కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!! | Arun jaitley gives budget speech sitting! | Sakshi
Sakshi News home page

కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!!

Published Thu, Jul 10 2014 12:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!! - Sakshi

కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!!

కేంద్ర బడ్జెట్ గానీ, రైల్వే బడ్జెట్ గానీ, రాష్ట్రాల బడ్జెట్లు గానీ.. ఏవైనా సరే అవి కొనసాగినంత సేపు సదరు మంత్రులు నిలబడే తమ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని చదువుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా, ఈమధ్య కాలంలో తొలిసారిగా ఎన్డీయే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. కూర్చుని తన బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. తొలుత ఆయన నిలబడే ప్రసంగించారు.

అయితే, బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన 45 నిమిషాల తర్వాత.. ఐదు నిమిషాల పాటు విరామం తీసుకున్న ఆర్థిక మంత్రి, ఆ తర్వాత నుంచి తన స్థానంలో కూర్చుని తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. మధ్యమధ్యలో మంచినీళ్లు తాగుతూ.. ఆయన కూర్చుని తన బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు. నడుం నొప్పి తీవ్రంగా బాధిస్తుండటం వల్లే ఆయనిలా చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement