budget-2014
-
సాక్షి కార్టూన్ (12-07-2014)
జైట్లీని తన పార్టీ కలర్ దుస్తుల్లో చూసే సరికి తట్టుకోలేక అలా అనేశాడేమో సార్! -
నమో మిడిల్ క్లాస్...
-
బడ్జెట్లో మెరుపులకు దూరంగానే
-
లోక్పాల్కు రూ. 2 కోట్లే..
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్పాల్ వ్యవస్థకు కేంద్ర బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులే దక్కాయి. లోక్పాల్కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ మొత్తం లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటుకు సరిపోతుందని కేంద్రం పేర్కొంది. మరోవైపు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి కేటాయింపుల్లోనూ స్వల్పంగా కోత విధించింది. సీవీసీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 21.29 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ. 94 లక్షలు కోత పెట్టి రూ. 20.35 కోట్లు కేటాయించింది. లోక్పాల్, లోకాయుక్త చట్టం 2013కు గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం లభించగా.. ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం లోక్పాల్ చైర్పర్సన్, ఇతర సభ్యుల ఎన్నికల ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైమానిక అనుసంధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు విమానాశ్రయాల నిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ‘పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)’ విధానంలో ఈ విమానాశ్రయాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది. పౌర విమానయాన శాఖకు గత బడ్జెట్లో రూ. 8,502 కోట్లు కేటాయించగా... ఈ సారి 11.4 శాతం అధికంగా రూ. 9,474 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో రూ. 6,720 కోట్లను ప్రణాళికా పద్దు కింద ఇవ్వనుండగా.. రూ. 2,754 కోట్లను ప్రణాళికేతర వ్యయం కింద అందజేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఎంతో మందికి విమానం ఎక్కాలనే కోరిక ఇంకా తీరకుండా ఉందన్నారు. అందువల్ల పెద్ద నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ భారీ సంఖ్యలో కొత్త విమానాశ్రయాలను నిర్మించి, విమాన సర్వీసులను పెంచనున్నట్లు తెలిపారు. మొత్తంగా పౌర విమానయాన శాఖకు కేటాయించిన బడ్జెట్లో ప్రభుత్వ వైమానిక సంస్థ ఎయిరిండియాకు రూ. 7,069 కోట్లు, విమానాశ్రయాల సంస్థకు రూ. 2,134 కోట్లు, పవన్ హాన్స్ హెలికాప్టర్ల సంస్థకు రూ. 46 కోట్లు ఇవ్వనున్నారు. అయితే ఎయిరిండియాకు గత బడ్జెట్లో కంటే కేవలం రూ. 6 కోట్లు మాత్రమే ఎక్కువగా ఇవ్వడం గమనార్హం. తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసా.. పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా కేంద్రం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈ-వీసా)ను ప్రవేశపెట్టనుంది. దశలవారీగా దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసా ప్రక్రియను ప్రవేశపెడతామని జైట్లీ తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను రాబోయే ఆరు నెలల్లో కల్పించనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల సృష్టిలో పర్యాటక రంగం ఒకటని, ఈ-వీసా సదుపాయం దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊపును తెస్తుందని ఆయన చెప్పారు -
ఇస్రోకు ఇం‘ధనం’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తన తొలి బడ్జెట్లో అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు నిధుల కేటాయింపును తాజా బడ్జెట్లో ఒకేసారి 50 శాతం పెంచి రూ.6,000 కోట్లు కేటాయించింది. 2013-14 బడ్జెట్లో అంతరిక్ష శాఖకు తొలుత రూ.5,615 కోట్లు కేటాయించారు. అయితే తర్వాత దానిని రూ.4 వేల కోట్లకు సవరించారు. తాజాగా అంతరిక్ష పరిశోధనలకు రూ.3,545.63 కోట్లు, ఇన్శాట్ ప్రాజెక్టుకు రూ.1,412.98 కోట్లు కేటాయించారు. 2014-15 సంవత్సరంలో జీఎస్ఎల్వీ ఎంకే-3, పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతోపాటు మరో రెండు నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అధిక బరువును మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకెట్ ప్రాజెక్టుకు రూ.378.76 కోట్లు, చంద్రయాన్-2 మిషన్ కొనసాగింపునకు రూ.60 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే గతేడాది ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం అంగారకుడి వైపుగా దూసుకెళుతోందని, ఆ ప్రాజెక్టు కొనసాగింపునకు తాజా బడ్జెట్లో రూ.65.93 కోట్లు కేటాయించామని చెప్పారు. కాగా, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల ఐదు విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి పంపడం, ఆ ప్రయోగానికి ప్రధాని మోడీ హాజరు కావడం తెలిసిందే. అంతరిక్ష రంగంలో విస్తృత సేవలు అందించేందుకు భారత్కు అవకాశాలున్నాయని, భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కూడా ఇస్రో సాధించాలని ఆ సందర్భంగా సూచించిన మోడీ.. తాజాగా ఇస్రో పరిశోధనలకు ఊతమిచ్చేలా కేటాయింపుల్లో ప్రాధాన్యతను పెంచారు. -
అణుశక్తి శాఖకు రూ.10 వేల కోట్లు
అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనలకు ఊతమిచ్చేలాఅరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్లో అణుశక్తి శాఖకు రూ.10,446 కోట్లు కేటాయించారు. ఇందులో అణు విద్యుదుత్పత్తికి రూ. 1,709 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తంలో రూ.30 కోట్లు కల్పక్కం వద్ద గల భారత తొలి ‘బాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ కోసం కేటాయించారు. అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్)కు రూ.203 కోట్లు, భారత నాభికీయ(అణు) విద్యుత్ నిగమ్ లిమిటెడ్(భావిని), మరో రెండు ప్రభుత్వ సంస్థలకు రూ.440 కోట్లు కేటాయింపుల నుంచి అందనున్నాయి. తాజా కేటాయింపుల్లో సింహభాగం రూ.8,737 కోట్లు అణు ఇంధన రంగంలో పరిశోధనలకే ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8 వేల కోట్లు బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8,768 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.3,544 కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ)కి, రూ.3,707 కోట్లు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం(డీఎస్ఐఆర్)కు, రూ.1,517 కోట్లు బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ)కి కేటాయించారు. -
ఈశాన్య రాష్ట్రాలకు 53 వేల కోట్లు..
న్యూఢిల్లీ: ఈశాన్య భారత ఒంటరితనానికి ముగింపు పలికేందుకు కేంద్రం సాధారణ బడ్జెట్లో వరాల వర్షం కురిపించింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం భారీగా రూ. 53,706 కోట్లు కేటాయించింది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి తదితరాలను అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఈశాన్య భారతం వెనుకబాటుతనంతో కునారిల్లుతోందని, సరైన అనుసంధానం లేక పోవడంతో ఏకాకితనం భావన నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతానికి 10 శాతం ప్రణాళికా నిధుల కేటాయింపును అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఇదివరకటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు. తాజా బడ్జెట్ నుంచి ఈశాన్య ప్రాంతానికి కేటాయింపులపై ప్రత్యేక పత్రాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాల కేటాయింపులు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.2,332.78 కోట్లు. బ జాతీయ రహదారుల సంస్థ, రాష్ర్ట్ర రహదారుల వ్యవస్థలో ప్రతిపాదించిన రూ. 38 వేల కోట్ల పెట్టుబడుల్లో రూ.3 వేల కోట్లు ఈశాన్యానికి. బ రైలు మార్గాల విస్తరణ కోసం మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోపాటు రూ. 1,000 కోట్లు. బ మణిపూర్లో క్రీడా విశ్వవిద్యాలయం. బ ‘అరుణ్ ప్రభ’ పేరుతో టీవీ చానల్.బ సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి రూ.100 కోట్లు. -
హోంశాఖకు నిధుల వరద..
కేంద్ర హోం శాఖకు అరుణ్జైట్లీ నిధుల వరదను పారించారు. నిరుటి కంటే 11శాతం అధికంగా రూ. 65,745 కోట్లను వివిధ కేటగిరీలలో హోం శాఖకు కేటాయించారు. దీంతో పాటుగా ప్రధాన నగరాల్లో మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లను కేటాయిస్తున్నట్టు జైట్లీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో సంక్షోభ నియంత్రణ కేంద్రాలను(క్రైసిస్ మేనేజిమెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వీటి కోసం నిర్భయ ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద పారామిలటరీ దళాలైన సీఆర్పీఎఫ్కు రూ. 12,169.51 కోట్లను ఇస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా భారత్-పాక్, భారత్-బంగ్లా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలకు రూ. 11,242.02 కోట్ల ను కేటాయించారు. విమానాశ్రయాలతో పాటు కీలకమైన సంస్థలు, స్థావరాల పరిరక్షణలో భాగస్వామిగా ఉన్న సీఐఎస్ఎఫ్కు రూ. 4,729 కోట్లను కేటాయించారు. అస్సాం రైఫిల్స్కు 3585 కోట్లు, ఐటీబీపీకి 4729 కోట్లు అందనున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోకి రూ. 1,176 కోట్లు ఇవ్వనున్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యంత ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కు 101 కోట్లను జైట్లీ అందించారు. ట్రాఫిక్ కమ్యునికేషన్ నెట్వర్క్ కోసం 11.37 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రతిపాదించారు. మావోయిస్టుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: దేశంలోని 13 రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్టులను నియంత్రించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, పోలీసు బలగాలకు అన్నివిధాలా ఆధునిక సదుపాయాలను కల్పించటానికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలకు నివాస గృహాలు, ఇతర సదుపాయాల కోసం 1745 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతే కాకుండా ఎలాంటి దాడులనైనా ఎదుర్కునేందుకు వీలుగా దుర్భేద్యమైన పోలీసు స్టేషన్ల నిర్మాణానికి మరో 110 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. -
రక్షణ రంగానికి పెద్దపీట
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తన తొలి బడ్జెట్లోనే రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.29 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు 12.5శాతం ఎక్కువని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2013-14లో రూ.2,03,672 కోట్లు కేటాయించగా, మొన్నటి మధ్యంతర బడ్జెట్లో 2లక్షల 24 వేల కోట్లకు అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో జైట్లీ మరో రూ. 5 వేల కోట్లు పెంచారు. దేశ భద్రత విషయంలోరాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సైనికదళాల ఆధునీకరణకు గత ఏడాది కేటాయించిన రూ.89,587.95 కోట్లకు అదనంగారూ.5వేల కోట్లు కేటాయించారు. రక్షణశాఖ మూలధన పెట్టుబడులను రూ.5వేల కోట్లకు పెంచుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. ఇందులోనే వెయ్యి కోట్లను సరిహద్దు ప్రాంతాలకు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించారు. రక్షణ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిధికి వంద కోట్లను కేటాయించారు. భద్రతాబలగాలు తమ ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకునే దిశగా 126 మల్టీరోల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును ప్రభుత్వం త్వరలోనే కుదుర్చుకోనుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ. 60 వేల కోట్లు. 22 అపాచే యుద్ధ హెలికాప్టర్లు, 15 చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం ఉన్న విమానాలు ఆరింటికి సంబంధించిన 40 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కొద్ది వారాల్లో పూర్తి కావచ్చు . అంతర్గత భద్రత: వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి, దాని ప్రభావమున్న జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నట్టు జైట్లీ వివరించారు. ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను బలోపేతం చేయడానికి రూ. 3వేల కోట్లు కేటాయించామన్నారు. ఒకేర్యాంకు.. ఒకే పింఛను భారత సైనికుల బాగోగుల పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని జైట్లీ అన్నారు. మాజీ సైనికుల పింఛనులను ఒకే ర్యాంకు.. ఒకే పింఛను విధానం కిందకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది పింఛను అవసరాలు తీర్చేందుకు రూ. వెయ్యికోట్లు కేటాయించారు. వార్ మెమోరియల్ ఏర్పాటు.. దేశ రాజధాని ఢిల్లీలో వార్ మెమోరియల్, ఇండియాగేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్కులో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. 100 కోట్లు కేటాయించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవానులు, అధికారులను ఈ దేశం రుణపడి ఉందని.. వారి స్మృతి చిహ్నంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. అలాగే సైనికులతో సమానంగా దేశంలో అంతర్గతంగా శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన పోలీసుల స్మారకార్థం జాతీయ పోలీస్ మెమోరియల్ ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు కేటాయించామన్నారు. దేశ సరిహద్దుల్లో మౌలిక వసతుల పెంపుదలకు ఇప్పటికే కేటాయించిన 2,250 కోట్లకు మరో రూ. 990 కోట్లు కేటాయించామని తెలిపారు. -
ఉసూరుమనిపించిన కేంద్ర ఆర్థిక బడ్జెట్
చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు : దేశ ఆర్థికరంగం అభివృద్ధి చెందాలంటే చిన్నతరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమైంది. గురువారం బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పరిశ్రమలకు ఆశించిన మేరకు ప్రయోజనం కలగలేదు. ఇప్పటికీ విద్యుత్కోతలతో పరిశ్రమలు సతమతమవుతూ కోట్లాదిరూపాయలు బ్యాంకులకు బకాయిలు పడ్డాయి. ఈ బడ్జెట్తో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆశించాం. ఆశించిన మేర ప్రోత్సాహం ఏమీ కనిపించలేదు. పరిశ్రమలను ప్రోత్సహించకుంటే ప్రభుత్వం ఆశించిన మేర వృద్ధిరేటు నమోదు కాదు. ఎప్పుడైనా పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వానికి కూడా తగినంత ఆదాయం వస్తుంది. చిన్నపరిశ్రమలకు సంబంధించి బడ్జెట్ ఆశాజనకంగా లేదు. చిన్నపరిశ్రమల వారికి ఇబ్బందులు తప్పవు. - ఏపీకే రెడ్డి, రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ధరల నియంత్రణకు చర్యలేవి?: పేద,మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో చోటులేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పైగా విదేశీ పెట్టుబడులకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడంతో స్వదేశంలో పేదల బతుకులు దయనీయంగా మారనున్నాయి. - ఉపేంద్ర, న్యాయవాది, నెల్లూరు ఆశించిన ఫలితం లేదు: నరేంద్రమోడీ నాయకత్వంలో యువతకు మం చి జరుగుతుందనుకున్నాం. అయితే బడ్జెట్లో యువత, విద్యార్థులకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపకపోవడం బాధాకరం.విద్యారంగానికి ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది. -బి లోకేష్రెడ్డి, విద్యార్థి, నెల్లూరు సామాన్యులకు అందుబాటులో లేదు: బడ్జెట్పై ఎంతో ఆశగా ఎదురు చూసిన సామాన్య ప్రజలకు నిరాశమిగిల్చింది. నిత్యవసర సరుకుల ధరలు తగ్గించేలా లేక పోవడం విచారకరం. ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. - బాలచంద్ర, ఉద్యోగి, వెంకటగిరి ప్రత్యేక నిధులు నామమాత్రమే: విభజన నేపథ్యంలో రాజధాని కూడా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దగా కేటాయించింది లేదు. ప్రత్యేకంగా నిధులు సమకూర్చి విభజనతో నష్టపోయిన ఆంధ్రులను ఆదుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారుదే. -చిల్లకూరు సుబ్రమణ్యంరెడ్డి, రియల్ వ్యాపారి, సూళ్లూరుపేట సీమాంధ్రకు నిరాశే: ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా సీమాంధ్ర రాష్ట్రానికి నిరాశాజనంగా ఉంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాష్ట్రం అయినప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం విచారకరం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వదనే సందేహం కలుగుతోంది. ఉభయసభల్లో గత ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరేలా లేవు. -కోవూరు వెంకటేశ్వర్లు, పొదలకూరు, వినియోగదారుల సేవాసంఘం మండల అధ్యక్షుడు బడ్జెట్ బాగుంది: అరుణ్జైట్లీ ఆర్థిక బడ్జెట్ బాగుంది. తక్కువ ఖర్చుతో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడే బకింగ్ కెనాల్కు పూర్వ వైభవం వచ్చేలా బడ్జెట్లో నిధులు విడుదల చేసి ఉంటే బాగుండేది. విశాఖ-చెన్నై కోస్టల్ కారిడార్ అభివృద్ధికి ఈ మార్గం ఎంతో ఉపయోగకరం. - ఎన్ జయచంద్ర, వ్యాపారి, సూళ్లూరుపేట ట్యాక్స్ మినహాయింపు రూ.ఐదు లక్షలకు పెంచాల్సింది: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగుల ఇన్కమ్ట్యాక్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ రూ.2.50 లక్షలకు పెంచారు. దీనిని రూ.5 లక్షలకు పెంచి ఉంటే బాగుండేది. - మురళీకృష్ణ, ముత్తుకూరు , ఉపాధ్యాయుడు పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే బడ్జెట్ అధిక ధరలను తగ్గిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఉంది. పేదలు, కార్మికులు, కర్షకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆచరణ సాధ్యంకాని విధానాలను బడ్జెట్లో ప్రవేశ పెట్టారు. బీజేపీ మాటలో స్వదేశీ నినాదం, ఆచరణలో విదేశీ విధానం. -చండ్ర రాజగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
మహిళల భద్రత కన్నా పటేల్ విగ్రహమే మిన్న!
న్యూఢిల్లీ: మహిళల భద్రత, వారి సంక్షేమం కన్నా గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణమే ముఖ్యమైనదిగా మోడీ సర్కారు భావించింది. తాజా బడ్జెట్లో మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లు, వారి సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ప్రధానమంత్రి సొంతరాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు మాత్రం రూ.200 కోట్లను కేటాయించారు. 182 మీటర్ల ఎత్తుతో, రూ. 2,500 కోట్ల ఖర్చుతో అహ్మదాబాద్లో ప్రపంచంలోనే ఎత్తై సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ‘ఐక్యతా ప్రతిమ’ పేరుతో నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి రూ. 200 కోట్లను కేటాయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైట్లీ ప్రతిపాదనల్లో ఇదే అత్యంత నచ్చని ప్రతిపాదనగా నెటిజన్లు అభిప్రాయపడ్డారు. -
అందరికీ ఆరోగ్యమే లక్ష్యం
బడ్జెట్లో రూ.39,237 కోట్లు న్యూఢిల్లీ: అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా అందరికీ ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్లో హామీ ఇచ్చింది. ఈ లక్ష్యసాధనకోసం ఆంధ్రప్రదేశ్తోపాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్లో రూ.500 కోట్ల వ్యయంతో మరో నాలుగు ఎయిమ్స్ తరహా సంస్థలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆరోగ్య రంగానికి యూపీఏ ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.37,330 కోట్లు కేటాయించగా, తాము ఐదుశాతం పెంచి మొత్తంగా రూ.39,237.82కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ.21,912కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్కు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ. 8426 కోట్లు, ఆయుష్ విభాగానికి రూ. 689 కోట్లు, వైద్యపరిశోధనకు రూ. 726 కోట్లు, ఎయిడ్స్ నియంత్రణకు రూ. 857 కోట్లు కేటాయించారు. గ్రామీణ భారతంలో అత్యుత్తమ ఆరోగ్య సేవలందించేందుకు 15 ఆదర్శ గ్రామీణ వైద్య పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. స్థానిక ఆరోగ్య సమస్యలపై ఈ కేంద్రాలు పరిశోధనలు జరపడంతోపాటు అన్ని రకాల సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 58 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయని, త్వరలో మరో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కొత్త కళాశాలల్లో దంతవైద్య సేవలు కూడా అందిస్తారని చెప్పారు. వృద్ధుల్లో టీబీ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు ఢిల్లీ, చెన్నైల్లోని ఎయిమ్స్లలో రెండు జాతీయ వృద్ధుల సంస్థలు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. అలాగే దంతవైద్యంలో ఉన్నత విద్యకోసం ఒక జాతీయ స్థాయి పరిశోధన, రిఫరల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తొలిసారిగా కొత్త ఔషధ పరీక్ష కేంద్రాలను నెలకొల్పడంద్వారా రాష్ట్రాల్లో ఔషధ, ఆహార నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. హైలైట్స్ {దవ్యలోటు లక్ష్యం ప్రస్తుత ఏడాదికి జీడీపీలో 4.1 శాతం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.6 శాతంగా నిర్ణయం * పెద్ద నగరాల్లో మహిళల భద్రత పెంపునకు రూ. 150 కోట్లు * ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు మరింత చౌక * సిగరెట్లు, పాన్ మసాలా, టొబాకో, కూల్డ్రింక్లు ప్రియం * రూ. 500 నుంచి రూ.1,000 ఖరీదు చేసే పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు * హిమాచల్ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్లలో 5 ఐఐఎంల ఏర్పాటు * ఆంధ్రప్రదేశ్, జమ్మూ, చండీగఢ్, గోవా, కేరళల్లో 5 ఐఐటీల ఏర్పాటు * పట్టణ పేదలు / ఈడబ్ల్యూఎస్ / ఎల్ఐజీ విభాగంలో అందుబాటులో గృహ నిర్మాణం కోసం తక్కువ వడ్డీకి రుణాలు పెంపొందించేందుకు రూ. 4,000 కోట్లు * గంగా నదిపై ‘జల్ మార్గ్ వికాస్’ పథకం పేరుతో అలహాబాద్ నుంచి హల్దియా వరకూ అంతర్గత జలమార్గాల కోసం రూ. 4,200 కోట్లు గ్రామాలు, పాఠశాలల్లో సేవలు, ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ కోసం జాతీయ గ్రామీణ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కార్యక్రమం * లక్నో, అహ్మదాబాద్లలో మెట్రో ప్రాజెక్టుల కోసం రూ. 100 కోట్లు * యుద్ధ ప్రదర్శనశాల, యుద్ధ స్మారకం ఏర్పాటుకు రూ. 100 కోట్లు * రూ. 500 కోట్ల నిధితో పండిట్ మదన్మోహన్ మాలవీయ నూతన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం * నిర్వాసిత కాశ్మీరీ వలసల పునరావాసానికి రూ. 500 కోట్లు * దాదాపు 600 కొత్త, ప్రస్తుత కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు మద్దతుగా రూ. 100 కోట్లతో పథకం * సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి రూ. 100 కోట్లు * కిసాన్ వికాస్ పత్రాల పునఃప్రవేశం, బీమా సదుపాయంతో కూడిన జాతీయ పొదుపు ధురవీకరణపత్రాల ప్రారంభం * అల్ట్రా మోడర్న్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ టెక్నాలజీ ప్రతిపాదన * {పభుత్వ రంగ బ్యాంకుల మూలధనం కోసం రూ. 11,200 కోట్లు * పత్యక్ష పన్నుల ప్రతిపాదనల ఫలితంగా రూ.22,200 కోట్ల ఆదాయ నష్టం * పన్నుల ద్వారా రూ. 9.77 లక్షల కోట్ల ఆదాయం అంచనా * పరోక్ష పన్నుల ప్రతిపాదనల ద్వారా రూ.7,525 కోట్ల ఆదాయం -
ఫ్లాగ్షిప్కు మోడీ టచ్
పాత పథకాలు యథాతథం... ‘ఉపాధి’కి పెంపు లేదు... 2014-15 బడ్జెట్లో : రూ. 33,364 కోట్లు 2013-14 బడ్జెట్లో : రూ. 33,000 కోట్లు 2012-13 బడ్జెట్లో : రూ. 33,000 కోట్లు యూపీఏ ప్రభుత్వం తొలివిడత అధికారంలోకి వచ్చాక 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమల్లోకి వచ్చింది. గ్రామాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రత కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. నిధుల కుమ్మరింపు భారీగానే ఉన్నా.. వనరుల కల్పనలో మాత్రం ఘోరంగా విఫలమవుతోందనే వాదనలు ఆరంభం నుంచీ వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నిధుల దారిమళ్లింపు, నాసిరకం పనులు, అవినీతి ఆరోపణలు ఇక సరేసరి. మోడీ సర్కారు దీన్ని వృద్ధికి లింకుపెట్టి కొత్తపుంతలు తొక్కిస్తామంటోంది. ‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పెంపు, శాశ్వతప్రాతిపదికన నిర్మాణాలు, ఆస్తుల కల్పనతో పాటు వ్యవసాయం, తత్సంబంధ పనులకూ ఉపాధి హామీని జతచేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలొస్తాయో వేచిచూడాల్సిందే... పనితీరు ఇదీ.... పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 14 కోట్ల మేర జాబ్ కార్డులు జారీ అయ్యాయి.ఇప్పటివరకూ రూ.2,55,862 కోట్ల మొత్తాన్ని వెచ్చించారు. 1,720 కోట్ల పనిరోజుల్ని (పర్సన్ డేస్) సృష్టించినట్లు అంచనా.గతేడాది మొత్తం 4.85 కోట్ల కుటుంబాలకు పనికల్పించారు. ఇక ఉపాధి హామీలో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య 7.46 కోట్లు మాత్రమే. గతేడాది 102 లక్షల పనులను (కొత్తవి, అంతక్రితం ఏడాది వదిలేసినవి కలిపి) చేపట్టారు. ఇందులో 32 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 2013-14లో సగటు రోజువారీ వేతనం రూ.132.6గా (అంతక్రితం ఏడాది రూ.121.4) నమోదైంది. బడ్జెట్ కేటాయింపునకన్నా అధికంగా రూ.38,621 కోట్లు ఖర్చయినట్లు అంచనా.సగటున 45.2 రోజులు ఒక్కో కుటుంబానికి పని కల్పించారు. 100 రోజుల పని పూర్తిచేసుకున్న కుటుంబాల సంఖ్య కేవలం 46.5 లక్షలు మాత్రమే. భారత్ నిర్మాణ్ గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకమిది. ఇందులో ప్రధానంగా రోడ్లు, గృహకల్పన, తాగునీరు, సాగునీరు, టెలికం-ఐటీ సేవల కల్పన, విద్యుదీకరణ... ఇలా ఆరు స్కీమ్లున్నాయి. 2005-09 మధ్య భారత్ నిర్మాణ్ తొలి దశ అమలు చేశారు. దీనికి మొత్తం బడ్జెట్ రూ.1.74 లక్షల కోట్లు. ప్రస్తుతం రెండో దశ అమలవుతోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాలకు నిధులు భారీగానే కేటాయిస్తున్నా... లక్ష్యాలను అందుకోవడంలో చతికిలపడుతున్నాయి. ఈ స్కీమ్ల పరిస్థితి చూస్తే... ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై).. 2014-15 ⇒ 16,000 2013-14 ⇒ 15,184 2022కల్లా దేశవ్యాప్తంగా అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం.. ఈ పథకానికి నిధులైతే పెద్దగా పెంచలేదు.2002 జనాభా లెక్కల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.2013-14లో 25,21,242 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 20,28,322 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 1,44,483 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.నిర్మాణ సామగ్రి ధరలు పెరగటంతో ఇళ్ల నిర్మాణం కుంటుపడుతోంది. కొన్ని చోట్ల నాసిరకంగా ఇళ్లను నిర్మించడం, నిధులను పక్కదారిపట్టించడం, అవినీతి బాగోతాలు భారీగానే వెలుగుచూస్తున్నాయి. గతేడాది బడ్జెట్లో మైదాన ప్రాంతాల్లో ఒకో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాల్లో రూ.75,000కుపెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంకా 82 మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో ఒకో ఇంటికి సాయాన్ని రూ.48,500గా నిర్ణయించారు. 2013 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. మోడీ సర్కారు దీన్ని యథాతథంగా కొనసాగించింది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన 2014-15 ⇒ 14,389 2013-14 ⇒ 21,700 ⇒ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం.. తొలి బడ్జెట్లోనే నిధులను తగ్గించేసింది. ఈసారి 33 శాతం కోత పెట్టింది. ⇒ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించగా, 2005లో దీన్ని యూపీఏ భారత్ నిర్మాణ్లోకి చేర్చింది. 500 మందికి పైగా జనాభా ఉన్న మైదాన ప్రాంతాలకు, 250 మందికి పైగా జనాభా గల కొండ, ఎడారి ప్రాంత గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలనేది ప్రస్తుత లక్ష్యం.పథకం ప్రారంభం నుంచి 1,44,717 ఆవాస ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో సుమారు 5,44,462 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను క్లియర్ చేశారు. ఇటీవలే ఈ పథకం రెండో దశను ప్రారంభించారు. ప్రస్తుత గ్రామీణ రోడ్డు నెట్వర్క్లో ఎంపిక చేసిన కొన్ని రోడ్లను మరింత అత్యున్నతంగా తీర్చిదిద్దడం లక్ష్యం. గ్రామీణ వృద్ధి కేంద్రాలు, హబ్లు, పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, ఇతరత్రా ముఖ్యమైన ప్రాంతాలను కలిపే రోడ్లను ఇందుకు ఎంపికచేస్తారు. గ్రామీణ మౌలిక సదుపాయాల పెంపు, పేదరికాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. మొత్తంగా 50,000 కిలోమీటర్ల మేర రోడ్లను మెరుగుపరచడానికి రూ.33,030 కోట్లు వెచ్చిస్తారు. కేంద్రం 75 శాతం నిధులు ఇస్తుంది. మిగతాది రాష్ట్రాలు భరించాలి. రాజీవ్ గాంధీ తాగునీటి మిషన్... 2014-15 ⇒ 11,000 2013-14 ⇒ 11,000 భార జలాలు/హానికర మూలకాలు, ఫ్లోరైడ్, క్రిమిసంహారకాలు/ఎరువుల ప్రభావం ఉన్న సుమారు 20 వేల ఆవాస ప్రాంతాలకు కమ్యూనిటీ నీటిశుద్ధి ప్లాంట్ల ద్వారా వచ్చే మూడేళ్లలో సురక్షిత తాగునీరు కల్పించాలని తాజా బడ్జెట్లో ప్రకటించారు. నిధులను మాత్రం పెంచలేదు. దేశంలో తాగునీటి సౌకర్యం లేని మారుమూల గ్రామాలన్నిటికీ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్ర- రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది. గతేడాది మార్చి నాటికి దేశంలోని మొత్తం 16.92 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను.. 11.61 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్షిక లక్ష్యాలకు ఆమడదూరంలో పథకం నత్తనడకన అమలవుతోంది. రాజీవ్గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన 2014-15 ⇒ 5,144 2013- 14 ⇒ 4,500 మోడీ సర్కారు ముద్ర కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన పేరుతో కొత్త పథకాన్ని తాజా బడ్జెట్లో జోడించింది. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. ఆర్జీజీవైకి కూడా నిధులను చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెంచారు.విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఎజెన్సీగా ఆర్ఈసీ వ్యవహరిస్తోంది.ఈ పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకూ 2.16 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ టెలిఫొనీ... 2014-15 ⇒ 3,553 2013-14 ⇒ 3,000 2017 నాటికి ఎన్ఓఎఫ్ఎన్ కింద బ్రాడ్బ్యాండ్ లక్ష్యాన్ని పూర్తిచేయాలని మోడీ సర్కారు నిర్దేశించుకుంది. ప్రస్తుత స్థాయి నుంచి 2017కల్లా గ్రామీణ టెలి డెన్సిటీని 70 శాతానికి, 2020నాటికి 100 శాతానికి చేర్చాలనేది తాజా లక్ష్యం.2014కల్లా గ్రామాల్లో ప్రతి 100 మందిలో 40 మంది టెలిఫోన్ వినియోగదారులుగా చేయాలనేది లక్ష్యం. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్(జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్-ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్కు ఫండ్స్ను అందిస్తున్నారు. గ్రామీణ సాగునీటి పథకం 2014-15 ⇒ 41,510 2013-14 ⇒ 41,207 2014-15లో కేటాయింపు: భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు. చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.410 కోట్లు.2013-14లో కేటాయింపు: భారీ, మధ్యస్థాయి సాగునీటి ప్రాజెక్టులకు రూ.895 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.312 కోట్లు. ఇంటి కలను నెరవేరుస్తాం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2022 నాటికి అందరికీ సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇంటి రుణాలపై ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ చెప్పారు. జాతీయ హౌసింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ) పథకం కింద చౌక ధరలో ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.4,000 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు/తక్కువ ఆదాయం కలిగిన వర్గాల కోసం వీటిని నిర్మిస్తారు. గ్రామీణ హౌసింగ్ ఫండ్ కింద చాలా మందికి ప్రయోజనం చేకూరినట్లు జైట్లీ తెలిపారు. మురికివాడల అభివృద్ధిని కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద చేర్చారు. దీనివల్ల కార్పొరేట్లపై మరింత బాధ్యత పెరిగింది. 16 కొత్త పోర్టు ప్రాజెక్టులు జల రవాణా ద్వారా దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్యోగ కల్పనకు కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. ఇందులోభాగంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రకటిస్తూ.. దేశవ్యాప్తంగా 16 కొత్త పోర్టు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. దేశంలోని ప్రధాన పోర్టుల అనుసంధానం, రూ. 11,635 కోట్లతో ట్యుటికోరిన్లో ఔటర్ హార్బర్ ప్రాజెక్టుతో పాటు కాండ్లా, జేఎన్పీటీ పోర్టుల వద్ద ఎస్ఈజెడ్ల ఏర్పాటు వం టివి ఇందులో ఉన్నాయి. నౌకా నిర్మాణ పరిశ్రమను ప్రోత్సహించేం దుకు కొత్త విధానాన్ని ప్రకటిస్తామని కూడా జైట్లీ ఈ సందర్భంగా తెలిపా రు. విచ్ఛిన్నం కోసం దిగుమతి చేసుకునే నౌకలపై వాణిజ్య పన్నును ఐదు నుంచి 2.5 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం దేశంలోని 12 ప్రధా న పోర్టుల ద్వారా 700 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు వీలుండగా.. 2020 కల్లా దీన్ని 3,130 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు. ఐదు పర్యాటక సర్క్యూట్ల సృష్టికి రూ. 500 కోట్లు న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేం దుకు ప్రత్యేక ఇతివృత్తాలతో ఐదు పర్యాటక సర్క్యూట్లను సృష్టించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ఐదు సర్క్యూట్ల సృష్టికి రూ.500 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా సార్నాథ్-గయ-వారణాసి బుద్ధిస్ట్ సర్క్యూట్ను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. దేశంలో పర్యాటకాభివృద్ధి కోసం మంత్రి చేసిన ఇతర ప్రతిపాదనలు... మధుర, అమృత్సర్, గయ, కంచీపురం, అజ్మీర్ వంటి పట్టణాలలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు ‘జాతీయ వారసత్వ పట్టణ అభివృద్ధి, పునరుద్ధరణ పథకం(హృదయ్)’ను అమలు చేస్తారు. ఇందుకు ప్రస్తుత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. దేశంలో ‘తీర్థయాత్రల పునరుత్తేజం, ఆధ్యాత్మిక అభివృద్ధికి జాతీయ కార్యక్రమం(ప్రసాద్)’ నిర్వహించేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. పురావస్తు కట్టడాల పరిరక్షణకు మరో రూ.100 కోట్లు ఇచ్చారు. గోవా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందని, అక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని, అందుకు కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా విదేశీయులు దేశంలోకి వచ్చిన తర్వాత కూడా వీసా పొందేలా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈ-వీసా) సౌకర్యాన్ని ఆరునెలల్లో దశలవారీగా 9 విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిపై పరిశ్రమవర్గాలు స్పందిస్తూ.. ఈ-వీసాల కేటాయింపు నిర్ణయం దేశ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశాయి. గ్రామీణాభివృద్ధిపై దృష్టి ⇒ యువతకు చేయూతనిచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించింది. గ్రామాల్లోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ⇒ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందు కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ)కి రూ. 8 వేల కోట్లు కేటాయింపు ⇒ ప్రాంతాల్లో వాటర్షెడ్ల అభివృద్ధి కోసం నీరాంచల్ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టిం ది. ఇందుకు రూ. 2,142 కోట్లు వెచ్చించనుంది. మరో 100 జిల్లాల్లో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు 4 శాతం వడ్డీతో బ్యాంకు రుణాలను అందించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. ప్రస్తుతం 150 జిల్లాల్లోనే ఇది అమలులో ఉంది. క్రీడలకు జోష్.. న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో యువజన సర్వీసులు, క్రీడల రంగానికి కేటాయింపులు రూ. 562 కోట్ల మేరకు పెరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి మొత్తం రూ.1,769 కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కేటాయించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 1,643 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం 126 కోట్లు. 2014-15 బడ్జెట్లో జమ్మూకాశ్మీర్కు పెద్ద పీట వేశారు. ఈ రాష్ట్రంలో క్రీడా వసతులు, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల అభివృద్ధికి రూ. 200 కోట్లను కేటాయించారు. మణిపూర్లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు కేటాయించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)కి రూ. 85 కోట్ల పెంపుతో 405.10 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు 25 కోట్ల పెంపుతో 185 కోట్లు కేటాయించారు. కాగా, రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్కు కేటాయింపుల్లో భారీ కోత విధించారు. దీనికి గతంలో రూ. 104.85 కోట్లను కేటాయించగా.. ఇప్పుడు 20 కోట్లతో సరిపెట్టారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లో పాలుపంచుకునే క్రీడాకారుల సన్నద్ధత కోసం రూ. 100 కోట్లను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింలో క్రీడల అభివృద్ధికి రూ. 192.65 కోట్లను కేటాయించారు. డోపింగ్ నిరోధక కార్యక్రమాలకు రూ. 11.60 కోట్లు.. నేషనల్ డోప్ టెస్ట్ ల్యాబొరేటరీకి రూ. 9 కోట్లు కేటాయించారు. జైట్లీ.. పేరాలకు పేరాల స్పీచ్ మన ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెడుతూ మధ్యలో తిరువళ్లూరు నుంచి గాలిబ్ వరకు చాలా మంది సూక్తులను అలవోకగా చెప్పేస్తూ.. గంటలకు గంటలు మాట్లాడ్డం వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే ‘సుత్తి కొట్టొద్దు.. సూటిగా చెప్పు’ అన్నట్టు సింపుల్గా ప్రసంగిస్తారు. అలాంటిదే మొన్న మొట్ట మొదటి బడ్జెట్ ప్రసంగం. ఈ ప్రసంగం కేవలం 39 పేరాలే. దీనికి భిన్నంగా ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ 253 పేరాల స్పీచ్ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కువ పేరాల ప్రసంగాలిచ్చిన ఆర్థిక మంత్రులందరినీ ఆయన మించిపోయారు. -
హామీలెక్కువ.. ఇచ్చింది తక్కువ
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు అంతంతమాత్రమే సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రెవెన్యూ లోటు పూడ్చేందుకు నిధులు.. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు.. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్, వివిధ యూనివర్సిటీలు.. విశాఖలో మెట్రో.. విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో.. ఇలా ఎన్నో ఆశలు పెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామన్నారు. ఈ మాటలన్నీ విన్న ఏపీ ప్రజానీకం కేంద్ర బడ్జెట్ కోసం ఆత్రంగా ఎదురు చూసింది. కానీ ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమీ లేదు. ఏవో కొన్ని తాయిలాలు తప్ప.. చాలావరకు హామీలను నెరవేర్చలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి.. ప్రత్యేకించి కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు రూ. 15,691 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. దీనిని భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ, ఈ బడ్జెట్లో కేంద్రం రూ.1,180 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంకా రూ.14,511 కోట్ల లోటు ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 250 కోట్లు కేటాయించింది. తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం, సీమాంధ్రకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్లాన్ ఔట్ లే కింద రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ వర్శిటీలకు నిధులు ఒకే ఏడాది కేటాయిస్తారా? లేక విడతలవారీగా కేటాయిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ప్రాథమికంగా ఒక్కో కోటి చొప్పున కేటాయించారు. బీజేపే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా దేశంలో 100 స్మార్ట్ సిటీలను రూ. 7,060 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా ప్రకటించినా.., ఆంధ్రప్రదేశ్కు అత్యావశ్యకమైన రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తినీ పట్టించుకోలేదు. ఏపీలో మెగాసిటీలు, స్మార్ట్ సిటీల నిర్మాణం గురించి బీజేపీ నేత వెంకయ్యనాయుడు పలుమార్లు చెప్పడమే తప్ప, బడ్జెట్లో వాటిని చేర్చడంలో కృతకృత్యులు కాలేకపోయారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ప్రకటన కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో ఆల్ట్రా మెగా సోలార్పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం పోర్టును పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రకటించారు. కాకినాడ పోర్టు అభివృద్ధికి నిధులిస్తామన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మాత్రం ఇతరత్రా ఏమీ లేవు. ఆర్థికంగా చేయూత అనుమానమే! బడ్జెట్లో ఏపీని ఆర్థికంగా ఆదుకొనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఆర్థిక లోటు, రాజధానికి కలిపి కొంచెం నిధులే కేంద్రం విదిలించింది. దీంతో కేంద్రం నుంచి నిధులు దక్కడంపై అధికారవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా కష్టమే ఏపీ కొత్త రాజధాని, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని పునర్వ్యవవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ బడ్జెట్లో ఈ ఊసే ఎత్త లేదు. -
జైట్లీ లెక్కలపై జనం మాట...
