థిక మంత్రికి సమర్పించడం ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ ఆశలు మరింత రెట్టింపయ్యాయి. దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను బీమా రంగం సమకూర్చగలదని, అందుకే ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ప్రసూన్ గజ్రి అంటున్నారు. బీమా వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్మెంట్స్ను ప్రోత్సహించే విధంగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. పొదుపు పథకాలపై పన్ను మినహాయింపులు పెంచడం, పన్ను భారం తగ్గించడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా ప్రజల్లో పొదుపు శక్తి పెరుగుతుందని తద్వారా ఆర్థిక వృద్ధిరేటు గాడిలో పడుతుందన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వైద్య బీమా ప్రీమియంపై లభిస్తున్న పన్ను మినహాయింపులను రూ.15,000 స్థాయిని రూ.50,000 వరకు పెంచాలని బీమా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. బీమా రంగ విస్తరణకు ఎఫ్డీఐ పరిమితి అడ్డుగా ఉండటంతో దీన్ని ప్రస్తుతం ఉన్న 26% నుంచి 49 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్య కావడంతో దీన్ని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. సేవా పన్ను తగ్గించాలి జీవిత బీమా ప్రీమియంలపై విధిస్తున్న సేవాపన్నును తగ్గించాలని మాక్స్లైఫ్ ఎండీ, సీఈవో రాజేష్ సుద్ కోరారు. మొదటి సంవత్సరం చెల్లించే ప్రీమియంపై సేవాపన్నును మూడు శాతానికి పెంచారని, దీన్ని తగ్గించాలన్నారు. అలాగే ఏజెంట్ల కమీషన్లపై విధిస్తున్న టీడీఎస్ పరిమితిని కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏడాదిలో ఏజెంట్ కమీషన్ రూ.20,000 దాటితే టీడీఎస్ను విధిస్తున్నారని, ఈ పరిమితిని కనీసం రూ.50,000కు పెంచాలన్నారు. -
తదుపరి ఆర్మీచీఫ్గా దల్బీర్సింగ్ సుహాగ్
-
తదుపరి ఆర్మీచీఫ్గా దల్బీర్సింగ్ సుహాగ్
బీజేపీ నిరసనలను పట్టించుకోకుండా నియమించిన ప్రభుత్వం జూలై 31న రిటైరవనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్సింగ్ సుహాగ్ను తదుపరి ఆర్మీ చీఫ్గా ప్రభుత్వం నియమించింది. ఆర్మీచీఫ్ నియామకంపై బీజేపీ నుంచి ఎదురవుతున్న నిరసనలను పట్టించుకోకుండా, ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ సుహాగ్ నియామకంపై రక్షణ శాఖ సిఫారసును మంగళవారం ఆమోదించింది. ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సుహాగ్ ఆర్మీచీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్స్లో గూర్ఖా అధికారి అయిన దల్బీర్సింగ్ సుహాగ్ (59) అందరి కంటే సీనియర్. చిత్తోర్గఢ్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసిన సుహాగ్, 1970లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది, 1974 జూన్లో 4/5 గూర్ఖా రెజిమెంట్లో చేరారు. సైనిక శిక్షణకు సంబంధించి దేశ విదేశాల్లో పలు కోర్సులు పూర్తిచేసిన సుహాగ్, శ్రీలంకలో చేపట్టిన ‘ఆపరేషన్ పవన్’లో కంపెనీ కమాండర్గా కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్ లోయలో 2003 జూలై నుంచి 2005 మార్చి వరకు చేపట్టిన చొరబాటు నిరోధక ఆపరేషన్కు నాయకత్వం వహించారు. కార్గిల్ యుద్ధంలో 2007 అక్టోబర్ నుంచి 2008 డిసెంబర్ వరకు 8 మౌంటైన్ డివిజన్ను విజయవంతంగా నడిపించారు. జనరల్ వీకే సింగ్ ఆర్మీ చీఫ్గా ఉన్న సమయంలో తలెత్తిన వివాదం అనంతరం 2012 జూన్ 16న ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా బాధ్యతలు చేపట్టారు. వీకే సింగ్ ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన సుహాగ్పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిషేధం విధించారు. వీకే సింగ్ పదవీ విరమణ తర్వాత బిక్రమ్ సింగ్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుహాగ్పై నిషేధాన్ని తొలగించారు. ఆర్మీ చీఫ్గా దల్బీర్ ఎంపికపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొద్దిరోజుల్లోనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్నందున ఇప్పటికిప్పుడే ఈ నియామకాన్ని చేపట్టేందుకు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. -
ఆర్మీ చీఫ్గా దల్బీర్ సింగ్ నియామకం
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ నియమితులయ్యారు. రక్షణ శాఖ పంపిన సిఫారసుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ బిక్రమ్ సింగ్ స్థానంలో దల్బీర్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. జూల్ 31న బిక్రమ్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత దల్బీర్ సింగ్ ఆర్మీ చీఫ్గా కొనసాగుతారు. 59 ఏళ్ల దల్బీర్ సింగ్ ప్రస్తుతం ఆర్మీలో డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు. -
ఆర్మీ చీఫ్ నియామకంపై ఈసీ దృష్టి
న్యూఢిల్లీ: సైనిక దళాల ప్రధానాధికారి నియామక ంపై వచ్చే వారంలో ఉన్నతస్థాయి భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందినట్లు శనివారం పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశం మరో రెండు రోజుల్లో చర్చ కు రావచ్చని ఓ అధికారి వెల్లడించారు. -
నూతన సైన్యాధిపతిగా దల్బీర్సింగ్?
న్యూఢిల్లీ: బీజేపీ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్మీ తదుపరి చీఫ్ నియామకంలో కేంద్రం ముందుకే వెళుతోంది. ప్రస్తుతం ఉప సైన్యాధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్సింగ్ సుహాగ్ పేరును ఆర్మీ చీఫ్ పదవికి సిఫారసు చేస్తూ రక్షణ శాఖ ప్రధాని కార్యాలయానికి ఫైలు పంపింది. ఇందుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాల అధిపతులు ఉద్యోగ విరమణకు కనీసం రెండు నెలల ముందే, కొత్తవారి పేరును ఖరారు చేయడం ఆనవాయితీ. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ పదవీ కాలం జూలై 31తో ముగిసిపోతోంది. బీజేపీ అభ్యంతరాలు బేఖాతరు: అధికారం నుంచి దిగిపోయే ముందు కేంద్రం కీలక పదవులను భర్తీ చేయడం సరికాదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే ఆర్మీ చీఫ్ నియామకాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని డిమాండ్ చేసింది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్న మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ కూడా... కొత్త ఆర్మీ చీఫ్ నియామకం విషయంలో ప్రభుత్వానికి అంత తొందరెందుకని ప్రశ్నించారు. కాగా, వీకే సింగ్ సైన్యాధిపతి ఉన్న సమయంలో దల్బీర్సింగ్ సుహాగ్పై క్రమశిక్షణ, నిఘాపరమైన నిషేధం విధించారు. 3 కోర్ కమాండర్గా ఉన్న దల్బీర్ తన పరిధిలోని నిఘా విభాగం నిర్వహణలో విఫలమైనందుకు చర్య తీసుకున్నారు. బిక్రంసింగ్ చీఫ్గా వచ్చిన తర్వాత దల్బీర్పై నిషేధాన్ని తొలగించారు. -
ఘజియాబాద్ నుంచి వీకే సింగ్ పోటీ
బీజేపీ కార్యకర్తల నుంచే నిరసన లోక్సభ బరిలో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాను ఆ పార్టీ మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్కు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లోక్సభ సీటును కేటాయించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్.. రానున్న ఎన్నికల్లో లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా షిల్లాంగ్ నుంచి షిబున్ లింగ్డో పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సింగ్ ఎంపికపై కార్యకర్తల నిరసన లోక్సభ టికెట్ల కేటాయింపు విషయంలో బీజేపీకి ఆపార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్కు ఘజియాబాద్ సీటును కేటాయించడంపై అక్కడి నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. స్థానికేతరుడైన సింగ్కు ఏప్రాతిపదికన సీటు కేటాయించారంటూ ఘజియాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధికార ప్రతినిధి అనంతకుమార్ కార్యకర్తలను శాంతింపజేసే యత్నం చేశారు. ఉత్తర్ప్రదేశ్ బీజేపీ ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకే పార్టీ అధిష్టానం టికెట్లు కేటాయించిందని వివరించారు. కిరణ్ ఖేర్పై కోడిగుడ్లతో దాడి ఛండీగఢ్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న నటీమణి 58 ఏళ్ల కిరణ్ ఖేర్కు కూడా ఆ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మంగళవారం ఛండీగఢ్కు వచ్చిన ఖేర్కు వ్యతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శించిన కార్యకర్తలు ఆమె వాహన శ్రేణిపై కోడిగుడ్లతో దాడి చేశారు. స్థానికులకే టికెట్ కేటాయించాలని నినదించారు. -
బీజేపీలో చేరిన ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్
-
బీజేపీలో చేరిన ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్
న్యూఢిల్లీ : దేశ రక్షణలో ఏళ్లపాటు గడిపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆయన శనివారం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే వీకే సింగ్ సంకేతాలు ఇచ్చారు. యనతో పాటు పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వీకే సింగ్ సుప్రీంకోర్టులో కేసు వేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన జనన తేదీపై రక్షణ శాఖతో తలెత్తిన వివాదంపై ఆయన 2012లో కేంద్ర ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
అమానుషం..