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిస్తుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహాన్ని నింపింది. బడా బాబులకు అండదండగా ఉంటానని నిరూపించింది. ఆదాయపు పన్ను మినహాయింపు భారీగా ఉంటుందని భావించిన ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లి పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సంపన్నులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. సామాన్యులకు అరకొరగా తాయిలాలు ప్రకటించి కంటికి కనిపించని రీతిలో భారాలు మోపే ప్రయత్నం కేంద్ర ఆర్థిక మంత్రి చేపట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. - సాక్షి నెట్ వర్క్ సబ్సిడీలు వద్దు.. ఎఫ్డీఐలు ముద్దు అన్నట్లుగా ఉంది.. ఎన్డీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్సిడీలు వద్దు.. ఎఫ్డీఐలు ముద్దు అన్న చందంగా ఉంది. సబ్సిడీలకు కోత వేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలకడం సిగ్గుచేటు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు బడ్జెట్లో అరకొరగా కేటాయించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదు. పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది. పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు. మొత్తానికి బడ్జెట్ చూస్తే బీమా రంగంలోని, రక్షణ రంగంలోనికి ఎఫ్డీఐలు ప్రవేశించేలా చేశారు. ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేశారు. - ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. గంగా, కావేరి అనుసంధానానికి సంబంధించి కెఎల్రావు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేవలం రూ.100 కోట్లు కేటాయించడం అత్యంత దారుణం. కొత్త యూనివర్సిటీలు ఏవీ రాలేదు సరికదా.. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన గానీ, రుణమాఫీ అంశం గానీ పొందుపరచలేదు. చేనేతకు ప్రత్యేక ప్యాకేజి లేదు. ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. గత రైల్వే బడ్జెట్లో కూడా రాయలసీమకు కొత్త రైళ్లు ఇవ్వలేదు. - ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే. సామాన్యులను విస్మరించారు.. బడ్జెట్లో సామాన్యులను విస్మరించారు. రక్షణ రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించారు. పేదలకు సబ్సిడీలు కుదించి పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించారు. ప్రజల కొనుగోలు శక్తి లేకపోవడం వలన ఆర్థిక వృద్దిరేటు సన్నగిల్లుతుంది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి భారతదేశానికి తెప్పించాలి. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించలేదు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తగినన్నీ నిధులు కేటాయించలేదు. - రవిశంకర్రెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి ప్రజల బడ్జెట్... ఇది ప్రజల బడ్జెట్. బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్తో ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. అలాగే ఏపీకి కేంద్రానికి సంబంధించిన వ్యవసాయ తదితర విద్యాలయాలను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. - అల్లపురెడ్డి హరినాథరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు ధనికులకు మేలు చేసేవిధంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేమీలేదు. నిత్యావసరధరలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటితోపాటే నిత్యావసర ధరలు కూడా పైపైకి పోతున్నాయి. పోలవరం, ప్రత్యేక ప్రతిపత్తి వంటి వాటిపై స్పష్టమైన హామీలు ఇవ్వలేదు. - కె. సురేష్బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మంచి బడ్జెట్ బిజెపి ప్రభుత్వం మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతను కల్పించింది. పారిశ్రామిక, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి సముచిత స్థానాన్ని కల్పించింది. ఉద్యోగులకు మేలును చేకూర్చారు. ఈ బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్కు ఎంతో లబ్ధి చేకూరుతుంది. - లింగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు. ‘సీమ’కు నిరాశే మిగిలింది ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొట్టమొదటి బడ్జెట్ రాయలసీమ వాసులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. యువత నైపుణ్యాలను పెంచే ‘స్కిల్ ఇండియా’ పథకాన్ని బడ్జెట్లో ప్రకటించినా, దాని అమలుకు నిధుల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అలాగే ఉపయోగపడే పథకాలకు అరకొర నిధులు మాత్రమే కేటాయించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మోడీ ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేసింది. - ఎమ్మెల్సీ గేయానంద్ సామాన్యులకు పెనుభారం.. బిజెపి సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేది శూన్యం. మోడీ అధికారంలోకి వస్తే ఏపికి సపోర్టుగా నిలుస్తాం అన్నారు. కానీ రైల్వేబడ్జెట్లో గానీ, ఈ బడ్జెట్లోగానీ న్యాయం చేయలేదు. మొత్తం మీద ఇది సామాన్యులకు పెను భారం, సంపన్నులకు అనుకూలంగా ఉంది. - పి. రవీంద్రనాథ్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కాంగ్రెస్ విధానాలనే కొనసాగించారు ఈ బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్ విధానాలనే కొనసాగించారు. ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రైతుల మద్దతు ధర కల్పించడానికి కేవలం రూ. 500 కోట్లు కేటాయించడం దారుణం. కీలకమైన రక్షణ, ఆర్ధిక రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా మన సార్వభౌమత్వానికి నష్టం చేకూరుస్తున్నారు. ఇది కార్పొరేట్లకు, ధనికులకు మాత్రమే ఉపయోగపడే బడ్జెట్. - బి. నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి బంగారం ధర పెరిగింది .. కేంద్ర బడ్జెట్లో బంగారంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కారణంగా గురువారం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.28వేల నుంచి రూ.28,700-రూ.29,000 వరకు చేరింది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. -బుశెట్టి రామ్మోహన్రావు, ప్రముఖ వ్యాపారి , ప్రొద్దుటూరు మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు.. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిత్యావసర ధరలను తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ధరలకు కళ్లెం వేయకుండా సామాన్యులకు ఒరగబెట్టేది ఏమీ లేదు. రైల్వే బడ్జెట్లో మాదిరిగానే ఈ బడ్జెట్లో సైతం జిల్లాకు ఏ విధమైన మేలు జరగలేదు - చక్రాంతం శ్రీహరిగణేష్, కడప ఆదాయపన్ను పరిమితి ఆశించిన స్థాయిలో లేదు.. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని ఆశించిన స్థాయిలో పెంచలేదు. నాలుగు లక్షల వరకు పరిమితి విధిస్తారని పత్రికల్లో సైతం కథనాలు వచ్చాయి. ఉద్యో గ, ఉపాధ్యాయులు కూడా కనీసం రూ.3 లక్షల వరకైనా ఉంటుందని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.2.5లక్షలకు పరిమితం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వాలతో పోరాడి పీఆర్సీ ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేలా కృషి చేస్తుండగా మరో వైపు ప్రభుత్వం ఈ విధంగా పన్ను వసూలు చేస్తోంది. - ఏ.నరసింహారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రొద్దుటూరు అంకెల గారడీ చేశారు.. బడ్జెట్ ద్వారా బిజెపి ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. మార్కెట్ అంచనాలను ఇది ఏమాత్రం అందుకోలేక పోయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంతిస్తారో చెప్పలేదు. తెలుగుజాతికి చంద్రబాబు, మోడీ క్షమాపణ చెప్పాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు. రాష్ట్రానికి ఐఐటి, ఎయిమ్స్ ఇస్తామని ఇవ్వలేదు. - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు మంచి నిర్ణయం సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులకోసం ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. గతంలో ఉచిత టోల్ఫ్రీ నెంబరు ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించేది కాదు. ప్రత్యేక ఛానెల్ అమలైతే వ్యవసాయ రంగానికి ఎంతో ఊరట. - శ్రీనివాసులు(రైతు), పులివెందుల మధ్యతరగతి ప్రజలకు మేలు లేదు.. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరని బడ్జెట్. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాధారణంగా జీవించే ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యుడికి నిరాశే మిగిలింది. - శేఖర్ (స్థానికుడు), పులివెందుల భవిష్యత్తుపై ఆశ కల్పించేలా ఉంది సాధారణ బడ్జెట్ భవిష్యత్తు పట్ల ఆశ కల్పించేలా ఉంది. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించడం శుభపరిణామం. సబ్బులు వంటి ధరలను తగ్గించడం, ఆరోగ్యానికి హాని కలిగించే సిగిరేట్, గుట్కా వంటి పదార్థాల ధరలు పెంచడం మంచి నిర్ణయం. అన్ని రకాల ధరలు పెరిగినందున ఆదాయ పరిమితి రూ.3 లక్షలకు పెంచి ఉంటే బాగుండేది. రాజధాని ఏర్పాటు విషయంలో బడ్జెట్లో చర్చించి ఉండాల్సింది. - ఎస్వీ రమణరావు, ప్రొఫెసర్, రాజంపేట వేతన జీవులకు మొండిచెయ్యి.. నూతన ప్రభుత్వంలో ఆదాయపు పన్ను మినహాయింపు రూ. 5 లక్షల వరకు పెంచుతారనుకున్న వేతన జీవులకు ఈ బడ్జెట్ నిరాశను కలిగించింది. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పెంచినట్లు కనిపిస్తున్నా వాస్తవానికి రూ. 30 వేలు మాత్రమే పెంచారు. గతంలో రూ. 2.20 లక్షల వరకు వర్తించేదని అటువంటిది ఇప్పుడు 2.5 లక్షలు పెంచడం ద్వారా కేవలం 30వేలు మాత్రమే పెంచినట్లు అయింది. - ఉద్దండం జయరామయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నిరాశ కలిగించింది.. కొత్త ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో కొంత మేలు చేస్తుందని ఆశించాం. కానీ ఆదాయపు పన్ను మినహాయింపు కేవలం రూ. 30 వేలు మాత్రమే పెంచడం నిరాశ కలిగించింది. వృద్ధులకు రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం, పొదుపు రూ. 1 లక్ష నుంచి 1.50 లక్షలకు పెంచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మహిళా ఉద్యోగుల గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరం. - వెంకటశివారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఏపికి న్యాయం జరిగింది బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగింది. ఇదే తరహాలో ఇకపై ప్రవేశపెట్టే బడ్జెట్లు ఉంటాయని భావించవచ్చు. బడ్జెట్ ద్వారా ఏపికి అన్నిరంగాలలో తగిన మేరకు కేటాయింపులు జరిపారు. దీన్నిబట్టి రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా మారగలదని ఘంటాపథంగా చెప్పవచ్చు. - గోవర్ధన్రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు -
కొత్తగా 5 ఐఐటీలు, 5 ఐఐఎంలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఐదు ఐఐటీలు, మరో ఐదు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు తాజా బడ్జెట్లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్గఢ్, కేరళ, జమ్మూ, గోవా రాష్ట్రాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ )లను... అలాగే మహారాష్ర్ట, పంజాబ్, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ప్రాథమికంగా రూ. 500 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ప్రపంచస్థాయి ఉన్నత విద్యా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మధ్యప్రదేశ్లో జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హ్యుమానిటీస్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక విద్యా రంగానికి ఊతమిచ్చేలా ఈసారి రూ. 68,728 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11 శాతం అధికం. ఇందులో పాఠశాల విద్యకే అత్యధికంగా 51,828 కోట్లను వ్యయం చేయనుంది. ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో దేశంలోని అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. మొత్తంగా లక్ష మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల స్థితిగతులపై అధ్యయనానికి రూ. 30 కోట్లతో పాటు సర్వశిక్షా అభియాన్కు రూ. 28,635 కోట్లు, మాధ్యమిక్ శిక్షా అభియాన్కు రూ.4,966 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్కూళ్లలో కొత్త శిక్షణా పద్ధతులను అమలు చేసేందుకు, ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ కోర్సుల కోసం వర్చువల్ తరగతి గదుల ఏర్పాటుకు రూ.వంద కోట్లు వెచ్చించనున్నట్లు జైట్లీ తెలిపారు. కాగా, ఉన్నత విద్య కోసం సులువుగా రుణాలు తీసుకునేందుకు వీలుగా నిబంధనలను సరళతరం చేస్తామని కూడా చెప్పారు. -
కేంద్ర బడ్జెట్పై భిన్నాభిప్రాయూలు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లా వాసులు భిన్నాభిప్రా యూలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోయిందని, వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళానికి వ్యవసాయ యూనివర్సిటీ కేటయించాలని, పారిశ్రామిక కారిడార్ను విస్తరింపజేయూలని పలువురు పేర్కొనగా, బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా ఉంద ని, ఆయూ రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారంటూ మరికొందరు పెదవివిరిచారు. -సాక్షి, శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్కు మొండిచేయి నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్లో ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. మధ్యతరగతి కుటుంబీకులకు తీవ్ర అన్యాయం జరిగింది. - కలమట వెంకటరమణ, ఎమ్మెల్యే, పాతపట్నం బీజేపీ పాలిత రాష్ట్రాలకే మొగు ఎన్డీఏ ప్రభుత్వం తన పరిపాలనకు అనుకూలంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బీజేపీ పాలిత ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క అభివృద్ధి పనికి నిధులు కేటాయించలేదు. దీనివల్ల అభివృద్ధి పనులు జరగవు. రాష్ట్రానికి మొండియి చూపడం విచారకరం. - కంబాల జోగులు, ఎమ్మెల్యే, రాజాం ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. సీఎం చంద్రబాబునాయు డు సూచనల మేరకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించా రు. నీటి పారుదలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించడం, ధరల స్థిరీకరణకు రూ. 500 కోట్లు కేటాయించడం హర్షణీయం. -కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మికశాఖ మంత్రి పదలకు నిరాశే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పేదలకు ప్రయోజనం చేకూర్చే రీతిలో లేదు. సాధారణ వస్తువులపై ధరాఘాతం పడింది. సబ్సిడీలు అంతంతమాత్రమే. రైతులకు కల్పించే రాయితీలను ఎత్తేసేందుకు నిర్ణరుుంచడం దారుణం. మొత్తం మీద నిరాశాజనకం. - విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే జిల్లాకు ప్రాధాన్యంలేదు అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన శ్రీకాకుళంకు పారిశ్రామిక కారిడార్లో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అభివృద్ధి దిశలో ఉన్న జిల్లాలకే అన్నివనరులు కేటయించారు. బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్ వల్ల జిల్లాకు ఒరిగింది ఏమీలేదు. -కె.రామ్మూర్తి, ఉపాధ్యాయుడు సామాన్యుడికి అందుబాటులో... బడ్జెట్ సామాన్యుడికి అందుబాటులో ఉంది. గ్రామీణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులకు ప్రాధాన్యం కల్పిస్తూ పలు కేటాయింపులు చేయడం హర్షణీయం. తాగునీరు, గృహ, విద్యుత్, సదుపాయూల కల్పనకు పెద్దపీట వేశారు. - పైడి వేణుగోపాలం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్మార్ట్సిటీ కింద రాజధానిని అభివృద్ధి చేయాలి కేంద్రం పలు పట్టణాలను స్మార్ట్సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర రాజిధాని కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి పట్టణాలను స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి చేయాలి. ప్రగతికి బాటలు వేయూలి. - గొర్లె కిరణ్ కుమార్, వైఎస్సార్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ కర్త అందుబాటులో లేదు నిత్యవసర ధరలు స్థిరీకరణపై అరుణ్జైట్లీ బడ్జెట్లో ఎటుంటి చర్యలు చేపట్టే దిశగా ప్రకటన చేయకపోవడంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండ పోయింది.గత ప్రభుత్వ బడ్జెట్కి ఈ బడ్జెట్కు తేడా మరేముంది. - పిసిని లక్ష్మణమూర్తి, హోమియో వైద్య సహాయకుడు, పాతపట్నం ఏన్డీఏ ప్రభుత్వానికి అనుకూలం కేంద్ర బడ్జెట్ ఎన్డీ ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. నిర్మాణాత్మకమైన విధానాన్ని అవలంభిస్తూ అన్ని వర్గాలవారికి ఉపయోగపడేలా ఉంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ పెరిగి ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరగడం, తద్వారా ఖర్చుపెరిగి జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. -పొట్టా సత్యనారాయణగుప్త, సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్, రాజాం విలాస వస్తువులపై పన్నుపెంచితే బాగుండేది బడ్జెట్లో విలాస వస్తువులపై పన్ను పెంచితే బాగుండేది. అన్ని దుస్తులపై పన్ను తగ్గించడం మంచిదే అరుునా బ్రాండెడ్ దుస్తులకు పన్ను త గ్గించకపోతే సరిపోయేది. ఆదాయపు పన్ను పరిమితి రూ. 4 నుంచి 5 లక్షలకు పెంచితే బాగుండేది. - అల్లాడ సత్యనారాయణ, సీనియర్ అడ్వకేట్, ఇచ్ఛాపురం -
మెరుపుల్లేవ్.. మరకలూ లేవ్
సాదాసీదాగా మోడీ సర్కారు తొలి బడ్జెట్ శాయశక్తులా చాణక్యం ప్రదర్శించిన జైట్లీ ‘నొప్పింపక, తానొవ్వక’ రీతిలో గణాంక గారడీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధి పెంపు తగ్గిన రోజువారీ వినియోగ వస్తువుల ధరలు సిగరెట్లు, కూల్డ్రింక్స్ తదితరాలపై బాదుడు యూపీఏ ఫ్లాగ్షిప్ పథకాల కొనసాగింపు దేశీ, విదేశీ పెట్టుబడుల సాధనే లక్ష్యమన్న జైట్లీ న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి బడ్జెట్ ఫర్వాలేదనిపించింది. వహ్వా అన్పించే రీతిలో జనాకర్షక విన్యాసాలు గానీ, మెరుపులు గానీ లేవు. అలాగని జనంపై మోయలేని భారాలూమోపలేదు. నొప్పింపక, తానొవ్వక అన్న రీతిలో చేతనైన మేరకు చాణక్యం చూపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి సాధారణ బడ్జెట్ను గురువారం ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కనీస మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచడమే గాక దానికి మరిన్ని పన్ను మినహాయింపు లనూ జోడించి మధ్యతరగతి వర్గాన్ని కాస్తంత మురిపించారు. అగ్గిపెట్టెలు మొదలుకుని టీవీలు, కంప్యూటర్ల దాకా పలు రకాలైన రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాలను ఓ మేరకు తగ్గించారు. అదే సమయంలో సిగరెట్ల నుంచి శీతల పానీయాల దాకా పలు ఉత్పత్తులపై ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో పన్నుల మోత మోగించారు. చీటికీమాటికీ పన్ను విధానాలను మార్చబోమనే హామీతో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపారు. పన్ను చట్టాలకు ‘గతం నుంచి అమల్లోకి వచ్చేలా’ (రెట్రాస్పెక్టివ్) సవరణలు చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటామంటూ వారికి హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్తిస్థాయిలో పట్టాలకెక్కించేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకున్నట్టు బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం పీటీఐ వార్తా సంస్థతో జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని పట్టాలకెక్కిస్తామన్నారు. వస్తువులు, సేవల పన్ను విధివిధానాలను కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పథకాల కొనసాగింపు... యూపీఏ హయాంలో మొదలైన జాతీయ ఉపాధి హామీ తదితర ఫ్లాగ్షిప్ పథకాలను మోడీ సర్కారు యథాతథంగా కొనసాగించింది. వాటిలో కొన్ని పథకాలకు నిధులను తగ్గించగా మరికొన్నింటికి యథాతథంగా కొనసాగించింది. వ్యవసాయ రంగానికి తమ సర్కారు ప్రాధాన్యమిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్లతో డీడీ కిసాన్ చానల్ను ప్రకటించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ తరహా సంస్థలను ప్రకటించారు. గ్రామీణ భారతాన్ని ఆధునిక బాట పట్టిస్తామన్నారు. ఇందుకోసం డిజిటల్ ఇండియా వంటి పలు పథకాలు ప్రకటించారు. చిన్న మొత్తాల పొదుపును ఇతోధికంగా ప్రోత్సహిస్తాం. కిసాన్ వికాస్ పత్రాలను మళ్లీ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మోడీ కలల ప్రాజెక్టు గంగా నది ప్రక్షాళనకు పెద్ద పీట వేశారు. అందరికీ ఆరోగ్యమే సర్కారు లక్ష్యమన్నారు. పెరిగిన ప్రణాళికా వ్యయం మొత్తం రూ.17,94,892 కోట్లతో కూడిన 2014-15 బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం రూ.12,19,892 కోట్లుగా ఉండొచ్చని జైట్లీ అంచనా వేశారు. అయితే ప్రణాళికా వ్యయం వాటా గతంతో పోలిస్తే 26 శాతం పెరిగి రూ.5.75 లక్షల కోట్లకు చేరింది. ఇది సానుకూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి తమ సర్కారు పెంచుతోందని మంత్రి చెప్పారు. కాకపోతే ఆయా రంగాలు పూర్తిగా స్వదేశీ నిర్వహణ, నియంత్రణలోనే కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో రూ.2.29 లక్షల కోట్లు (గత కేటాయింపులతో పోలిస్తే 12.5 శాతం అధికం) కేటాయించారు. స్థూల పన్ను వసూళ్లను రూ.13,64,524 కోట్లుగా అంచనా వేశారు. ‘‘ఇందులో కేంద్రం వాటా రూ.9,77,258 కోట్లు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.2,12,505 కోట్లుగా ఉండవచ్చు’’ అని మంత్రి అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.1 శాతం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అది 2015-16లో 3.6 శాతం, 2016-17లో 3 శాతానికి పరిమితమవుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ద్వారా రూ.22,200 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోనున్నామని, అదే సమయంలో పరోక్ష పన్ను ప్రతిపాదనలు రూ.7,525 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెట్టనున్నాయని తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 45 రోజులే అయింది. గత ప్రభుత్వం విధించుకున్న లక్ష్యాల కారణంగా తలెత్తిన పరిమితులకు లోబడి, ఈ స్వల్ప కాలంలో మేం చేయగలిగిందంతా చేశాం’’ అని చెప్పుకొచ్చారు. సబ్సిడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో అణగారిన, బలహీనవర్గాల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సబ్సిడీ సంస్కరణలను పరిశీలించేందుకు వ్యయ నిర్వహణ కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సకాలంలో విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే వరుసగా రెండేళ్ల పాటు ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం కంటే దిగువకు పడిపోయిందంటూ యూపీఏ ప్రభుత్వాన్ని జైట్లీ విమర్శించారు. రూ.6 లక్షల కోట్ల అప్పులు తెస్తాం: జైట్లీ ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి, గత రుణాలను తీర్చడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 లక్షల కోట్ల దాకా రుణాలను సేకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గతేడాది ఇది రూ.5.63 లక్షల కోట్లు. గత రుణాలు, వడ్డీల చెల్లింపులకు పోను నికరంగా రూ.4,61,204 కోట్ల రుణాలను సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. 2013-14తో పోలిస్తే ఇది రూ.7,700 కోట్లు తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ.3.68 లక్షల కోట్ల రుణాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 24 పైసలు మార్కెట్ నుంచి అప్పు రూపంలోనే సమకూరనుంది. ఇందులో 20 పైసలు వడ్డీల చెల్లింపుకే వెళ్తుంది. కేంద్ర ప్రణాళికా కేటాయింపులు ప్రతి రూపాయిలో 21 నుంచి 11 పైసలకు తగ్గాయి. నిరుడు 18 పైసలు న్న వడ్డీ చెల్లింపులు 20 పైసలకు పెరుగుతాయి. ఇది సవాలే.. అధిగమిస్తాం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, మందగమనంతో కూడిన వృద్ధి నిజంగా సవాళ్లేనని జైట్లీ అన్నారు. ఈ పరిస్థితిని అధిగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఆశించిన వృద్ధి, అల్ప ద్రవ్యోల్బణం, రంగాలవారీగా అభిలషణీయ సమతౌల్యం, సమర్థమైన విధాన వైఖరులతో కూడిన వ్యవస్థను నెలకొల్పుతాం’ అని ప్రకటించారు. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ, ఉపాధి కల్పన దిశగా బడ్జెట్లో ఎన్నో చర్యలు తీసుకున్నామ న్నారు. హైవేల ఆధునీకరణకు రూ.38 వేల కోట్లు వెచ్చించనుండటానికి ఇదో కారణమన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఆర్ఈఐటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్లకు రూపకల్పన చేసి పన్ను రాయితీలు కల్పిస్తున్నామని అన్నారు. -
జైట్లీసారూ! ఇదేం తీరు..!
శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి పదేళ్లకోసారి జరిపే లెక్కల్లో లక్షల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోంది. జనాభా నియంత్రణపై ప్రభుత్వం అలక్ష్యం చేయడం, ప్రజల్లో అవగాహన కొరవడడమే జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల తగ్గుతున్నా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం జీవనమే కష్టమైన రోజుల్లో కూడా సంచార జాతుల్లో అవగాహన లేమి జనాభా పెరగుదలకు కారణమవుతోంది. జనాభాలో జిల్లా పరిస్థితి... జిల్లాలో జనాభా రోజురోజుకూ పెరుగుతోందనడానికి జనాభా లెక్కలే ప్రామాణికం. 1991 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 23,21,126 మంది కాగా, 2001లో 25,37,593 మంది, 2011 జనాభా లెక్కల ప్రకారం 27,03,114 గా నమోదైంది. వృద్ధిరేటు దాదాపు 19 శాతం వరకు ఉంది. ఇందులో పురుషులు 13,41,738 కాగా, మహిళలు 13,61,376 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం కుటుంబాలు పట్టణ ప్రాంత ంలో 1,08,948, రూరల్లో 5,72,382, మొత్తంగా 6,81,330 కుటుంబాలున్నాయి. దేశాలనే అధిగమించేశాం... ప్రస్తుతం జిల్లా జనాభా ప్రపంచంలోని ఖతర్, బ్రూనే, నమీబియూ వంటి సుమారు 50 చిన్నదేశాలకంటే అధికం. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా నమ్మాల్సిన నిజం. దక్షిణ తూర్పు ఆసియాలోని బ్రూనై దేశంలో 3,93,162 మంది జనాభా ఉండగా, ఆఫ్రికా ఖండంలో నమీబియాలో 23,24,004 మంది, సౌదీ అరేబియాకు దగ్గరలో ఉండే ఖతర్ దేశంలో 18,70,041 మంది జనాభా ఉన్నారు. నియంత్రణలో అలక్ష్యం వాస్తవంగా కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తే జనాభా తగ్గుతుంది. అరుుతే, దీనిపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం జనాభా పెరుగుదలకు కారణమవుతోంది. 2001 నుంచి ఏటా సగటున 19,000 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయూలని లక్ష్యం కాగా ఏనాడూ లక్ష్యాలకు చేరుకోలేదు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నలుగురు నుంచి ఐదుగురు పిల్లలకు జన్మనిస్తున్నా పట్టించుకునేవారే లేరు. వారిలో చైతన్యం నింపేవారే కరువయ్యూరు. జిల్లా వెనుకబాటు తనం, సంచార జాతులు అధికంగా ఉండం, నిరక్ష్యరాస్యత తదితర అంశాలు జనాభాను ప్రోత్సహిస్తున్నారుు. ఇలా చేయాలి.. శతశాతం అక్షరాస్యత జిల్లాగా మార్చాలి. జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్ధాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించాలి. వారిని అవగాహన కల్పిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటుచేయాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లల వల్ల కలిగే లాభాలపై ప్రచారం చేయూలి. చైతన్యవంతం చేయూలి. చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. సంచార జాతుల్లో అవగాహన కల్పించాలి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలను ప్రోత్సహించాలి. ఒక బిడ్డతో శస్త్రచికిత్స చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు పెంచాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది జనాభా నియంత్రణ కోరేవారి అభిప్రాయం. -
భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్
1947 ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? ఆ వివరాలు తెలుసుకుందామా.. (అంకెలు రూ.కోట్లలో) మంత్రి: ఆర్కే షణ్ముగం చెట్టి, తేదీ: 1947, నవంబర్ 26 రెవెన్యూ అంచనా: 171.15 రెవెన్యూ వ్యయం: 197.39 రెవెన్యూ లోటు: 26.24 రక్షణశాఖకు: 92.74 ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: 119 కస్టమ్స్ ఆదాయం: 50.5 ఫారెక్స్ నిల్వలు: 1,547 గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్ను జాన్ మతాయ్ 1950 ఫిబ్రవరి 28న సభలో ప్రవేశపెట్టారు. -
సబ్సిడీ పెంపు స్వల్పమే.
ఎరువులకు పెంపు... పెట్రోలియానికి తగ్గింపు న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తాజా బడ్జెట్లో సబ్సిడీ బిల్లును స్వల్పంగా పెంచి రూ. 2.60 లక్షల కోట్లు కేటాయించారు. అయితే.. ఆహార, ఇంధన, ఎరువులకు కేటాయిస్తున్న సబ్సిడీలు లబ్ధిదారులకు మరింత ఖచ్చితత్వంతో చేరేలా సబ్సిడీ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని.. ఈ క్రమంలో పేద, అణగారిన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. కొత్త ఎరువుల విధానాన్నీ రూపొందిస్తామని చెప్పారు. సబ్సిడీ బిల్లు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు రూ. 2,55,516.00 కోట్లుగా ఉండగా.. దానిని 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,60,658 కోట్లకు పెం చారు. ఈ ఏడాది ఎరువుల రంగానికి కేటాయింపులు పెంచటం వల్ల సబ్సిడీ బిల్లు మొత్తంగా పెరిగింది. మధ్యం తర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ. 67,970 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్లో దానిని రూ. 72,970.30 కోట్లకు పెంచారు. ఇందులో దిగుమతి చేసుకున్న ఎరువులకు (యూరియా) రూ. 12,300 కోట్లు, దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎరువులకు (యూరియా) రూ. 36,000 కోట్లు, ఫాస్ఫేట్, పొటాసియం వంటి ఎరువుల విక్రయానికి రూ. 24,670.30 కోట్లు చొప్పున కేటాయించారు. ఆహార భద్రతకు రూ. 88,500 కోట్లు ఇక ఆహార సబ్సిడీ కింద మధ్యంతర బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ. 1,15,000 కోట్లనే యథాతథంగా ప్రతిపాదించారు. గత ప్రభుత్వమే ఆహార భద్రత చట్టం అమలులోకి తెచ్చిన నేపధ్యంలో ఆహార సబ్సిడీని గత ఆర్థిక సంవత్సరం కన్నా మధ్యంతర బడ్జెట్లో భారీగా రూ. 23,000 కోట్లు పెంచింది. మొత్తం ఆహార సబ్సిడీ బిల్లులో జాతీయ ఆహార భధ్రత చట్టం అమలు కోసం రూ. 88,500 కోట్లు కేటాయిం చారు. ఆహార భద్రత చట్టం అమలు గడువును మరో మూడు నెలలు పొడిగించి ఈ ఏడాది సెప్టెంబర్గా నిర్ణయించారు. ఇక ఇంధనం, ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్లను వాస్తవ ధరకన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అందించే పెట్రోలియం సబ్సిడీ రూ. 63,426.95 కోట్లుగా జైట్లీ ప్రతిపాదించారు. గత ఏడాది పెట్రోలియం సబ్సిడీ సవరించిన అంచనాలు రూ. 85,480 కోట్ల కన్నా తగ్గింది. మొత్తం మీద సబ్సిడీ బిల్లులో పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. అది ఈ ఆర్థిక సంవ్సరంలో ద్రవ్యలోటుపై ప్రభావం చూపనుంది. -
తెలంగాణకు రిక్తహస్తమే..!
ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదాపై ప్రకటన కరువు హామీలు గాలి కొదిలేశారు...! విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ... గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్తో ఎన్టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్లో రాలేదు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తాన్నే చూపింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో కేవలం ఒక్క ఉద్యానవన యూనివర్సిటీ మినహా ఏ ఇతర హామీని కేంద్రం తన బడ్జెట్లో ప్రకటించలేదు. గిరిజన యూనివర్సిటీపై నామమాత్రపు ప్రస్తావన కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఎలాంటి హామీ దక్కలేదు. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే ప్రకటన మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ను హైదరాబాద్కు మంజూరు చేసినా దానివల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు. ప్రాణహిత-చేవెళ్లకు ఏదీ జాతీయ హోదా! ప్రాణహిత- చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించారని కూడా వారు ప్రకటించారు. అయితే, బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించలేదు. అంతేకాకుండా రాష్ట్రానికో ఎయిమ్స్ అని హామీ ఇచ్చినా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఎయిమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ లేదు. హామీలు గాలి కొదిలేశారు...! విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ... గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్తో ఎన్టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్లో రాలేదు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు. నిరాశ కలిగించింది: సీఎం కేసీఆర్ బడ్జెట్లో రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ మినహా మరేది కొత్తగా కేటాయించకపోవడం సరికాదు. అది కూడా రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందే. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంతో కోరాం. అయినా న్యాయం చేయలేదు. పునర్విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా నిరాశ కలిగించింది. -
గంగా నది పరిరక్షణకు రూ. 2,037 కోట్లు
న్యూఢిల్లీ: గంగా నది పరిరక్షణకు ఓ సమీకృత పథకాన్ని కేంద్ర ప్రభుత ్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్లో రూ. 2,037 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు భారీగా నిధులు వెచ్చించినప్పటికీ గంగా నది పరిరక్షణ కార్యక్రమం ముందుకు సాగడం లేదని, ఇందుకు తగిన కృషి జరగకపోవడమే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అభిప్రాయపడ్డారు. అందుకే ‘నమామి గంగా’ పేరుతో గంగా కన్సర్వేషన్ మిషన్ను చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే గంగా పరిరక్షణకు ఉత్సాహం చూపుతున్న ఎన్ఆర్ఐలను ప్రోత్సహించేందుకు ‘ఎన్ఆర్ఐ ఫండ్ ఫర్ గంగా’ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక కేదార్నాథ్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని నదీ తీరాల అభివృద్ధి, అక్కడి పవిత్ర ఘాట్ల సుందరీకరణ కోసం రూ. వంద కోట్లు కేటాయించారు. వాటిలో చారిత్రక వారసత్వం ఇమిడి ఉందని ఈ సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు. అలాగే గంగా నదిని జల రవాణాకు అనువుగా అభివృద్ధి పరచనున్నట్లు ప్రకటించారు. కార్గో రవాణాకు వీలుగా మార్చేందుకు రూ. 4,200 కోట్లు కేటాయించారు. దీంతో ‘జల్ మార్గ్ వికాస్’ పేరిట తొలి దశలో అలహాబాద్-హల్దియా(1620 కిలోమీటర్లు) మధ్య 1500 టన్నుల బరువైన నౌకలు ప్రయాణించేలా జల మార్గం ఆరేళ్లలో అందుబాటులోకి రానుంది. మరోవైపు నదుల అనుసంధానం ద్వారా జల వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రాజెక్టును రూపొందిండంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం సత్వరమే సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా బడ్జెట్లో రూ. వంద కోట్లు కేటాయించింది. 4. -
మోడీ ‘మైనారిటీ’ మంత్రం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మదర్సాల ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటారుుంచింది. సంప్రదాయ కళల్లో మైనారిటీల నైపుణ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.3,734.01 కోట్ల బడ్జెట్ కేటారుుంచింది. ఇది గత ఏడాది బడ్జెట్తో పోల్చుకుంటే 5.75% అధికం. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం రూ.3,530.98 కోట్లు కేటారుుంచింది. కాగా మదర్సాల ఆధునీకరణ కోసం పాఠశాల విద్యా శాఖకు అదనంగా రూ.100 కోట్లు కేటారుుస్తున్నట్టు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. బాలికా శిశు రక్షణకు కొత్త పథకం దేశంలో బాలికలు, ఆడ శిశువులపై నిర్లక్ష్యం, వివక్షను రూపుమాపడానికి రూ.100 కోట్లతో కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పఢావో యోజన’ను ప్రకటించింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశం దూసుకుపోతున్నా.. ఆడ శిశువులు, మహిళలపై వివక్ష కొనసాగుతుండడం సిగ్గుపడాల్సిన అంశమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈసారి బడ్జెట్లో స్త్రీ,శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖకు రూ. 21,100 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం ఒక ప్రత్యేక చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. ‘బేటీ బచావో...’ పథకంలో భాగంగా ఆడ శిశువులు, బాలికలపై వివక్షను రూపుమాపడం, వారి రక్షణపై దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఇక పెద్ద నగరాల్లో మహిళలకు మరింత భద్రత నిమిత్తం రూ. 150 కోట్లు, ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల భద్రత కోసం రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతోపాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యాచార బాధితుల కోసం ‘సంక్షోభ నివారణ కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని, ఇందుకు ‘నిర్భయ నిధి’ నుంచి కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. గిరిజన సంక్షేమం కింద ఎస్టీ పిల్లల విద్యా పథకానికి రూ.1,058 కోట్లు, వన బంధు కల్యాణ్ యోజనకు గాను రూ.100 కోట్లు గిరిజన వ్యవహారాల శాఖకు కేటారుుంచారు. ఇలా ఉండగా ఎస్పీ ప్రణాళిక కింద రూ.50,548 కోట్లు, టీఎస్పీ కింద రూ.32,387 కోట్లు ప్రతిపాదించారు. ‘అన్క్లెయిమ్డ్’ సొమ్ము వృద్ధులకు... సేవింగ్స్ స్కీముల్లో ‘అన్క్లెయిమ్డ్’ పేరిట మూలుగుతున్న భారీ మొత్తంలోని సొమ్మును ప్రత్యేకంగా వృద్ధుల(సీనియర్ సిటిజన్స్) సంక్షేమం కోసం వినియోగించనున్నట్టు జైట్లీ తెలిపారు. వివిధ పథకాల కింద పొదుపు చేసుకున్న వృద్ధులు మరణించిన సందర్భాల్లో.. చెల్లింపులకు సంబంధించి తగిన మార్గదర్శకాలకోసం వేచిచూస్తూ ఆ మొత్తా లు ‘అన్క్లెయిమ్డ్’ కింద మిగిలిపోతున్నాయన్నారు. ఈ సొమ్మును వృద్ధుల రక్షణకు, వారి ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఎలా ఉపయోగించవచ్చో సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
మరో హరిత విప్లవం తెస్తాం
సాగులో ఆధునిక పరిజ్ఞానానికి, యాంత్రీకరణకు పెద్దపీట బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటన న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా నూతన ప్రణాళికను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తన బడ్జెట్లో పొందుపరిచారు. ఇందులో సాగును యాంత్రీకరణ దిశగా నడిపించి పంట దిగుమతులు పెంచేందుకు పలు కార్యక్రమాలను ప్రకటించారు. మొత్తమ్మీద వ్యవసాయ రంగానికి జవసత్వాలు అందించి 4 శాతం వృద్ధిని సాధిస్తామని, రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతామని తెలిపారు. బీడుగా పడి ఉన్న భూములను వ్యవసాయానికి అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు, భూసార పరిరక్షణ, పరిశోధన కార్యక్రమాలకు బడ్జెట్లో రూ.7,500 కోట్లు కేటాయించారు. అలాగే పంటలను నిల్వ చేసేందుకు శాస్త్రీయ పద్ధతిలో పెద్దఎత్తున గోదాములను అభివృద్ధి చేస్తామని, ఇందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)లో సమూల మార్పులు తీసుకువస్తామని, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. మార్కెట్లో పంటల ధరలు తగ్గిపోయినప్పుడు రైతులను ఆదుకునేందుకు ‘ధరల స్థిరీకరణ నిధి’ కింద రూ.500 కోట్లు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించినా దీనిపై వ్యవసాయరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ నిధి దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఏ మూలకు సరిపోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంకుల ద్వారా రైతులకు రూ.8 లక్షల కోట్ల రుణాలు ఇప్పిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. కిందటేడాది యూపీఏ సర్కారు తన బడ్జెట్లో రైతులకు రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇప్పిస్తామని చెప్పగా.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల రుణాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ పథకాన్ని కొనసాగిస్తామని జైట్లీ పేర్కొన్నారు. దానికితోడు రూ.5 వేల కోట్ల కార్పస్ ఫండ్తో గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రుణాలు అందిస్తామని వెల్లడించారు. ‘‘సాగును లాభసాటిగా మార్చేందుకు, ఇతర రంగాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తక్షణమే ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది. అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి’’ అని జైట్లీ తన ప్రసంగంలో చెప్పారు. వ్యవసాయానికి కేటాయించిన రూ.7,500 కోట్లలో రూ.వెయ్యి కోట్లను ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ పథకానికి ఇచ్చారు. ఈ పథకం కింద బీడు భూములను అభివృద్ధి చేయనున్నారు. ఇక రెండు రాష్ట్రాలుగా అవతరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా వ్యవసాయ విద్యా సంస్థలను నెలకొల్పుతామని ప్రకటించారు. బడ్జెట్ బాగుంది: నాబార్డ్ బడ్జెట్ బాగుందని నాబార్డ్(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) చైర్మన్ హెచ్కే భన్వాలా పేర్కొన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారన్నారు. బడ్జెట్లో సాగుకు కేంద్రం ఇచ్చిందేమిటంటే.. ► ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, హర్యానాలో ఉద్యాన వర్సిటీని నెలకొల్పుతాం. ఇందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నాం. హా భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) తరహాలో అస్సాం, జార్ఖండ్లలో రాష్ట్రానికి ఒకటి చొప్పున రూ.100 కోట్లతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తాం. ► రూ.100 కోట్లతో అగ్రి-టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ఏర్పాటు చేస్తాం. ► సాగుభూమి లేని 5 లక్షల కౌలు రైతుల బృందాలకు నాబార్డ్ ద్వారా ఆర్థికసాయం అందజేస్తాం. రైతులకు రుణాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు సహకార బ్యాంకులకు నాబార్డ్ ద్వారా విడతల వారీగా రూ.50 వేల కోట్లు అందిస్తాం. ► భూసార పరిరక్షణకు పెద్దపీట వేస్తాం. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. భూసారానికి సంబంధించి రైతులందరికీ ప్రత్యేక కార్డులు అందజేస్తాం. రూ.56 కోట్లు వెచ్చించి దేశవ్యాప్తంగా మరో 100 సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ► వర్షాభావ పరిస్థితుల్లో పంటల దిగుబడులు తగ్గిపోయినా ప్రజాపంపిణీ ద్వారా సరుకులను అందజేస్తాం. ► విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త యూరియా విధానాన్ని తీసుకువస్తాం. ► దేశీయ పాడి పశువుల అభివృద్ధికి రూ.50 కోట్లు వెచ్చిస్తాం. మత్స్యసంపద పెంచేందుకు మరో రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం. రైతన్నల కోసం ‘టీవీ-కిసాన్’ న్యూఢిల్లీ: ఆరుగాలం శ్రమించే అన్నదాతల కోసం ‘టీవీ-కిసాన్’ పేరిట 24 గంటల టీవీ చానల్ను ఈ సంవత్సరమే ప్రారంభించనున్నారు. దీని ఏర్పాటుకుగాను బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించారు. కిసాన్ టీవీలో.. వ్యవసాయ సంబంధిత సమాచారం, పంటల మెళకువలు, సాంకేతిక, పర్యావరణ పరిజ్ఞానం, జల వినియోగం, వాతావరణ పరిస్థితులు వంటివి 24 గంటలూ ప్రసారం కానున్నాయి. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ‘అరుణ ప్రభ’ పేరుతో మరో 24 గంటల టీవీ చానల్ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కాగా, కమ్యూనిటీ రేడియోను పరిపుష్టం చేసేందుకు రూ.100 కోట్లతో 600 కొత్త రేడియో స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. సమాచార, ప్రసార శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ. 3,316 కోట్లు కేటాయించింది. నూనె చెక్కలపై సుంకం రద్దు పశువులు, కోళ్లకు దాణాగా ఉపయోగించే తెలగపిండి వంటి నూనె చెక్కలపై ప్రస్తుతమున్న 15 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ చెక్కలపై సుంకం వసూలు చేయబోమన్నారు. ఈ చర్యతో దాణా ధరలు దిగొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. యూరియూ వినియోగానికి కళ్లెం! న్యూఢిల్లీ: యూరియూ అధిక వినియోగానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యూరియూ విధానానికి రూపకల్పన చేయనుంది. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం యూరియూ.. ఉత్పత్తి ఆధారిత సబ్సిడీ (పీబీఎస్) విధానంలో ప్రతి టన్ను యూరియూకు రైతులు గరిష్ట స్థిర చార్జీ రూ.5,360 మాత్రమే చెల్లిస్తుండటం, ప్రభుత్వం సబ్సిడీ కింద టన్నుకు రూ.11,760 చొప్పున చెల్లిస్తుండటంతో భారీగా నిధులు వృథా అవుతున్నట్లు ఆర్ధిక సర్వే వెల్లడించిన నేపథ్యంలో కొత్త యూరియూ విధానానికి కేంద్రం రూపకల్పన చేయనున్నట్టు జైట్లీ తెలిపారు. వివిధ రకాల ఎరువుల వినియోగంలో సమతూకం లోపించడం వల్ల భూసారం తగ్గుతుండటంపై కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు జైట్లీ తన ప్రసంగంలో చెప్పారు. పొలాలకు ప్రత్యేక ‘పవర్’ న్యూఢిల్లీ: వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు గుజరాత్లో అనుసరిస్తున్న విధానాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్తు మౌలిక వసతులను వేరు చేసేందుకు బడ్జెట్లో కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు ఫీడర్లను వేరు చేసేందుకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన’ పథకం కింద నిధులు ఇచ్చారు. గ్రామాల్లో విద్యుత్తు లైన్లు, సబ్-ట్రాన్స్మిషన్, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం దీని లక్ష్యమని అరుణ్జైట్లీ తెలిపారు. ఢిల్లీలో విద్యుత్తు కోతలు లేకుం డా సంస్కరణలు చేపట్టేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామని, నీటి కొరత లేకుండా చర్యల కోసం మరో రూ.500 కోట్లు ఇస్తామన్నారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు పదేళ్లపాటు టాక్స్ హాలిడే(2017 మార్చి 31 నుంచి వర్తిస్తుంది). -
ఫొటోలు దిగేది ఇందుకే..
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి లెదర్ బ్రీఫ్కేస్ను పట్టుకుని.. మీడియా ముందుకొచ్చి ఫొటోలు దిగడం మనమెప్పుడూ చూస్తుంటాం. దీనికి ఓ కారణముంది. 1869లో బ్రిటిష్ కామన్స్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చిన జార్జి వార్డ్ హంట్ సభాధ్యక్షుడి నుంచి అనుమతి రాగానే లేచి నిలబడ్డాడు. తీరా చూస్తే.. బడ్జెట్ పత్రాలున్న తన బ్రీఫ్కేసు కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి.. దాన్ని ఇంట్లోనే మరిచిపోయి వచ్చానన్న విషయం.. దీంతో అప్పట్నుంచి ఆర్థిక మంత్రులు ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సభకు వచ్చేముందు తమ వెంట పత్రాలన్నీ తెచ్చుకున్నామని, ఇంట్లో ఏవీ మర్చిపోలేదని పార్లమెంట్ వద్ద గుమికూడిన జనానికి తెలియజేస్తూ బాక్స్ను చూపించి లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. తర్వాత అదో సంప్రదాయంగా మారింది. పార్లమెంటు విధివిధానాలకు సంబంధించి చాలావరకూ బ్రిటన్ను ఫాలో అయ్యే మనం.. దీన్ని కూడా యథాతథంగా కాపీ కొట్టాం. -
ఎవరికి ఎంత లాభం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్ను పెంచటం వల్ల ఎవరికెంత లాభం? ఉద్యోగులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, వృత్తి నిపుణులు వీరందరికీ ఎంత ప్రయోజనం కలుగుతుంది? ఇది తెలుసుకోవటానికి ట్యాక్సేషన్ నిపుణుల్ని ‘సాక్షి’ సంప్రదించింది. వారు సోదాహరణంగా చెప్పిన వివరణలివీ... 1) కృష్ణమోహన్ నెల జీతం రూ.25,000. అంటే ఏడాదికి రూ.3 లక్షలు. గతేడాది బేసిక్ లిమిట్ రెండు లక్షలుగా ఉండటంతో మిగిలిన లక్ష రూపాయల ఆదాయంపై పది శాతం అంటే రూ.10,000 పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ కృష్ణ మోహన్ ఈ భారాన్ని తగ్గించుకోవడానికి సెక్షన్ 80సీ పరిమితిని పూర్తిగా వినియోగించుకున్నాడు. దీంతో అతను ఒక్కపైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బడ్జెట్లో బేసిక్ లిమిట్ను రూ.2.5 లక్షలకు పెంచడంతో పన్నుకు గురయ్యే ఆదాయం రూ.50,000 తగ్గింది. దీంతో అతనికి నేరుగా రూ.5,000 పన్ను భారం తగ్గింది. అలాగే ఈ సారి కేవలం రూ.50,000 పొదుపు చేస్తే చాలు పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆ విధంగా చూస్తే కృష్ణమోహన్ జేబులోకి ఈ ఏడాది ఖర్చు చేసుకోవడానికి అదనంగా రూ.55,000 వచ్చినట్లే. సెక్షన్ 80సీనే పూర్తిగా వినియోగించుకోలేదు కాబట్టి ఈ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచినా, గృహరుణాలపై మినహాయింపు లభించే వడ్డీ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచినా వీటి ప్రయోజనాలను కృష్ణ మోహన్ పొందలేడు. ఈ ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే అతని వార్షిక వేతనం కనీసం రూ.6 లక్షలు దాటి ఉండాలి. అంటే నెలకు రూ.50,000 జీతం దాటిన వారు మాత్రమే జైట్లీ ఫలాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించగలరు. బేసిక్ లిమిట్ను పెంచడం... సెక్షన్ 80సీ, గృహ రుణ వడ్డీపై మినహాయింపుల పెంపువల్ల ఎవరెవరికి గరిష్ఠంగా ఎంత పన్ను భారం తగ్గుతుందో పై పట్టికలో చూడొచ్చు.. -
మెరుపులు... విరుపులు
పాతబాణీలోనే... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు సరైన నిర్ణయాలు లేవు. ధరల నియంత్రణ ఆశయంతో నిధులను కేటాయించినప్పటికీ సంచలనాత్మక మార్పులేవీ లేవు. సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు కేటాయించటం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వటం హర్షణీయం. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా దేశాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు నడిపేందుకు తగిన అవకాశాన్ని కల్పించారు. సిగరెట్స్, ఖైనీలు, గుట్కాలపై పన్నులను అధిక మొత్తంలో పెంచటం మంచిది. ఆదాయపు పన్ను పరిమితిని 2లక్షలనుంచి 2.50 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 3 లక్షలకు పెంచితే బాగుండేది. పవర్ సెక్టార్పై పన్ను మినహాయింపు మరో పదేళ్ల పాటు పెంచటం కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలం. గంగానది ప్రక్షాళనకు రూ.2వేల కోట్లు కేటాయించారు. ఈ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది. - ఈ.ఆర్ .సోమయాజులు (రాంజీ ), ప్రముఖ చార్డెట్ అకౌంటెంట్ రక్షణ రంగంలో ఎఫ్డీఐ శాతం పెంచడమా...? రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు భవిష్యత్లో నష్టం కలుగుతుంది. ఈ రంగంలో పెట్టుబడుల శాతం 49 వరకు పెంచి కేంద్రం తప్పుచేస్తోంది. - గంగుల మదన్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, బొబ్బిలి మన రాష్ట్రానికి ప్రాధాన్యమేదీ? రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండా పోయిన మన రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. లోటుబడ్జెట్తో ఉన్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర పాలకులు ఏమీ చేయలేకపోయారు. - జరజాపు సూరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు పట్టణ కన్వీనర్, సాలూరు కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బడ్జెట్ సంపన్నులకు మేలు చేసేదిగా ఉంది. పేదలకు మేలుకు బదులుగా కీడు కలిగించేదిగా ఉంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గితే అవి వాడేది డబ్బున్నవారు కాబట్టి వారికే అది ఉపయోగపడేలా ఉంది. - మజ్జి వెంకటేష్, పట్టణాధ్యక్షులు వైఎస్సార్ సీపీ, పార్వతీపురం మోడీ సర్కారు పేదలదన్నారు... మోడీ సర్కారు పేదల సర్కారని ఊదరగొట్టారు. మరి పేదలకు ఈ బడ్జెట్ ఒరిగిందేమీ లేదు. పేదలు ఉపయోగించే పలు వస్తువులపై సుంకం పెంచడం, ధరలు పెంచడం చేసింది. ఉపాధి, ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే పరిస్థితి లేదు. - జి.ఉదయభాను, వైఎస్సార్ సీపీ నాయకులు, పార్వతీపురం ఏదీ గిరిజన యూనివర్శిటీ ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు కూడా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కానీ కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపి, తనవంతు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన బీజేపీ బడ్జెట్లో చిన్నచూపే చూపింది. - వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్, సాలూరు రైతుల మాటేంటి...? ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేదు. రైతుల రుణమాఫీకి మనకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. చంద్రబాబుకు మోడీ ఎలాంటి సహాయం చేసినట్లు కనిపించలేదు బడ్జెట్లో. రాష్ట్ర నిర్మాణానికి నిధులేవీ..? వేమిరెడ్డి లక్ష్మునాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, బొబ్బిలి మోడీ సర్కారు రాష్ట్ర పునర్నిర్మాణానికి నిధులు కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశ పట్టింది. చంద్రబాబునాయుడు మోడీకి మంచి మిత్రుడేమో...? నిధులు మోడీ ఎందుకు విదల్చలేదో...? దీని వల్ల మన రాష్ట్రానికి ఇబ్బందే కదా.. ఈ బడ్జెట్ ఊహించినంత బాగోలేదు. - గోర్జ వెంకటమ్మ, ఎంపీపీ, బొబ్బిలి -
తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే...
100 స్మార్ట్ నగరాల ఏర్పాటుకు రూ. 7,060 కోట్లు ‘నమామి గంగ’ పేరుతో సమీకృత గంగా సంరక్షణ కార్యక్రమానికి రూ. 2,037 కోట్లు స్థూల రుణాలు రూ. 6 లక్షల కోట్లు రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్డీఐ పరిమితి 49 శాతానికి పెంపు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 58,425 కోట్లు నెలవారీ కనీస పెన్షన్ రూ. 1,000 కి పెంపు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు రూ. 200 కోట్లు ధరలు పెరిగేవి సిగరెట్లు పాన్ మసాలా గుట్కా నమిలే పొగాకు ఉత్పత్తులు జర్దా శీతల పానీయాలు రేడియో ట్యాక్సీ దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు విరిగిన/హాఫ్ కట్ వజ్రాలు ధరలు తగ్గేవి సాదా (సీఆర్టీ) టీవీలు ఎల్ఈడీ/ఎల్సీడీ టీవీలు (ముఖ్యంగా 19 అంగుళాల కంటే తక్కువ సైజువి) పాదరక్షలు.. సబ్బులు ఇ-బుక్ రీడర్లు, డెస్క్టాప్ కంప్యూటర్లు, లాప్టాప్లు, టాబ్లెట్లు ఆర్వో టెక్నాలజీ వాటర్ ప్యూరిఫయర్లు ఎల్ఈడీ లైట్లు, గృహోపకరణాలు {బాండెడ్ పెట్రోల్ సూక్ష్మ జీవిత బీమా పాలసీలు హెచ్ఐవీ/ఎయిడ్స్ ఔషధాలు, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉద్యోగికి ఊరట ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు దీంతో జేబులోకి అదనంగా రూ.5,000 రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట సెక్షన్ 80సీ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు దీంతో అదనంగా రూ. 50,000 పొదుపు గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షలకు... రూ. 15 వేల వరకూ ప్రయోజనం పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు మొత్తంగా జనానికి కలిగే లబ్ధి విలువరూ. 22,000 కోట్లు మధ్యతరగతికి ఊరటనిచ్చిన మోడీ సర్కారు తొలి బడ్జెట్ నరేంద్రమోడీని యావద్దేశంతో పాటు సొంత పార్టీ సైతం ‘నమో! నమామి!’ అనేలా చేసింది మధ్య తరగతి మహా భారతమే. ఆ రుణాన్ని మోడీ తొలి బడ్జెట్లోనే తీర్చుకున్నారు. తన తొలి బడ్జెట్లో పెద్దగా వాతలు వేయకుండానే...ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50 వేల మేరకు పెంచి ఆ వర్గాన్ని ఆనందపరిచారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ. సెక్షన్ 80సీ పరిధిలో పొదుపు చేసే మొత్తాన్ని మరో రూ. 50వేలు పెంచటమే కాక... గృహ రుణాలపై చెల్లించే వడ్డీకీ మినహాయింపు పెంచారు. మొత్తమ్మీద మధ్య తరగతి చేతిలో కాస్తంత డబ్బు మిగిలేలా చేశారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవటమే కాక.. బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు. దేశాభివృద్ధిలో ప్రైవేటును విస్మరించలేమని స్పష్టంగా సంకేతమిచ్చారు. కొత్తగా ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తూ తమ అభివృద్ధి ఎజెండాను చెప్పకనే చెప్పారు. ఒక కోణంలో మరీ గొప్పగా కాకున్నా మధ్యస్తంగా ఓకే అనిపించినా... పాతికేళ్ల సంకీర్ణ చరిత్రను బద్దలుగొడుతూ సొంతంగా మెజారిటీ సాధించిన సర్కారు స్థాయిలో మోడీ ప్రభుత్వం ఆలోచించలేదనే చెప్పాలి. కఠిన నిర్ణయాలు తప్పవంటూ నెలరోజులుగా ఊదరగొట్టినా... ద్రవ్యలోటుతో సహా అన్ని అంశాల్లోనూ యూపీఏ బాటలోనే నడిచారు. దాదాపు 28 పథకాలకు తలా రూ. 100 కోట్లు కేటాయిస్తూ పోయిన అరుణ్ జైట్లీ... తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే ఉన్నారు. -
ఉద్యోగికి ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మధ్య తరగతిని కేంద్రం మరచిపోలేదు. ఎన్నికల్లో గెలిచాక నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్లో మధ్య తరగతి జీవులకు ఊరటనిచ్చేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కనీస మినహాయింపు పరిమితిని (బేసిక్ లిమిట్) ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ల విషయంలోనైతే ఈ మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. అది రూ.3 లక్షలకు చేరుతుంది. అలాగే గృహరుణాలకు చెల్లించే వడ్డీపై లభించే పన్ను ప్రయోజనాలను రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. పన్ను శ్లాబుల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. ‘‘బేసిక్ లిమిట్ పరిమితిని అదనంగా రూ. 50,000 పెంచుతున్నాం’’ అని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జేబులోనూ కనిష్టంగా రూ.5,000 మిగులుతాయి. సుమారు రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. పెరిగిన సేవింగ్స్ పరిమితి వివిధ పొదుపు పథకాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్, వ్యయాలపై లభించే పన్ను మినహాయింపుల పరిమితిని పెంచుతూ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 80సీ ద్వారా లభించే పన్ను మినహాయింపుల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. జీవిత బీమా ప్రీమియంలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి పొదుపు పథకాలతో పాటు ట్యూషన్ ఫీజులు గృహరుణాలకు చెల్లించే అసలు (ప్రిన్సిపల్) వంటి వ్యయాలు ఈ సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ పరిధిని పెంచడంతో మరో రూ.50,000పై పన్ను ప్రయోజనాలను పొందచ్చు. దీనివల్ల పన్ను శ్లాబులను బట్టి కనిష్టంగా రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. గృహరుణ దారులకు ఊరట గృహ రుణం తీసుకొని ఆ ఇంట్లో నివసించే తాము తీసుకున్న రుణానికి గాను ఈఎంఐలు చెల్లిస్తుంటారు. దీన్లో అసలు కొంత, వడ్డీ కొంత ఉంటుంది. అసలు మొత్తానికి సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుండగా... వడ్డీకి మాత్రం సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపు ఉంటోంది. ఇప్పటిదాకా ఈ మినహాయింపు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ మాత్రమే వర్తించేది. దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం లభించనుంది. పీపీఎఫ్ పరిమితి పెంపు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకాలను ప్రోత్సహించే విధంగా ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఇన్వెస్ట్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పెట్టే పెట్టుబడులు సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు 2011లో నిలిపివేసిన కిసాన్ వికాస్ పత్రాలను తిరిగి ప్రవేశపెట్టారు. డీటీసీని సమీక్షిస్తున్నాం.. డెరైక్ట్ ట్యాక్స్ కోడ్ను (డీటీసీ) సమీక్షిస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. చాలా సంక్లిష్టంగా ఉన్న 60 ఏళ్ల నాటి ప్రస్తుత ఇన్కమ్ ట్యాక్స్ స్థానంలో సులభతరంగా ఉండే డీటీసీని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. డీటీసీ బిల్లును 2010లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పటి ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హా నాయకత్వంలో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డీటీసీపై వచ్చిన సూచనలు సలహాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ పేర్కొన్నారు. రూ. 22 వేల కోట్ల ఆదాయ నష్టం ప్రత్యక్ష పన్నుల్లో చేసిన మార్పులతో భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆదాయ పన్ను సవరణలతో పాటు ఇతర ప్రత్యక్ష పన్నుల్లో చేసిన మార్పుతో రూ.22,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు చెప్పారు. ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు ఈ నిర్ణయంతో జేబులోకి అదనంగా రూ.5,000 రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట సెక్షన్ 80సీ పరిమితి రూ.1 లక్ష నుంచి 1.5 లక్షలకు గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు.. ఈ నిర్ణయంతో గరిష్టంగా 15వేల వరకూ ప్రయోజనం -
బడ్జెట్ భగవాన్
దేవుడా! ఈ సారైనా ఇన్కమ్ట్యాక్స్ బేసిక్ లిమిట్ను 3 లక్షలకు పెంచేలా చూడు!! భగవాన్! నేనో సొంతింటివాణ్ణి కావాలి. తక్కువ ధరలో ఇల్లు దొరికేలా చెయ్యి!! స్వామీ! పెరిగిన ధరలతో బతకలేకపోతున్నాం. ధరల్ని కిందికి దించు!! భగవంతుడా! నా పరిశ్రమ బతకాలంటే దిగుమతి సుంకాలు తగ్గేలా చెయ్యి!! బడ్జెట్ ముందు ఇలాంటి మొక్కులు మామూలే. రైతులు, సామాన్యుల నుంచి వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు దాకా ఎవరి కోరికలువారు వినిపిస్తూ ఉంటారు. దేవుడు అందరికీ వరాలివ్వడు. అలాగే... బడ్జెట్ భగవాన్ అవతారమెత్తే ఆర్థిక మంత్రి కూడా కొందరినేకరుణిస్తుంటారు. మరి ఈసారి అరుణ్జైట్లీ వరాలిచ్చిందెవరికి? వాతలేసిందెవరికి? బడ్జెట్ భగవాన్ అందరికన్నా ఎక్కువ శిక్షించింది పొగరాయుళ్లు, గుట్కా బాబుల్నే. కనికరం మాట అటుంచితే... కక్ష గట్టినట్టుగా సిగరెట్తో వాతలు పెట్టారు. గుట్కా, పాన్ మసాలా ముట్టుకుంటే వాత పెడతానని వార్నింగిచ్చారు. ఎక్కువ కనికరించింది మధ్య తరగతిని, ఉద్యోగినే. పన్ను మినహాయింపు పెంచి ఉద్యోగి జేబులో నేరుగా రూ.5వేలు డిపాజిట్ చేసేశారు. మరింత పొదుపు చేసుకో! మరింత పన్ను మిగుల్చుకో అంటూ కరుణించేశారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారిని తొందరపెట్టారు. రుణం తీసుకుంటే దానిపై చెల్లించే వడ్డీకి ఐటీ మినహాయింపు మరింత పెంచుతున్నా! కాబట్టి త్వరపడండి అని బడ్జెట్ భగవాన్ పచ్చజెండా ఊపారు. పరిశ్రమలు పెడదామనుకుంటున్న ఔత్సాహికులకూ వరమే. పాతిక కోట్లకన్నా ఎక్కువ పెట్టి ఉత్పాదక పరిశ్రమ పెడితే 15 శాతం ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ప్రకటించారు. మూడేళ్లు ఈ వరం కొనసాగుతుందని కూడా చెప్పారు. ట ఇంట్లో టీవీ లేదని అల్లాడిపోయే దిగువ మధ్య తరగతికి చాన్సిచ్చారు జైట్లీ. సీఆర్టీ టీవీలు, 19 అంగుళాలకన్నా చిన్నగా ఉండే ఎల్సీడీ, ఎల్ఈడీల ధరలు కూడా తగ్గిస్తున్నా... ఇప్పుడే కొనుక్కోమని ప్రకటించేశారు. అరె! మీరేం తక్కువ తిన్నారంటూ ధనవంతులకు కూడా వరమిచ్చారు. విలువైన రాళ్ల ధరలు దించారు. అదే పనిగా శీతల పానీయాలు తాగే ఫుడ్ షాపర్లను కూడా జైట్లీ వదిలిపెట్టలేదు. మంచినీళ్లు తాగితే సరే! కూల్డ్రింకులేంటి? అంటూ పన్ను పోటు వేశారు.మ్యూచ్వల్ ఫండ్స్లో దాచుకునేవారికి షాకిచ్చారు జైట్లీ. ఈక్విటీలు కాకుండా ఇతరత్రా పథకాల్లో ఇన్వెస్ట్చేసే ఫండ్లలో పెట్టుబడి పెడితే...లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును రెట్టింపు చేశారు. పాపం! ఇంట్లోకి స్టీలు సామాన్లు కొనుక్కోవాలనుకునే గృహిణులు ఇక కాస్త ఆలోచించాల్సిందే. పన్నులు పెంచటంతో వీటి ధర కూడా స్వల్పంగా పెరిగే చాన్సుంది. ఇంట్లో కారు లేదు... అద్దె ట్యాక్సీలో వెళ్లాలనుకునేవారి జేబులకు సైతం కత్తెర పెట్టారు బడ్జెట్ భగవంతుడు. రేడియో ట్యాక్సీలో వెళితే సౌండ్ పెంచే సర్వీసు తాను మొదలెడతానంటూ బాదేశారు. ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుని చవగ్గా ఆన్లైన్లో, మొబైల్స్లో ప్రకటనలిద్దామనుకునే వారినీ జైట్లీ వదిలిపెట్టలేదు. ‘మీరేమో ప్రకటనలకు కొత్త మార్గాలు వెదుక్కుంటున్నారు. మరి నేను కూడా పన్నులకు కొత్త మార్గాలు వెదకాలిగా’ అనే రీతిలో ఝలక్ ఇచ్చారు. దీన్ని కూడా సర్వీసేనంటూ పన్ను చట్రంలోకి తెచ్చేశారు.!! -
కార్మిక, ఉపాధికి 45% ఎక్కువ
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో కార్మిక, ఉపాధి శాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 45 శాతం అధికంగా నిధులు దక్కాయి. ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈసారి రూ. 2,496 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ఉపాధి కల్పనా(ఎంప్లాయింట్ ఎక్స్ఛేంజ్) కేంద్రాలను కెరీర్ సెంటర్లుగా ఆధునీకరించడానికి మరో రూ. 50 కోట్లను కేటాయించారు. తమ పేర్ల నమోదుకు వచ్చే నిరుద్యోగులకు ఈ కేంద్రాల్లో తగిన కౌన్సెలింగ్, శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.యువతకు ఉపాధి కల్పన, కార్మికులకు నైపుణ్య శిక్షణ, అసంఘటిత రంగంలోకి కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, పని సంస్కృతిని మెరుగుపరచడంతో పాటు మహిళా కార్మికులకు రక్షణ వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు -
కార్మికుల కనీస పెన్షన్ ఇక నెలకు రూ. వెయ్యి
న్యూఢిల్లీ: వ్యవస్థీకృతరంగ కార్మికుల నెలవారీ పింఛన్ ఇక కనీసం రూ.వెయ్యి కానుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 పరిధిలోని పెన్షన్దారుల కనీస పింఛన్ను రూ.1000 చేస్తూ నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తన బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.1000 కన్నా తక్కువ పెన్షన్ పొందుతున్న దాదాపు 28 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకుముందు పెన్షన్ పథకాల అర్హుల వేతన పరిమితి రూ.6,500గా ఉండేది. దీన్ని రూ.15 వేలకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వ్యవస్థీకృత రంగ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో ఖజానాపై అదనంగా పడబోయే భారాన్ని భరించేందుకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈపీఎఫ్వో తన చందాదారులందరికీ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒకే పీఎఫ్ నంబర్(యూనియన్ అకౌంట్ నంబర్) అందజేస్తుందని తెలిపారు. దీని ద్వారా కార్మికులు/ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వారి భవిష్య నిధి ఖాతాలను మార్చుకోవడంలో ఇబ్బందులు తప్పనున్నాయి -
సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి!
న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సబ్సిడీల భారాన్ని క్రమంగా దించుకునే దిశగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీల వల్ల ఏటా పడుతున్న రూ.1.40 లక్షల కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా డీజిల్ ధరపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయడంతోపాటు వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘డీజిల్ మార్కెట్ ధరకు, అమ్మకపు ధరకు మధ్యనున్న వ్యత్యాసాన్ని 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా తొలగించాలని యోచిస్తున్నాం. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఉండదు. మార్కెట్ రేట్ల ప్రకారమే వాటి అమ్మకపు ధర ఉంటుంది’’ అని బడ్జెట్లో పేర్కొన్నారు. మొత్తమ్మీద 2013-14లో ఇంధన సబ్సిడీ రూ.1.40 లక్షల కోట్లు ఉండగా, ఇందులో ఒక్క డీజిల్పైనే రూ.62,800 కోట్లు వెచ్చిస్తున్నారు. ‘‘చమురు రంగంలో అంతర్జాతీయంగా ఎలాంటి షాకులూ లేకపోతే ఏడాదిలోగా డీజిల్ ధరలపై నియంత్ర ణ తొలగిపోతుంది. సబ్సిడీ పెరిగిపోతున్న నేపథ్యంలో సిలిండర్ల సంఖ్యపై వా స్తవ అంచనాతో పరిమితి విధించాల్సిన అవసరముంది’’ అని పేర్కొన్నారు. -
కొనసాగనున్న ‘ఆధార్’!
న్యూఢిల్లీ: ‘ఆధార్’ ప్రాజెక్టును కొనసాగించే అవకాశమున్నట్లు కొత్త ప్రభుత్వం బడ్జెట్లో సంకేతమిచ్చింది. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండే ఆధార్ కార్డులను జారీ చేస్తున్న ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్)కు 2014-15 గాను రూ. 2,039 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం గత ఏడాది కేటాయింపులకంటే రూ. 1,550 కోట్లు ఎక్కువ. ఉడాయ్ మరో 10 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ప్రధాని మోడీ ఆధార్ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారని, ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా అందించే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారని సమాచారం. 70 కోట్ల మంది వివరాలు నమోదు చేసిన ఉడాయ్ 65 కోట్ల మందికి ఆధార్ కార్డులు మంజూరు చేయడం తెలిసిందే. జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) కింద దేశ ప్రజలందరికీ బహుళార్థక జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉడాయ్ వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. -
ఒక్కో స్మార్ట్ సిటీకి 70 కోట్లు..!
100 స్మార్ట్ నగరాలకు రూ. 7,060 కోట్లు కేటాయించిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,060 కోట్ల వ్యయంతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. ‘‘దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకూ చేరేకొద్దీ.. నగరాలకు గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి. లేకుంటే ప్రస్తుతం ఉన్న నగరాలు త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి’’ అని అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని 50 వేల చదరపు మీటర్ల నుంచి 20 వేల చదరపు మీటర్లకు.. ఎఫ్డీఐల మూలధన పరిమితిని పది మిలియన్ డాలర్ల నుంచి ఐదు మిలియన్ డాలర్లకు తగ్గించారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు మూడేళ్ల కాల పరిమితిని నిర్దేశించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం నిధులను చౌక గృహ నిర్మాణాల కోసం ఖర్చు చేయనున్నారు. స్మార్ట్ స్మార్ట్గా... దేశం మొత్తమ్మీద వంద స్మార్ట్సిటీల నిర్మాణానికి సంకల్పం చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో ఇందుకోసం రూ. 7,060 కోట్లను కేటాయించింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మౌలిక సదుపాయాలకే మరమ్మతులు చేసుకుంటూ నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకోని కారణంగా నగరాలు సమస్యల కాసారాలుగా మారిపోయాయి. ఇప్పటికే ఉన్న మహా నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు అవకాశమున్నప్పటికీ అందుకోసం లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కొత్త నగరాల సృష్టికి ప్రాధాన్యమిస్తోంది. అంతా బాగానే ఉందిగానీ.. ఇం తకీ ఈ స్మార్ట్సిటీల్లో ఉండే సౌకర్యాలేమిటి? వాటితో మనకొచ్చే లాభమేమిటి? నిజంగానే అలాంటి నగరాలు మనకు అవసరమా? అని ప్రశ్నించుకుంటే.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ వేగంగా పెరిగిపోతోంది. 2032 నాటికి మన దేశంలోని నగరాల జనాభా మరో 25 - 30 కోట్లు పెరిగిపోతుందని ఒక అంచనా. వచ్చే ఇరవయ్యేళ్ల పాటు నిమిషానికి 30 మంది గ్రామీణులు ఉపాధి, ఇతర కారణాలతో నగరబాట పడతారని అంచనా. ఇప్పటికే దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఒక్కో చదరపు కిలోమీటర్ వైశాల్యంలో రెండు వేల మందికిపైగా జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరగనుంది. ఇక దేశంలో రోజంతా మంచినీరు సరఫరా చేసే నగరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నగరాల్లోని వాహనాలు కూడా 2021 నాటికి మూడురెట్లు ఎక్కువ అవుతాయి. వీటికి పరిశ్రమలూ తోడైతే కాలుష్యం కూడా పెరిగిపోవడం ఖాయం. 2015 నాటికి అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ మూడోస్థానానికి చేరుకోనుందని.. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలంటే రూ. అరవై లక్షల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన నగరాల్లోని ప్రజలు ఎంతో కొంత సౌకర్యంగా జీవితం సాగించాలంటే కనీసం 500 కొత్త నగరాలను నిర్మించాల్సి ఉంటుందని ఐబీఎం లెక్కకట్టింది. అన్నీ స్మార్ట్: స్మార్ట్ సిటీ అన్న ఆలోచనకు ఒక ప్రత్యేక నిర్వచనమంటూ ఏదీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. స్థూలంగా చూసినప్పుడు మాత్రం.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజా జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటివాటిని స్మార్ట్సిటీలకు చోదకాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్సిటీ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించిన అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఎనిమిది కీలకాంశాలను గుర్తించింది. పరిపాలన, విద్యుత్, భవనాలు, రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు ఆధునిక టెక్నాలజీల సాయంతో తెలివిగా పనిచేసే నగరం స్మార్ట్ సిటీ అవుతుందని తీర్మానించింది. ఇలాంటివి ప్రపంచంలో ఒకట్రెండు నగరాల్లోనే అమలవుతుండగా.. వాటికి ‘ఎకో ఫ్రెండ్లీ సిటీ’లుగా నామకరణం చేసింది ఫోర్బ్స్! - సాక్షి, హైదరాబాద్ ఈ సిటీల్లో ఏముంటాయి? 2025 నాటికి ప్రపంచం మొత్తమ్మీద అంతర్జాతీయ స్థాయి స్మార్ట్సిటీలు 26 వరకూ ఉంటాయని ఇప్పటివరకూ ఉన్న అంచనా. వీటిల్లో ఉండగల సౌకర్యాలు, ఇతర టెక్నాలజీలు...ట్రాఫిక్ లైట్లు మొదలుకొని భవంతుల వరకూ అన్నీ కంప్యూటర్ నెట్వర్క్ లేదా వైఫైతో అనుసంధానమై ఉంటాయి.వైర్లెస్ సెన్సర్ల నెట్వర్క్లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు, అధికారులకు సమాచారమిస్తాయి.నీటి పైపుల్లో లీకేజీలుంటే గుర్తించే వ్యవస్థలు. చెత్తకుండీ నిండిపోయిన వెంటనే కార్పొరేషన్ అధికారులకు అలారమ్.ట్రాఫిక్ రద్దీ.. వాతావరణ పరిస్థితులను బట్టి ట్రాఫిక్ లైట్ల వెలుతురులో హెచ్చుతగ్గులు ట్రాఫిక్ జామ్ల గురించి ఎప్పటికప్పుడు ప్రజ లకు సమాచారం. తద్వారా ప్రయాణ మార్గంలో మార్పులు చేసుకోవడమో లేదా సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాన్నిగుర్తించి సేదతీరడమో చేయవచ్చు. ఇంధనం, సమయం కలిసొస్తాయి.వాననీటిని ఒడిసిపట్టి నగరాల్లో పచ్చదనం పెంపునకు ఉపయోగించడం.పనిచేసే చోటుకు దగ్గరగానే నివాస సముదాయాలు ఉండేలా చూడటం. మెట్రో రైలు వంటి అధునాతన రవాణా వ్యవస్థ.అవసరాన్ని బట్టి స్మార్ట్గా పనిచేసే విద్యుత్ గ్రిడ్. పౌర సేవల కోసం ప్రత్యేకమైన టెక్ ఆధారిత ప్రాజెక్టులు. -
అభినవ చాణక్యుడు.. అరుణ్ జైట్లీ
వ్యూహ రచనలో దిట్ట.. న్యాయ రంగంలో అపార అనుభవం సూటిగా, స్పష్టంగా మాట్లాడే వక్త.. బీజేపీలో ట్రబుల్ షూటర్గా పేరు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ తరువాత అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్జైట్లీ. ఎంతో ప్రాధాన్యమైన రెండు శాఖలు(ఆర్థిక, రక్షణ) ఆయన నిర్వహిస్తున్నారంటే సమర్ధత అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల అధికార ప్రతినిధులు సైతం పలు విషయాల్లో జైట్లీని సలహాలు అడుగుతారట. మోడీ క్యాబినెట్లో ఆయన ఓ తురుపు ముక్క. పార్టీ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత ఈయనకే అప్పగిస్తుంటారు. మోడీ మాటల్లో చెప్పాలంటే ఆయన ఓ అరుదైన వజ్రం. ప్రకాశ్జవదేకర్ మాటల్లో ఓ అద్భుత వ్యూహకర్త. ఐఎన్ఎస్ విక్రమాదిత్యను మోడీ సందర్శించిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నా ఆయనతో పాల్గొనకుండా పలు సమస్యల పరిష్కారానికి జమ్మూకాశ్మీర్కు వెళ్లారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడం జైట్లీకి అలవాటు లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. న్యాయవాదిగా... 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలోని ఇండియన్ ఎక్స్ప్రెస్ భవనాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టులో ఎదుర్కొనడంతో పాటు విజయం సాధించారు జైట్లీ. ఈ ఘటన రామనాథ్ గోయంకా, అరున్ శౌరీ, ఫాలీ నారీమన్, స్వామినాథన్ గురుమూర్తి లాంటి వారితో పరిచయానికి దోహదపడింది. 1977 నుంచి లాయర్గా పలు కోర్టుల్లో పనిచేశారు. 1990లో సీనియర్ లాయర్గా వ్యవహరిస్తు న్నారు. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేతలు శరద్ యాదవ్, ఎల్కే అద్వానీ, మాధవరావు సింధియాలకు పలు వివాదాల్లో లాయర్గా పనిచేశారు. బిర్లా గ్రూప్ ఆస్తుల వివాదాల్లో, జాతీయగీతం వివాదంపై రామ్గోపాల్ వర్మకు కూడా లాయర్గా వ్యవహరించారు. కుటుంబం... 1982లో సంగీతను వివాహం చేసుకున్నారు. రోహన్, సోనాలీ ఇద్దరు సంతానం. నిర్వహించిన పదవులు... 1986-87లో జనసంఘ్ పార్టీ(ఇప్పుటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ఘటన వీపీసింగ్ దృష్టిలో పడేలా చేసింది. 1989లో సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్గా జైట్లీని నియమించారు. అప్పటికి ఆ పదవి నిర్వహించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. 1999లో తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వంలో లా, సమచార, ప్రసార, పెట్టుబడులు, నౌకాయాన, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. స్వతహాగా లాయర్ కావడంతో లా శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. లాయర్లకు వచ్చే ఫీజులో 10 శాతం మొత్తాన్ని వారి కింద పనిచేసే క్లర్కులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఫండ్తో ఎంతో మంది పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారని సీనియర్ లాయర్ ఓమ్ ప్రకాశ్ శర్మ చెప్పారు. 2004లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో పార్టీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో అమృత్సర్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. గత మేలో కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగతం... 1952లో జన్మించిన జైట్లీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. రతన్ప్రభ(అమృత్సర్), మహరాజ్ కిషన్ జైట్లీ(లాహోర్)లు తల్లిదండ్రులు. తండ్రి ప్రముఖ న్యాయవాది. దేశ విభజన తరువాత వీరు అమృత్సర్లో స్థిరపడ్డారు. అరుణ్ సెయింట్ గ్జావియర్స్ మిషనరీ స్కూల్ చదివారు. డిగ్రీ, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఎస్ఆర్సీసీ కాలేజీలో చదివే రోజుల్లో కరంజవాలా అండ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీనియన్ లాయర్ రయన పరిచయం అయ్యారు. వీరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగేవి. జైట్లీకి అప్పటి నుంచే ఏ అంశం మీదనైనా అనర్ఘళంగా మాట్లాడడం అలవాటైంది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(ఏబీవీపీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది జైట్లీ తొలి విజయం. అప్పుడు ఈయన లా చదువుతున్నారు. అంతేకాదు ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతో అరెస్టు అయ్యారు కూడా. 19 నెలల జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
జైట్లీ వరాలు
సాక్షి, చెన్నై:కేంద్రంలో కొత్తగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తమిళనాడుకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావం పెరిగింది. తమకు ఉన్న ఎంపీల సంఖ్యా బలం మేరకు కేంద్రంతో సానుకూలంగా మెలిగే పనిలో సీఎం జయలలిత పడటంతో ఇక నిధుల వరద పారుతుందన్న ధీమా పెరిగింది. అయితే, రైల్వే బడ్జెట్లో సదానంద ప్రకటన ఆశల్ని ఆవిరి చేసేంది. తమిళనాడుకు సదానంద హ్యాండివ్వడంతో ఆర్థిక బడ్జెట్లోను అదే పరంపర సాగొచ్చన్న నిరుత్సాహం ఆవహించింది. అయితే, పెద్దల్ని మరింత అందలం ఎక్కించడంతో పాటుగా పేద, మధ్య తరగతి వర్గాల మీద, రాష్ట్రాలు దృష్టి పెట్టేవిధంగా బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు. సదానంద బాటలో: తమిళనాడు విషయంలో కొన్ని అంశాల్లో రైల్వే మంత్రి సదానంద బాట లోనే జైట్లీ నడిచారని చెప్పవచ్చు. చెన్నై నుంచి ఇతర రాష్ట్రాల్ని అనుసంధానించే విధంగా కొత్త రైళ్లను సదానంద ప్రకటిస్తే, పారిశ్రామిక కారిడార్ల విషయంలో అదే బాణిని అరుణ్ జైట్లీ అనుకరించారు. చెన్నై టూ విశాఖ, చెన్నై టూ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రస్తావన తెచ్చిన ఆయన, మదురై - తూత్తుకుడి పారిశ్రామిక కారిడార్ ప్రస్తావనను మరిచారు. ఈ కారిడార్ ప్రస్తావనను తన బడ్జెట్లో తెచ్చి ఉంటే, దక్షిణాది జిల్లాల ప్రజల మన్ననలు అందుకుని ఉండేవారు. పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు ఉండేది. అయితే, దక్షిణ తమిళనాడు విషయంలో సదానందను అనుకరించడంతో అక్కడి ప్రజలనుంచి జైట్లీకి వ్యతిరేకత తప్పదు. విశాఖ - చెన్నై కారిడార్ను ఈస్ట్ కోస్ట్ కారిడార్గా మార్చి మదురై -తూత్తుకుడి వరకు పొడిగించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మెరుగు: చెన్నై వరకు కారిడార్లను తీసుకొచ్చి వదలి పెట్టిన జైట్లీ, మరి కొన్ని ప్రకటనలతో తమిళుల్ని ఆకర్షించారు. చెన్నై మహానగరానికి కూత వేటు దూరంలో, తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో గుమ్మిడి పూండి సమీపంలో ఉన్న పొన్నేరిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే జాబితాలోకి చేర్చడం విశేషం. అత్యధికంగా జనాభా కలిగి, రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ పొన్నేరిని ఆధునీకరించడం ద్వారా అక్కడి ప్రజల జీవన స్థితి మరింత మెరుగు పడే అవకాశాలు అధికం. మద్రాసు మెడికల్ కళాశాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజెన్సీ ఏర్పాటుతో పరిశోధనలను మరింత ప్రోత్సహించేం దుకు నిర్ణయించారు. తద్వారా రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవలు, పేదలకు మరింత చేరువయ్యే అవకాశాలు ఉంటారుు. ఆధునిక వైద్య ఆస్పత్రులకు నిధుల ప్రకటించిన దృష్ట్యా, చెన్నైలో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి రూపు దిద్దుకోవడం ఖాయం. ఇక, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తరచూ తెర మీదకు రావడం, అధికారుల శ్రమతో సమసి పోవడం జరుగుతూ వస్తున్న తరుణంలో సౌరశక్తి విద్యుత్ ప్లాంట్ ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. హార్బర్లకు నిధుల కేటాయింపుల ప్రస్తావనతో తూత్తుకుడి హార్బర్ మీద పెట్టుబడులు అధికంగా పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. సాంస్కృతిక పట్టణాలు: కాంచీపురం, వేలాంక న్ని, శ్రీరంగం పట్టణాలు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగాను బాసిల్లుతున్నాయి. వీటికి మరింత వన్నె తెచ్చే రీతిలో సాంస్కృతిక (హెరిటేజ్) పట్టణాల జాబితాలో చేర్చడం ప్రశంసనీయం. మెగా క్లస్టర్కు తమిళనాడు వేదిక కానుండడం మరో విశేషం. దీని కోసం గిరిజన, వెనుకబడిన వర్గాల తండాల్లో ప్రగతి లక్ష్యంగా కేటాయిం పులు, గ్రామ సడక్ యోజన పథకాలు జాతీయ స్థాయిలో ప్రకటించారు. వీటి ద్వారా తమిళనాడులో లబ్ధి పొందే గ్రామాలు అనేకం ఉన్నాయి. ఇక, కేంద్ర బడ్జెట్ మేరకు రాష్ట్ర అన్నదాతలకు ఆర్థికంగా భరోసా దక్కడం ఖాయం. ప్రశంసలు, విమర్శలు డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్కొంటూ, అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ను రూపకల్పన చేశారని ప్రశంసించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, జాతీయ స్థాయి అభివృద్ధి నినాదంతో ఈ బడ్జెట్ ఉందని కితాబు ఇచ్చారు. సీపీఐ నేత టీ పాండియన్ పేర్కొంటూ, ప్రభుత్వ రంగ సంస్థలకు పెను ప్రమాదం సృష్టించే అంశాలు కొన్ని బడ్జెట్లో ఉన్నాయని విమర్శించారు. యాజమాన్యాలకు పెద్ద పీట వేస్తున్నట్టుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ పేర్కొంటూ, ఉచితాల్ని పక్కన పెట్టి, దేశ భవిష్యత్తు, గ్రామాల అభ్యున్నతికి పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొంటూ, నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, పెద్దగా మార్పులు లేవని, తమిళనాడుకు పెట్టుబడులు, పరిశ్రమలు లేవంటూ విమర్శించారు. -
ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల తగ్గుదల - వినియోగదారుల్లో ఆనందం
-
బడ్జెట్పై ప్రముఖుల స్పందన
-
బడ్జెట్పై ప్రముఖుల స్పందన
న్యూఢిల్లీ: లోక్సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014 -2015)పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందంటే, మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. జైట్లీ బడ్జెట్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ విమర్శించారు. ధరల భారం నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించిన సామాన్యుడి ఆశలను బడ్జెట్ అడియాశలు చేసిందని ఆయన ఆరోపించారు. కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతించడాన్ని జెడియు తప్పుబట్టింది. జైట్లీ బడ్జెట్ సామాన్యలకు కోతలు, సంపన్నులకు వరాలిచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బడ్జెట్లో ఏపీకు కాస్తా న్యాయం జరిగిందని, ఇంకా న్యాయం జరగాల్సి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆశ ఉందని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సంపదలు వృద్ధిచెందాలని బడ్జెట్ కోరుకుంటోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అన్నిరంగాలు పునరుజ్జీవం చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, గాడితప్పిన భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించే విధంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్సిటీ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. వచ్చే బడ్జెట్ లోపు తెలంగాణకు మరిన్ని నిధులు తెచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. దేశంలో మౌళిక సదుపాయాలు పెంచి ఉద్యోగకల్పన వచ్చే విధంగా, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగిందని ఆయన బడ్జెట్ను స్వాగతించారు. బడ్జెట్ తటస్దంగా వుందని ఎఫ్ఏపిసిసిఐ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. దేశం లోని ఆర్దిక స్దితి గతులను బట్టి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ వుందని ఆయన ఆభిప్రాయ పడ్డారు. ప్రముఖుల అభిప్రాయాలు: ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జైట్లీ బడ్జెట్ అమోఘం. ఈ బడ్జెట్ వాస్తవిక దృక్పథంతో ఉంది- హోంమంత్రి రాజ్నాథ్ బడ్జెట్ దూరదృష్టితో వచ్చింది - రైల్వేమంత్రి సదానంద గౌడ వృద్ధిరేటుకు ఈ బడ్జెట్ చోదక శక్తి - కేంద్రమంత్రి అనంత్కుమార్ బడ్జెట్ నిరాశపరిచింది: బీహార్ మాజీ సీఎం నితీష్ పేదలను ఆదుకునేలా బడ్జెట్ లేదు: ఎన్సీపీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదు. - తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బడ్జెట్ పేదలకు వ్యతిరేకంగా ఉంది. ప్రజలను చాలా నిరాశపరిచింది. ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న సగటుమనిషికి ఏ అండా దొరకలేదు. - లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఇదొక అచేతన బడ్జెట్. దూరదృష్టీ, కార్యాచరణలేని బడ్జెట్. విదేశీ పెట్టుబడుల కోసం, పెట్టుబడుల చేత, పెట్టుబడు కొరకు ఈ బడ్జెట్ వచ్చింది. - బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటే, వారిని బడ్జెట్ వమ్ముచేసింది. సమాజంలో ఏ వర్గం క్షేమాన్ని బడ్జెట్ పట్టించుకోలేదు. - ఆమ్ఆద్మీ పార్టీ -
తెలంగాణకు అన్యాయం జరిగింది: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదని పెదవి విరిచారు. కేంద్రం కేటాయించిన ఉద్యాన విశ్వ విద్యాలయం కొత్తది కాదని.. పునర్విభజన చట్టంలో ఉన్నదే అని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయిని ఆశించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణకు కూడా ఎయిమ్స్ను ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణకు నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. -
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్
లోక్సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014-2015)లో ఆంధ్రప్రదేశ్కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల ప్రస్తావనేలేదు. విభజన జరిగిన నేపధ్యంలో ఏపి ఎంతో నష్టపోయింది. అనేక అంశాలలో తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మించుకోవలసి ఉంది. విద్య, వైద్యంతోపాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవలసి ఉంది. అందుకు తగిన రీతిలో బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవు. జాతీయ వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించినవి: * ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ * ఐఐటి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * వ్యవసాయ విశ్వవిద్యాలయం * అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ * శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు * విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు * హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి బడ్జెట్లో ప్రస్తావించని ప్రధాన అంశాలు: * ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి ప్రధానమైన కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావనేలేదు. * రాష్ట్ర విభజన సమయంలో చెప్పినవిధంగా ఐఐఎం(ఇండియన్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ను ఏపికి ప్రకటించలేదు. * సెంట్రల్ యూనివర్సిటీని ప్రకటించలేదు * గిరిజన విశ్వవిద్యాలయ ప్రస్తావనలేదు * అందరూ ఊహించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన కూడా బడ్జెట్లో లేదు. * పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనలేదు. * విభజన సమయంలో కేంద్రం చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. * విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు ప్రకటించలేదు. -
అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
-
రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా?