హైదరాబాద్, న్యూస్లైన్: అయిన వారే కాలయములయ్యారు. భార్య, కుమారులు, బావమరిది కలిసి ఆర్మీ మాజీ ఉద్యోగిని మెడ నరికి దారుణంగా చంపేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, ఆస్తి తగదాలే ఈ హత్యకు కారణమని తెలిసింది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన ఆదివారం హైదరాబాద్లోని శ్రీనివాసపురంలో జరిగింది. సీఐ లక్ష్మీకాంత్రె డ్డి, స్థానికుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన నందమూరి చిన్న వెంకటరెడ్డి(55) నగరానికి వచ్చి శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు. ఈయనకు భార్య చెన్నమ్మ, కుమారులు వెంకట రమణారెడ్డి(30), విజయకుమార్రెడ్డి(27), కుమార్తె రమాదేవి(28) ఉన్నారు. పిల్లలు ముగ్గురూ ఉన్నత చదువులు అభ్యసించారు. ఆర్మీలో పని చేసిన వెంకటరెడ్డి పదవీ విరమణ తర్వాత ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్సూరెన్స్ కంపనీలో పని చేస్తున్నారు. వెంకటరెడ్డికి రామంతాపూర్లో రెండు ఇళ్లు, బోడుప్పల్లో రెండు పాట్లు, స్వగ్రామంలో పొలం ఉంది. ఏడాదిన్నర క్రితం రామంతాపూర్లోని ఇల్లును అమ్మకానికి పెట్టగా భార్య ఒప్పుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలై తారస్థాయికి చేరాయి. గతంలో రెండుసార్లు వెంకటరెడ్డిపై భార్య ఉప్పల్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో విభేదాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి కొంతకాలంగా కోఠిలోని లాడ్జిలో ఉంటున్నారు. 20 రోజుల క్రితం స్థానిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భార్యాభర్తలు రాజీ కుదుర్చుకున్నారు. ఇకపై ఎలాంటి గొడవలు పడకుండా కలిసుందామని ఒట్టుపెట్టుకొని.. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అయినా.. ఇద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. భర్తపై పగ పెంచుకున్న భార్య అతడిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. కొడుకులు, తన సోదరుడు భాస్కర్రెడ్డి (మాజీ ఆర్మీ ఉద్యోగి) తో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఇందులో భాగంగా మాట్లాడుకుందామని వెంకటరెడ్డిని ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించారు. మాటల్లో పెట్టి వేటకోడవలితో మెడ నరికారు. కడుపులో పొడిచి, తలపై రోకలి బండతో మోది చంపేశారు. హత్య అనంతరం నిందితులు పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య, ఉప్పల్ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, డీఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కాశ్మీర్ మంత్రులకు ఆర్మీ డబ్బు
మరో వివాదానికి తెరలే పిన వీకే సింగ్ న్యూఢిల్లీ: మాజీ సైనికాధిపతి జనరల్ వీకే సింగ్ మరో వివాదానికి తెరదీశారు. జమ్మూకాశ్మీర్లో శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూసేందుకు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఆర్మీ డబ్బులు ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగ్ చేసిన ఈ ప్రకటన మంగళవారం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. డబ్బులు ఎవరికి ఇచ్చారో చెబితే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి షిండే పేర్కొనగా.. ఎవరికి డబ్బులు అందాయో బయటపెట్టాలంటూ జమ్మూకాశ్మీర్ అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. డబ్బులు తీసుకున్న మంత్రుల పేర్లు బయటపెట్టాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జమ్మూకాశ్మీర్ మంత్రులు, మాజీ మంత్రులు వీకే సింగ్ను హెచ్చరించారు. అటు కాంగ్రెస్ కూడా సింగ్ వ్యాఖ్యలపై మండిపడింది. సున్నితమైన అంశాలపై వీకే సింగ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టింది. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో వీకే సింగ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రులకు ఆర్మీ డబ్బులిచ్చింది లంచం రూపంలో కాదని, సదుద్దేశంతోనే ఇచ్చిందన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.