గుంటూరు: రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యతిరేకించారు. రక్షణ శాఖలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు రక్షణ రంగంలో 49 శాతం వరకు ఎఫ్డీఐలు అనుమతించాలని గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించింది. కాగా, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రుణమాఫీ ప్రస్తావన రాలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఊసే లేదన్నారు. ఏపీలో రూ.15,900 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, దీని భర్తీ విషయంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో రైలు ప్రస్తావన రాలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. -
కేంద్రబడ్జెట్పై చర్చ
-
ధరలు - తగ్గేవేవి ? పెరిగేవేవి ?
-
పాత బడ్జెట్నే తిప్పి ప్రవేశ పెట్టారు!
-
వేతన జీవులకు పెద్దగా ఒరిగేదేం లేదు!
-
అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలన్నీ ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ప్రస్తావించిన అనేక అంశాలు బడ్జెట్ ప్రసంగంలో లేవని చెప్పారు. ఏపీకి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని పెదవి విరిచారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ పరిస్థితి దుర్భరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విధాన పరమైన నిర్ణయాల్లో కొన్ని మాత్రమే సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపీకి స్పెషల్ కేటగిరి హోదా, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్ , ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలకు బడ్జెట్ ప్రసంగంలో చోటు దక్కలేదని సోమయాజులు తెలిపారు. -
రైతులకు, పేదలకు పెద్దపీట
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారిగా ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్(2014-2015) రైతులకు, పేదలకు పెద్దపీట వేయడంతోపాటు ఆర్థిక సంస్కరణలు - ఉత్పత్తి రంగాలపై దృష్టిసారించినట్లుగా భావిస్తున్నారు. కచ్చితమైన లక్ష్యాలతో పేదరిక నిర్మూలన పథకాలు రూపొందించినట్లు లోక్సభలో దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్లో రైతులకు, పేదలకు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు: * పట్టణాల్లో రైతుల కోసం మార్కెట్లు * ప్రతి రైతుకు భూపరీక్ష కార్డు, దీని కోసం రూ.100 కోట్లు * రైతుల పంట రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగింపు * 100 కోట్ల రూపాయలతో రైతుల కోసం టీవీ * ధరల స్థిరీకరణ నిధికోసం 500 కోట్ల రూపాయలతో నిధి * వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8 లక్షల కోట్లు * స్వల్పకాలిక పంటరుణాల రీషెడ్యూలింగ్ కోసం 5వేల కోట్ల రూపాయలు * రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలు * 5వేల కోట్లతో శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం * భూములేని రైతులకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం * 2019 నాటికి ప్రతి ఇంటికీ టాయిలెట్ * కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మురికివాడల అభివృద్ధి * బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు * తక్కువ ఖర్చుతో నిర్మితమయ్యే గృహాలకు 400 కోట్ల రూపాయలు * పట్టణ పునర్ నిర్మాణ పథకాలకు ప్రత్యేక లక్ష్యాలు * లింగ వివక్ష నిర్మూలనకు రూ.100 కోట్లు * జాతీయ తాగునీటి పథకానికి రూ.3600 కోట్లు * గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.8 వేల కోట్లు * వికలాంగుల కోసం ప్రత్యేక పథకం * వృద్ధులకు వేయి రూపాయల పెన్షన్, దీని కోసం రూ.2050 కోట్లు * గ్రామీణ విద్యుత్ సదుపాయాల కోసం రూ.500 కోట్లు * 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ స్కీం * ఆడ పిల్లను రక్షించు - ఆడపిల్లను చదివించు పేరుతో కొత్త పథకం * ఎస్సీ, ఎస్టీల సంక్షేమంకోసం రూ.50,047 కోట్లు * గిరిజనుల కోసం రూ.100 కోట్లతో వనబంధు పథకం * సాగునీటి కాల్వల బలోపేతానికి వేయి కోట్లు * బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం * కస్టమ్ డ్యూటీ తగ్గింపుతో చిన్నకలర్ టీవీలు తగ్గనున్నాయి * వ్యవసాయవర్శిటీల కోసం రూ.200 కోట్లు * ఈశాన్యంలో ఆర్గానిగ్ వ్యసాయం కోసం రూ.100 కోట్లు * జార్ఖండ్, అస్సాంలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు * 20 వేల గ్రామాల్లో తాగునీటి కోసం రూ.3600 కోట్లు * 2019 కల్లా దేశంలో పూర్తిస్థాయి పారిశుధ్యం * గ్రామీణ అభివృద్ధికి రూ.30వేల కోట్లతో నిధి * వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథక పునర్ వ్యవస్థీకరణ * గృహనిర్మాణం పథకంలో మార్పులు * 2022 నాటికి అందరికీ ఇళ్లు -
శెట్టి గారి నుంచి జైట్లీ వరకు!
అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం. 1947 నవంబర్ 26వ తేదీ. సరిగ్గా ఆ రోజున ఆర్థికమంత్రి ఆర్.కె. షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు.. ఇన్నాళ్ల తర్వాత దేశానికి 84వ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. దేశ విభజన తర్వాత ఢిల్లీ, ఇస్లామాబాద్లలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశానికి సబంధించి ఏడున్నర నెలల కాలానికి గాను 171.15 కోట్ల రూపాయల అంచనాతో మన దేశ బడ్జెట్ను షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. అప్పటి ద్రవ్యలోటును రూ. 24.59 కోట్లుగా అంచనా వేశారు. -
బడ్జెట్ బాగుంది: టీడీపీ; బాగోలేదు: కాంగ్రెస్ ఎంపీలు
సాధారణ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని టీడీపీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక కేటాయింపులు జరిగాయని టీడీపీ పార్లమంటరీ నేత సుజనాచౌదరి అన్నారు. బడ్జెట్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, మొన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అసంతృప్తి కలిగించినా, ఈ బడ్జెట్ బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రవేశపెట్టినది ఎనిమిది నెలల బడ్జెటైనా ఇప్పుడున్న నిధులు సరిపోతాయని, ఇది రైతు పక్షపాత బడ్జెట్ అని టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు అంశం మాత్రం ఈ బడ్జెట్లో ఎక్కడా లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సుబ్బరామిరెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటనలు చేశారు గానీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రం బడ్జెట్ లేదని వారు వ్యాఖ్యానించారు. -
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ Part 2
-
బడ్జెట్ మీద ట్విట్టర్లో ప్రశంసలు.. విమర్శలు
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచడాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన నెటిజన్లు.. సర్దార్ పటేల్ విగ్రహానికి 200 కోట్లు కేటాయించడం లాంటి అంశాల మీద మాత్రం మిశ్రమంగా స్పందించారు. అంధుల కోసం బ్రెయిలీ నోట్లను ముద్రించాలన్ని నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంకా ఎలాంటి స్పందనలు వచ్చాయో ఒకసారి చూద్దామా.. నగరాల్లో మహిళల రక్షణకు కేవలం వంద కోట్లేనా? దీనికి ఇంకా ఏదైనా పెద్దస్థాయిలో చేస్తారేమో అనుకున్నాం -స్టెల్లా పాల్ గుజరాత్లో విజయవంతం అయిన అన్ని ప్రధాన పథకాలకు కేంద్ర బడ్జెట్లో స్థానం లభించింది -రవి ఘియర్ దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రక్షణ రంగానికి 2.29 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు -దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కిసాన్ టెలివిజన్ను ప్రారంభించడం గణనీయమైన మార్పును తెస్తుంది -నీల్ సంఘవి ఉత్పాదక, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, నీటిపారుదల రంగాలకు మంచి ఊతం ఇచ్చారు. ఇది భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుంది -ప్రకాష్ జవదేవకర్ #Budget2014 :expected something big in security for women. Got a vague 1bn INR for 'women's safety in cities'. Doesn't help! #India #gender — Stella Paul (@stellasglobe) July 10, 2014 All major tested and successful schemes of Gujarat Govt finds a place in #unionbudget2014 — Ravi Ghiyar (@ravighiyar) July 10, 2014 No compromise with defence of country . ₹ 2 lac 29 thousand crore for #defence . #Budget2014 — Devendra Fadnavis (@Dev_Fadnavis) July 10, 2014 This could be the game changer for India RT"@ANI_news: 'Kisan Television' will be launched in the current year-Arun Jaitley #Budget2014" — Neil Sanghavi (@NeilSanghavi) July 10, 2014 FM: govt to print currency notes with braille like signs to assist the visually impaired. Excellent move! — Arjun Datta Majumdar (@arjundm) July 10, 2014 #Budget2014 gives thrust on Manufacturing, Infrastructure, Housing & Irrigation. Its a Roadmap for Future. — Prakash Javadekar (@PrakashJavdekar) July 10, 2014 -
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ Part 3
-
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ Part 1
-
వ్యవసాయ రుణాల లక్ష్యం 8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నుముక. అయితే క్షీణించిపోతున్న వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ కీలక చర్యలు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8 లక్షల కోట్లుగా ప్రకటించిన విత్తమంత్రి... నాబార్డ్ ద్వారా 5 లక్షల కోట్ల రుణాలు అందిస్తామని వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీకే స్వల్ప కాలిక రుణాలు అందిస్తామని తెలిపిన ఆయన సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలకు అందిస్తామని వెల్లడించారు. కొత్తగా కిసాన్ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. -
పవర్ కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే
న్యూఢిల్లీ: ఆర్థిక బడ్జెట్ లో విద్యుత్ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలకు అమల్లోవున్న పదేళ్ల టాక్స్ హాలీడేను మరో ఏడాది పొడిగించారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80-1ఏ కింద విద్యుత్ ఉత్పాదన సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మార్చి 31, 2015 వరకు పొడిగించారు. మార్చి 31, 2017లోపు ప్రారంభమయ్యే కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే వర్తిస్తుంది. కాగా, ఢిల్లీలో విద్యుత్ సంస్కరణలకు రూ. 200 కోట్లు కేటాయించారు. రాజస్థాన్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్ లోని సొలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూ. 500 కోట్లు ప్రకటించారు. అల్ట్రా మోడరన్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు. దేశంలో అన్ని గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
భేటీ బచావో-భేటీ పడావోకు 500 కోట్లు
న్యూఢిల్లీ : ఆడశిశువుల రక్షణ, ఆడపిల్లల విద్యపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. 'భేటీ బచావో-భేటీ పడావో' పేరుతో కొత్త పథకం ప్రకటించింది. ఆడపిల్లలను రక్షించండి, చదివించండి పథకానికి రూ.500 కోట్లు నిధులు కేటాయించనున్నారు. అలాగే దేశంలో మహిళల భద్రత కోసం రూ.150 కోట్లు నిధులు ఖర్చు చేస్తామని అరుణ్ జైట్లో తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అదేవిధంగా లింగ వివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో బోధనలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. *నిర్భయ ఫండ్ నుంచి నిధులు *ఢిల్లీలో మహిళా రక్షణకు ఎమర్జెన్సీ సెంటర్ *నగరాల్లో మహిళల రక్షణకోసం రూ. 150 కోట్లు *బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు * బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం * మహిళల రుణాల కోసం 'ఆ జీవిక' పథకం -
ప్రకటనలు ఘనం... కేటాయింపులు మితం
న్యూఢిల్లీ : ఎన్నో ఆశలు... మరెన్నో అంచనాలు... భవిష్యత్తుకు భరోసా ఇస్తారనే ఊహాగానాల నడుమ మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటనలు ఘనం... కేటాయింపులు మితం. ద్రవ్యలోటు, ప్రపంచ దేశాల్లో ఆర్థిక అస్థిరతను ప్రస్తావించిన విత్తమంత్రి జైట్లీ... పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 5 కంటె తక్కువగా ఉందన్న ఆయన 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని ప్రకటించారు. అలాగే ఆర్థిక లోటుకు పగ్గాలు వేయడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపిన జైట్లీ ప్రస్తుతం 4.1 శాతంగా ఉన్న ఆర్థిక లోటును వచ్చే మూడేళ్లలో 2016-17 ఆర్థిక సంవత్సరం నాటికి 3 శాతానికి తగ్గించడానికి కృషి చేస్తామని తెలిపారు. దాదాపు 17.90 లక్షల కోట్ల రూపాయలతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించిన ఆయన పన్ను వసూళ్ల ద్వారా 13న్నర లక్షల కోట్లు సాధించగలమని అంచనా వేశారు. -
క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు
న్యూఢిల్లీ: మణిపూర్ లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆసియా క్రీడలకు సన్నద్దమయ్యే క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు కేటాయించారు. జమ్మా, కాశ్మీర్ లో అవుట్ డోర్, ఇండోర్ స్టేడియంల ఆధునీకరణకు రూ.200 కోట్లు ప్రకటించారు. -
తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు. కంటితుడుపు చర్యగా కేవలం హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రకటించారు. ఇక జైట్లీ పద్దులో ఏపీకీ మరో కేటాయింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యూనివవర్సిటీ ఏర్పాటును ప్రతిపాదించిన ఆయన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే అనంతపురం జిల్లా హిందూపూర్లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీని ప్రతిపాదించారు. అయితే ఐతే రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు మాత్రం దక్కలేదు. -
కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్ను విధానమిదే!
-
నాడు వద్దన్నదే... నేడు ముద్దైంది
న్యూఢిల్లీ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నదే అధికారంలోకి వచ్చాక ముద్దైంది. విదేశీ పెట్టుబడులపై యూపీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో నానా హడావుడి చేసిన వారే నేడు రారమ్మని స్వాగతం పలికారు. విదేశీ పెట్టుబడులతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అంటూ గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చారు. విదేశీ పెట్టుబడులకు ఎన్డీయే సర్కారు తలుపులు బార్లా తెరిచింది. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. రక్షణ, బీమా రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న ఎఫ్డీఐల శాతాన్ని 26 నుంచి 49 వరకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు. తయారీ రంగంలోనూ ఎఫ్డీఐలకు సంకేతాలిచ్చారు. -
ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి...
న్యూఢిల్లీ: దేశీయ ఎలక్రానిక్ ఉత్పత్తులు ధరలు తగ్గనున్నాయి. అయితే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులపై మోత మోగించారు. 2014-15 ఆర్థిక బడ్జెట్ లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత, తగ్గింపుతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వాటిపై పన్నులు పెంచడంతో వాటి ధరలు ప్రియం కానున్నాయి. పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 6 శాతానికి తగ్గించారు. 19 అంగుళాల టీవీలు తయారు చేసే దేశీయ కంపెనీలకు పన్ను రాయితీ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 16 శాతానికి పెంచారు. సున్నపురాయి, డోలమైట్ పై రాయితీ ప్రకటించారు. కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్పై పన్ను తగ్గించారు. ధరలు తగ్గేవి... * 19 అంగుళాల ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, మొబైల్ ఫోన్లు * సబ్బులు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, బ్రాండెడ్ దుస్తులు * పిక్చర్ ట్యూబ్స్, రెడీ టూ ఈట్ ఫుడ్స్ * నూనెలు, పెట్రో కెమికల్స్, సిమెంట్, ఐరన్ * సోలార్ ప్యానెల్స్, క్రీడా వస్తువులు ధరలు పెరిగేవి... * పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, పాన్ మసాలా * దిగుమతి చేసుకున్న స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు * దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు * శీతలపానీయాలు -
పొగరాయుళ్ల జేబుకు చిల్లు
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్ల మీద ప్రస్తుతమున్న 11 శాతం పన్నును ఒకేసారి 72 శాతానికి పెంచారు. పాన్ మసాలా, గుట్కాల మీద కూడా పన్నును 60 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మసాలాలు, గుట్కాలు.. వీటన్నింటి ధరలు అత్యంత భారీగా పెరగబోతున్నాయి. సిగరెట్ల మీద ధరలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకుముందే ఆర్థిక మంత్రిని కోరింది. అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఈ చర్యకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు కూల్ డ్రింకులు, సోడాల మీద కూడా పన్నును పెంచారు. దేశంలో కేన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు.. ప్రధానంగా పొగతాగేవాళ్లకే కేన్సర్, గుండెజబ్బుల లాంటివి వస్తున్నాయని వైద్యవర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయినా పట్టణ, గ్రామీణ భారతాల్లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల వాడకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రధానంగా యువత వీటిపై ఎక్కువగా మక్కువ పెంచుకుంటున్నారు. ఆర్థికమంత్రి మోగించిన మోతతో.. పొగాకు, పొగాకు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇప్పటికైనా వీటి వాడకాన్ని తగ్గిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. -
2014 -సాధారణ బడ్జెట్ హైలైట్స్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. * పాదరక్షల ధరలు తగ్గే అవకాశం * 19 ఇంచ్లు టీవీలు * పొగాకు ఉత్పత్తులపై 12 నుంచి 16 శాతం ఎక్సైజ్ సుంకం పెంపు * రేడియో టాక్సీలపై సేవా పన్ను * తగ్గనున్న కంప్యూటర్, మొబైల్ ఫోన్ల ధరలు * ఇనుము ధరలు తగ్గే అవకాశం * దేశంలో మరో 60 ఆదాయ పన్ను సేవా కేంద్రాలు * సున్నపురాయి, డోలమైట్ పై రాయితీ * సిగరెట్ల పై కూడా భారీగా వడ్డింపు * గుట్కా, పాన్ మసాలపై 60 శాతం పన్ను పెంపు * వజ్రాల ధర తగ్గింపు * ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎడ్యుకేషన్ సెస్ * పెట్రో కెమికల్స్ పై కస్టమ్స్ తగ్గింపు * స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు * పవన విద్యుత్ పరికరాలపై పన్ను తగ్గింపు * ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల ధర తగ్గింపు * కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్పై పన్ను తగ్గింపు * ఫ్యాటీ ఆసిడ్స్, గ్లిజరిన్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు * ఉన్ని దుస్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు * గృహ రుణాల ఆదాయపన్ను పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు * 80 సీసీ పరిమితి రూ.1.5 లక్షలకు పెంపు * సర్ ఛార్జీల్లో మార్పు చేయని జైట్లీ * పొదుపు పథకాల్లో లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు * హైదరాబాద్ లో రుణాల వసూళ్లకు ట్రిబ్యునల్ * సీనియర్ సిటిజన్లకు పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు * వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ. 2 లక్షల నుంచి 2.5లక్షలకు పెంపు * హిందూపూర్ జాతీయ ఎక్సైజ్, కస్టమ్స్ అకాడమీ * సెజ్ ల పునరుద్దరణకు సమగ్ర చర్యలు * ప్రణాళికేతర వ్యయం రూ.12,90819 కోట్లు * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం * టూరిజం అభివృద్ధికి రూ.500 కోట్లు * మహిళల రక్షణకు నిర్బయ ఫండ్ * అమరవీరుల స్మారకార్థం వార్ మ్యూజియంకు రూ. * మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల ఆధునీకరణకు రూ.3వేల కోట్లు * గంగానది ప్రక్షాళనకు రూ.2,037 కోట్లు * రైతులకు మూడు శాతం వడ్డీతో పంట రుణాలు * రక్షణ రంగానికి రెండు లక్షల ఇరవై తొమ్మిదివేల కోట్లు కేటాయింపు * పీపీఎఫ్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు * డిసెంబర్ 31 నాటికి అన్ని మంత్రిత్వ కార్యాలయాలు అనుసంధానం * సకాలంలో ముంబై-బెంగళూరు కారిడార్ పూర్తి * గంగానదిలో జలరవాణా కోసం రూ.4వేల కోట్లు * జమ్మూ,కాశ్మీర్లో హస్తకళలకు రూ.50వేల కోట్లు * లక్నో, అహ్మదాబాద్ లకు మెట్రో ప్రాజెక్టులు * రూ.11,635 కోట్లతో పోర్టుల అభివృద్ధి * బాలికల సాధికారిత కోసం రూ.100 కోట్లు * బెనారస్ సిల్క్ అభివృద్ధికి రూ.50 కోట్లు * తక్కువ వడ్డీకే రైతులకు స్వల్పకాలిక రుణాలు * వ్యవసాయ రుణాల కోసం రూ.8వేల కోట్లు * రక్షణ మంచినీటి పథకం కోసం రూ.6,500 కోట్లు * ద్రవ్యోల్బణం కట్టడికి ధరల స్థిరీకరణ నిధి * పీపీసీ పద్ధతిలో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, విస్తరణ * పట్టణాలలో రైతు మార్కెట్లు ఏర్పాటు * పుడ్ సెక్టార్లో పీపీసీలు ప్రోత్సహిస్తాం * పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.28వేల కోట్లు * ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు * 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి * ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో సంస్కరణలు * చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్ * భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు * ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి * కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు * విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు * రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు * ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ * సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు * వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు * మూలధనం పెంపుకు జాతీయ బ్యాంకుల వాటా అమ్మకం * నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం * తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు * సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు * ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు * హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి * 2022 నాటికి అందరికీ ఇళ్లు * గోదాముల కోసం రూ.5కోట్లు * తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ * ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు * గిరిజనుల కోసం వనబంధు పథకానికి రూ.100 కోట్లు * సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు * 2019 నాటికి పరిశుభ్ర భారత్ * సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు * గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు * మహిళల భద్రతకు రూ.150 కోట్లు * దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు * పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ * యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం * మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు * ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్లకు 500 కోట్లు * కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు * కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు * నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు * ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు కోసం * బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు * వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు * గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు * గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు * ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐలకు ప్రోత్సహం * ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు * గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు * గుజరాత్ తరహా పట్టణీకరణకు చర్యలు * ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు * పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం * సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు * గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు * ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల * సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన * ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన చర్యలు * గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా * ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు * వ్యయ-యాజమాన్య కమిషన్ ఏర్పాటు * పర్యాటక రంగం ప్రోత్సాహానికి 9 ఎయిర్ పోర్టుల్లో ఈ-వీసాలకు అనుమతి * త్వరలో కొత్త యూరియా పాలసీ * ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యం * ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేవు * 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు * ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ * తయారీ రంగంలో ఎఫ్డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు * బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది * బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు కృషి * ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు * నల్లధనం దేశానికి శాపంగా మారింది * మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం * గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గిస్తాం * రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది * అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది * ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం * అర్హులకే సబ్సీడీలు అందేలా చర్యలు * రక్షణ, బీమా రంగంలో 41 శాతం ఎఫ్డీఐ * రెండు,మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు * 2015 ద్రవ్యలోటు 3.6 శాతం * భవిష్యత్ తరాలకు రుణభారాలు మిగల్చరాదు * అవసరానికి మించి ఖర్చులు చేయలేం * పన్ను వసూళ్లు మెరుగు పరచాలి * పన్ను, జీడీపీ రేటును పెంచాలి * అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ * బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రయత్నం * భారత్ మార్పు కోరుకుంటుంది * ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు * రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నాం * గత ప్రభుత్వాల నిర్ణయాల్లో లోపాల వల్ల అవకాశాలు కోల్పోయం *దారిద్ర్య రేఖ నుంచి బయటకు రావటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు -
'హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ'
అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ప్రత్యేక నిధులతో ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
ఏపీ, తెలంగాణకు దక్కని ఐఐఎం
న్యూఢిల్లీ: దేశంలో 5 కొత్త ఐఐఎం, 5 కొత్త ఐఐటీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే నూతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐఐఎం దక్కలేదు. ఏపీలో ఐఐటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీ, రాజస్థాన్ లో వ్యవసాయ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. హర్యానా, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. వీటన్నింటి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రూ.100 కోట్లతో వ్యవసాయ౦ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. జార్కండ్, అసోం రాష్ట్రాల్లో వ్యవసాయ పరిశోధనా సంస్థలను నెలకొల్పుతామని జైట్లీ హామీయిచ్చారు. మదర్సాల ఆధునీకరణకు రూ. 100 కోట్లు కేటాయించారు. -
ఆదాయపన్ను ఊరట అంతంత మాత్రమే!!
ఆదాయపన్ను విషయంలో భారీ రాయితీలు ఇస్తారని భావించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఉద్యోగవర్గాలను కొంత నిరాశకు గురిచేశారు. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ఇప్పుడున్న 2 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచారు. అదే సీనియర్ సిటిజన్ల విషయంలో అయితే ఈ పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. అయితే, పొదుపును పెంచే ఉద్దేశంలో భాగంగా.. సెక్షన్ 80 సి కింద ఆదాయ పన్ను మినహాయింపు వచ్చే పొదుపు మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి లక్షన్నరకు పెంచుతూ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కొంతవరకు ఊరట కల్పించే అంశమే అవుతుంది. అలాగే, గృహరుణాల వడ్డీ మీద పన్ను మినహాయింపును కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారు. ఈ లెక్కన గృహరుణాలు తీసుకుని, 80 సి లో కూడా పొదుపును పాటించే ఉద్యోగులకు సుమారు లక్షన్నర రూపాయల వరకు ఊరట లభించినట్లు అవుతుంది. పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎడ్యుకేషన్ సెస్ లాంటివన్నీ ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. -
ఆదాయ పన్ను పరిమితి 2.5లక్షలకు పెంపు
-
డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ
దూరదర్శన్లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అందుకోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని అరుణ్ జైట్లీ తెలపారు. -
పొదుపు పథకాలకు పెద్దపీట
చిన్నమొత్తాల పొదుపు పథకాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దపీట వేశారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇప్పటివరకు ఏడాదికి లక్ష రూపాయలు మాత్రమే గరిష్ఠంగా వేసుకునే అవకాశం ఉండగా, దాన్ని లక్షన్నరకు పెంచారు. అలాగే.. ఆడ పిల్లల చదువు, వాళ్ల పెళ్లికోసం ప్రత్యేకంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు క్రీడాభివృద్ధి మన దేశంలో చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి చెప్పారు. వివిధ క్రీడల్లో శిక్షణ సదుపాయాలకు నిధులు కేటాయించారు. దాంతో పాటు ప్రత్యేకంగా మణిపూర్ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి వంద కోట్లు కేటాయించారు. -
గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా!
న్యూఢిల్లీ: నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని గృహాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. క్లీన్ థర్మల్ ఎనర్జీ పథకానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన'కు రూ.14,389 కోట్లు ఇవ్వస్తామని జైట్లీ హామీయిచ్చారు. -
తెలంగాణకు హార్టీకల్చర్ యూనివర్సిటీ
-
కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్
న్యూఢిల్లీ: కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీయిచ్చారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు ఆయనకు పలు పథకాలు ప్రకటించారు. కృష్ణపట్నం ఓడరేవుకు అదనపు నిధులిస్తామన్నారు. విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో 20 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆంధ్రప్రదేశ్కు ఎయిమ్స్
-
కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!!
కేంద్ర బడ్జెట్ గానీ, రైల్వే బడ్జెట్ గానీ, రాష్ట్రాల బడ్జెట్లు గానీ.. ఏవైనా సరే అవి కొనసాగినంత సేపు సదరు మంత్రులు నిలబడే తమ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని చదువుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా, ఈమధ్య కాలంలో తొలిసారిగా ఎన్డీయే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. కూర్చుని తన బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. తొలుత ఆయన నిలబడే ప్రసంగించారు. అయితే, బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన 45 నిమిషాల తర్వాత.. ఐదు నిమిషాల పాటు విరామం తీసుకున్న ఆర్థిక మంత్రి, ఆ తర్వాత నుంచి తన స్థానంలో కూర్చుని తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. మధ్యమధ్యలో మంచినీళ్లు తాగుతూ.. ఆయన కూర్చుని తన బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు. నడుం నొప్పి తీవ్రంగా బాధిస్తుండటం వల్లే ఆయనిలా చేసినట్లు తెలుస్తోంది. -
ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ వర్సిటీ
తన బడ్జెట్ తొలి భాగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వరాలను ప్రకటించారు. రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వ విద్యాలయాలను ఆయన కేటాయించారు. అయితే, ఇంతకుముందు విభజన సమయంలో చెప్పినట్లుగా ఐఐఎంను మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం ఒకదాన్ని ఆయన కేటాయించారు. దేశం మొత్తమ్మీద ఐదు కొత్త ఐఐటీలను ఏర్పాటుచేయబోతున్నట్లు జైట్లీ ప్రకటించారు. వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐఐటీని ఇచ్చారు. దాంతోపాటు రెండు సంస్థలను కూడా ఆయన కేటాయించారు. -
స్టాట్యూ ఆఫ్ యూనిటీకి రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రతిష్టాపనకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం నిర్మించనున్నారు. -
పర్యాటక అభివృద్ధికి 'ఈ-వీసా' విధానం
దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది పరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అందులోభాగంగా ఈ - వీసా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని తోమ్మిది విమానాశ్రయాలలో దశలవారీగా ఈ వీసా విధానాన్ని అమలు చేస్తామన్నారు. 2014 -15 సంవత్సర ఆర్థిక బడ్జెట్ను జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ - వీసా విధానంతో 'వీసా ఆన్ ఎరైవల్' సులభతరం అవుతుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. -
'సబ్ కే సాత్, సబ్ కా వికాస్'
న్యూఢిల్లీ: అధిక జనాభా కారణంగా దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ను గురువారం ఆయన ప్రవేశపెట్టారు. అందరికీ సాయం, అందరికీ అభివృద్ధి(సబ్ కే సాత్, సబ్ కా వికాస్) అనేదే తమ లక్ష్యమని జైట్లీ పేర్కొన్నాడు. రెండు, మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటును అధిగమించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అన్నారు. నల్లధనం కలుగుతున్న నష్టాన్ని గుర్తించామని చెప్పారు. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నామని వెల్లడించారు. -
బడ్జెట్ ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ
-
7060 కోట్లతో వంద స్మార్ట్ సిటీల అభివృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7060 కోట్ల రూపాయలతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం నాడు లోక్సభలోప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయనీ విషయం తెలిపారు. ''అభివృద్ధి ఫలాలు అత్యధికులకు అందేకొద్దీ, నగరాలకు వలసలు పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరగాలని భావిస్తారు. వారికి తగిన సౌకర్యాలు కల్పించకపోతే నగరాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి. అందుకే దేశంలో 100 స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలన్నది ప్రధాని యోచన. ఇందుకోసం 7060 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయిస్తాం'' అన్నారు. పల్లెలను కూడా అభివృద్ధి చేయడం ద్వారా గుజరాత్ మంచి ఫలితాలు సాధించిందని, అదే పద్ధతిలో.. పీపీపీ విధానంలో నిధులు సేకరించి దేశంలోని అన్ని పల్లెలనూ అభివృద్ధి చేస్తామని జైట్లీ చెప్పారు. విద్యుత్ చాలా ముఖ్యమైన అవసరమని, గ్రామాల్లో కూడా రోజుకు 24 గంటలూ విద్యుత్ అందాలని, ఇందుకోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనకు 500 కోట్లు కేటాయిస్తాం. గుజరాత్లో ఏర్పాటు చేస్తున్న సర్దార్ పటేల్ విగ్రహం కోసం 200 కోట్లు ఇస్తామన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సి ఉందని, అందుకోసం భారత ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులలో షేర్లు అమ్ముతామని అత్యధిక శాతం షేర్లు మాత్రం ప్రభుత్వం వద్దనే ఉంటాయని ఆయన చెప్పారు. -
'ఆర్థికవ్యవస్థకు శాపంగా మారిన నల్లధనం'
నల్లధనం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన అంశాలిలా ఉన్నాయి. * ప్రస్తుతం మనం రక్షణలో 25 శాతం ఎఫ్డీఐలు అమలుచేస్తున్నాం వాటిని 49 శాతానికి పెంచాలనుకుంటున్నాం * బీమా రంగంలో కూడా 26 నుంచి 49 శాతం వరకు ఎఫ్డీఐలను పెంచాలనుకుంటున్నాం. * పలు రంగాల్లో ఎఫ్డీఐల వల్ల స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. * మన దేశంలోని పలు రంగాల్లో ఉద్యోగాలు రావడం చాలా అవసరం * మన స్వదేశీ ఉత్పాదక పరిస్థితులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. * మన ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిన నల్లధనాన్ని అరికట్టాలి. * పేదరికంలో ఉన్నవాళ్లు దాన్నుంచి బయట పడాలనుకుంటున్నారు. అందరికీ ఆశలు చాలా ఉన్నాయి. * ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ఆహార ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తాం. * నిరుద్యోగం, మౌలిక సదుపాయాల లేమితో బాధపడకూడదు. * 7-8 శాతం వృద్ధిరేటు సాధించడానికి ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రారంభం మాత్రమే * ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజులకే ప్రవేశపెట్టే బడ్జెట్లో అద్భుతాలు చేస్తామని ఆశించక్కర్లేదు * పేదరికం అతిపెద్ద సమస్య. దాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకుంటాం * సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న మోడీ నినాదానికి అనుగుణంగా చర్యలుంటాయి, బలమైన భారతాన్ని నిర్మిస్తాం * రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది.. దీంతో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది * మరిన్ని వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది. పన్నులు- జీడీపీ నిష్పత్తిని మెరుగుపరుచుకోవాలి * ఇన్నాళ్లూ ఖర్చులను తగ్గించుకున్నారు తప్ప ఆదాయాన్ని మెరుగుపరిచే చర్యలు పెద్దగా చేపట్టలేదు * కృషిచేయడం ఆపేసినప్పుడే విఫలం అవుతాం. * ఇరాక్ సంక్షోభం వల్ల, మధ్య ప్రాచ్య సమస్యల వల్ల చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి * రుతుపవనాలు రాకపోవడంతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది * వ్యయ నిర్వహణ కమిషన్ ఒకదాన్ని ప్రవేశపెడతాం * ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం * పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధానాలను అమలుచేస్తాం * 4 లక్షల కోట్ల పన్ను డిమాండ్ ఇప్పటికీ ఇంకా వివాదాల్లో ఉంది * పన్ను చట్టాలను పటిష్ఠం చేసేందుకు సీబీడీటీ సూచనలతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తాం -
బడ్జెట్ 2014-15 ఎలా ఉండాలి?
-
బడ్జెట్ ఎలా ఉండాలంటే..?
-
'బడ్జెట్పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు'
హైదరాబాద్ : నరేంద్ర మోడీ బడ్జెట్పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి అన్నారు. సాధారణ బడ్జెట్ నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఆయన గురువారమిక్కడ సాక్షి చానల్లోని చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులకు చేయూత ఇచ్చేలా బడ్జెట్ ఉండాలన్నారు. అయితే తాను ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడం లేదని, రైతుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాని నాగిరెడ్డి తెలిపారు. -
పార్లమెంట్ చేరుకున్న అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్కు సమయం ఆసన్నమైంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ గురువారం పార్లమెంట్కు చేరుకున్నాయి. బడ్జెట్ పత్రాలు కూడా పార్లమెంట్కు చేరుకున్నాయి. దేశాభివృద్ధికి బాటలు పరిచేలా బడ్జెట్లో సంస్కరణల పర్వానికి పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. రైల్వే, రక్షణశాఖ సహా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. ఆర్థికవృద్ధికి చేయూతనివ్వడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై కూడా జైట్లీ దృష్టి సారించినట్లు సమాచారం. అంతకు ముందు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. బడ్జెట్ వివరాలు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. -
కేంద్ర బడ్జెట్ 2014-15 ఎలా ఉండబోతోంది?
-
ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ శుభారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండటంతో.. స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్లో సానుకూలంగా స్పందించాయి. భారతీయ ఈక్విటీ మార్కెట్ల పరిస్థితిని చూపించే ప్రధాన సూచీ సెన్సెక్స్ 64.08 పాయింట్లు పుంజుకుంది. ఆటోమొబైల్ షేర్లు పెరగడం మొదలుపెట్టాయి. ప్రధానంగా ఆటోమొబైల్, కేపిటల్ గూడ్స్, వినియోగదారుల వస్తువుల రంగాల్లో కొనుగోళ్లు బాగా కనిపించాయి. ఆరోగ్యరంగంలో మాత్రం అమ్మకాల ప్రభావం గట్టిగా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ) సెన్సెక్స్ 25,513.74 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఉదయం 9.15 ప్రాంతానికి ప్రారంభ సెషన్లో 25,508.89 వద్ద ట్రేడవుతోంది. గురువారం నాటి ముగింపు అయిన 25,444.81 కంటే ఇది 64.08 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మాత్రం పెద్దగా స్పందించడంలేదు. కేవలం 0.90 పాయింట్లు మాత్రమే పెరిగి, 7,585.90 వద్ద ట్రేడవుతోంది. -
రాష్ట్రపతితో అరుణ్ జైట్లీ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. నేడు పార్లమెంట్లో అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దాంతో బడ్జెట్ వివరాలను ప్రణబ్కు వివరించినట్లు సమాచారం. ఇక ప్రణబ్తో భేటీ అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర భేటీతో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జైట్లీ ..బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఏపీ కోర్కెలను బడ్జెట్ నెరవేర్చేనా?
-
కోటి ఆశలను బడ్జెట్ నెరవేరుస్తుందా ?
-
ఏపీతో పోటీ లేదు కానీ.. తెలంగాణకూ న్యాయం చేయాలి
-
రైల్వే బడ్జెట్ వల్ల ఉపయోగం శూన్యం
విజయనగరం ఫూల్బాగ్ : రైల్వే బడ్జెట్ వల్ల రాష్ట్రానికి గాని జిల్లాకు గాని ఒరిగిందేమీ లేదని అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహనరావు అన్నారు. బడ్జెట్కు నిరసనగా బుధవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేలో దేశ వ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 4 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడం అన్యాయమన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన మోడీ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు నేరుగా ఒక్క ట్రైన్ కూడా లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం కూలీలు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం నుంచి ట్రైన్ వేయాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందన్నా రు. ప్రతి ఆరు నెలలకొకసారి రైల్వే చార్జీలు పెం చేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు త్రినాథ్, శ్రీరామ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.గణేష్, సరేష్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రకు మొండిచేయి విజయనగరం ఫూల్బాగ్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. స్థానిక బాలగంగాధరరావు భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బడ్జెట్ వల్ల ప్రజలపై భారం పడిందన్నారు. కనీసం జిల్లా నుంచి ఒక్క రైలు కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. రైళ్లు నడిపే విభాగం మినహా మిగతా విభాగాలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇది ఎంతమత్రం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఉత్తరాంధ్రకు ఎటువంటి ప్రాజెక్టులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. వీక్లీ ట్రైన్స్ (నాగావళి, బిలాస్పూర్, సమత, యశ్వంత్పూర్, తిరుపతి)ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఆశల పల్లకిలో...
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టనున్న మోడీ సర్కార్ మొట్టమొదటి బడ్జెట్పై నగరవాసులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఈ సాధారణ బడ్జెట్లో రాజధానికి కేటాయింపులు పదిశాతం పెరుగుతాయని భావిస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, దీంతో విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. నీటిసరఫరా సమస్యపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని చెప్పుకొంటున్నారు. ఇక నగరంలో మరో ప్రధాన సమస్య అయిన యమునా నది పునరుద్ధరణకు మోడీ సర్కార్ తప్పకుండా ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించవచ్చని కూడా అంటున్నారు. యమునా నదిని పునరుద్ధరించాలంటే యమనా నదిలోకి విడుదల చేసే మురుగు నీటిని శుద్ధి చేయవలసి ఉంటుంది కనుక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం, సీవేజ్ సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుందని, దీనిపై మోడీ ప్రభుత్వం తప్పకుండా దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే మురుగునీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు నగరంలో ఉన్నాయి. బడ్జెట్ తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడవచ్చని చెబుతున్నారు. చారిత్రక కట్టడాల సుందరీకరణ కూడా ప్రాధాన్యమైన అంశమే కావడంతో ఇందుకోసం కనీసం 20 కోట్ల రూపాయలనైనా కేటాయిస్తారని చెబుతున్నారు. ఢిలీ, ఎన్సీఆర్ల మధ్య రవాణా సదుపాయాల కోసం కూడా ఆశించినస్థాయిలోనే నిధులను జైట్లీ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు కూడా కేటాయింపులు పెంచవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టు కోసం 1,259 కోట్లు, పోలీస్ స్టేషన్లు, గృహవసతి, కార్యాలయ భవనాల కోసం 1,790 కోట్ల రూపాయలు కేటాయించాలని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. 1 కోటీ 70 లక్షల జనాభా గల ఢిల్లీలో పోలీసు బలగాలను పెంచాలని, ఇందుకోసం కొత్త నియామకాలు జరపాలని, శిక్షణ కోసం అధిక నిధులు కేటాయించాలని కూడా ఢిల్లీ పోలీసులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో ఢిల్లీ పోలీసుల డిమాండ్లు కొంతమేరైనా నెరవేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తానికి మోడీ సర్కార్ బడ్జెట్పై నగరవాసుల అంచనాలు భారీగానే ఉన్నా అరుణ్ జైట్లీ ఏమేరకు కరుణిస్తారో చూడాలి. -
జై కొడతారా? భయపెడతారా?
-
విన్నపాలు వింటరా?
-
‘అనుబంధం’లోనైనా న్యాయం చేయండి
న్యూఢిల్లీ: రైల్వే అనుబంధ(సప్లిమెంటరీ) బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా, అసంతృప్తిగా ఉందన్నారు. 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇలాంటి బడ్జెట్ను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఏపీ, తెలంగాణలోని 29 పెండింగు ప్రాజెక్టుల విషయంలో కమిటీ నిర్ణయం తర్వాత అనుబంధ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖను కోరారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. -
రైల్వే బడ్జెట్ 2014-15 పై ప్రత్యేక చర్చ
-
కలల లోకాన్నైతే సృష్టించారు కానీ..
-
రైల్వే బడ్జెట్లో తెలుగు వారికి మొండి చెయ్యే!
-
ఊరించి.. ఉసూరుమనిపించారు
- రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన సదానందగౌడ - కడప-బెంగళూరు రైలు మార్గానికి ఒక్క పైసా విదల్చని దుస్థితి - జిల్లాలో రైల్వేజోన్, డివిజన్ ఏర్పాటుపై నోరుమెదపని గౌడ - తిరుపతికి ఒక్క కొత్త సర్వీసును కూడా మంజూరు చేయలేదు - అన్యాయంపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై ప్రజాగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ జిల్లా ప్రజానీకాన్ని ఊరించి ఉసూరుమనిపించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఊపిరిలూదే బెంగుళూరు-కడప, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాల కు ఒక్క పైసా నిధులను కూడా కేటాయించలే దు. చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కనిపించలేదు. రైలు మార్గాల మా ట దేవుడెరుగు.. కనీసం కొత్త రైలు సర్వీసులను కూడా జిల్లాకు మంజూరు చేయలేదు. రైల్వే బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది జిల్లాకు అన్యాయం జరిగినా ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధి కూడా నోరుమెదపకపోవడంపై జనం నివ్వెరపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్ను మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరాక ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఈ ఏడాది రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా జిల్లాకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేస్తారని ప్రగల్భాలు పలికారు. శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైలు మార్గాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తారని చెప్పుకొచ్చారు. చిత్తూరు నుంచి పలమనేరు మీదుగా కుప్పం వరకూ కొత్త రైలుమార్గం నిర్మాణానికి సైతం రైల్వేశాఖ ఆమోదముద్ర వేస్తుందని బీరాలు పలికారు. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైలు సర్వీసులు మంజూరు చేస్తారని స్పష్టీకరించారు. చంద్రబాబు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రకటించలేదు. పూర్తయ్యేదెన్నడో.. కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గాన్ని 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ మంజూరు చేసింది. రూ.రెండు వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రైల్వే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ రూ.40 కోట్లు కేటాయించింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.40 కోట్లను కేటాయించడంతో రూ.80 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2010-11 బడ్జెట్లో రూ.56 కోట్లు, 2011-12 బడ్జెట్లో రూ.60 కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. 259 కి.మీల పొడవున ఈ రైలుమార్గం నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 21 కి.మీ. పొడవున చేపట్టిన రైలు మార్గం పనులు కూడా నిలిచిపోయాయి. 2013-14 బడ్జెట్లో గానీ.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోగానీ ఈ రైలు మార్గానికి ఒక్క పైసా నిధులను కేటాయించలేదు. ఇప్పుడు మంత్రి సదానందగౌడ కూడా ఈ రైలుమార్గానికి ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఒప్పందం ప్రకారం ఈ రైలుమార్గం 2015 నాటికి పూర్తికావాలి. నిధుల కేటాయింపు ఇలానే ఉంటే.. ఈ రైలుమార్గం పూర్తికావాలంటే కనీసం రెండున్నర దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని 2009-10 బడ్జెట్లో నిర్ణయించాయి. రూ.1314 కోట్ల వ్యయంతో 309 కి.మీ. ల పొడవున ఈ రైలుమార్గం నిర్మించడానికి ప్రణాళిక రూపొం దించారు. ఈ రైలు మార్గానికి 2013-14 బడ్జెట్లో కేవలం రూ.కోటి మాత్రమే కేటాయించారు. ఆ నిధులు సర్వేకు కూడా సరి పోవు. ఈ ఏడాది బడ్జెట్లో ఆ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ రైలుమార్గం మరుగునపడినట్లే లెక్క!! చంద్రబాబు వల్లెవేసిన చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కన్పించకపోవడం గమనార్హం. కొత్త రైళ్లు ఏవీ..? రైలుమార్గానికి నిధుల విషయంలోనే కాదు.. కనీసం కొత్త రైల్వే సర్వీసులను మంజూరు చేయడంలోనూ మంత్రి సదానందగౌడ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైళ్లను మంజూరు చేస్తారనే భావనను సదానందగౌడ తుంచేశారు. తిరుపతి-వారణాసి, తిరుపతి-షిర్డీ ఎక్స్ప్రెస్ రైళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి.రేణిగుంటలోని కోచ్ రిపేర్ వర్క్ షాప్ సామర్థ్యాన్ని విస్తరించడంపై కూడా రైల్వే బడ్జెట్లో స్పష్టత లేదు. జిల్లాకే కాదు.. రాష్ట్రానికి అదే రీతిలో అన్యాయం జరిగింది. ఇంత అన్యాయం జరిగినా సీఎం చంద్రబాబుగానీ.. టీడీపీ ప్రజాప్రతినిధులుగానీ నోరుమెదపకపోవడం గమనార్హం. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూశానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్డీఐల చాటున ప్రైవేటీకరణ రైల్వే మంత్రి సదానందగౌడ రైల్వేల్లో ఎఫ్డీఐలను ఆహ్వానిస్తున్న ట్లు చెప్పడం వెనుక రైల్వే ప్రైవేటీకరణ దాగి ఉంది. అయితే రైల్వే ఆపరేషనల్ విభాగంలో ఎఫ్డీఐలను మినహాయిస్తున్నట్లు చెప్పి నా రైల్వే ప్రైవేటీకరణకు ఇది శ్రీకారం చుట్టినట్టే. ఈ అంశాన్ని ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తాం. - కుప్పాల గిరిధర్కుమార్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ సీఎం సొంత జిల్లా అంటే లెక్కలేదా..? రైల్వే బడ్జెట్లో చేసిన కేటాయింపులు చూస్తే సీఎం జిల్లా అంటే కేంద్రానికి లెక్క లేనట్లుంది. కనీసం తిరుపతి, చిత్తూరును పరిగణనలోకి కూడా తీసుకోకుండా బడ్జెట్ ప్రకటన చేయడాన్ని సీఎం కూడా సీరియస్గా భావించి మార్పులు చేయించాలి. సీఆర్ఎస్ అభివృద్ధి ఊసే ఎత్తకపోవడం బాధాకరం. - కారుమంచి రాజు, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సంఘం పెండింగ్ ప్రాజెక్ట్లకు కమిటీ నాన్చుడుకే.. విభజన జరిగాక ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్లపై ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు చెప్పడం నాన్చుడు ధోరణికే అని సామాన్యునికి కూడా అర్థమయింది. నిధులు, కొత్త రైళ్ల కేటాయింపులో తిరుపతికి ప్రతిసారీ అన్యాయమే జరుగుతోంది. దీన్ని రాష్ట్ర ఎంపీలు తీవ్రంగా పరిగణించాలి. - సుదర్శన్ రాజు, రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ దేశ సమగ్రత అంటే ఇదేనా? ఎన్నికలకు ముందు దేశ సమగ్రత అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రైల్వే మంత్రి ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రిక్తహస్తం చూప్పారు. ఇదేనా సమగ్రత అంటే? రాయలసీమకు రైల్వే జోనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారనుకుంటే మొండిచేయి చూపారు. పీపీపీ విధానంతో ఉద్యోగులను సాగనంపడానికే ప్రాధాన్యం ఇచ్చారు. - గుండ్లూరు వెంకటరమణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొత్త సీసాలో పాత సారా.. బీజేపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్ను పరిశీలిస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్లే ఉంది. గతంలో రైల్వే ఉద్యోగుల కోసం కనీసం కొద్దోగొప్పో కొన్ని పథకాలైనా ప్రకటించారు. ఈ సారి అది కూడా లేకపోగా, గుంతకల్ డివిజన్కే బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. - కే.కళాధర్, గుంతకల్ డివిజన్ ఆర్ఎంయూ కార్యదర్శి మహిళా రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి రైల్వేలో మహిళా ప్రయాణికుల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ దిశగా భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేస్తామన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లను తక్షణం నియమించాలి. - ఎన్.విజయలక్ష్మి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు కాంగ్రెస్ హయాంలో నేను రైల్వే ప్యాసింజర్స్ అమినిటీస్ కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఉన్నప్పుడే తిరుపతికి డబుల్ డెక్కర్ రైలును మంజూరు చేయించా. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు, సొంత జిల్లాకు రైల్వేలో ప్రాధాన్యం ఇప్పించుకోకపోవడంపై ప్రజలకు ఇప్పుడేం చెబుతారు? ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం. - మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ రైల్వే పీఏసీ సభ్యుడు అరచేతిలో వైకుంఠం చూపింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి, ఇప్పుడు ప్రతి అంశంలో మోసం చేస్తోంది. ధరల బాదుడుకు బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్నికల అనంతరం బీజేపీ అసలు రంగు బయట పడుతోంది. - బట్టు రామారావు,ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా అధికార ప్రతినిధి చేతగానితనం చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనానికి ఇదే నిదర్శనం. రైల్వే బడ్జెట్ రూపకల్పన సమయంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అప్పట్లో ప్రతి పాదనలు పంపకుండా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మూడురోజుల ముందు హడావుడిగా ప్రతిపాదనలు పంపింది. నెల రోజుల ముందే వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రతిపాదనలు ఇచ్చాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం మేల్కొని ఉంటే రాష్ట్రానికి.. మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి సమన్వయ కమిటీని నియమించడం కేవలం కాలయాపన చేయడం కోసమే. ఇంత అన్యాయం జరిగినా టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుమెదకపోవడంలో ఆంతర్యమేమిటో..? - పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట ఇదెక్కడి చోద్యం..? రైల్వే బడ్జెట్లో రాష్ట్రంతోపాటూ జిల్లాకు న్యాయం చేయాలని నెల కిత్రం వైఎస్సార్సీపీ ఎంపీలు అందరూ కలిసి మంత్రి సదానందగౌడ, ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉంటే.. రాష్ట్రానికి, మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇప్పుడైనా చంద్రబాబు స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు బీరాలు పలకడానికి తప్ప దేనికీ పనికిరాడన్నది మరోసారి స్పష్టమైంది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గానికి నిధులు, రేణిగుంట సీఆర్ఎస్ విస్తరణ, తిరుపతి నుంచి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు మంజూరు చేసే వరకూ మడమ తిప్పకుండా పోరాటం చేస్తాం. - వరప్రసాద్, ఎంపీ, తిరుపతి -
ఏపీ, తెలంగాణలకు అన్యాయం: వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొత్తపల్లి గీతలతో కలిసి మేకపాటి రాజమోహనరెడ్డి పార్లమెంటు వెలుపల మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని, కమిటీ వేసి చర్చించి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఆ కమిటీ ఏమిటో, ఎప్పుడు వేస్తారో..! ఈ ప్రాజెక్టుల్లో వేటిని ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం’’ అని అన్నారు. ‘‘విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో కనెక్టివిటీ, విశాఖకు మెట్రో రైలు ప్రస్తావన లేదు. అనేక ఏళ్ల కిందట మంజూరై, బడ్జెట్లో ఆమోదం పొంది అమలుకు నోచుకోని ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, ఎర్రగుంట్ల-నంద్యాల, కర్నూలు-మంత్రాలయం సహా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ప్రస్తావనే లేదు’’ అని విమర్శించారు. -
కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీకి స్థలం అందాలి: శ్రీవాస్తవ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ వాస్తవికతకు అనుగుణంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం రూ.5 కోట్లు కేటాయించారని చెప్పారు. నిధుల కేటాయింపు పెద్దగా సమస్య కాదని, ఫ్యాక్టరీకీ కావలసిన స్థలమే ముఖ్యమని పేర్కొన్నారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 125 ఎకరాల భూమిని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తోనూ తాను మాట్లాడానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకే కాకుండా రాష్ర్టంలో ఎక్కడైనా రైల్వేల అభివృద్ధికి భూములను కేటాయించడంతో పాటు, అవసరమైన నిధులు, సహాయ సహకారాలను అందజేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
ఒడిశా ఒత్తిడితోనే జోన్ గల్లంతు!
సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు దాదాపు ఖాయమైనా, దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడానికి ఒడిశా ప్రభుత్వం ఒత్తిడే కారణమని తెలిసింది. వాల్తేరు డివిజన్లో భాగంగా ఉన్న విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. ఇక్కడ కొత్త జోన్ ఏర్పాటు చేస్తే ఒడిశా ప్రాంతాలను వాల్తేరు డివిజన్ను నుంచి వేరుచేసి, తెలుగు ప్రాంతాలను మాత్రమే అందులో కొనసాగిస్తారు. ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్కు వాల్తేరు డివిజన్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ డివిజన్ లేకపోతే ఆ జోన్కు ఆదాయం దారుణంగా పడిపోయి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేం ద్ర మోడీని కలిసి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్ను వేరే చేస్తే నార్త్ కోస్ట్ జోన్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ప్రధానికి చెప్పినట్లు తెలిసింది. -
ఈ రైలూ ఎల్లిపోయె..!
శ్రీకాకుళం సిటీ:బడ్జెట్ రైలులో శ్రీకాకు ళం జిల్లాకు బెర్త్ దొరకలేదు.. ఆసలు ఆ రైలు జిల్లాలో ఎక్కడా ఆగనే లేదు. గత కొన్నేళ్లుగా జిల్లావాసులకు ఇదే అనుభవం ఎదురవుతున్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కు ఏదేదో చేసేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు చేసిన ఆర్భాటంతో ఈసారి ఎంతోకొంత మేలు జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఈ ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లా ప్రజల అవసరాలు తీర్చే ఒక్క లైను గానీ, ఒక్క రైలుగానీ.. చివరికి బెర్తుల కోటా పెంపు, అదనపు హాల్టులు చిన్నపాటి కోర్కెలను సైతం తీర్చేందుకు రైల్వే మంత్రి ప్రయత్నించలేదు. ఈ బడ్జెట్లో జిల్లాకు కొంత సంబంధం ఉన్న అంశం ఒక్కటే కనిపించింది. అదే కొత్తగా ప్రతిపాదించిన విశాఖ-పరదీప్ వీక్లీ రైలు. జిల్లా మీదుగా ఇది ప్రయాణించినా వీక్లీ ఎక్స్ప్రెస్ అయినందున జిల్లాలో హాల్టులు ఉంటాయో లేదో తెలియదు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే వంటి కీలక రవాణా వ్యవస్థల్లో మరింత మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రాజెక్టులు అత్యావశ్యకం. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లాలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామికం గా అభివృద్ధి చెందే అవకా శం కూడా ఉం టుంది. అయి తే రైల్వే మం త్రి ఈ విష యం పట్టించుకోలేదు. మన జిల్లా, రాష్ట్ర ప్రజాప్రతినిధుల నిర్లిప్తత కూడా ఈ నిర్లక్ష్యానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెరవేరని డిమాండ్లు రైల్వేల పరంగా జిల్లా నుంచి ఎన్నో డిమాండ్లు.. మరెన్నో ప్రతిపాదనలు ఏళ్ల తరబడి ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న మత్య్సకారులు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్తుంటారు. అలాగే ఒడిశా సరిహద్దులో ఉన్న ఆంధ్ర ప్రాంతాల నుంచి రాయ్పూర్, భిలాయ్, తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. జిల్లా నుంచి ఈ ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. శ్రీకాకుళం-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-పలాస ఈఎంయు ఇచ్ఛాపురం వరకు పొడిగింపు, పలాస-రాయగడ రైళ్లు వేయాలన్న డిమాండ్ ఉంది. కోణార్క్, ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైళ్లకు నౌపడ జంక్షన్లో హాల్ట్ ఇవ్వాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇక జిల్లా మీదుగా నడుస్తున్న షిర్డీ-హౌరా, చెన్నై- షాలీమార్, తిరుపతి- సంత్రగచ్చి, చెన్నై- గువహతి, విశాఖ-దిఘా, విల్లుపురం-ఖరగ్పూర్, పాండిచ్చేరి- హౌరా, రామేశ్వరం-భువనేశ్వర్, హౌరామైసూర్ తదితర 9 రైళ్ల కు ఎక్కడా హాల్ట్లు లేవు. ఈ రైళ్లను ఆమదాలవలస, పలాసల్లో నిలపాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్లో ప్రకటించిన గుణుపూర్-విశాఖపట్నం పాసింజర్ రైలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోలేదు. కలగానే రాజాం లైను పారిశ్రామిక పట్టణంగా పేరున్న రాజాంకు ప్రధాన రైల్వేలైనుతో కలిపేలా.. పొందూరు నుంచి రైల్వే లైను వేయాలన్న ప్రతిపాదన కలగానే మిగిలిపోతోంది. 2011-12 బడ్జెట్లో ఈ లైను ఏర్పాటుపై సర్వే చేస్తామని ప్రస్తావించారు. అయితే ఇంతవరకు ఒక్క పైసా కూడా విదల్చలేదు సరికదా.. కొత్త బడ్జెట్లో ఆ ఊసే లేదు. ఈ లైను నిర్మిస్తే శ్రీకాకుళం, విజ యనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం స్టేష న్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామని గత బడ్జెట్లో ప్రకటిం చినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ప్రత్యేక కమిటీయే తారకమంత్రమా? రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెండింగు ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల మంజూరుకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పి రైల్వే మంత్రి చేతులు దులుపుకొన్నారు. అన్నింటికీ అదే తారక మంత్రం అన్న ట్లు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయా లు తీసుకుంటామని తేల్చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు మేలు చేకూర్చే విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు, కొత్త రైళ్లు, ఇతర ప్రాజెక్టుల మంజూరీలన్నీ ఆ కమిటీ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడ్డాయన్నది స్పష్టమైపోయింది. మొండి చెయ్యి చూపారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే మంత్రి అసంతృప్తి మిగిల్చారు. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల విషయంలోనూ మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఎన్నో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తామని నమ్మబలి కి, ఇప్పుడు మోసం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి ఆశోక్గజపతిరాజు, విశాఖ, శ్రీకాకుళం ఎంపీలు ఈ విషయంలో విఫలమయ్యారు. విశాఖ రైల్వే జోన్తోపాటు పలు రైల్వే ప్రాజెక్టుల సాధనకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. -ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ -
మారనున్న ఏపీ ఎక్స్ప్రెస్ పేరు!
సాక్షి, హైదరాబాద్: అందరికీ సుపరిచితమైన... సికింద్రాబాద్- ఢిల్లీ మధ్య నడిచే ‘ఏపీ ఎక్స్ప్రెస్’ పేరు మారనుంది. రైల్వే బడ్జెట్లో విజయవాడ- ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టనున్న రైలును ‘ఏపీ ఎక్స్ప్రెస్’గా పేర్కొన్నారు. రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏపీ ఎక్స్ప్రెస్ పేరును ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు. ఇక సికింద్రాబాద్- ఢిల్లీ రైలుకు ఏ పేరు పెడతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, కాకతీయ ఎక్స్ప్రెస్ల పేరుతో ఇప్పటికే రెండు రైళ్లు నడుస్తున్నాయి. కాబట్టి మరో కొత్త పేరు ఏదైనా పెడతారా? లేక తెలంగాణ, కాకతీయ ఎక్స్ప్రెస్లలో ఒక పేరును సికింద్రాబాద్- ఢిల్లీ రైలుకు బదలాయిస్తారనే ఆనేది వేచిచూడాలి. -
రెడ్ సిగ్నల్..!
కడప అర్బన్/వైవీయూ : ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో వైఎస్ఆర్ జిల్లా రైల్వే ప్రాజెక్టులకు రెడ్సిగ్నల్ పడింది. జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పలు రైల్వేలైన్లు, ప్రాజెక్టులపై రైల్వే మంత్రి సదానందగౌడ ఎటువంటి కనికరం చూపలేదు. బ్రిటీష్ పాలకుల హయాంలో ఏర్పాటు చేసిన రైలు మార్గాలు మినహా జిల్లాకు మరో రైలు మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటూ చెప్పకనే చెప్పారు. నందలూరులో రైల్వేపరిశ్రమను తీసుకువస్తామని గతంలో పలుమార్లు చెప్పినా ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు కనపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాన్యుడికి మేలుచేస్తాడని అందలం ఎక్కిస్తే ఓవైపు చార్జీల మోత మోగిస్తూ మరోవైపు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తరైలు ఇవ్వకపోవడంతో పాటు ప్రారంభమైన మార్గాలను విస్మరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కడప- బెంగుళూరు మార్గం.. కడప జిల్లా ప్రజల చిరకాలం వాంఛ అయిన కడప-బెంగుళూరు నగరాల మధ్య రైల్వేలైను ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రూ. 1784 కోట్లతో అంచనాలు వేశారు. 2010లో కడపను సందర్శించిన రైల్వేశాఖ సహాయమంత్రి మునియప్ప సైతం ఈ మార్గాన్ని 5 సంవత్సరాల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించి నాలుగు సంవత్సరాలు పైగా కావస్తున్నా ఎటువంటి పురోగతి లేదు. కేవలం కడప -పెండ్లిమర్రి మధ్య 23 కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వేలైను ఎర్త్పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వేలైను పనుల పట్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వ సమానభాగస్వామ్యంతో నిర్మించడానికి సిద్ధం చేశారు. 2009-10 సంవత్సరానికి రూ. 1 కోటి, 2010-11 సంవత్సరానికి రూ. 58 కోట్లు (29+29), 2011-12 సంవత్సరానికి రూ. 100 కోట్లు (50+50), 2012-13 సంవత్సరానికి రూ. 38 కోట్లు, 2013-14 సంవత్సరానికి రూ. 70 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. మొ త్తం మీద రూ. 230 కోట్లు నిధులు మాత్రమే విడుదల కావడం గమనార్హం. తాజాగా విడుదలైన ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. అటకెక్కిన సర్వేలు... ప్రొద్దుటూరు-కంభం మధ్య 130కిలోమీటర్ల మేర రూ. 800 కోట్లతో రైలు మార్గానికి సర్వేలు చేశారు. గత బడ్జెట్లో అనుమతి లభించినా ఈ సారి నిధులు కేటాయించకపోవడంతో సర్వేదశలోనే నిలిచిపోనుంది. అదే విధంగా భాకరాపేట-గిద్దలూరు మధ్య రైల్వేమార్గం సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా నిర్మించేందుకు సర్వేచేపట్టిన సర్వేలకు సైతం నిధులు లేకపోవడంతో ముందుకువెళ్లే అవకాశం లేకపోయింది. చెదిరిన కల.. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి కొత్తరైల్వేజోన్తో పాటు మెట్రోరైళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం పునర్విభజన బిల్లులోని ఏ అంశాన్ని పట్టించుకోకపోవడం దారుణం. ఏపీ రైల్వే అభివృద్ధికి కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించడం పట్ల కమిటీలు అంటే విసిగిపోయిన సీమాంధ్రులు విశ్వసించడం లేదు. వారానికి ఒక్కరోజు వచ్చే రైళ్లను కూడా డైలీరైళ్లుగా మార్చకపోవడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊసేలేని ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గం.. ఓడల అనుసంధానానికి నిధులు విడుదల చేసిన మంత్రి ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు మార్గానికి పైసా కూడా విదల్చలేదు. వీటి మధ్య 113 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.930 కోట్లు అంచనావేశారు. దీనికోసం 2012-13లో రూ. 6 కోట్లు, 2013-14లో రూ. 96.9 కోట్లు విడుదల చేశారు. అయితే కేవలం 10 కిలోమీటర్ల ఎర్త్వర్క్ మాత్రమే జరగడం గమనార్హం. ఈ మార్గం సిద్ధమైతే నెల్లూరు మీదుగా విజయవాడ వెళ్లేందుకు మార్గం దగ్గరవుతుంది. కాగా కృష్ణపట్నంపోర్టు ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేసిన కేంద్రం ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మార్గానికి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం. ఈ మార్గానికి అధిక నిధులు ఇవ్వాల్సి ఉన్నా దీని ఊసే లేకపోవడం విచారకరం. -
రైల్వే బడ్జెట్పై.. నేతల అభిప్రాయాలు
ఇది పీపీపీ బడ్జెట్: వినోద్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం లో అంతా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) అన్న పదమే ఉందని, ఇది రైల్వే బడ్జెట్ అన డం కన్నా పీపీపీ బడ్జెట్ అంటే బాగుంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఈ విధానం గతంలోనూ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. పార్లమెంట్ సమావేశం అనంతరం విజ య్చౌక్లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలు, రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎలాంటి ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేయడాన్ని వినోద్ తప్పుపట్టారు. రైల్వే బడ్జెట్ నిరాశపర్చింది: ఎంపీ కవిత రైల్వే బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందని టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని, అయితే చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పాత ప్రాజెక్టులను సైతం కమిటీ నివేదిక వరకు ఆగాలనడం బాధాకరమన్నారు. రెండింటికీ మొండిచెయ్యే: గుత్తా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ స్వాతంత్య్ర చరిత్రలోనే చెత్తదిగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మెండిచెయ్యి దక్కిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏం ఒత్తిడి తెచ్చారు. మసిపూసి మారేడుకాయ చేయలేదు: కిషన్రెడ్డి ‘‘రైల్వే బడ్జెట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉంది. ఏ రాష్ట్రాన్నీ చిన్నచూపు చూడకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడుగాయ చేయకుండా ప్రజలకు భద్రతతో కూడిన బడ్జెట్ను సిద్ధం చేయటం అభినందనీయం. 14 వేల మంది రైల్వే పోలీసుల నియామకం, 4 వేల మంది మహిళా పోలీసుల ఏర్పాటు లాంటివి దీనికి నిదర్శనం. ప్రజలంతా ఈ బడ్జెట్ను స్వాగతిస్తారని ఆశి స్తున్నా. అమలు చేయలేని హామీలివ్వటం కం టే... చేయదగ్గ పనులనే ప్రస్తావించటం మంచి చర్య. తెలంగాణకు రెండు సెమీ బుల్లెట్ రైళ్లను కేటాయించటం సంతోషకరం’ సాధారణ బడ్జెట్ చూశాక స్పందిస్తాం: యనమల కేంద్ర సాధారణ బడ్జెట్ను కూడా చూశాక తమ స్పందన తెలియచేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైల్వే బడ్జెట్పై వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బడ్జెట్ను రైల్వే మంత్రి చదువుతున్నప్పుడు విన్నామే తప్ప అందులో ఏమేమున్నాయో పూర్తిగా చూడలేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణకు సంబంధించి 29 ప్రాజెక్టులున్నాయని, వాటిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. జనాకర్షణకు స్వస్తి: జేపీ జనాకర్షణ సంస్కృతికి స్వస్తి చెప్పి రవాణాలో మెరుగైన మౌలిక వసతులకు పునాది వేసేందుకు రైల్వే బడ్జెట్ ద్వారా కేంద్రం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం దశాబ్దాకాలం పాటు అనుసరించిన తాత్కాలిక ధోరణులను విడిచిపెట్టి, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ రైల్వే మంత్రి వ్యవహరించడం స్వాగతించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆశించినట్లు లేదు: బీజేపీ ఏపీ శాఖ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే తీరున రైల్వే బడ్జెట్ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి. విష్ణుకుమార్రాజు ‘సాక్షి’తో అన్నారు. బడ్జెట్ గురించి తాము ఊహిం చింది ఒకటి, జరిగింది మరొకటి అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఆశించామని.. అలాం టి ప్రకటన లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో కొత్త జోను ప్రకటించకపోయినా ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తీవ్ర నిరాశ మిగిల్చింది: వామపక్షాలు కేంద్ర రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశ మిగి ల్చిందని సీపీఐ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణ వైపే పరుగులు తీస్తున్నట్టు కని పించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని భావిం చినా నిరాశే మిగిలిందని చెప్పారు. విజయవాడ-న్యూఢిల్లీ మధ్య రైలు మినహా రాష్ట్రానికి బడ్జెట్లో దక్కిందేమీ లేదన్నారు. -
ఆశలు అడియాసలే..!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో బడ్జెట్ రైలు పరుగులు తీసింది. కానీ తెలంగాణవైపు మళ్లకుండా వెళ్లిపోయింది. ఆశలపై నీళ్లు చల్లుతూ.. అంచనాలను తలకిందులు చేస్తూ .. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం వెక్కిరించింది. లక్షన్నర కోట్ల భారీ బడ్జెట్తో రైల్వేలు మురిపించినా.. తెలంగాణకు దక్కింది మాత్రం కొన్ని వందల కోట్లే! మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ైరె ల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రకటించినవి నాలుగు రైళ్లు కాగా.. అవన్నీ వారానికోసారే(ఒక్కటి మాత్రం రెండు సార్లు) ప్రయాణికులను పలకరిస్తాయి. రెండు రైళ్లు రాష్ర్టం నుంచే ప్రారంభమవుతుండగా.. మరో రెండు మాత్రం ఈ ప్రాంతం మీదుగా వెళతాయి. తాజా బడ్జెట్లో తెలంగాణకు దక్కింది ఇంతే! గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల కాలంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుండగా.. తాజాగా మోడీ ప్రభుత్వం అంతకంటే చిన్నచూపే చూశారు. రైల్వేల ఆర్థిక స్థితి సరిగా లేదని, పదేళ్లుగా ప్రకటించిన పథకాలకు సరిపడా నిధులు లేనందున కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేమని వారం క్రితమే ఆయన కుండబద్దలు కొట్టినా.. అంతకుమించిన రీతిలో తెలంగాణ ను నిర్లక్ష్యం చేశారు. కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకున్నా.. ఇప్పటికే మొదలైన పనులకు నిధుల కేటాయింపు. కీలక మార్గాల్లో డబ్లింగ్ పనుల పూర్తి, కొత్త రైళ్లు, ఉన్నవాటి నిడివి పొడగింపు తదితరాల విషయంలో రాష్ర్ట ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆది నుంచీ రైల్వే మార్గాల విషయంలో బాగా వెనకబడి ఉన్నందున.. కొత్త రాష్ర్టంగా ఏర్పడినందున ప్రోత్సాహకరంగా నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇవ్వకుండా.. పాతవాటినే పూర్తి చేయాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరారు. కానీ రైల్వే మంత్రి సదానంద గౌడ ఇవేవీ పట్టించుకోలేదు. ప్రాజెక్టులు సరే... రైళ్లేవి? గత బడ్జెట్లో 11, అంతకుముందు 15, ఆపైయేడు 17.. ఇలా దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లు వచ్చాయి. వాటిని చూసే ప్రజలు పెదవి విరిచారు. అలాంటిది ఈసారి ఆ స్థాయిలో కూడా కొత్త రైళ్లను కేటాయించలేదు. కేవలం నాలుగు ైరె ళ్లను మాత్రమే ప్రకటించారు. ఒకటి హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్ప్రెస్. ఇది వారానికి ఒక్కసారే తిరుగుతుంది. ప్రీమియం రైలు కావడంతో దీని టికెట్ రేట్లు పేలిపోతాయి. వెరసి ఇది ఫ్రీక్వెన్సీ, టికెట్ ధరల పరంగా ఏమాత్రం అనుకూలం కాదు. కాజీపేట-ముంబై మధ్య మరో రైలును ప్రకటించారు. అది కూడా వారానికి ఒక్క రోజే నడుస్తుంది. ఇవి కాకుండా తెలంగాణ మీదుగా వెళ్లేవి మరో రెండున్నాయి. వారానికోరోజు నడిచే జైపూర్-మధురై ప్రీమియం ఎక్స్ప్రెస్తో పాటు వారానికి రెండు రోజులు నడిచే అహ్మదాబాద్-చెన్నై (వయా వసాయ్ రోడ్డు) ఎక్స్ప్రెస్ను కేంద్రం ప్రకటించింది. ఇవి కూడా ప్రజలకు అంతగా ఉపయోగపడేవి కావు. సెమీ బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లేదెన్నడు? హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ మార్గాలను ఆధునీకరించి.. హైస్పీడ్ సెమీ బుల్లెట్ రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు. వీటి గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇందుకు లైన్ల పటుత్వాన్ని బాగా మెరుగుపరచాల్సి ఉంటుంది. కాపలా లేని లెవల్ క్రాసింగ్లు ఉండకూడదు. ఇదంతా జరగాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్లో ఇందుకు ప్రతిపాదించింది కేవలం రూ. 100 కోట్లు. అర్థం కాని కమిటీ.. అంతుచిక్కని ఆలోచన! ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనను కమిటీకి అప్పగిస్తామనడం గందరగోళంగా ఉంది. ఆ కమిటీ ఏంటో, దానికి పెండింగు ప్రాజెక్టుల బాధ్యత ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటో అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకారం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల ఏర్పాటును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో గతంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీలలో 29 పెండింగ్ (పనులు కొనసాగుతున్నవి) ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే ఈ ప్రాజెక్టుల విషయం తేల్చే బాధ్యతను ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగిస్తున్నామని, అందులో రైల్వే అధికారులతోపాటు రెండు రాష్ట్రాల అధికారులుంటారని, తాను స్వయంగా వారితో చర్చిస్తానని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. విభజన సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఐదుగురు రైల్వే అధికారులు తప్ప ఇరు రాష్ట్రాల ప్రతినిధులు లేరు. మరి మంత్రి చెప్పేది అదే కమిటీనా, వేరే కమిటీనా అన్నది దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కూడా అర్థం కావడం లేదు. ఎంఎంటీఎస్ది నత్తనడకే! ఎంఎంటీఎ స్ రెండో దశకు ఈసారి కూడా మొండిచేయే ఎదురైంది. స్మార్ట్ సిటీ ఫార్ములాను కేంద్రం సిద్ధం చేసి న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆశించారు. కానీ కేవలం రూ. 20 కోట్లతోనే కేంద్రం సరిపెట్టింది. దీంతో రైల్వే శాఖ ఇప్పటివరకు కేటాయించిన నిధుల మొత్తం రూ. 40 కోట్లకు చేరుకోగా రాష్ట్రప్రభుత్వం వాటాగా రూ. 80 కోట్లు ఇచ్చింది. రైల్వే నుంచి రూ. 60 కోట్లు వస్తే పనులు వేగిరమయ్యేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు.రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల కంటే అందంగా తీర్చిదిద్దాలంటూ ఇటీవల స్వయంగా ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో... సికింద్రాబాద్ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ప్రాజెక్టుకు నిధులు వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ బడ్జెట్లో దాని ఊసే లేదు. -
రైల్వే బడ్జెట్.. అన్నింటికీ కలిపి రూ.473.28 కోట్లే..
కొత్త లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి.. తదితర పనుల కోసం ప్రణాళికా వ్యయం కింద సుమారు రూ. 473.28 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో స్వర్ణ చతుర్భుజి, పోర్టుల అనుసంధానం ప్రాజెక్టుల అమలుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అమలు చేస్తున్న ప్రాజెక్టులనూ చూపించారు. ఆర్వీఎన్ఎల్ నిధులు సమకూర్చుకోవడంలో రైల్వే శాఖ అన్ని రకాలుగా సహకరిస్తుంది. కానీ ప్రాజెక్టుల వారీగా నేరుగా నిధులు కేటాయించదు. ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్లో పనుల కోసం రైల్వే కేటాయించిన నిధులు సుమారు రూ.152.28 కోట్లే. 142 కిలోమీటర్ల పొడవైన కంభం-ప్రొద్దుటూరు కొత్త లైన్కు కేవలం రూ. 10 లక్షలు కేటాయించారు. మరీ కంటితుడుపు కేటాయింపులకు ఇదో ఉదాహరణ. మరికొన్ని కేటాయింపులు ఇలా ఉన్నాయి.. * కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత మండలం వెంకటాచలం మీదు గా కృష్ణపట్నం వరకు కొత్త రైల్వే లైన్ (ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టు)కు బడ్జెట్లో రూ. 208 కోట్లు కేటాయించారు. ఓబుళవారిపల్లె - వెంకటాచలం మీదుగా కృష్ణపట్నం పోర్టు వరకు ఈ లైన్ నిర్మిస్తారు. * కడప - బెంగళూరు రైల్వే లైన్ (255.4 కిలోమీటర్లు)లో పెండ్లిమర్రి వరకు నిర్మాణం పూర్తయింది. ఇందుకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లో కేవలం రూ.30 కోట్లు కేటాయించారు. రాయలసీమలో సరకు రవాణాకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అప్రాధాన్య కోటాలో వేశారు. * కదిరి- పుట్టపర్తి, కాకినాడ - నిజాంపట్నం ఓడరేవు క్తొత రైల్వే మార్గాలకు నిధుల కేటాయింపులు లేవు. * కొండపల్లి - కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.611 కోట్లు అవసరమైతే రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. * 2006లో ఆమోదముద్ర వేసిన జగ్గయ్యపేట - మల్లెలచెరువు లైను నిర్మాణానికి రూ.60 కోట్లే కేటాయించారు. ఇంకా రూ.100 కోట్లు అవసరం. * కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 912 కోట్లు అవసరం కాగా రూ.10 కోట్లు కేటాయించారు. * గూడూరు-దుగరాజపట్నం రైల్వే లైను (41.55కిలోమీటర్లు)కు రూ. 272 కోట్లు అవసరం కాగా రూ. 5 కోట్లతో సరిపెట్టారు * నంద్యాల -ఎర్రగుంట్ల మార్గానికి (126 కిలోమీటర్లు) రూ.80 కోట్లు ఇచ్చారు. * కాకినాడ - పిఠాపురం లైనుకు (21.5 కిలోమీటర్లు) రూ.కోటి ఇచ్చారు. * కోటిపల్లి - నర్సాపూర్ మార్గానికి (57.21 కి.మీ) రూ.10 కోట్లు. * నడికుడి - శ్రీకాళహస్తి లైనుకు (309 కిలోమీటర్లు) రూ.10 కోట్లు ఇచ్చారు. * విజయవాడ- గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపురం- నిడదవోలు లైను డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.712 కోట్లు అవసరమైతే గత బడ్జెట్లో రూ 40 కోట్లు కేటాయించగా, ఈసారి రూపాయీ కేటాయించలేదు. * గూడూరు-రేణిగుంట-తిరుపతి (92.34 కిలోమీటర్లు) డబ్లింగ్కు రూ.5 కోట్లు ఇచ్చారు. * ఆర్వీఎన్ఎల్ చేపట్టే గుత్తి-రేణిగుంట డబ్లింగ్కు రూ.4.18 కోట్లు, వెంకటాచలం - కృష్ణపట్నం డబ్లింగ్కు రూ.15 కోట్లు, గుంటూరు - తెనాలి డబ్లింగ్కు రూ.58 కోట్లు, విజయవాడ- గుడివాడ- భీమవరం డబ్లింగ్కు రూ.20 కోట్లు, గుంతకల్-రాయచూర్ డబ్లింగ్కు రూ.20 కోట్లు కేటాయించారు. * గుంటూరు - గుంతకల్ - కల్లూరు మార్గం గేజ్ మార్పిడికి (76 కిలోమీటర్లు) రూ.7 కోట్లు కేటాయించారు. * బీబీ నగర్ - గుడివాడ డబ్లింగ్, విద్యుదీకరణ, తిరుపతి-కాట్పాడి డబ్లింగ్, పాకాల - ధర్మవరం విద్యుదీకరణ పనులకు మోక్షం కలగలేదు. * గూడూరు - విజయవాడ మధ్య మూడో లైను, మంత్రాలయం రోడ్ - కర్నూలు, బిట్రగుంట - దొనకొండ, పిడుగురాళ్ల - నర్సరావుపేట, మార్కాపురం రోడ్డు - శ్రీశైలం, బాపట్ల - నిజాంపట్నం - రేపల్లె, గిద్దలూరు - బాకర్పూర్, నంద్యాల - ఆత్మకూరు, మచిలీపట్నం - రేపల్లె, విశాఖ - భద్రాచలం కొత్త రైల్వే లైన్లకు, గుంటూరు - గుంతకల్, తెనాలి - రేపల్లె డబ్లింగ్, విద్యుదీకరణ పనుల సర్వేలకు ఈ బడ్జెట్లో చోటు దక్కలేదు. -
మరోసారీ!
పాలమూరు జిల్లాకు మరోసారి అన్యాయం జరిగింది. రైల్వే బడ్జెట్లో జిల్లా ప్రస్తావనే లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు... పాతవాటి గురించి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంపీల ప్రతిపాదనల్లో కొన్నింటినైనా కేటాయిస్తారనుకున్న జిల్లావాసుల ఆశలు అడియాశలే అయ్యాయి. సాక్షి, మహబూబ్నగర్ : రైల్వే బడ్జెట్... ఎప్పటిలాగే పాలమూరుకు పాత కథే మిగిల్చింది. మంగళవారం రైల్వేమంత్రి సదానందగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లాకు కొత్త రైళ్లు వస్తాయని, డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపుతారని అంతా భావించారు. కానీ, ఎప్పటిలాగే ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. కీలకమైన గద్వాల- రాయిచూర్ మార్గానికి ఒక్క రైలూ కేటాయించలేదు. కేవలం డెమో రైలుతోనే నెట్టుకొస్తోంది. జిల్లాకు గతంలో ప్రకటించిన రైళ్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. గద్వాల - మాచర్ల వయా వనపర్తి మీదుగా వెళ్లాల్సిన రైల్వేలైన్పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, వాటి గురించి కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలక్నుమా- మహబూబ్నగర్ డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపలేదు. దీంతో రైల్ క్రాసింగ్ ఇబ్బందులు తప్పేట్లు లేదు. జిల్లా గుండా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు జరుపుతున్న డబుల్ డెక్కర్ రైలు ఇటీవల కాలంలో నిలిచిపోయింది. ఈ రైలు పునరుద్ధరణ పైనా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రాయిచూర్- గద్వాల మధ్య రైల్వేట్రాక్ అంతా సిద్ధమైనందున కొత్త రైళ్లు కేటాయిస్తారని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. గద్వాల మీదుగా చెన్నై- షిరిడీ మధ్య రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీపై కూడా స్పష్టత ఇవ్వలేదు. గద్వాల్ రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న 110 ఎకరాల స్థలంలో రైల్వే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం కాస్త అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. ఏళ్లు గడుస్తున్నా దానికి మోక్షం లభించడంలేదు. రైళ్ల రాకపోకల వల్ల తరచూ రహదారిపై ఉన్న గేట్ పడుతుండడంతో జడ్చర్ల వాసులను తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. ఎంపీ పంపిన ప్రతిపాదనల్లో కూడా ఆర్వోబీని ప్రముఖంగా ప్రస్తావించడంతో ఈ సారైనా స్థానం దక్కుతుందని ఆశపడ్డారు. కానీ, దానికి కూడా బడ్జెట్లో స్థానం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. గుడ్డిలో మెల్లగా మహబూబ్నగర్- మునీరాబాద్ రైల్వే లైన్కు మాత్రం ఈ సారి కచ్చితంగా 160 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. 50 రైల్వేగేట్ల వద్ద భద్రతకు చర్యలు దేశవ్యాప్తంగా కాపాలా లేని రైల్వేగేట్ల వద్ద భద్రత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది జిల్లాకు కొంత ఊరట కలిగించనుంది. ఇది అమలైతే జిల్లాలోని 50 కాపలాలేని రైల్వేగేట్ల వద్ద భద్రత పెరగనుంది. దీంతో కొంతవరకు ప్రమాదాలను అరికట్టగలిగే అవకాశం ఉంది. -
రైల్వే బడ్జెట్లో.. ఏపీపై కరుణ ఏది?
► రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి ► కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు ► పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రాజెక్టులకూ దిక్కులేదు ► ప్రత్యేక జోన్, మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు ► రాష్ట్రంలో ప్రారంభమయ్యే రైళ్లు మూడే..వీటిలో రెండు పాతవే.. ► రాష్ట్రం మీదగా 6 కొత్త రైళ్లు ► కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ఇతరత్రా పనులకు ఇచ్చింది సుమారు రూ.473.28 కోట్లే.. సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్లో మళ్లీ మొండిచేయే మిగిలింది. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. మంగళవారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నామమాత్రంగానే నిధులు విదిలించారు. చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రాలేదు. కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ బడ్జెట్లో చోటు దక్కలేదు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం జరి గిన ఆరు నెలల్లోగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా జోన్లోని వాల్తేరు డివిజన్తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విశాఖ లేదా విజయవాడ కేంద్రంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటనలు గుప్పించినా, బడ్జెట్లో నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన బిల్లు లో పేర్కొన్న విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో రైల్ ఏర్పాటుపై అపాయింటెడ్ డే (జూన్ 2) నుంచి ఆరు నెలల్లో సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి వుంది. బడ్జెట్లో ఈ ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా నేతల ప్రకటనలకే పరిమితమైంది.తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తామని గతంలో అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేరగలదని అందరూ భావించారు. డివిజన్ ఏర్పాటు అంశం బడ్జెట్లో ప్రస్తావించాల్సిన అవసరం లేదనీ, కమిటీ నివేదిక వచ్చాక ఏర్పాటవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎ క్లాస్ రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విశాఖలో వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటునూ కేంద్రం విస్మరించింది. గుంతకల్లులో రూ.100 కోట్లతో విద్యుత్ లోకో షెడ్ నిర్మింప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర పడలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీతో సరి.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్న హామీ కూడా మంత్రి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ ఏర్పాటు ప్రకటనతో సరిపెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రూ. 20,680 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి నిధుల కేటాయింపుపై నివేదిక ఇవ్వడానికి రైల్వే, ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదికను అనుసరించి ఇరు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఈ ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చారు. పాత రైళ్లే కొత్తవిగా.. రాష్ట్రం నుంచి 3 రైళ్లు కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో చూపించారు. వాస్తవానికి వీటిలో విజయవాడ - న్యూఢిల్లీ మధ్య రోజూ నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ మాత్రమే కొత్త రైలు. విశాఖపట్నం - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ వేస్తున్నట్లు బడ్జెట్లో చెప్పారు. అయితే, ఈ రైలు ఇప్పటికే విశాఖ - చెన్నైల మధ్య ప్రత్యేక రైలుగా నడుస్తోంది. దానినే వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చారు. పారదీప్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా ఇటువంటిదే. ఇప్పటికే పారదీప్ - శ్రీకాకుళంల మధ్య నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకు పొడిగించి, కొత్త రైలు మంజూరు చేసినట్లు చూపించారు. మరో 6 రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించేవి ఉన్నాయి. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు, షాలిమార్ - చెన్నై ప్రీమియం ఏసీ ఎక్స్ప్రెస్, జైపూర్ - మధురై, కమాఖ్య - బెంగళూరు ప్రీమియం ఎక్స్ప్రెస్లు, అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్ప్రెస్ (బైవీక్లీ), టాటానగర్ - బెంగళూరు ఎక్స్ప్రెస్ (వీక్లీ)లు రాష్ట్రం మీదుగా వెళ్తాయి. ఇవి మినహా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు బడ్జెట్లో ఒక్కటీ కనిపించలేదు. విజయవాడ నుంచి ముంబై, కోల్కతా నగరాలకు ప్రత్యేక రైళ్లు, తిరుపతి- షిరిడి రైలు ఊసే లేదు. -
రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్
రైళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. ఇందులోభాగంగా తినడానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు ఈట్) ఆహార పదార్థాలను రైళ్లలో అందించనున్నట్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ పార్లమెంట్లో వెల్లడించారు. నాణ్యత, భిన్నత్వం కోసం రైళ్లలో ‘రెడీ టు ఈట్’ ఆహార ఉత్పత్తులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక రైళ్లలో కేటరింగ్ సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మరో సంస్థతో తనిఖీలు(థర్డ్ పార్టీ ఆడిట్) నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ వ్యవస్థను రూపొందించనున్నట్లు ప్రతిపాదించారు. ఇందులోభాగంగా ఐవీఆర్ఎస్ విధానంలో ఆహార నాణ్యతపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే పద్ధతిని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. శుభ్రత, రుచి విషయంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసినపక్షంలో సదరు విక్రయదారుపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టును రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడికక్కడ స్థానిక రుచులను అందించనున్నట్లు, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్లు స్వీకరించే సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా న్యూఢిల్లీ-అమృత్సర్, న్యూఢిల్లీ-జమ్మూతావి సెక్షన్లలో ఈ సేవలను త్వరలోనేఅమలు చేయనున్నట్లు ప్రకటించారు. -
సదానందది ‘సంపన్నుల రైలు’
రైల్వే బడ్జెట్పై విపక్షాల ధ్వజం కేంద్రం అవమానించింది.. రగిలిపోతున్నా: మమత న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అసంబద్ధమైన రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇది నిరుపయోగమైన రైల్వే బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించగా సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం సమకూర్చే ఒడిశాకు ఒరిగింది ఏదీ లేదని బిజూ జనతాదళ్ ఆక్రోశించింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల పట్ల ఆదరణ చూపుతామన్న మోడీ సర్కారు హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టింది. దేశంలోని చాలా ప్రాంతాలను విస్మరించి నాలుగైదు నగరాల మధ్యనే ప్రాజెక్టులను పరిమితం చేశారని జేడీయూ తప్పుబట్టింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గిస్తారని భావించినా ఆ ఊసే లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైకు కొంత ఊరట తప్పితే మరాఠ్వాడా, విదర్భ, కొంకణ్ ప్రాంతాలను పట్టించుకోలేదని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ చెప్పారు. రైల్వే శాఖ మాజీ మంత్రులు లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ, పి.కె.బన్సల్, మల్లికార్జున ఖర్గే తాజా బడ్జెట్పై పెదవి విరిచారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పార్లమెంట్లో ఉండుంటే ఏం చేసేదాన్నో తనకే తెలియదని మమత రౌద్ర రూపం దాల్చారు. మోడీ సర్కారు బెంగాల్ను నిర్లక్ష్యం చేసిందని తిట్టిపోశారు. మరోవైపు దేశ రాజధానిలో కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ నివాసం వద్ద ఆందోళనకు దిగి ఆయన ఇంటికి ఉన్న నామ ఫలకాన్ని తొలగించారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారీ పోకడలో నడుస్తూ రైల్వేల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి అధిర్ రంజన్ చౌధురి ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో పేర్కొన్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ యూపీఏ విధానాలను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని తప్పుబట్టారు. సదానంద గౌడ ఇంటి వద్ద కాంగ్రెస్ నిరసన రైల్వేలో ప్రైవేటీకరణకు దారులు తెరవొద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఢిల్లీ త్యాగరాజ్ మార్గ-1లోని ఆయన ఇంటి ఎదుట సాయంత్రం ఆందోళన నిర్వహించారు. సదానంద గౌడ ఇంటి గేటు వద్ద ఆయన పేరుతో ఉన్న నామ ఫలకాన్ని తొలగించి కాళ్లతో తొక్కారు. రైల్వే మంత్రి కారు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సదానందగౌడ, ప్రధాని నరేంద్రమోడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల పెంచిన రైల్వే చార్జీలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. అయితే తమ కార్యకర్తలను వెంటనే మందలించినట్లు అర్విందర్ సింగ్ లవ్లీ తెలిపారు. బడ్జెట్లో ప్రకటించిన బుల్లెట్ రైళ్ల ప్రతిపాదనను కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. -
ముందే ప్రింటైపోయింది
న్యూఢిల్లీ: రాజ్యసభలో రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా మంగళవారం సభలో గందరగోళం తలెత్తింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ సమావేశమయ్యాక రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుండగా.. కాంగ్రెస్ నేత మధుసూదన్మిస్త్రీ అడ్డుపడ్డారు. చేతిలో ఒక దినపత్రికను పట్టుకుని ముందుకు వస్తూ రైల్వే బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించకముందే ఆ ప్రసంగం ఒక పత్రికలో ప్రచురితమైందని.. ఇది సభా హక్కుల ఉల్లంఘనేనని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయనకు మద్దతుగా సీపీఎం సభ్యులు కూడా లేచినిల్చుని మాట్లాడారు. అయితే.. ఈ అంశంపై నోటీసు ఇవ్వవచ్చని, లేదంటే బడ్జెట్పై చర్చకు కేటాయించిన సమయంలో లేవనెత్తవచ్చని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యుడు మిస్త్రీ ఆందోళనను కొనసాగిస్తుండగా.. గందరగోళం మధ్యే రైల్వేమంత్రి బడ్జెట్ను సమర్పించారు. అనంతరం సభను డిప్యూటీ చైర్మన్ బుధవారానికి వాయిదావేశారు. -
రైల్వే బడ్జెట్ లో జిల్లాకు మళ్లీ మొండిచేయే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ప్రాజెక్టులు దక్కకపోగా మళ్లీ టికెట్ చార్జీల పెంపు ఉండవచ్చంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ చేసిన ప్రకటన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాకు సంబంధించిన కొత్త రైల్వే లైనులు, రైళ్ల స్టాపింగ్లు, కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రాకు పూర్తి అన్యాయం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా అన్యాయం జరిగిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎప్పటి నుంచో ఈ ప్రాంతానికి రావాల్సిన నడికుడి - కాళహస్తి రైల్వేలైన్ ప్రస్తావన చేయకపోవడం బాధాకరమన్నారు. కడప - ఎర్రగుంట్ల రైల్వేలైన్తో పాటు ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆమోదం తెలపకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే మంత్రిలా బడ్జెట్ రూపొందించారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ - ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం - చెన్నై వీక్లీ ఎక్స్ప్రెస్ మినహా ఏ రైళ్లు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రస్తావించిన అంశాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విశాఖపట్నం మెట్రోరైలు, విజయవాడ - తెనాలి - గుంటూరుకు మెట్రోరైలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే రాజధాని నుంచి హైదరాబాద్కు రాపిడ్ ఎక్స్ప్రెస్లైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాలను కనీసం బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇంత ఘోరమైన రైల్వే బడ్జెట్ను చూడలేదని చెప్పారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వే మంత్రి సదానంద గౌడ పూర్తి నిరాశ మిగిల్చారన్నారు. తాము రైల్వే మంత్రిని నెలరోజుల క్రితమే కలిసి ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతిపాదనలను వివరించినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మళ్లీ అన్యాయమే: కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి రైల్వే బడ్జెట్లో మళ్లీ జిల్లాకు అన్యాయమే జరిగింది. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే ప్రాజెక్టుకుగానీ, దొనకొండ- ఒంగోలు రైల్వే లైన్కు సంబంధించి ఆశించిన ప్రయోజనమేమీ లేదు. జిల్లా నుంచి సరుకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నా వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. రైళ్లల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతున్నా అదనపు రైళ్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం బుల్లెట్ రైళ్ల పేరుతో ధనవంతులకు సౌకర్యం కల్పించడం తప్ప పేదల గురించి పట్టించుకోవడం మానేశారు. రైల్వే బడ్జెట్ భేషుగ్గా ఉంది: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ భేషుగ్గా ఉంది. పారదర్శకతకు, అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యం. రైల్వేల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, యశ్వంతపూర్ - గుంటూరు డైలీ ప్యాసింజర్ రైలు, విశాఖ-చెన్నై వీక్లీ, సికింద్రాబాద్- చెన్నై వీక్లీ ఎక్స్ప్రెస్ కొత్త రైళ్ల ఏర్పాటు శుభసూచకం. మహిళా ప్రయాణికులకు అధిక భద్రత, డబ్లింగ్-ట్రిప్లింగ్, కొత్త రైళ్లకు అధిక ప్రాధాన్యత. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం పోస్టాఫీసుల ద్వారా కూడా రైలు టికెట్ల విక్రయాలు చేపట్టడం వంటి వాటివల్ల బడ్జెట్ సంతృప్తిగా ఉంది. జనరంజక బడ్జెట్: బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు రైల్వే బడ్జెట్ జనరంజకంగా ఉంది. ఒక వైపు ఆదాయం వంద రూపాయలు వస్తుంటే అందులో 90 రూపాయలు వ్యయం అవుతోంది. అందువల్ల కేవలం పదిరూపాయల్లోనే అభివృద్ధి చేపట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం సాహసోపేతంగా కొత్త ట్రాక్ల నిర్మాణానికి పూనుకోవడం ద్వారా సరుకు రవాణాను వేగవంతం చే సి తద్వారా రైల్వే సేవలను మరింత అభివృద్ధి చేయబోతోంది. -
మళ్లీ నిరాశపరిచిన రైల్వే బడ్జెట్
రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. 2014-15 బడ్జెట్ను పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సదానంద గౌడ జిల్లా వాసులను నిరాశపరిచారు. ఏళ్ల నాటి పెండింగ్లో ఉన్న సమస్యలకు మోక్షం కలగలేదు. గత ఏడాది బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క రైలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోగా, అదే బాటలో పయనించిన ప్రస్తుత మోడీసర్కారు ఒకే ఒక్క వీక్లీ రైలుతో సరిపెట్టేసింది. జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈస్ట్కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్గా కేటాయించేందుకు ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదన విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. ప్రైవేటీకరణే ధ్యేయంగా ప్రతి అంశాన్ని ముడిపెడుతూ ఎఫ్డీఐలను అనుమతిస్తూ ప్రత్యేక కార్యాచరణకు దిగారు. పాత వాటి ఊసులేదు... కొత్తవాటికి గ్రీన్ సిగ్నల్ లేదు. ఒక్క వీక్లీ రైలుతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. విజయనగరం టౌన్ : కేంద్రంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా జిల్లాలో ఉన్న సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి. లాభార్జనే ధ్యేయంగా రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ను రూపకల్పన చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. పారదీప్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ రైలును మాత్రం వారంలో ఒకరోజు వచ్చేలా ఏర్పాటుచేశారు. ఇది తప్ప జిల్లాకు ఉపయోగపడే మరో అంశం ఏదీ బడ్జెట్లో లేదు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గమ్యం చేరుకోబోయే ముందు ప్రయాణికులకు అలర్ట్ వేకప్ కాల్స్ సదుపాయం, అన్ని రైళ్లల్లో ఇంటర్నెట్ వైఫే సౌకర్యం, పార్కింగ్ కమ్ ఫ్లాట్ ఫామ్ టికెట్లను ఒకే దాంట్లో ఇవ్వడం, ప్రయాణికులకు పోస్టల్, నెట్ తదితర వాటి ద్వారా అన్నిరకాల రైల్వే సౌకర్యాలు కల్పించడం చేశారు. అయితే చాలా ఏళ్ల నుంచి జిల్లా ఎంపీలు యత్నిస్తున్నా అంశాలలో ఏ ఒక్కటీ సాఫల్యం కాలేదు. గత బడ్జెట్లో కూడా విశాఖ -గుణుపూరు పాసింజర్ రైలు తప్పితే మనకేదీ దక్కలేదు. పట్టాలెక్కని హామీలివే.... ఈస్ట్కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్గా చేయాలన్న ఆశ అడియాశగానే మిగిలింది. విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఊసేలేదు. విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరవన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక ఏళ్ల నాటి డిమాండ్లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్ప్రెస్ను నడపాలన్నది అలాగే ఉండిపోయింది. సుమారు రూ.కోటీ 55 లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ నెరవేరలేదు. ఇక రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్గానే మిగిలిపోయింది. విజయనగరం రైల్వే స్టేషన్లో 5వ ప్లాట్ఫామ్ నుంచి చివరి ప్లాట్ఫామ్ వరకు ఫుట్ఓవర్ బ్రిడ్జిను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. ఈ బ్రిడ్జి పనులు పిల్లర్ల స్థాయితో అర్ధాంతరంగా ఆగిపోయాయి. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం విజయనగరం రైల్వేస్టేషన్లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆ పనులు కూడా నెరవేరలేదు. విజయగనం పట్టణంలో వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులను పట్టించుకోలేదు. -
లాయర్ గౌడ తొలిసారి బడ్జెట్
ప్రవేశపెట్టిన బీజేపీ నేత సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ తొలిసారిగా తమ పార్టీకి చెందిన నేతకు రైల్వే శాఖను కట్టబెట్టింది. ఆ హోదాలో డి.వి.సదానందగౌడ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక రాష్ర్టం మందెకొట్ల గ్రామం దేవరగుండా కుటుంబంలో జన్మించారు. ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ క్రీయాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన జీవితం కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి స్థాయికి ఎదిగింది. 1994లో తొలిసారి ఎన్నికల్లో పోటీ. పుత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం. పుట్టింది: 19, మార్చి 1953 సుల్యా, దక్షిణ కర్ణాటక తల్లిదండ్రులు: కమల, వెంకప్పగౌడ భార్య పేరు దత్తే.. కుమారుడు కార్తీక్. చిన్న కుమారుడు కౌషిక్.. మెడిసిన్ చదువుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అద్భుతం, విప్లవాత్మకం. భద్రత, పరిశుభ్రత, వేగానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా రైల్వేలను తిరిగి గాడిన పెడుతుంది. బడ్జెట్లో సృజనాత్మక ఆలోచనలున్నాయి. రైల్వే మంత్రి సదానందదే ఈ ఘనత. - రాజ్నాథ్సింగ్, కేంద్ర హోంమంత్రి -
రైలు రాలే!
నిజామాబాద్ అర్బన్: రైల్వే బడ్జెట్లో జిల్లాకు నిరాశ త ప్పలేదు. నిధులు, రైళ్లు ఏ మాత్రం కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జిల్లాకు రైల్వే బడ్జెట్లో మంచి ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఈ ప్రాంతంపై రైల్వే మంత్రి ఏ మాత్రం కనికరించలేదు. ఉన్నవాటికే నిధులు కేటాయించ లేదు. కొత్త పథకాల ఊసే లేకుండా పోయింది. నానాటికి రై ల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా రైల్వే సేవలు, సౌకర్యలు విస్తరిస్తాయని భావించినవారికి అసంతృప్తే మిగిలింది. హామీల ప్రస్తావనేదీ! ఇంతకు ముందు ప్రకటించిన హామీల అమలు విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావించే లేదు. జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయడానికి గతంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. నిజామాబాద్-పెద్దపల్లి పనులు పెండింగ్లో ఉన్నాయి. బోధన్-బీదర్ రైలు మార్గం గురించి ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డిలను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా మారుస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లు గడిచింది. వీటిలో ఏ ఒక్కదానిపైనా రైల్వే మంత్రి స్పందించలే దు. ఒక్క కొత్త రైలు కూడా జిల్లాకు కేటాయించలేదు. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ఈ జిల్లా వ్యా పారపరంగా వేరువేరు ప్రాంతాలకు మంచి ప్రయాణమార్గంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే సౌకర్యాలను పెంచవల్సిన అవసరం ఉంది. అయినా, గతంలోలాగే ఈసారి కూడా కొత్త పాసింజర్ రైళ్ల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్ ప్రస్తుత బడ్జెట్ కంటే మేలు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ 2014 వరకు పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించినా, ఈ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో నిధులు భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా ప్రజలు ఎదురుచూశారు. కాని వీటికి కేటాయింపు జరగలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వేప్రాజెక్టులను కేంద్రం పట్టించుకోకపోవడం నిరుత్సాహపరిచింది. ఆధునికీకరణ పనులు, నిధుల కేటా యింపు , రైళ్ల పొడగింపు, కొత్త రైళ్ల ఏర్పాటులో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చే అవసరం ఎం తైన ఉంది. కాని వీటిని రైల్వే బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. ఢిల్లీలో మకాం వేసినా నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కె.కవిత, బీబీ పాటిల్ రైల్వే బడ్జెట్లో జిల్లాకు సౌకర్యాలు, నిధులు కేటాయించాలని ఢిల్లీలో రైల్వే అధికారులను, మం త్రులను కలిసి విన్నవించారు. దాదాపు 15 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి శ్రమించారు. అయినా, రై ల్వేబడ్జెట్లో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. వీరి విన్నపాలను కేంద్రం పట్టించుకోలేదు. కనీసం నిధులు, రైళ్లను కూడా కేటాయించలేదు. ఉత్త ర తెలంగాణ జిల్లాలన్నింటికీ నిరాశే మిగిలింది. -
వెయిటింగ్ నిల్.. వేగంగా టికెట్
పాసింజర్ టికెట్ వ్యవస్థలో సమూల మార్పులు 1. ‘నెక్స్ట్ జనరేషన్ ఈ-టికెటింగ్’గా రిజర్వేషన్ వ్యవస్థ.. నిమిషానికి 7,200 టికెట్లు 2. నెట్ ద్వారా ప్లాట్ఫాం, అన్రిజర్వ్డ్ టికెట్లు.. ఒకేసారి పార్కింగ్, ప్లాట్ఫాం టికెట్లు 3. ఎ1, ఎ2 స్టేషన్లు, ఎంపిక చేసిన మరికొన్ని స్టేషన్లలో వైఫై సర్వీసులు 4. రైలొచ్చే ముందు ప్రయాణికులకు వేకప్ కాల్ న్యూఢిల్లీ: రైల్వే టికెట్లు మరింత సులభంగా, వేగంగా ప్రయాణికులకు లభించేలా బుకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తేనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. మంగళవారం ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో టికెట్ బుకింగ్ వ్యవస్థ మరింత సమర్ధంగా, వేగంగా, ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా పలు ప్రతిపాదనలు చేశారు. పాసింజర్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను నెక్ట్స్ జనరేషన్ ఈ-టికెటింగ్ వ్యవస్థగా రూపుదిద్దనున్నారు. ప్రస్తుతం నిమిషానికి 2,000 టికెట్లు ఇస్తున్నారు. దీనిని నిమిషానికి 7,200 టికెట్ల సామర్థ్యానికి పెంచనున్నారు. ఒకేసారి 1.20 లక్షల యూజర్లు ఈ-టికెటింగ్ను ఉపయోగించుకొనేలా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా.. మొబైల్ ఫోన్లు, పోస్టాఫీసుల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేనున్నారు. ఇప్పటివరకు స్టేషన్లలోనే లభించే ప్లాట్ఫాం, అన్రిజర్వ్డ్ టికెట్లను ఇక మీదట ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఒకేచోట పార్కింగ్, ప్లాట్ఫాం కాంబో టికెట్లను కూడా జారీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేలా టికెట్ల జారీ యంత్రాల వద్ద దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామన్నారు. పేపర్లెస్ రైల్వే కార్యాలయాలు ఐటీ పరిజ్ఞానంతో వచ్చే ఐదేళ్లలో రైల్వే కార్యాలయాలను పేపర్లెస్ ఆఫీసులుగా రూపుదిద్దనున్నట్లు గౌడ చెప్పారు. ఎ1, ఎ2 స్టేషన్లు, ఎంపిక చేసిన మరికొన్ని స్టేషన్లలో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు. ఇవే కాకుండా.. రైళ్ల రాకపోకలను తెలుసుకొనేందుకు, రైలు బయల్దేరే సమయానికి ముందుగా ప్రయాణికులకు ఫోన్ ద్వారా వేకప్కాల్తో అప్రమత్తం చేసేందుకు, ప్రయాణంలో ప్రయాణికులు దిగవలసిన ప్రాంతం వచ్చినట్లుగా సమాచారాన్ని ఇచ్చేందుకు, స్టేషన్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు, కంప్యూటరైజ్డ్ పార్సిల్ వ్యవస్థను విస్తరించేందుకు కూడా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. స్టేషన్లలో డిజిటల్ రిజర్వేషన్ చార్ట్లను కూడా ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్లు గౌడ చెప్పారు. పీపీపీ పద్ధతిలో అన్ని టికెట్ కౌంటర్లలో ద్వంద్వ విధానంలో చార్జీలను తెలిపే వ్యవస్థను విస్తరిస్తామనితెలిపారు. రైల్వేల ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు వాటిని డిజిటైజేషన్ చేస్తామని చెప్పారు. బొగ్గు రవాణా లైన్ల నిర్మాణం వేగవంతం విద్యుత్ కేంద్రాలకు బొగ్గును త్వరగా రవాణా చేసేందుకు మూడు కీలక రైల్వే మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని కేంద్రం తెలిపింది. తోరి-శివపూర్-కతౌతియా (జార్ఖండ్), జార్సుగూడ-బార్పల్లి, సర్దేగా(ఒడిశా), భూప్దేవ్పూర్-రాయ్గఢ్- మాండ్ (ఛత్తీస్గఢ్) లైన్ల నిర్మాణం ద్వారా రవాణా అయ్యే బొగ్గు మొత్తం 10 కోట్లటన్నులకు చేరుకుంటుందని రైల్వే మంత్రి సదానంద గౌడ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 7,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ లైన్ల నిర్మాణం ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. విద్యుత్ ప్లాంట్లు ఇంధన కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వీటి నిర్మాణంపై స్పందించారు. ట్విట్టర్లో 40 వేల ఫాలోవర్లు! రైల్వే మంత్రి సోమవారం ప్రారంభించిన ట్విట్టర్ ఖాతాకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ట్విట్టర్లో రైల్వే శాఖ హ్యాండిల్(ఖాతా) ఃఖ్చజీకజీఐఛీజ్చీకు ఒక్కరోజులోనే సుమారు 40 వేల మంది చేరువయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా ప్రజలకు తాజా సమాచారం అందజేస్తామని రైల్వే శాఖ తెలిపింది. -
3లైన్లకు రూ.48 కోట్లే.. ప్చ్..!
బడ్జెట్ రైలు ఈ ఏడాది కూడా జిల్లాలో ఆగలేదు. కొత్త రైళ్లు వస్తాయని, నిజామాబాద్ లైన్ పూర్తవుతుందని, రాజధానికి రైలు సౌకర్యం కలుగుతుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మూడు లైన్లకు కేవలం రూ.48 కోట్లు ఈ బడ్జెట్లో మంజూరయ్యాయి. ఈ నిధులతో పాత ప్రాజెక్టులు అంగుళం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి, కరీంనగర్ : దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే లైన్ల నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు ప్రతీసారి అన్యాయమే జరుగుతోంది. ఈసారీ అదే జరిగింది. ముందు చెప్పినట్టే.. ఎలాం టి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ ఇవ్వని రైల్వే మంత్రి మూడు పాత ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించి మమ అనిపించారు. కేటాయించిన నిధులతో ఏ ప్రాజెక్టు కూడా కనీసం 5 శాతం పూర్తికాని పరిస్థితి. పైగా అవసరాన్ని బట్టి చార్జీల మోత తప్పదని లోక్సభలో మంత్రి స్పష్టం చేయడంతో సమయం, సందర్భం లేకుండా రైలు చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం పడనుంది. కేటాయింపులివీ... కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణంపై సర్వే కోసం రూ.10 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన ఈ లైన్ నిర్మాణమైతే కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. గత ఆర్థిక బడ్జెట్లో అప్పటి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈసారి రూ.10 కోట్లే కేటాయించడంతో సర్వే పనులైనా జరుగుతాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రామగుండం-మణుగూరు రైల్వేలైన్కు రూ.3 కోట్లు కేటాయించారు. 1982లోనే.. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గు గనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు (ఘన్పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోగా ఈసారి రూ.3 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు ఇటీవల రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దపల్లి-నిజామాబాద్ లైన్కు ఈసారి రూ.35 కోట్లు కేటాయించారు. ఈసారైనా రైలు ఇందూరుకు చేరుతుందని ఆశించిన జిల్లా ప్రజలకు ఈ బడ్జెట్ కేటాయింపుతో నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితమే అప్పటి రైల్వేమంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వేలైన్ను ఆ ఏడాది పూర్తికానున్న లైన్ల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పూర్తికాలేదు. పెద్దపల్లి వయా కరీంనగర్, జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు లైన్ పూర్తిగా కాగా, మోర్తాడ్ నుంచి నిజామాబాద్ వరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రూ.35 కోట్లతో లైన్ ఎంతదూరం వెళ్తుందో మంత్రికే తెలియాలి. జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడేలా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్-హసన్పర్తి వరకు కొత్త లైన్ వేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గతంలో పలుమార్లు సమర్పించిన ప్రతిపాదనలను మోడీ సర్కార్ బుట్టదాఖలు చేసింది. పలు స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ విషయంలోనూ రైల్వేమంత్రి జిల్లావాసులను నిరాశపరిచారు. రామగుండం రైల్వేస్టేషన్లో.. చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్ఫాస్ట్, నవ్జీవన్, జైపూర్, స్వర్ణజయంతి, పెద్దపల్లిలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్ఫాస్ట్ రైళ్ల నిలుపుదల విజ్ఞప్తులను పెడచెవినపెట్టారు. కమిటీ పేరిట లింకు కేటాయించిన ఈ అరకొర నిధులు కూడా ఖర్చు చేయకుండా కేంద్రం మెలిక పెట్టింది. సమైక్యంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయని.. రెండుప్రాంతాల్లో మొత్తం 29 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్న మంత్రి వీటిపూర్తి కోసం రూ.26,680 కోట్లు అవసరమున్నట్లు అంచనా వేశారు. ఈ రెండు ప్రాంతాల్లో రైల్వే అభివృద్ధికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో జిల్లాకు ఇప్పుడు ప్రకటించిన నిధులైనా వస్తాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేలో ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులతో కలిపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ (పీపీపీ) వ్యవస్థ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ప్రకటించడంపైనా ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవస్థతో రైల్వే ఏమాత్రం అభివృద్ధి చెందే ప్రసక్తే లేదని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. గతంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వాలు వెనుకడుగు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాకు రైల్వే నిధుల కేటాయింపు కేవలం కంటితుడుపు చర్యగా ఉన్నాయన్నారు. -
‘సదా’ నిరాశే
కొత్తగూడెం : జిల్లా ప్రజల ఆశలపై రైల్వే బడ్జెట్ నీళ్లు చల్లింది. ఈ దఫా ఎలాగైనా జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం తో పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశించిన జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2012లో మంజూరైన కొవ్వూరు లైన్తోపాటు, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కీలకమైన సత్తుపల్లి లైన్కు క్లియరెన్స్ వస్తుందని ఆశ పడినప్పటికీ.. నిరాశే మిగిలింది. జిల్లాలో సింగరేణి గనులతో పేరెన్నిక కలిగిన కొత్తగూడెం కేంద్రంగా రైల్వే విస్తరణ చేయాల్సి ఉంది. అయితే సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)-కొవ్వూరు లైన్కు ఈ బడ్జెట్లో అసలు నిధులే కేటాయించకపోవడం గమనార్హం. 2012లో ఈ లైన్కు మంజూరు లభించినా.. నాటి నుంచి ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. ఈ లైన్ ఏర్పాటయితే సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం కలుగుతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే 140 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశాలున్నాయి. ఇన్ని అవకాశాలున్న ఈ లైన్కు నిధులు మంజూరు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత లైన్లకు మాత్రమే పర్యవేక్షణ కమిటీ వేసిన సదానంద బడ్జెట్ అందరినీ నైరాశ్యంలోకి నెట్టివేసింది. సింగరేణికి తప్పని తిప్పలు.. పర్యావరణశాఖ ఆదేశాల మేరకు భవిష్యత్లో సింగరేణి సంస్థ చేపట్టే నూతన ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును రైలు మార్గం ద్వారానే తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీలలో ఉత్పత్తి చేసే బొగ్గు రవాణాకు కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ ముందుకొచ్చింది. ఈ లైన్కు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ లైన్ ఫైనల్ సర్వే కూడా పూర్తయింది. అయితే ప్రస్తుత బడ్జెట్లో కొత్తగూడెం - సత్తుపల్లి లైన్కు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సత్తుపల్లిలోని కొత్త ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గును ఎలా సరఫరా చేయాలనే విషయంపై సింగరేణి సందిగ ్ధంలో పడింది. ఉద్యోగులకూ ఊరట లేదు.. జిల్లాలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉండగా మొత్తం 1500 మంది వరకు రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు 7వ పే రివిజన్ కమిటీ కోసం ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమైనా తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 7వ పే రివిజన్కు అనుమతి ఇస్తుందని భావించిన ఉద్యోగులకు ఈ బడ్జెట్లోనూ నిరాశే ఎదురైంది. -
దారి మళ్లిన ‘గౌడ’ బండి
గుంతకల్లు టౌన్ : రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ‘రైలు’ దారి మళ్లింది. సంస్కరణలకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పిన మోడీ సర్కారు.. ఏడాదికి రూ.1100 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న గుంతకల్లు రైల్వే డివిజన్పై సవతి ప్రేమ చూపింది. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్కు ఒక్క కొత్త రైలూ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ ఊసూ లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుదీకరణ పనులు, కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, అండర్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారే కానీ వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పలేకపోయారు. రాష్ట్ర విభజన బిల్లులో రైల్వే జోన్ ఏర్పాటు హామీ ఉన్నా దాని ఊసే ఎత్తలేదు. కొత్తగా వచ్చే రైల్వే జోన్కు సౌత్ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వేగా నామకరణం చేయబోతున్నట్లు రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లోని విశాఖపట్నంను కలుపుకుని రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ వస్తుందని భావించినా ఉసూరుమనిపించారు. కమిటీతో కాలయాపన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న 29 ప్రాజెక్టులను రానున్న పదేళ్లలో పూర్తి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సదానంద ప్రకటించారు. అయితే కమిటీ నివేదిక వచ్చేదెన్నడు? పనులు పూర్తి చేసేదెన్నడు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు రైల్వే డివిజన్కు గతంలో మంజూరైన డబ్లింగ్, విద్యుదీకరణ, రైలు మార్గాల ఏర్పాటుకు దాదాపు 4 వేల కోట్ల రూపాయలు అవసరం ఉండగా ప్రభుత్వం ప్రతియేటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఫలితంగా పెండింగ్ ప్రాజెక్టులు పడకేస్తున్నాయి. ప్రతిపాదనలకే పరిమితమా? గుంతకల్లు డివిజన్లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్న ప్రజల డిమాండ్ మేరకు డివిజన్ స్థాయి రైల్వే అధికారులు రైల్వేమంత్రిత్వ శాఖకు ప్రతి యేటా ప్రతిపాదనలు పంపుతున్నా వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఉదయం వేళల్లో పుట్టపర్తి-హైదరాబాద్తో పాటు తిరుపతి-షిర్డీ, పుట్టపర్తి-షిర్డీ రైళ్లను ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ ఉంది. పెండేకల్లు బైపాస్, గుత్తి మీదుగా వెళ్తున్న కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, తుంగభ ద్ర ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా నడపాలన్న డిమాండ్ ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజధాని గుంటూరు లేదా విజయవాడల మధ్య ఏర్పాటు చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంతి, అమరావతి, రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా రైళ్లు ఏర్పాటుకు గౌడ బడ్జెట్ గ్రీన్సిగ్నల్ ఇస్తుందేమోనని భావించినా నిరాశే ఎదురయ్యింది. ఆశాజనకంగా లేదు రైల్వే బడ్జెట్ వల్ల అటు ప్రయాణికులు, ఇటు రైల్వే కార్మిక వర్గాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. డివిజన్ మీదుగా కనీసం ఒక్క కొత్త రైలు కానీ, కొత్త ప్రాజెక్టు గానీ మంజూరు చేయకపోవడం అన్యాయం. అందరూ ఆశించినట్లు గుంతకల్లు రైల్వే జోన్ గురించి ప్రస్తావించకపోవడం మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమే. కనీసం పెండేకల్లు బైపాస్ మీదుగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా నడిపేందుకు గ్రీన్సిగ్నల్ కూడా ఇవ్వలేదు. - కళాధర్, మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ఊసెత్తకపోవడం భాధాకరం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్త రైళ్లు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం భాధాకరం. రైల్వే ఉద్యోగుల స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ను రూ.500 నుండి 800 వరకు పెంచుతామని, రైల్వే కార్మికుల పిల్లల కోసం కాలేజిలు, ఒక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఉద్యోగ వర్గాలకు కొంత ఊరట కలిగించిందే. అది మినహాయించి డివిజన్కు ఒరిగిందేమీ లేదు. - శ్రీనివాసులు, ఎంప్లాయిస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి గుంతకల్లు రైల్వేస్టేషన్ను మోడల్ రైల్వేస్టేషన్గా నిర్మిస్తామని రూ.6 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులు పునాదులకే పరిమితం అయ్యాయి. ట్రాక్షన్ షెడ్ నిర్మాణానికి రూ.80 కోట్లు అవసరముండగా ఇప్పటి వరకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. గుంటూరు-గుంతకల్లు, డోన్-ధర్మవరం వయా గుత్తి, గుంతకల్లు-హొస్పేట డబ్లింగ్ పనులు, కడప-బెంగుళూరు, నడికుడి-శ్రీకాళహస్తి, కదిరి-పుట్టపర్తి మధ్య రైల్వేలైన్ ఏర్పాటు కోసం మంజూరైన నిధుల్లో అరకొర విడుదల చేయడంతో ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదు. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికై నిత్యం లక్షలాది మంది భక్తాదులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్ను వరల్డ్క్లాస్ ఆదర్శ రైల్వేస్టేషన్గా తీర్చిదిద్దుతామని గతంలో చేసిన వాగ్దానాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రయాణికుల రద్దీ, రైళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ దిశగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. -
మనకూ బుల్లెట్ రైల్
భారతీయుల కల సాకారం చేస్తాం రైల్వే బడ్జెట్లో కేంద్రం ప్రకటన ► ముంబై-అహ్మదాబాద్ సెక్టార్లో అమలు ► దాదాపు రూ. 60 వేల కోట్ల ఖర్చు! ► 9 రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ► రైళ్ల వేగం గంటకు 160-200 కిలోమీటర్ల వరకు పెంపు న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలును పరుగులు పెట్టిం చేందుకు ఎన్డీయే సర్కారు సంకల్పించింది. ముందుగా ముంబై-అహ్మదాబాద్ కారిడార్లో దాదాపు రూ. 60వేల కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తన తొలి రైల్వే బడ్జెట్లో ప్రకటించింది. అంతేకాదు, అన్ని మెట్రోలు, ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైల్ నెట్వర్క్(వజ్ర చతుర్భుజి నెట్వర్క్)ను నిర్మించాలని కూడా బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మంగళవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రైల్వే మంత్రి సదానంద గౌడ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కారిడార్ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుగా రూ. వంద కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో బుల్లెట్ రైలు పరుగులు తీయాలన్న భారతీయులందరి చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా భారతీయ రైల్వేలు అడుగులేస్తున్నాయని ఆయన లోక్సభలో వ్యాఖ్యానిం చారు. ఎంపిక చేసిన సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చండీగఢ్, ముంబై-అహ్మదాబాద్ రూట్లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ-కాన్పూర్, నాగ్పూర్-బిలాస్పూర్, మైసూర్-బెంగళూరు, చెన్నై, ముంబై-గోవా, చెన్నై-హైదరాబాద్, నాగ్పూర్-సికింద్రాబాద్ సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుత నెట్వర్క్ను ఆధునీకరించాల్సి ఉంటుందని, అలాగే బుల్లెట్ రైలు కోసం సరికొత్త మౌ లిక వసతులు అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 58 కొత్త రైళ్లొస్తున్నాయ్! న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్ 58 కొత్త రైళ్లను మోసుకొచ్చింది. మంగళవారం రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 58 కొత్త రైళ్లను ప్రతిపాదించారు. వీటిలో ఐదు జణ్ సాధారణ రైళ్లతోపాటు మరో ఐదు ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, రెండు మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(మెమూ) సర్వీసులు, 5 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) సర్వీసులు ఉన్నాయి. అలాగే మరో 11 ైరె ళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి చార్ధామ్ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఓ కొత్త లైన్తో సహా 18 లైన్ల సర్వేను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. జైపూర్ -కోట, చందన ఫోర్ట్-నాగ్భిర్, మంగళూర్-ఉల్లాల్-సూరత్కల్, రేవారి-మహేందర్గఢ్ల మధ్య డబ్లింగ్ కోసం సర్వేలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జన్ సాధారణ్ రైళ్లు.. 5 1.. అహ్మదాబాద్-దర్భంగా (వయా సూరత్), 2. జైనగర్-ముంబై, 3. ముంబై-గోరఖ్పూర్, 4. సహర్సా-ఆనందవిహార్ (వయా మోతీహారీ), 5. సహర్సా-అమృత్సర్ ప్రీమియం రైళ్లు.. 5 1. ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ (ఏసీ), 2. షాలిమార్-చెన్నై (ఏసీ), 3. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (ఏసీ), 4. జైపూర్-మదురై, 5. కామాఖ్య-బెంగళూరు ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లు.. 6 1. విజయవాడ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ (రోజూ), 2. లోకమాన్యతిలక్ టెర్మినల్(ముంబై)-లక్నో (వారానికోరోజు), 3. నాగపూర్-పుణే (వారానికోరోజు), 4. నాగపూర్-అమృత్సర్ (వారానికోరోజు), 5. నహర్లాగూన్-న్యూఢిల్లీ (వారానికోరోజు), 6. నిజాముద్దీన్-పుణే (వారానికోరోజు) ఎక్స్ప్రెస్ రైళ్లు.. 27 1. అహ్మదాబాద్-పాట్నా (వారానికోరోజు), 2. అహ్మదాబాద్-చెన్నై (వారానికి 2 రోజులు), 3. బెంగళూరు-మంగళూరు (రోజూ), 4. బెంగళూరు-షిమోగా (వారానికి 2 రోజులు), 5. బాంద్రా-జైపూర్ (వారానికోరోజు), 6. బీదర్-ముంబై (వారానికోరోజు), 7. ఛాప్రా-లక్నో (వారానికి మూడురోజులు), 8. ఫిరోజ్పూర్-చండీగఢ్ (వారానికి 6 రోజులు), 9. గౌహతి-నహర్లాగూన్ (రోజూ), 10. గౌహతి-ముర్కాంగ్సెలెక్ (రోజూ), 11. గోరఖ్పూర్-ఆనందవిహార్ (వారానికోరోజు), 12. హాపా-బిలాస్పూర్ (వారానికోరోజు), 13. హుజూర్సాహెబ్ నాందేడ్-బికనీర్ (వారానికోరోజు), 14. ఇండోర్-జమ్మూతావి (వారానికోరోజు), 15. కామాఖ్య-కత్రా (వారానికోరోజు), 16. కాన్పూర్-జమ్మూతావి (వారానికి రెండురోజులు), 17. లోకమాన్యతిలక్ టెర్మినల్ ముంబై-ఆజంగఢ్ ((వారానికోరోజు), 18. ముంబై-కాజీపేట (వారానికోరోజు) వయా బలార్షా, 19. ముంబై-పాటియాలా (వారానికోరోజు), 20. న్యూఢిల్లీ-భటిండా శతాబ్ది (వారానికోరోజు), 21. న్యూఢిల్లీ-వారణాసి (రోజూ), 22. పారాదీప్-హౌరా (వారానికోరోజు), 23. పారాదీప్-విశాఖపట్నం (వారానికోరోజు), 24. రాజ్కోట్-రేవా (వారానికోరోజు), 25. రామ్నగర్-ఆగ్రా (వారానికోరోజు), 26. టాటానగర్-బయ్యప్పనహళ్లి బెంగళూరు (వారానికోరోజు), 27. విశాఖపట్నం-చెన్నై (వారానికోరోజు) ప్యాసింజర్ రైళ్లు (రోజూ).. 8 1. బికనీర్-రేవారీ , 2. ధార్వాడ్-దండేలీ, 3. గోరఖ్పూర్-నౌతాన్వా, 4. గౌహతి-మెందీపత్తర్, 5. హాతియా-రూర్కెలా, 6. బిందూర్-కాసరగోద్, 7. రంగపారా నార్త్-రంగియా, 8. యశ్వంత్పూర్-తుంకూర్ మెమూ రైళ్లు.. 2 1. బెంగళూరు-రామనగరం (వారానికి ఆరురోజులు), 2. పల్వాల్-ఢిల్లీ-అలీగఢ్ డెమూ రైళ్లు.. 5 1. బెంగళూరు-నీల్మంగళ (రోజూ), 2. ఛాప్రా-మాండ్వాదీ (వారానికి ఆరురోజులు), 3. బారాముల్లా-బనిహాల్ (రోజూ), 4. సంబల్పూర్-రూర్కెలా (వారానికి ఆరురోజులు), 5. యశ్వంత్పూర్-హోసూర్ (వారానికి ఆరురోజులు) పాలు, పళ్లు, కూరగాయలకోసం ప్రత్యేక రైళ్లు న్యూఢిల్లీ: ఆహారపదార్థాల రవాణాకు ప్రత్యేక రైళ్లను నడపాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశాన్నంటుతున్న ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాల రవాణాకు మిల్క్ ట్యాంకర్లు, కూరగాయలు, పళ్ల రవాణాకు ప్రత్యేక సదుపాయాలు కల్పిం చాలని భావిస్తున్నట్లు సదానంద గౌడ తెలిపారు. ఆయన మంగళవారం పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ... దేశంలోని పది ప్రాంతాల్లో సెంట్రల్ రైల్సైడ్ వేర్హౌస్ కార్పొరేషన్ (సీఆర్డబ్యూసీ) భాగస్వామ్యంతో పళ్లు, కూరగాయల రవాణాకు శీతలీకరణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. తొలి దశలో వాత్వా, విశాఖపట్నం, బడగర, చెరియనాడ్, భివాండీ రోడ్, అజారా, నవ్లూర్, కాలంబోలి, సనంద్లలో ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అక్కడినుంచి పంపిణీని సీఆర్డబ్ల్యూసీ పర్యవేక్షిస్తుందన్నారు. దీనివల్ల కూరగాయలు వృథాకాకుండా నివారించడంతోపాటు రైతులకు సరసమైన ధరలు లభిస్తాయని తెలిపారు. జాతీయ పాల అభివృద్ధి సంస్థ, అమూల్ సంస్థతో కలిసి పాల రవాణాకు ప్రత్యేక ట్యాంకర్లను నడుపుతామన్నారు. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాల ధరల పెరుగుదల వల్ల మే నెలలో ద్రవ్యోల్బణం 6.01కు చేరినట్లు తెలిపారు. ధరల నియంత్రణకోసం బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. రూ.11,790 కోట్ల రుణాల సేకరణ న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో పెట్టుబడి వ్యయం కోసం రూ.11,790 కోట్ల మేరకు మార్కెట్ రుణాలను సేకరించనుంది. తన కంపెనీలైన ఇండియన్ రైల్వే స్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ), రైల్వేస్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ద్వారా ఈ రుణాలు చేయనుంది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఈ మొత్తా న్ని రూ.13,800 కోట్లుగా పేర్కొనడం తెలిసిందే. అయితే అంతర్గత వనరులను పెంపొందించుకుంటున్నందున ఆ మేర రుణాలను తగ్గించుకోవాలని ప్రతిపాదించినట్టు మంత్రి తెలి పారు. తాజా ప్రణాళికను అనుసరించి.. గూడ్స్ వ్యాగన్లు, ప్రా జెక్టుల్లో పెట్టుబడుల కోసం ఐఆర్ఎఫ్సీ ద్వారా రూ.11,500 కోట్ల రుణాలను సేకరిస్తారు. ఆర్వీఎన్ఎల్ ద్వారా రూ.290 కోట్లను, పీపీపీ రూపేణా రూ.6,005 కోట్లను సమీకరిస్తారు. యాత్రా స్పెషల్స్ న్యూఢిల్లీ: దేశీయ టూరిజాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ప్రముఖ తీర్థయాత్రా స్థలాలను కలుపుతూ పలు టూరిస్టు రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు. ఇప్పటికే దేవీ సర్క్యూట్, జ్యోతిర్లింగ సర్క్యూట్, జైన్ సర్క్యూట్ లాంటి వాటిని రైల్వే శాఖ గుర్తించిందన్నారు. వీటితోబాటు క్రిస్టియన్, ముస్లిం/సుఫి, సిక్, బుద్ధిస్ట్ సర్క్యూట్లే కాకుండా ప్రఖ్యాత ఆలయాల సర్క్యూట్లలలో కూడా రైళ్లు ప్రవేశపెడతామన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో ఎకో-టూరిజం, ఎడ్యుకేషన్ టూరిజం కూడా చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని యాత్రా స్థలాలను కలుపుతూ గడగ్, పండరీపూర్ మధ్య.. రామేశ్వరం నుంచి చెన్నై, బెంగళూరు, అయోధ్య, వారణాసిల మీదుగా హరిద్వార్ వరకూ మరో టూరిస్టు రైలు నడుపుతామన్నారు. మహిళా భద్రతకు భరోసా న్యూఢిల్లీ: రైళ్లలో అన్ని తరగతుల బోగీల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి ప్రత్యేక సూచనలు కూడా చేస్తున్నామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. వారి భద్రతకు మరిన్ని అదనపు చర్యలు కూడా తీసుకుంటామన్నారు. స్టేషన్లలో భద్రత పెంచేందుకు 1,700 మంది రైల్వే భద్రతా దళ (ఆర్పీఫ్) కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకున్నామని, త్వరలోనే వారిని విధుల్లోకి పంపుతామని చెప్పారు. మరో 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించాలని ప్రతిపాదించామని, వీరిని మహిళల బోగీలకు రక్షణగా పంపుతామని పేర్కొన్నారు. రైళ్లకు రక్షణ గా వెళ్లే ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందజేస్తామని, ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని సంప్రదించవచ్చని అన్నారు. భద్రతకు సంబంధించిన హెల్ప్లైన్ను విస్తరిస్తామని, స్టేషన్ల చుట్టూ ప్రహరీల నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. రైల్వే వర్సిటీ ఏర్పాటుపై పరిశీలన న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన అంశాల అధ్యయనం లక్ష్యంగా రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సాంకేతికేతర అంశాల అధ్యయనంకోసం ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. సిబ్బందిలో నైపుణ్యాల మెరుగుదలకోసం ప్రణాళికలు రూపొందించినట్టు బడ్జెట్ సమర్పణ సందర్బంగా రైల్వే మంత్రి చెప్పారు. రైల్వేలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాఠ్యాంశాలను గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సాంకేతిక విద్యా సంస్థలతో రైల్వేశాఖ అవగాహన కుదుర్చుకుంటుందన్నారు. కింది స్థాయి సిబ్బందిచేత స్వల్పకాలిక కోర్సులను అధ్యయనం చేయిస్తామన్నారు. హై స్పీడ్, భారీ స్థాయి సరుకు రవాణా తదితర కార్యకలాపాలపై సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తగ్గిన ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు న్యూఢిల్లీ: అధిక ఆదాయం కోసం ఎయిర్ కండీషన్డ్ బోగీల ప్రయాణి కులపై కన్నేసిన రైల్వేకు చేదువార్త. గత ఏడాదితో పోలిస్తే ఏసీ మొదటి తరగతి, ఏసీ త్రీటైర్ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఏసీ ఫస్ట్క్లాస్లో 33.1 లక్షల ప్రయాణించగా, 2013-14 లో 26.1 లక్షల మంది మాత్రమే వెళ్లారు. 2012-13లో ఏసీ త్రీటైర్ బోగీల్లో 7 కోట్ల మందికిపైగా ప్రయాణించగా, 2013-14లో 6.87 కోట్ల మంది ప్రయాణించారు. అయితే ఏసీ చైర్కార్ తరగతి ప్రయాణికుల సంఖ్య మాత్రం కాస్త పెరిగింది. ఈ తరగతిలో గత ఏడాది 2.21 కోట్ల మంది వెళ్లగా 2013-14లో 2.51 కోట్ల మంది వెళ్లారు. ఏసీ స్లీపర్(ఏసీ టూటైర్) ప్రయాణికుల సంఖ్య కూడా 2.23 కోట్ల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్ ప్రకారం.. ఏడాది ఏసీ ఫస్ట్క్లాస్లో 38.6 లక్షల మంది ప్రయాణిస్తారని ప్రభుత్వ అంచనా. బుల్లి.. బుల్లి రైళ్లు... టాయ్ ట్రైన్లు అంటే.. బొమ్మ రైళ్లనుకునేరు. ప్రముఖ చారిత్రక రైల్వే లైన్లపై నడిచే చిన్న రైళ్లే.. టాయ్ ట్రైన్లు. ప్రధానంగా పర్వత ప్రాంతాల మీదుగా సాగే ఈ రైళ్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. గమ్యస్థానాలు చేరడానికి దాదాపు ఎనిమిది గంటలసమయం కూడా పడుతుంటుంది. అయినప్పటికీ ప్రయాణం మాత్రం ఎందో ఆహ్లాదకరంగా ఉంటుంది. కారణం.. వీటిలో బోగీలు మామూలు రైళ్ల మాదిరిగా కాకుండా.. రెండువైపులా కొండకోనల అందాలను తిలకించడానికి, పిల్లగాలులను ఆస్వాదించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో ప్రముఖమైనవి.. డార్జిలింగ్ హిమాలయన్ రైలు తూర్పు హిమాలయాల నుంచి డార్జిలింగ్లోని తేయాకు తోటల వరకు ప్రయాణిస్తుంది. 1881లో మొదలైన ఈ రైలే.. భారత్లో మొట్టమొదటి టాయ్ ట్రైను. కల్కా-సిమ్లా రైలు బ్రిటిష్ పాలకులు 1903లో తమ వేసవి రాజధాని సిమ్లాకు వెళ్లడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 సొరంగ మార్గాలు, దేవదార్ అడవులు, పర్వత ప్రాంతాల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. మాథేరన్ రైలు 1907లో దీన్ని ప్రారంభించారు. సైకిళ్లు సహా వాహనాలకు ప్రవేశం లేని మాథేరన్ (మహారాష్ట్ర) కొండ ప్రాంతాల్లో పచ్చని అందాల నడుమ ప్రయాణిస్తుంది. కొండపైకి వెళ్లడానికి దాదాపు 2.30 గంటల సమయం పడుతుంది. ఊటీ నీలగిరి రైలు తమిళనాడులోని ఊటీ సోయగాలతో మనల్ని పరవశింపజేస్తూ సాగుతుంది ఈ రైల్లో ప్రయాణం. ఇది 1899లో ప్రారంభమైంది. భారత్లో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఇది. గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే వెళుతుంది. కంగర వ్యాలీ రైలు ఇది పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి సుందరమైన జోగీందర్ నగర్ లోయ వరకు నడుస్తుంది. హిమాలయా ఉప ప్రాంతాల్లో 163 కిలోమీటర్ల పాటు సాగుతుంది దీని ప్రయాణం. 1929లో దీన్ని ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో ముఖ్యాంశాలు ♦ 2014-15లో రూ.1,64,374 కోట్ల ఆదాయం అంచనా. ఖర్చును రూ.1,49,176 కోట్లకు కుదించారు. ♦ గతంలో లేనంత ఎక్కువగా రూ.65,455 కోట్ల ప్రణాళికా వ్యయం. ♦ మొత్తం 58 కొత్త రైళ్లు. వీటిలో ఐదు జన్ సందర్శన్, ఐదు ప్రీమియం, ఆరు ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నారుు. 11 రైళ్ల పొడగింపు. ♦ {పయూణికుల చార్జీలను, సరుకు రవాణా చార్జీలను పెంచలేదు. ♦ త్వరలో హైస్పీడ్ నెట్వర్క్తో పాటు పట్టాల పైకి బుల్లెట్ రైళ్లు. ♦ ముంబరుు-అహ్మదాబాద్ సెక్టార్లో బుల్లెట్ రైలు. ♦ హైస్పీడ్ రైళ్ల కోసం వజ్ర చతుర్భుజి. ఈ ప్రాజెక్టు కోసం రూ.9 వేల కోట్లు అవసరం. రూ.100 కోట్ల కేటారుుంపు. ♦ తొమ్మిది సెక్టార్లలోని ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ల స్పీడ్ను గంటకు 160 నుంచి 200 కిలోమీటర్లకు పెంచే యోచన. ♦ ఆన్లైన్లో ఫ్లాట్ఫామ్తో పాటు అన్ రిజర్వ్డ్ టికెట్లు. స్టేషన్ల వద్ద పార్కింగ్కు, ప్లాట్ఫామ్కు కలిపి కోంబో టికెట్లు ♦ అన్ని స్టేషన్లలో ప్రయూణికుల విశ్రాంతి గది సౌకర్యం. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రధాన స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లు. రైలు సమయంపై ప్రయూణికులను అప్రమత్తం చేసేందుకు ఎస్మెమ్మెస్. ♦ భద్రత పెంపు కోసం 17 వేల మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల భర్తీ. మహిళల బోగీల్లో భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియూమకం. రైళ్లలోని ఆర్పీఎఫ్ బృందాలకు మొబైల్ ఫోన్లు. ♦ {పధాన రైళ్లు, సబర్బన్ బోగీలకు తలుపులు ఆటోమేటిక్గా మూసుకునే వ్యవస్థ ఏర్పాటు ♦ సాంకేతిక, సాంకేతికేతర సబ్జెక్టులకు రైల్ విశ్వవిద్యాలయం. ♦ విమానాశ్రయూన్ని తలపించేలా, అలాంటి అనుభూతిని కలిగించేలా అంతర్జాతీయ స్థారుుకి టాప్ 10 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ. ♦ స్టేషన్ల నిర్వహణకు మూల నిధి ఏర్పాటు. స్టేషన్లు, రైళ్లలో ఆర్వో తాగునీరు. ప్రధాన స్టేషన్లకు సౌర విద్యుత్ సౌకర్యం. ♦ రైలు ప్రయూణికులకు మరింత మెరుగైన ఆహారం. ప్రముఖ కంపెనీలకు చెందిన వండి తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం అందజేత. నాణ్యత లోపిస్తే సంబంధితులపై చర్యలు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్. ♦ శుభ్రత కోసం ఉద్దేశించిన బడ్జెట్ 40% పెంపు. స్టేషన్లలో శుభ్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీల వినియోగం. మూడో పార్టీ ♦ రిజర్వేషన్ విధానం పునర్వ్యవస్థీకరణ. మొబైల్ ఫోన్లు, పోస్ట్ ఆఫీసుల ద్వారా టికెట్ బుకింగ్కు మరింత ప్రచారం. ♦ ఇ-టికెటింగ్ విధానంలో నిమిషానికి 7,200 టికెట్ల జారీ. ఏకకాలంలో 1,20,000 మంది ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. ప్రస్తుతం నిమిషానికి 2 వేల టికెట్లే జారీ. ♦ కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ఆఫీస్ ఆన్ వీల్స్, వై-ఫై, వర్క్ స్టేషన్ సదుపాయూలు. ♦ ఒక్కో ప్రయూణికుడిపై ఒక కిలోమీటర్కు వాటిల్లుతున్న నష్టం 10 పైసల (2000-01) నుంచి 23 పైసలకు (2012-13) పెరుగుదల. ♦ సంపాదించిన రూపారుులో 94 పైసల ఖర్చు. కేవలం 6 పైసలే మిగులు. ప్రస్తుత ప్రాజెక్టుల కోసం వచ్చే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసర ం. ఐదేళ్లలో కాగితాలు లేని రైల్వే కార్యాలయూలు. ♦ స్వామి వివేకానంద బోధనల కోసం ప్రత్యేక రైలు ఆఫీస్ ఆన్ వీల్స్ రైళ్లలో ప్రయాణించే వాణిజ్యవేత్తల సౌకర్యార్థం ‘ఆఫీస్ ఆన్ వీల్స్’ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో వర్క్స్టేషన్లను ఏర్పాటు చేస్తామనీ, వీటిని వినియోగించుకునే వారు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందనీ చెప్పారు. అన్ని ఏ1, ఏ తరగతి స్టేషన్లతో పాటు కొన్ని రైళ్లలో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. -
స్వీటు ఆశిస్తే.. నోటిపై జెల్ల
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఢిల్లీలో పాలకులు మారినా, జిల్లాలో ప్రజా ప్రతినిధులు మారినా..కథ మారలేదు. ఈ గడ్డ అభివృద్ధికి దోహదపడే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మళ్లీ నిరాశ తప్పలేదు. మంగళవారం సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కూడా పాతపంథాలోనే జిల్లావాసుల ఆశలకు పూచికపుల్ల విలువనివ్వలేదు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే ప్రతి నేతా రైల్వే ప్రాజెక్టులను సాధిస్తామని ఎన్నికల్లో..‘బొగ్గు ఇంజన్ కూత’లా బిగ్గరగా వాగ్దానం చేస్తుంటారు. తీరా ఎన్నికయ్యాక.. తమ హయాంలో ప్రవేశపెట్టే ఏ రైల్వేబడ్జెట్లోనూ జిల్లావాసుల కలలు సాకారమయ్యేందుకు కించిత్తు కృషి చేయకుండానే పదవీకాలం ముగించేస్తున్నారు. యూపీఏ-2 సర్కారు పోయి, ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలుగా ఆ కూటమిలో భాగస్వామియైన తెలుగుదేశం వారే ఎన్నికయ్యారు. అయినా రైల్వే బడ్జెట్ షరామామూలుగానే జిల్లావాసుల ఆశలను.. తాయిలం కోసం ఎదురు చూసిన పిల్లల నోటిపై గుద్దినట్టు.. చిత్తు చేసింది. పెండింగ్లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించ లేకపోయిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల అనంతరం జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని వారు మండిపడుతున్నారు. వారూ వీరూ.. ఒకటే తీరు సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒప్పించి సాధిస్తామన్న ముగ్గురు ఎంపీలు తోట నరసింహం, మురళీమోహన్, పండుల రవీంద్రబాబు ఏమీ సాధించలేక చేతులెత్తేశారు. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపడంతోనే వారి వైఫల్యం తేటతెల్లమైంది. తొలి ప్రాధాన్యం పిఠాపురం-కాకినాడ మెయిన్ రైల్వేలైన్ అని కాకినాడ ఎంపీ తోట ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెప్పారు. ఇదివరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎంఎం పళ్లంరాజు ఒకసారి మెయిన్ లైన్ వద్దని, మరోసారి అవసరమని పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేశారే తప్ప ప్రాజెక్టు సాధించలేకపోయారు. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ సాధనే తన లక్ష్యమని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. ఇదివరకు ఇదే ప్రాజెక్టు కోసం గంభీరోపన్యాసాలు చేసిన అప్పటి ఎంపీ హర్షకుమార్ కూడా ఇదే రకంగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇప్పుడు రవీంద్రబాబు కూడా నిధుల సాధనలో విఫలమయ్యారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్న జిల్లా పట్ల ఈసారి రైల్వేబడ్జెట్లో కూడా వివక్షనే చూపడంపై జిల్లావాసులు, మేధావి వర్గ ప్రతినిధులు నిప్పులు చెరుగుతున్నారు. గత దశాబ్దంగా యూపీఎ- 1, 2 సర్కార్ల హయాంలో ఏటా రైల్వే బడ్జెట్లలో మొండిచేయే ఎదురైంది. గత ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. ఎన్డీఏ సర్కారైనా జిల్లాకు సముచిత ప్రాతినిధ్యం ఇస్తుందని ఆశిస్తే..‘దొందూ దొందే’ అన్నట్టు యూపీఏలాగే జిల్లాకు జెల్ల కొట్టింది. అన్ని డిమాండ్లపైనా చిన్నచూపే.. జిల్లా కేంద్రం కాకినాడను మెయిన్లైన్కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల సాకారం కావాలంటే కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్ల అంచనాతో కూడిన ఈ ప్రాజెక్టు ఈసారి కూడా పట్టాలెక్కలేదు. ఆ దిశగా లోక్సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ ఎంపీ తోట చేసిన ప్రయత్నం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. లోక్సభ దివంగత స్పీకర్ బాలయోగి కృషితో 2000లో పునాదిరాయి పడిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్కి ఈసారి కదలిక ఉంటుందని కోనసీమ వాసులు ఆశించగా ఈ బడ్జెట్లోనూ వెక్కిరింతే మిగిలింది. 55 కిలోమీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం ఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1100 కోట్లకు చేరింది. భూ సేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. నిర్మాణవ్యయంలో 25 శాతం ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఈ రెండు ప్రధాన డిమాండ్లతో పాటు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపిన కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేను సైతం ఈ బడ్జెట్లో గాలికొదిలేశారు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, పుదుచ్చేరి వరకు సర్కార్ ఎక్స్ప్రెస్ పొడిగింపు డిమాండ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. చెన్నై నుంచి విశాఖకు వారానికి ఒకసారి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన రైలు జిల్లా మీదుగా వెళ్లడం మినహా సదానందగౌడ బడ్జెట్తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. -
జిల్లాలో ఆగని ‘గౌడ’ రైలు
కర్నూలు (రాజ్విహార్) : ఈ సారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా.. రైల్వే మంత్రిత్వ శాఖను దక్కించుకోలేకపోయింది. రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి రాయితీలు సాధించలేకపోయింది. కర్నూలు జిల్లా ప్రజలకు ఎప్పటిలాగే నిరాశే మిగిలింది. ఎన్నో ఆశల నడుమ ఊరించిన ఎన్డీఏ తొలి రైల్వే బడ్జెట్ ఊహలకు అందనిరీతిలో ఉసూరుమనిపించింది. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం ప్రకటించిన ఈ బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త ప్రాజెక్టుల ఊసు అసలు లేకపోగా.. పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనే ఎత్తలేదు. గత రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వర్క్షాపు నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. దశాబ్దాల కాలంగా డిమాండ్లో ఉన్న కర్నూలు- మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం వీడలేదు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న 29 ప్రధాన ప్రాజెక్టుల స్థితి గతులను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయడం తప్ప బడ్జెట్తో ఏమీ ఒరగలేదని చెప్పవచ్చు. ప్రతిపాదనలకు రెడ్ సిగ్నల్.. కర్నూలులో రైల్వే మిడ్లైఫ్ రీహామిటిటేషన్ వర్క్షాపును ఏర్పాటు చేసేందుకు 2013 బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు మూడు సార్లు నగర శివారులోని పంచలింగాల వద్ద స్థల పరిశీలన చేసినా సేకరణ జరగలేదు. దీనికి రూ. 250 కోట్లు కావాలని అధికారులు అంటున్నా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెనెన్స్ (నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని నాటి మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2 కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త లైను కోసం గతంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు సర్వే పనులకు గ్రీన్ లభించింది. రెండు సార్లు సర్వే చేసి నిధులు దుర్వినియోగపర్చారు తప్ప ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈసారి కూడా ఆ లైను ఊసేలేదు. ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనుల ప్రస్తావన లేదు. గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా పురోగతి మాటేలేదు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణకు నిధుల్లేవు. హొస్పేట - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడపాలనే డిమాండ్కు మోక్షం లభించలేదు. కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్క్రు, విజయవాడ నుంచి నంద్యాల, డోన్, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్కోట్ వరకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. అయితే గుంటూరు వరకు రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. విజయవాడ వరకు కనీసం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉన్నా ప్రస్తావన లేదు. చెన్నై - హైదరాబాద్ మధ్య హై స్పీడు ఎక్స్ప్రెస్ రైలు నడుపుతామని ప్రకటించినా.. ఏ మార్గాన నడుపుతారో స్పష్టం చేయలేదు. బెంగళూరు నుంచి కాచిగూడకు ప్యాసింజరు రైలు ప్రకటించినా కర్నూలు మీదుగా వస్తుందో లేదో తెలియదు. -
‘సదా’ నిరాశ
సాక్షి, మంచిర్యాల : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఎప్పటిలాగే జిల్లావాసులకు నిరాశ మిగిల్చింది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్న ప్రజల కలలకు గండిపడింది. సికింద్రాబాద్-నాగ్పూర్ ఎక్స్ప్రెస్ రైలును హై స్పీడు రైలుగా మారుస్తామన్న నిర్ణయం తప్ప మరేదీ జిల్లాకు దక్కలేదు. పెండిం గ్ ప్రాజెక్టులు, నూతన రైల్వేలైన్ల ప్రతి పాదనలపై ఇరు రాష్ట్రాల కోసం వేసిన కమిటీయే ఫైనల్ అని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. దీంతో జిల్లాలోని ప్రతిపాదిత ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, స్టేషన్ల నవీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్-నిర్మల్, ఆదిలాబాద్-మంచిర్యాల్ వయా ఉట్నూర్ రైల్వే లైన్ల సర్వేపై ఉమ్మడి కమిటీ తరువాతే స్పష్టత రానుంది. దీంతోపాటు ఎంపీలు గొడం నగేశ్, బాల్క సుమన్ల ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్- ఆదిలాబాద్ ఇంటర్సిటీ కేటాయింపు, ఖాజీపేట్-బల్లార్ష రూటులోని పలు రైళ్ల బోగీలకు ఏసీ బోగీలు అమర్చేందుకు స్పష్టత రాలేదు. సికింద్రబాద్ నుంచి హజ్రత్ నిజామొద్దీన్(న్యూఢిల్లీ)ల మధ్య ప్రీమియం రైలు ఏర్పాటు అంశం జిల్లావాసులకు ఊరట కలిగించేదే అయినప్పటికి, జిల్లాలోని ఏయే స్టేషన్లలో ఈ రైలుకు నిలుపుదల(హాల్ట్) ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.ప్రధాన రైల్వే స్టేషన్లలో సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నప్పటికి జిల్లాలో ఆ సౌలభ్యం పొందగల స్టేషన్లు ఏవి లేవు. ఖాజీపేట-కాగజ్నగర్ల మధ్య మరిన్ని రైళ్లు, మరిన్ని బోగీలు ఉంటాయనే ఆశతో రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూసిన జిల్లా వాసులకు మోడీ మార్కు బడ్జెట్ రుచించలేదు. ఎంపీలు విన్నవించినా.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కాబట్టి నిధులు కేటాయిస్తారని భావించినప్పటికి సదానంద గౌడ నిరాశే మిగిల్చారు. ఆదిలాబాద్-గడ్చందూర్ రైలు సర్వే విషయంలోనూ మొండిచేయి చూపారు. మంచిర్యాల, బాసర రైల్వే స్టేషన్లలో ఔట్ పేషెంట్ డిస్పెన్సరీ ఏర్పాటుపై నిరాశే మిగిల్చారు. జిల్లాలో విశాలంగా విస్తరించి ఉన్న తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించేందుకు ఆదిలాబాద్-మంచిర్యాల వయా ఉట్నూరు రైలు లైను ఏర్పాటుతో, జిల్లాలోని ప్రజలకు రవాణా మార్గం సుగమమం అయ్యేది. దీనిపై బడ్జెట్లో ప్రస్తావించక పోవడంపై జిల్లా వాసులు నిరాశ చెందుతున్నారు. భాగ్యనగర్, సింగరేణి, రామగిరి, తెలంగాణ రైళ్లలో ఏసీ కోచ్లతోపాటు, అదనపు బోగీల ప్రస్తావనే బడ్జెట్లో లేదు. ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రికి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వినతి పత్రం సమర్పించినప్పటికి ఫలితం లేదు. నవజీవన్, దర్బాంగ, జీటీ ఎక్స్ప్రెస్లను బెల్లంపల్లిలో హాల్ట్ చేయాలనే డిమాండును పట్టించుకోలేదు. ఆదిలాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైను సర్వే కోసం ప్రతి బడ్జెట్లోను ఆశగా ఎదురు చూస్తున్న పశ్చిమ జిల్లా ప్రజలకు ఈసారి యథావిధిగా నిరాశే మిగల్చడం గమనార్హం. సింగిల్ లైన్ వల్ల అవస్థలు ఎదురవుతున్న హైదరాబాద్-ఆదిలాబాద్ డబ్లింగ్ పనులకు నిధుల కేటాయింపు లేనే లేదు. ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం శూన్యం. ఈ సారైనా నిధులు విడుదల చేస్తే, ఈ లైను పనుల్లో పురోగతి ఉంటుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. -
రైల్వే బడ్జెట్ నజరానా: రెండు రాష్ట్రాలకూ మొండిచేయి
తెలుగింటికో కమిటీ ప్రస్తుతం అమల్లో ఉన్న 29 రైల్వే ప్రాజెక్టులపై కమిటీ వేశాం.. ఆ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్న రైల్వే మంత్రి సదానంద గౌడ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు.. ఏపీకి ఏసీ డైలీ ఎక్స్ప్రెస్ రెండు రాష్ట్రాలకు మూడు వీక్లీ ఎక్స్ప్రెస్లు మిగిలిన అంశాల్లో కనిపించని మన రాష్ట్రాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే మంత్రి సదానంద గౌడ మొండిచేయి చూపారు. ఒకట్రెండు మెరుపులు మినహా రైల్వే బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. కొన్ని కొత్త రైళ్లు ఇచ్చారు తప్పితే, మౌలిక వసతులకు సంబంధించి కొత్తగా లబ్ధి కనిపించలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు చేపడతామని రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రెండు రాష్ట్రాల్లో రూ. 20,860 కోట్ల అంచనా వ్యయంతో 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని, రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు జరిపిన తరువాత వారి అవసరాలనుబట్టి పూర్తిచేసేందుకు యత్నిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 18 కొత్త రైల్వే మార్గాలకు సర్వే పనులు చేపడతామని ప్రకటించినప్పటికీ, వాటిలో రెండు రాష్ట్రాలకు చెందినవి ఒక్కటీ లేదు. అలాగే డబ్లింగ్, గేజ్ మార్పిడి పనుల్లోనూ చోటు దక్కలేదు. రైళ్ల పొడిగింపులోనూ మన సర్వీసులేవీ లేవు. దేశవ్యాప్తంగా ఐదు జనసాధారణ్ రైళ్లు ప్రవేశపెట్టినా వాటిలోనూ అంతే. తీర్థయాత్రల కోసం ప్రవేశపెడుతున్న ప్రత్యేక రైళ్లలోనూ మన ప్రస్తావనే లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల వినతులకు మోక్షం లభించలేదు. ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట ప్రత్యేక డివిజన్ ప్రతిపాదనలను రైల్వే మంత్రి పట్టించుకోలేదు. రెండు మూడేళ్ల క్రితం ప్రారంభించిన సర్వే పనులకు కూడా ఐదారు లక్షలు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. అలాగే స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాల ప్రస్తావనే లేదు. దేశ రాజధానిని కలుపుతూ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు, ఆంధ్రప్రదేశ్కు ఒక ఏసీ ఎక్స్ప్రెస్ కేటాయింపు మాత్రమే ఊరట కలిగించే అంశం. జనసాధారణ్ రైళ్లే కాదు.. ప్యాసింజర్, మెమూ, డెమూ రైళ్లలో రెండు రాష్ట్రాలకూ ఒక్కటి కూడా ఇవ్వలేదు. రైళ్ల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులూ ఒక్కటీ లేవు. -
ఇలాగైతే.. అంతా హైఫై..
ఆఫీసు పనిమీద ముంబై వెళుతున్నారు.. జస్ట్ మీ మొబైల్ ఫోన్తోనే టికెట్ బుక్ చేసుకున్నారు.. స్టేషన్కు వెళ్లగానే పూర్తి పరిశుభ్రంగా ఉన్న ఆవరణ మీకు స్వాగతం పలికింది.. మెట్లెక్కే శ్రమ ఏమాత్రం లేకుండా ‘ఎస్కలేటర్’పై నుంచుని కావాల్సిన ప్లాట్ఫాంపైకి వెళ్లారు.. రైలుకు ఇంకా సమయం ఉండడంతో అక్కడే ఉన్న ‘ఫుడ్ కోర్ట్’కు వెళ్లి పిజ్జా తిన్నారు.. తర్వాత ‘రెస్ట్ రూమ్’కెళ్లి హాయిగా కూర్చున్నారు.. అక్కడే మీ ల్యాప్టాప్ తీసి స్టేషన్లో ఏర్పాటు చేసిన ఉచిత వైఫై ఇంటర్నెట్కు అనుసంధానమై పనిచేసుకుంటున్నారు.. ఇంతలో రైలు రాబోతోందని మీ ఫోన్కు కాల్ వచ్చింది.. లేచివెళ్లి రెలైక్కారు.. మీ సీట్లో కూర్చుని రైల్లోనూ ఏర్పాటు చేసిన వైఫైతో ఇంటర్నెట్లో విహరించారు.. ఆకలైతే చిన్న ఎస్సెమ్మెస్తో మీక్కావాల్సిన దానికి ఆర్డరిచ్చారు.. వచ్చే స్టేషన్లోనే రుచిగా, శుచిగా ఉన్న భోజనం మీ వద్దకు వచ్చేసింది.. ఈ లోగా టీసీకి మీ మొబైల్కు వచ్చిన ‘టికెట్ సందేశా’న్ని చూపించేశారు.. తర్వాత మీ వద్దకు వచ్చిన ‘హౌస్ కీపింగ్’ సిబ్బందితో మ్యాగజైన్, మంచినీళ్లు తెప్పించుకున్నారు.. కాసేపటికి నిద్రపోయారు.. మీరు దిగాల్సిన స్టేషన్ రావడానికి కొద్ది నిమిషాల ముందు ‘మీ స్టేషన్ రాబోతోంద’ంటూ ఫోన్కాల్ వచ్చింది.. లేచి బ్యాగ్ సర్దుకోగానే స్టేషన్ వచ్చేసింది.. రైలుదిగి ముందుగానే బుక్ చేసుకున్న వీఐపీ రెస్ట్రూమ్కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.. అక్కడే కాస్త రెడీ అయ్యి వచ్చిన పనిమీద నగరంలోకి వెళ్లారు. - రైల్వే మంత్రి బడ్జెట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ రూపం దాల్చితే.. త్వరలో అందుబాటులోకి వచ్చే సౌకర్యాలివి! ఇంతేకాదు.. కాయిన్ వేసి ప్లాట్ఫాం టికెట్ తీసుకునేలా వెండింగ్ యంత్రాలు.. పోస్టాఫీసుల్లో రైలు టికెట్లు.. ఇంటర్నెట్లో ప్లాట్ఫాం, అన్ రిజర్వుడ్ టికెట్లు, ‘రెస్ట్ రూమ్’ను బుక్ చేసుకునే అవకాశం.. ఏ రైలు ఏ సమయంలో ఎక్కడ ప్రయాణిస్తోందో తెలుసుకునే ఏర్పాట్లు.. స్టేషన్లు, రైళ్లలో మినరల్ వాటర్ అందించే ఏర్పాట్లు.. బయో టాయిలెట్లు.. విస్తృతంగా సీసీ కెమెరాలు.. వంటి సౌకర్యాలెన్నో అందుబాటులోకి రానున్నాయి. ప్రగతికారకం, మార్గదర్శకం ఈ రైల్వే బడ్జెట్ ప్రగతికారకం, మార్గదర్శకం. పారదర్శకమైన, సంస్థాగతంగా రైల్వేను బలోపేతం చేయగలిగిన బడ్జెట్ను సదానంద గౌడ ప్రవేశపెట్టారు. సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగేలా తక్కువ సమయంలోనే రైల్వేకు మంచి దిశానిర్దేశం చేశారు. సాధారణ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా, వేగవంతమైన అభివృద్ధితోపాటు భద్రత కల్పించేలా రైల్వే బడ్జెట్ ఉంది. - నరేంద్ర మోడీ, ప్రధాని 6 నెలలకోసారి చార్జీల సవరణ ప్రయాణ చార్జీలను ప్రతి ఆరునెలలకూ సవరించేందుకు ఇంధన ధరల సర్దుబాటు అంశాన్ని (ఎఫ్ఏసీని) ప్రాతిపదికగా తీసుకునే ప్రక్రియను కొనసాగిస్తాం. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నాం. బుల్లెట్ రైళ్లపై ఒక సర్వే నివేదిక అందింది. మరో నివేదిక వచ్చే నెలాఖరుకు రావచ్చు. నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం. రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంలో ప్రైవేటు పెట్టుబడిదారుల ప్రమేయంపై పెట్టుబడిదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - విలేకరులతో రైల్వే మంత్రి సదానందగౌడ నిజాయతీ గల బడ్జెట్ ఇది రైల్వే బడ్జెట్ వాస్తవాలను ప్రతిబింబించేదిగా ఉన్న ఒక నిజాయితీ కలిగిన బడ్జెట్. గడిచిన కొన్నేళ్లుగా నిర్వహణ లోపం వల్ల భారత రైల్వే కష్టాల పాలయింది. త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న కేంద్రం కొత్త ఆలోచనను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. జనార్షక, అవాస్తవిక బడ్జెట్ల కంటే హేతుబద్ధమైన నిర్వహణే మేలు చేస్తుంది. - వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి -
ఇక హైస్పీడ్లో రైల్వేల అభివృద్ధి..!
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ అభివృద్ధిని ప్రేరేపించేదిగా ఉందని వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వ్యాఖ్యానించాయి. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ఆకర్షణపై దృష్టిపెట్టడంతో మౌలిక సౌకర్యాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపాయి. ‘భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కావలసిన నిధుల్లో భారీ మొత్తాన్ని పీపీపీ మార్గం ద్వారా సమీకరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం. ఈ ప్రతిపాదనతో నిధుల కొరతను అధిగమించవచ్చు. రైల్వేల ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు...’ అని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సరకు రవాణా టెర్మినళ్లను, లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతామని రైల్వే మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. హైస్పీడ్ రైళ్లతో సహా భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టులకు నిధులను ప్రధానంగా పీపీపీలోనే సమకూరుస్తామని చెప్పారు. ఎఫ్డీఐ అనుమతిపై హర్షం... మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల్లో ఎఫ్డీఐని అనుమతించే యోచన హర్షణీయమని అల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా ఎండీ భరత్ సల్హోత్రా అన్నారు. అరకొర నిధులతో సతమతమవుతున్న భారతీయ రైల్వేలకు ఈ నిర్ణయంతో పుష్కల ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశీయ రైల్వే రంగంలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలను త్వరగా ఏర్పాటు చేసేందుకు ఎఫ్డీఐలు దోహదపడతాయని అన్నారు. బడ్జెట్లో చేసిన ప్రకటనలు రైల్వే మౌలిక సౌకర్యాల మెరుగుకు, ఉపాధి అవకాశాల కల్పనకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపురియా పేర్కొన్నారు. ‘ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచారు. అధికార దాహంతో కూడిన పథకాలేవీ లేవు. మార్కెట్లు ఇంతకంటే ఏం ఎక్కువ ఆశించాయి?...’ అని మహింద్రా అండ్ మహింద్రా సీఎండీ ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. పెట్టుబడుల ప్రవాహం... పీపీపీ పద్ధతిని పాటించడం వల్ల ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ చెప్పారు. మోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి అత్యంత విశ్వసనీయత ఉందని అన్నారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియతో రైల్వే రంగం నిజమైన జీవన రేఖగా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు. పీపీపీ పద్ధతిలో రేవులను అనుసంధానిస్తామనీ, ప్రైవేట్ పార్టీల ద్వారా పార్శిల్ వ్యాన్లు, ర్యాకులను సమీకరిస్తామనీ కూడా రైల్వే మంత్రి వెల్లడించారు. రైల్వేల సామర్థ్యం మెరుగుపడితే రవాణా వ్యయం తగ్గుతుందనీ, తద్వారా ఎగుమతిదారులకు మేలు జరుగుతుందనీ ఈఈపీసీ ఇండియా చైర్మన్ అనుపమ్ షా తెలిపారు. ఉట్టిపడిన వాస్తవికత... కీలకమైన రైల్వే రంగంలో మౌలిక సౌకర్యాలను, సామర్థ్యాన్నీ పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను రైల్వే బడ్జెట్లో విస్పష్టంగా ప్రకటించారని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ ఎస్.శ్రీరామ్ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఐఐ హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. వాస్తవిక దృక్పథంతో కూడిన బడ్జెట్ను మంత్రి సమర్పించారని సీఐఐ అధ్యక్ష పదవికి ఎన్నికైన సుమీత్ మజుందార్ చెప్పారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించేవిగా ప్రాజెక్టులను రూపొందిస్తే పీపీపీ, ఎఫ్డీఐ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆరు కొత్త రైళ్లను మంజూరు చేయడంపై సీఐఐ చైర్మన్ (ఆంధ్ర, తెలంగాణ) సురేశ్ చిట్టూరి సంతోషం వ్యక్తంచేశారు. ఉక్కు వినియోగం పెరుగుతుంది.. రైల్వే ట్రాకుల డబ్లింగ్, ట్రిప్లింగ్, స్టేషన్ల ఆధునీకరణ, మీటర్ గేజ్ పట్టాలను బ్రాడ్గేజ్గా మార్చడం వంటి చర్యలతో ఉక్కు వినియోగం పెరగనుందని సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ, ఐటీ, వివిధ ప్రాజెక్టుల అమలుపై బడ్జెట్లో దృష్టి సారించారనీ, దేశీయ రైల్వేల పనితీరు మెరుగుకు దోహదపడుతుందనీ భారతీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎం.రఫీక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. గేజ్ మార్పిడి, కొత్త పట్టాల ఏర్పాటుతో రైల్వేల సామర్థ్యం పెరుగుతుందని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ వినీత్ అగర్వాల్ చెప్పారు. -
డాలర్ ట్రాక్పై మోడీ రైలు...
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే ఆపరేషన్ విభాగంలో మాత్రం ఎఫ్డీఐలు ఉండవు దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 60 వేల కోట్లతో బుల్లెట్ రైలు రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ పద్ధతిలోనే {పతి ఆరు నెలలకూ రైలు చార్జీల సవరణ! ఆధునీకరణే ‘సదానందం’ మెట్రో నగరాలను కలుపుతూ హైస్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగం గంటకు 200 కి.మీ. వరకు పెంపు కొత్తగా 58 రైళ్లు, మరో 11 రైళ్ల ప్రయాణ దూరం పొడిగింపు ఇక టికెటింగ్ ఈజీ.. కొత్త తరం ఈ-టికెటింగ్ రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పాటు రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్.. ప్రధాన స్టేషన్లలో స్థానిక ఫుడ్ కోర్టులు కొత్తగా 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం ప్రతి రైల్వే బడ్జెట్లోనూ... చార్జీలు పెరుగుతాయా? పెరగవా? అని ఎదురుచూడటం సగటు భారతీయుడి సైకాలజీ. ఈసారి ఎవ్వరికీ అలా ఎదురుచూసే చాన్సివ్వకుండా 15 రోజుల ముందే మోడీ సర్కారు భారీగా వడ్డించేసింది. ఇక బడ్జెట్లో స్పీడంతా బుల్లెట్ రైళ్లదే. కానీ వాటికి దేశీ ఇంధనం సరిపోదని రైల్వే మంత్రి ముందే చెప్పారు. అందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపేశారు. వీటికితోడు దేశీ కార్పొరేట్లకూ ద్వారాలు తెరిచారు. బుల్లెట్ వేగం, అందమైన స్టేషన్లు, అద్భుతమైన సౌకర్యాలు, మొబైల్తోనే మొత్తం ప్రయాణం, వజ్ర చతుర్భుజి ప్రాజెక్టు... అంటూ అరచేతిలో ఆవిష్కరించిన స్వర్గానికి ఇం‘ధన’మైతే ఇప్పుడు లేదు. పెండింగ్లో ఎన్నో ప్రాజెక్టులున్నాయంటూ కొత్తవాటికి నో చెప్పిన రైల్వే మంత్రి... కేటాయింపులు మాత్రం గత ప్రభుత్వాల తీరులోనే విదిలించారు. ఇక ఆంధ్రప్రదేశ్... తెలంగాణ. రాష్ట్రాలు రెండయినా రాత మాత్రం మారలేదు. ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పక్కనబెట్టేశారు. మరి ఈ డాలర్ డ్రీమ్స్ సాకారమవుతాయా? వేచి చూస్తేనే తెలిసేది!! -
ద లాల్ సిగ్నల్
నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటితమయ్యాక తొలిసారి స్టాక్ మార్కెట్లు కంగుతిన్నాయ్. లోక్సభలో సదానంద గౌడ ప్రకటించిన రైల్వే బడ్జెట్ నిరాశను మిగల్చడంతో ఇన్వెస్టర్లలో ఉన్నట్టుండి భయాలు వ్యాపించాయ్. మొట్టమొదటిసారిగా ఒక బీజేపీ మంత్రి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇన్వెస్టర్లు ప్రసంగం మొదట్లోనే నిరుత్సాహానికి లోనయ్యారు. దేశీయ రైల్వే వ్యవస్థ ఎదుర్కొంటున్న నిధులలేమిని నొక్కిచెప్పిన మంత్రి ప్రసంగం చివర్లో ఇందుకు పలు మార్గాలను ప్రకటించినప్పటికీ మార్కెట్లకు రుచించలేదు. ప్రధానంగా ఎలాంటి కొత్త ప్రాజెక్ట్లనూ ప్రతిపాదించకపోగా, ఇప్పటికే పలు సమస్యలతో కుదేలైన ప్రాజెక్ట్లను ఎలా పూర్తిచేసేదీ స్పష్టం చేయకపోవడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మరోవైపు మార్కెట్ను ఉత్సాహపర్చే పెద్ద ప్రకటనలూ లేకపోవడం సెంటిమెంట్ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వార్షిక సాధారణ బడ్జెట్ సైతం ఇదే రీతిలో ఉండొచ్చునన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ ఒక దశలో 610 పాయింట్లు దిగజారింది. నిజానికి తొలుత 90 పాయింట్ల వరకూ లాభపడి కొత్త గరిష్టం 26,190ను తాకింది. అయితే రైల్వే బడ్జెట్ వెలువడ్డాక పతనబాట పట్టి 25,495 వద్ద కనిష్టాన్ని చేరింది. చివరికి 518 పాయింట్లు కోల్పోయి 25,582 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం ఇదే బాటలో 7,809 వద్ద కొత్త రికార్డును అందుకున్నప్పటికీ ఇంట్రాడేలో ఆ స్థాయి నుంచి 7,596కు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసేసరికి నికరంగా 164 పాయింట్లు పోగొట్టుకుని 7,623 వద్ద నిలిచింది. ఇంతక్రితం మార్కెట్లు 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో పతనమయ్యాయి. అప్పట్లో సెన్సెక్స్ 651, నిఫ్టీ 299 పాయింట్లు చొప్పున దిగజారాయి. బ్లూచిప్స్ బోర్లా సెన్సెక్స్, నిఫ్టీలో భాగమైన సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మాత్రమే అదికూడా నామమాత్రంగా లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక దిగ్గజాలు భెల్, ఎన్టీపీసీ, టాటా పవర్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, సెసాస్టెరిలైట్, ఆర్ఐఎల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా 8-2% మధ్య పతనమయ్యాయి. రియల్టీ నేలచూపులు రియల్టీ షేర్లు కోల్టేపాటిల్, యూనిటెక్, ఇండియాబుల్స్, అనంత్రాజ్, డీఎల్ఎఫ్, హెచ్డీఐఎల్, ఫీనిక్స్ మిల్, శోభా, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీబీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 13-4.5% మధ్య కుప్పకూలాయి. విద్యుత్ షాక్ విద్యుత్ రంగ షేర్లు అదానీ పవర్, పీటీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేపీ పవర్, సీఈఎస్సీ, ఏబీబీ, సీమెన్స్, రిలయన్స్ పవర్, ఎన్హెచ్పీసీ 8 శాతం స్థాయిలో నీరసించాయి. బీఎస్ఈ-500 విలవిల ట్రేడైన షేర్లలో ఏకంగా 2,234 తిరోగమిస్తే, కేవలం 770 లాభపడ్డాయి. బీఎస్ఈ-500లో జిందాల్ స్టెయిన్లెస్, హెచ్ఎంటీ, ఉత్తమ్ గాల్వా, జేపీ అసోసియేట్స్, ఇండియా సిమెంట్స్, గుజరాత్ గ్యాస్, ఐఎఫ్సీఐ, ధనలక్ష్మీ బ్యాంక్, మహీంద్రా సీఐఈ, ఎంఎంటీసీ, ఎంటీఎన్ఎల్, టీబీజెడ్, సిండికేట్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ ఇన్ఫో, ఎస్కార్ట్స్, జైన్ ఇరిగేషన్ 13-8% మధ్య దిగజారాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 423 కోట్లను ఇన్వెస్ట్చేయగా, దేశీ సంస్థలు రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. -
డాలర్ డ్రీమ్స్
రైలు పాతదే.. కలలు కొత్తవి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే నిర్వహణ విభాగంలో మాత్రం ఎఫ్డీఐలు ఉండవు దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం సదానందగౌడ రైల్వే బడ్జెట్లో ప్రయాణికులకే పెద్దపీట న్యూఢిల్లీ: నెల రోజుల కిందటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. రైల్వే మౌలిక వసతులకు ఎఫ్డీఐలను ఆహ్వానిస్తామని, స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులకూ అనుమతిస్తామని స్పష్టంచేసింది. కీలక ప్రాజెక్టుల్లో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాన్నీ (పీపీపీని) పెంచుతామని తొలి రైల్వే బడ్జెట్లో ప్రకటించింది. రైల్వేమంత్రి సదానందగౌడ తన తొలి రైల్వే బడ్జెట్ను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. రికార్డు స్థాయిలో రూ.1,64,374 కోట్లతో రూపొందించిన రైల్వే బడ్జెట్లో.. ఊహించినట్లే ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటానికి, రైల్వేల ఆధునీకరణకు ప్రాధాన్యమిచ్చారు. కానీ.. ప్రజాకర్షక ప్రకటనలేవీ చేయలేదు. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ - మహారాష్ట్రలోని ముంబై మధ్య ఒక బుల్లెట్ రైలు, ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ హై స్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ, తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచటం, దేశవ్యాప్తంగా 58 కొత్త రైళ్లు ప్రవేశపెట్టటం, మరో 11 రైళ్ల ప్రయాణదూరం పొడిగింపు. ఇవీ ఈ బడ్జెట్లోని ముఖ్యాంశాలు. పక్షం రోజుల కిందటే భారీగా రైలు ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలను వడ్డించిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఎలాంటి చార్జీలపెంపూ లేదు. అయితే ప్రతి ఆరు నెలలకొకసారి అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రైలు చార్జీలను సమీక్షించి సవరించాలని గతంలో పార్లమెంటు నిర్ణయించిందని, దానిని కొనసాగిస్తామని రైల్వేమంత్రి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12:10 గంటలకు తొలుత లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన సదానందగౌడ.. తను ప్రతిపాదించిన బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైలు తరహాలోనే వేగంగా ప్రసంగాన్ని చదువుతూ పోయారు. రైల్వేలోకి ఎఫ్డీఐ, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని గౌడ ప్రకటించినపుడు.. ఇది అంబానీలు, అదానీల బడ్జెట్ అంటూ విపక్షాలు నిరసించాయి. ప్రాజెక్టులన్నీ పెండింగే... రైల్వే రంగం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురయిందని, ప్రజాకర్షణ మోజులో పడి రైల్వేను తీవ్ర నిధుల కొరతలోకి నెట్టివేశారని గత ప్రభుత్వాలపై గౌడ విమర్శలు ఎక్కుపెట్టారు. సభలో చప్పట్ల కోసం, ఓట్ల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూ వచ్చారని.. కానీ నిధుల కొరత కారణంగా ఆ ప్రాజెక్టులేవీ సకాలంలో పూర్తికావటం లేదని ఎండగట్టారు. గత 30 ఏళ్లలో రూ.1,57,883 కోట్ల వ్యయం కాగల 676 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే.. ఇప్పటికి 317 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలినవి పూర్తిచేయటానికి ఇప్పుడు రూ.1,82,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అలాగే గత పదేళ్లలో రూ. 60,000 కోట్ల విలువైన 99 కొత్త రైల్వే లైన్లకు అనుమతులివ్వగా.. అందులో ఇప్పటివరకూ పూర్తయింది ఒక్కటేనని చెప్పారు. కిలోమీటరుకు 23 పైసలు నష్టం ప్రయాణ చార్జీలను చాలా కాలంగా సవరించకుండా వదిలివేశారని.. దీనివల్ల 2012-13 నాటికి ఒకో ప్రయాణికుడిపై కిలోమీటరుకు 23 పైసల నష్టంవస్తోందని మంత్రి చెప్పారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి సరుకు రవాణా చార్జీలను పెంచేయటంతో రవాణాదారులు దూరమవుతున్నారని.. సరుకు రవాణాలో రైల్వేల వాటా గత 30 ఏళ్లలో క్రమంగా తగ్గిపోతూ వస్తోందన్నారు. అందుకే కఠినమైనప్పటికీ చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత నెల 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన చార్జీల పెంపుతో రూ. 8,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. అయితే.. వజ్ర చతుర్భుజి వ్యవస్థను పూర్తిచేయటానికి రూ.9 లక్షల కోట్లకన్నా ఎక్కువ నిధులు అవసరమవుతాయన్నారు. ఒక్క బుల్లెట్ రైలును ప్రవేశపెట్టటానికి రూ. 60,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. అందుకే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించానని తెలియజేశారు. రికార్డు స్థాయి రైల్వే ప్రణాళిక... 2014-15లో రూ.1,64,374 కోట్ల రాబడిని అంచనా వేశారు. దీన్లో సరుకు రవాణా ఆదాయం రూ.1,05,770 కోట్లు, ప్రయాణ చార్జీల ఆదాయం రూ. 44,645 కోట్లు. దీన్లో రూ.1,49,176 కోట్లు అంచనా వ్యయంకాగా.. సాధారణ నిర్వహణ వ్యయం 1,12,649 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా రూ. 15,078 కోట్లు ఎక్కువ. ఇంధన ధరలు పెరగటం, సిబ్బంది వ్యయం పెరగటం వల్ల నిర్వహణా వ్యయం పెరిగనట్లు గౌడ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ. 65,445 కోట్ల ప్రణాళికా వ్యయాన్ని ప్రకటించారు. ఇందులో రూ. 30,000 కోట్లకు పైగా బడ్జెటరీ మద్దతుగా కేంద్రం అందిస్తుంది. మార్కెట్ అప్పుల ద్వారా రూ. 11,790 కోట్లు, అంతర్గత వనరులు రూ. 15,350 కోట్లు, పీపీపీల ద్వారా 6,005 కోట్లు సమీకరిస్తారు. బడ్జెట్లో పెన్షన్ చెల్లింపుల కోసం రూ. 28,850 కోట్లు, డివిడెండ్ చెల్లింపుల కోసం రూ. 9,135 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైల్వే ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో 94 పైసలను రైల్వే కోసమే వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వేల్లోకి విదేశీ పెట్టుబడులు... రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆర్థికంగా బలంగా ఉన్నాయని, వీటి నుంచి అదనపు నిధులను రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులుగా తెచ్చేందుకు ఒక పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైన నిధుల కోసం రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ (ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యం) పద్ధతిలో చేపడతామన్నారు. భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరమైన హైస్పీడ్ రైళ్లకు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామన్నారు. రాబడి తగ్గింది.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రవాణా వసూళ్లు రూ. 1,39,558 కోట్లుగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇది సవరించిన అంచనాలకన్నా రూ. 942 కోట్లు తక్కువ. మరోవైపు సాధారణ నిర్వహణ వ్యయం రూ. 97,571 కోట్లకు చేరిందని.. ఇది సవరించిన అంచనా కన్నా రూ. 511 కోట్లు ఎక్కువని వివరించారు. అలాగే.. పెన్షన్ చెల్లింపులు కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రూ. 7,943 కోట్లు మిగులు.. వాస్తవానికి రూ. 3,783 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఇక ప్రణాళికా వ్యయం కూడా సవరించిన అంచనాలు రూ. 59,359 కోట్ల కన్నా తగ్గిపోయిందని.. పీపీపీ లక్ష్యాలు వాస్తవరూపం దాల్చకపోవటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత, సేవలకు ప్రాధాన్యం ప్రధాన రైల్వేస్టేషన్లలో ఫుట్-ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు; వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీలతో నడిచే చక్రాల కుర్చీలు; రైళ్లలో వై-ఫై, కంప్యూటర్లతో వర్క్ స్టేషన్ల ఏర్పాటు, రైళ్లలో పరిశుభ్రమైన ఆహారం సరఫరా, రైల్వేస్టేషన్లలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, ఈ-టికెట్ బుకింగ్ సౌకర్యాల విస్తరణ వంటి చర్యలను రైల్వే మంత్రి ప్రకటించారు. స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, ఆర్వో తాగునీటి యూనిట్ల ఏర్పాటు, రైళ్లలో బయో టాయిలెట్లు, పారిశుద్ధ్య సిబ్బంది మరిన్ని రైళ్లకు విస్తరణ వంటి చర్యలు చేపడతామన్నారు. వీటన్నిటిలో పీపీపీ పద్ధతిని అనుసరించటంతో పాటు ఎన్జీఓలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తామన్నారు. భద్రతకోసం దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ, కాపలా లేని లెవల్ క్రాసింగ్ల తొలగింపు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం రూ. 40,000 కోట్లు అవసరమవుతాయని మంత్రి చెప్పారు. ఈ బడ్జెట్లో వీటికి 1,785 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్గా తలుపులు మూసుకునే బోగీలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే.. 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమిస్తామని, మహిళా బోగీల్లో వీరితో భద్రత కల్పిస్తామని చెప్పారు. రైలు టూరిజం, రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం పునర్వ్యవస్థీకరణ, రైల్వే ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించారు. సిబ్బంది సంక్షేమ నిధి, రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేపడతామన్నారు. హైస్పీడ్ వజ్ర చతుర్భుజి ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించారు. అలాగే.. తొమ్మిది ఎంపిక చేసిన సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెంచుతామన్నారు. -
ఉభయ రాష్ట్రాలకూ నిరాశే!
అడిగే నాథుడు లేక అయిదేళ్లుగా రాష్ట్రానికి ఏ ప్రాజెక్టునూ ఇవ్వ కుండా రైల్వే బడ్జెట్లను కానిచ్చేస్తున్న యూపీఏ ప్రభుత్వ సంప్రదా యాన్నే ఎన్డీయే సర్కారు కూడా కొనసాగించదల్చుకున్నట్టుంది. కాక పోతే, ఈసారి విభజన సాకుతో ఆ పనిచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదికొచ్చాక ఒరగబెడతామన్న హామీ తప్ప ఈ బడ్జెట్లో అటు తెలంగాణకైనా, ఇటు ఆంధ్రప్రదేశ్కైనా దక్కిందేమీ లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్కు ఒక ఏసీ ఎక్స్ప్రెస్ రైలు ఇచ్చారు. ఇది సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ తరహాలోనే విజయవాడ - న్యూఢిల్లీ మధ్య ఉంటుంది. అయితే, ఈ ఎక్స్ప్రెస్ను ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించాలో, లేదో అర్థం కాని పరిస్థితి. ఆ రైలు విజయవాడలో బయలుదేరిన గంటకల్లా తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి వరంగల్ చేరాక దాని ప్రయాణమంతా ఏపీ ఎక్స్ప్రెస్ దోవనే వెళ్తుంది. ఏతా వాతా బయలుదేరే స్టేషన్ తప్ప మిగిలిన ప్రయాణమంతా తెలం గాణ ప్రాంతంలోనే ఉంటుంది. సీమాంధ్రకు మేలు చేద్దామన్న సంకల్పం ఉంటే, ఆ ప్రాంతంలోని జిల్లాలకు ప్రయోజనం చేకూ రుద్దా మనుకుంటే దాన్ని విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిపాల్సింది. రైల్వే బడ్జెట్కు రూపకల్పన చేసేటపుడు రాష్ట్రాలను సంప్రదించే సంప్ర దాయం ఉంటే ఇలాంటి లోపాలు సరిదిద్దే అవకాశం ఉంటుంది. కానీ, అటు కేంద్రానికీ ఈ ఆలోచన ఉండదు. ఇటు రాష్ట్ర ప్రభు త్వాలూ పట్టించుకోవు. అందువల్లే కాబోలు... ప్రకటించిన 18 కొత్త రైలు మార్గాల సర్వేల్లో ఉభయ రాష్ట్రాలకూ ఒక్కటీ లేదు. రైళ్ల పొడిగింపులోగానీ, డబ్లింగ్, గేజ్ మార్పిడి వంటి పనుల్లోగానీ, తీర్థ యాత్రల రైళ్లలోగానీ రెండు రాష్ట్రాలకూ ఇచ్చిందేమీ లేదు. మొత్తానికి ఎంపీలు ఇచ్చిన వినతులన్నీ ఎప్పటిలా బుట్టదాఖలా అయినట్టే కనిపిస్తున్నది. మన దక్షిణ మధ్య రైల్వే లాభాలు గడించే రైల్వే జోన్లలో అగ్రభాగాన ఉన్నా అందుకు తగినట్టుగా ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు, రైళ్లు రావడంలేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. పదమూ డేళ్లక్రితం అనుమతి లభించిన కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. 1999లో అనుమతి వచ్చిన కాకి నాడ-పిఠాపురం లైను పరిస్థితీ అలాగే ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు మంజూరైన నిజామా బాద్ - పెద్దపల్లి మార్గం ఇప్పటికీ పూర్తికాలేదు. ఇక కాజీపేట వ్యాగన్ల తయారీ పరిశ్రమదీ అదే స్థితి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్, తెలం గాణలకు ఇంత అన్యాయం చేసిన రైల్వే బడ్జెట్ మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్రపై ఎక్కడలేని ప్రేమనూ ప్రదర్శించింది. రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) అంగీకరిస్తే భద్ర త విషయమై రాజీపడినట్టే అవుతుందని కేంద్ర హోంశాఖ అభ్యం తరపెట్టినట్టు వార్తలొచ్చాయి. అందువల్ల రైల్వేలకు సంబం ధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగానికి మాత్రమే ఎఫ్డీఐలను పరిమితం చేస్తామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించారు. అలాగే, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరుస్తామ న్నారు. రైల్వేల్లో సంస్కరణలకు గత ప్రభుత్వం అంకురార్పణ చేస్తే ఎన్డీయే ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకుపోదల్చుకు న్నట్టు ఈ ప్రతిపాదనలను గమనిస్తే అర్థమవుతుంది. రూ. 9 లక్షల కోట్లు అవసరంకాగల బృహత్తర ప్రాజెక్టు వజ్ర చతుర్భుజిని చేప ట్టబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద మెట్రో నగరా లన్నిటికీ బులెట్ రైళ్లు నడుపుతారు. ముందుగా ముంబై - అహ్మదాబాద్ల మధ్య దీన్ని ప్రారంభిస్తారు. తొలుత ప్రారంభ మయ్యే బుల్లెట్ రైలు కోసమే రూ. 60,000 కోట్లు వ్యయమవు తాయి. ఇంత ఖర్చయ్యే ఈ బుల్లెట్ రైలుకు ప్రధాని స్వస్థలాన్ని ఎంచుకోవడం కూడా రైల్వే శాఖ సంప్రదాయానికి అనుగుణంగానే ఉంది. గతంలో రైల్వే మంత్రులుగా ఉన్నవారంతా తమ రాష్ట్రాలకు ముఖ్యమైన ప్రాజెక్టులను, రైళ్లను సమకూర్చుకున్నారు. ఆ సంగతలా ఉంచి ఈ ఆరున్నర దశాబ్దాల్లో మన పాలకులు నిర్మించిన కొత్త రైలు మార్గం 11,000 కిలోమీటర్లు మించలేదు. ప్రతి బడ్జెట్లోనూ కొత్త రైల్వే లైన్లకు సర్వేలు చేస్తామని ప్రకటించడమే తప్ప చేసినవాటి అతీగతీ ఏమైందో తెలియదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు 5,000 కిలోమీటర్ల మేర 36 కొత్త రైలు మార్గాల కోసం సర్వే చేయించారు. వాటిలో 9 మినహా అన్నీ పూర్త య్యాయని చెప్పారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ ఒక్కటంటే ఒక్క కొత్త రైలు మార్గం రాలేదు. చాలాచోట్ల కాపలా లేని రైల్వే క్రాసింగ్లు ప్రమాదాలకు నిలయమవుతున్నాయి. అలాగే, నాసిరకం ట్రాక్లు రైలు ప్రయాణమంటేనే హడలెత్తిస్తున్నాయి. వీటిగురించి శ్రద్ధ పెడ తామని చెప్పడం తప్ప అందుకు సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికేమీ బడ్జెట్లో లేదు. మోడీ సర్కారు ముందు ఇలాంటివాటి సంగతి చూసి బులెట్ రైలు వంటి ప్రతిపాదనలు సిద్ధంచేస్తే బాగుండేది. ఇక బడ్జెట్కు కొన్ని రోజుల ముందే రూ. 8,000 కోట్ల మేర ప్రయాణి కుల చార్జీలను పెంచారు గనుక బడ్జెట్లో దాని జోలికెళ్లలేదు. అయితే, గత ఫిబ్రవరినాటికి ప్రయాణికుల తరలింపులో రైల్వేలకు రూ. 30,000 కోట్ల నష్టం వచ్చిందని రైల్వే మంత్రి చెబుతున్నారు. కనుక మరో బడ్జెట్ వచ్చే లోపల చార్జీలు పెరగబోవన్న భరోసా ఏమీ లేదు. మొత్తానికి సంస్కరణలంటూనే పాత వాసనలు వదులు కోని రైల్వే బడ్జెట్ తెలుగు రాష్ట్రాలు రెండింటికీ నిరాశనే మిగిల్చింది. -
మళ్లీ మొండిచేయి
సంగడిగుంట (గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో గుంటూరు రైల్వే డివిజన్కు మొండి చెయ్యి చూపించింది. కొత్త ప్రభుత్వం నుంచి అదనపు రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన, నిధులు రాబడతామని నేతలు ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదు. విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రకటించిన రైలు వల్ల గుంటూరు జిల్లాకు కొత్తగా ఒనగూరిందేమీ లేదు. ఢిల్లీకి ఇప్పటికే చాలా రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి. నూతన బడ్జెట్లో గుంటూరు రైల్వే డివిజన్కు ప్రత్యేక కేటాయింపులు లేవు, కొత్త రైళ్లు లేవు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న 29 పనులకు రూ. 20 వేల కోట్లను ప్రకటించినా ఆ నిధుల్లో గుంటూరు డివిజన్కు ఎంత మొత్తం కేటాయించిందీ స్పష్టత లేదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలను కేంద్ర రైల్వేశాఖ అసలు పరిగణలోకి తీసుకున్నట్లు లేదు.దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు ప్రకటించిన తొమ్మిది రైళ్లలో కేవలం ఒకే ఒక్క రైలును తిరుపతికి కేటాయించారు. అది గుంటూరు మీదుగా వెళుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. నిరాశే మిగిలింది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో గుంటూరు డివిజన్కు వరాల జల్లు కురుస్తుందని ఆశించాం. కానీ నిరాశే మిగిలింది. నమ్ముకున్న ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రయత్నాలు చేయని విషయం స్పష్టం అవుతోంది. బడ్జెట్ ముందు రోజు హడావుడి చేయడంవల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇకనైనా బడ్జెట్ తయారీకి నెల రోజులకు ముందే ప్రతిపాదనలు పంపాలి. - ఎ. అశోక్ కుమార్, గుంటూరు కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా గుంటూరు రైల్వే డివిజన్కు ప్రత్యేకంగా ఏ విధమైన ప్రాజెక్టులూ ప్రకటించకుండానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుని మోసపోయాం. ప్రజాప్రతినిధులు హామీలు ఆచరణకు నోచుకోలేదు. - కె. గోవిందరెడ్డి, గుంటూరు -
నిధుల ఊసే లేదు
కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ యూపీఏ తరహాలో తమిళనాడు మీద సవతి తల్లి ప్రేమ చూపించారు. దక్షిణాది జిల్లాలకు పూర్తిగా హ్యాండిచ్చిన సదానంద, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు మాత్రం ఐదు రైళ్లను కంటి తుడుపు చర్యగా ప్రకటించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల ఊసే లేని దృష్ట్యా, తమిళనాట రైల్వే బడ్జెట్కు వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని పెండింగ్, అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సుమారు పది వేల కోట్ల మేరకు నిధులు అవసరం. కొన్నేళ్ల క్రితం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీఏ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించింది. ప్రస్తుతం అధికారం మారడంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో సామరస్య పూర్వంగా మెలిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసక్తి చూపినా కేంద్రం వైఖరి మాత్రం మారలేదు. హ్యాండిచ్చిన సదానంద: తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధానంగా చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, దక్షిణాది జిల్లాలోని పలు ప్రధాన నగరాల్ని కలుపుతూ కొత్త రైళ్ల సేవలకు ప్రతిపాదనలున్నారుు. అయితే, తమిళనాడుకు సదానంద హ్యాండిచ్చారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలు కూడా ప్రకటించ లేదు. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తుల్ని సైతం సదానంద ఖాతరు చేయలేదు. అమల్లో ఉన్న పనులకు కనీసం నిధుల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో ఆ పనులు పూర్తవడానికి మరెన్ని నెలలు పట్టనుందోనని ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరాశే : విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్, మార్గాల్లో జరుగుతున్న పనులకు నిధుల ఊసెత్తక పోవడం గమనార్హం. అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటన వెలువడుతుందని ఎదురు చూసిన వాళ్లకు చివరకు మిగిలింది నిరాశే. అయితే, మౌళిక వసతుల కల్పం, రైల్వే ప్రయాణికుల భద్రత, మహిళా భద్రత ప్రకటనలు మాత్రం స్వాగతిస్తున్నారు. కంటి తుడుపు చర్య : తమిళనాడు ప్రజలకు హ్యాండిచ్చిన సదానంద గౌడ కంటి తుడుపు చర్యగా కొన్ని రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ చెన్నై నుంచి బయలు దేరే రైళ్లే. దక్షిణాదిలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి నగరాలకు మిగిలింది నిరాశే. అరుుతే చెన్నై - హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు సేవలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సావల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఐదు రైళ్లు : పార్లమెంట్లో ప్రకటించిన రైల్వే బడ్జెట్ మేరకు ఐదు రైళ్ల వివరాలు. మదురై - జైపూర్ (వారంతాపు ప్రీమియర్ ఎక్స్ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు రైలు సేవ),- చెన్నై - విశాఖ (వారంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత). సర్వత్రా విమర్శ : ఈ బడ్జెట్ను తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమిళ ప్రజల్ని పూర్తిగా విస్మరించారని పీఎంకే ఎంపీ అన్భుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైళ్లను తన సొంత రాష్ట్రానికి మంత్రి తరలించుకున్నారని సీపీఎం ఎంపీ రంగరాజన్ మండిపడ్డారు. తమిళ ప్రజలకు మొండి చేయి మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాటనే మళ్లీ మళ్లీ పాడినట్టు, చివరకు తమిళ ప్రజల నెత్తిన టోపీ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ సుదర్శన నాచ్చియప్పన్ పేర్కొన్నారు. తమిళుల ఆశల్ని, విజ్ఞప్తులపై మోడీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండి పడ్డారు. టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ సైతం రైల్వే బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. ఆహ్వానం : సీఎం జయలలిత మాత్రం రైల్వే బడ్జెట్ను ఆహ్వానించారు. భవిష్యత్తును కాంక్షిస్తూ ఈ బడ్జెట్ను రూపొందించినట్టుందన్నారు. స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల సేవలు, మహిళలకు భద్రత, రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రకటనలు సంతృప్తినిచ్చాయన్నారు. ముంబె తర్వాత బుల్లెట్ రైలు సేవల ప్రాధాన్యతలో తమిళనాడుకు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకటించినవి మదురై - జైపూర్ (వారాంతపు ప్రీమియర్ ఎక్స్ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు), చెన్నై - విశాఖ (వారాంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ). వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సవాల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఆశించినవి చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలైనా వస్తుందని ఆశించారు. విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్ మార్గాల పనులకు నిధులివ్వలేదు. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటిస్తారని ఆశించినా జరగలేదు. -
ఈ సారీ ఆగలేదు!
తాండూరు: ఈ సారి కూడా తాండూరు వాసులకు నిరాశే మిగిలింది. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తాండూరుకు కొత్త హాల్టింగ్ గానీ, పొడగింపునకు గానీ అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్న అంశాలపై మోడీ సర్కారు దృష్టి సారిస్తుందని ఆశపడిన ప్రయాణికులకు భంగపాటు తప్పలేదు. తాండూరు మీదుగా నడిచే రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానిక వ్యాపారులు, ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఎదురుచూశారు. కర్ణాటకలోని చిత్తాపూర్ చిన్న రైల్వేస్టేషన్. ఇక్కడ గరీభ్థ్ ్రఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉంది. ఈ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు రైల్వేకు రూ.50వేల వరకు టిక్కెట్ విక్రయంపై ఆదాయం వస్తుంది. రోజుకు సుమారు 1500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాజధాని ఎక్స్ప్రెస్ సేడంలో ఆగుతుంది. ఇక్కడ రోజుకు 2500 ప్రయాణికులు రాకపోకలు సాగి స్తారు. సుమారు రూ.లక్ష ఆదాయం వస్తుంది. కానీ ఈ రెండు రైల్వేస్టేషన్ల కన్నా తాండూరు పెద్దది. రోజుకు సుమారు ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు రోజుకు రూ.రెండు లక్షల ఆదాయం వస్తుంది. మోడీ సర్కారు ఈ బడ్జెట్లో గరీభ్థ్,్ర రాజధాని ఎక్స్ప్రెస్లకు తాండూరులో హాల్టింగ్ ఇస్తుందని ప్రయాణికుల ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. ఇక ఉదయం పది గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్కు ‘హుస్సేన్సాగర్’ రైలు ఉంది. ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్లడానికి సాయంత్రం నాలుగు గంటల వరకు రైలు లేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య హైదరాబాద్ వెళ్లడానికి వికారాబాద్ వరకు నడుస్తున్న పల్నాడు ఎక్స్ప్రెస్ను పొడిగించాలని ఇక్కడి ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రైలు పొడిగింపునకు, పద్మావతి ఎక్స్ప్రెస్ హాల్టింగ్కు రైల్వే బడ్జెట్లో అవకాశం దక్కపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను నిరాశపరిచింది. వేల కోట్లు ఖర్చుపెట్టి బుల్లెట్ రైలును నడపడం వల్ల కొందరికే ప్రయోజనం కలుగుతుంది తప్పా.. మధ్య తరగతికి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీదర్ -ముంబయ్ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించినా.. అది రూట్లో నడుస్తుందన్న దానిపై స్పష్టత లేదు. -
‘తెలుగు’ రైలు కూతేది!
సాక్షి ముంబై: ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ముంబైలోని తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం ముంబై-కాజీపేట(వరంగల్) వయా బల్లార్షా వారానికి ఒకసారి కొత్త ఎక్స్ప్రెస్ రైలును ప్రకటించింది. దీంతో ముఖ్యంగా తెలంగాణకు చెందిన అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీంతోపాటు అహ్మద్బాద్-చెన్నై వయా వసాయి రోడ్డు మీదుగా వారానికి రెండు సార్లు కొత్త రైలును ప్రకటించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం మీదుగా వెళ్లనుంది. రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు ఈ రెండు రైళ్లు మినహా బడ్జెట్లో పెద్దగా ఒరిగిందేమీలేదని చెప్పవచ్చు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న తొలిసారి బడ్జెట్పై ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసించే తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు రైల్వేబడ్జెట్పై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి తెరదింపారు. నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, గుంతకల్ వైపు కొత్త రైలు లేదా కనీసం పొడగింపు తదితరాలేమైనా ఉంటాయని అందరూ భావించారు. అయితే కేవలం తెలంగాణ ప్రాంతానికి ఒక రైలు మాత్రమే ప్రకటించి తెలుగువారిని తీవ్ర నిరాశకు గురిచేశారు. పాత డిమాండ్కు మోక్షం...! బల్లార్షా లేదా కాజీపేట మీదుగా రైలును నడపాలని అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కాని ఈ మార్గం అనుకూలంగా లేకపోవడం, సెంట్రల్, సౌత్ సెంట్రల్ రైల్వేల పరిధులు తదితరాల దృష్ట్యా ఈ డిమాండ్ ఇన్నేళ్లుగా తెరపైకి రాలేదు. కాని సెంట్రల్ రైల్వేపరిధి బల్లార్షా తర్వాత చిన్న రైల్వేస్టేషన్ మానిక్ఘర్ వరకు ఉండగా సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధి కాగజ్నగర్ వరకు ఉంది. అయితే సెంట్రల్, సౌత్ సెంట్రల్రైల్వే పరిధిల కారణంగా ఈ బోగీని బల్లార్షా రైల్వేస్టేషన్ వరకే పరిమితం చేశారు. అదే విధంగా ముంబై-నాగపూర్ రైలును గోండియా వరకు పొడగించారు. ప్రస్తుతం బల్లార్షా వరకు సుమారు మూడు బోగీలను సేవాగ్రామ్ ఎక్స్ప్రెస్తో వర్దా రైల్వేస్టేషన్లో జోడిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ బల్లార్షా నుంచి ముంబై వెళ్లే ఈ బోగీల్లో సుమారు ఆరు టికెట్లు సిర్పూర్కాగజ్నగర్కు కోటా ఉంది. అయితే ఈ బోగీలను కనీసం మంచిర్యాల వరకు పొడగించాలని లేదా మంచిర్యాల నుంచి వయా కాజీపేట మీదుగా కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలుకు కనీసం ఒక బోగీ జోడించాలన్న డిమాండ్లు స్థానికులు చేసేవారు. కాని మార్గాలు వేర్వేరుగా ఉండడంతో పెద్దగా ఎవరూ వీరి డిమాండ్లపై శ్రద్ధ చూపలేదు. కాని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మార్గంపై కొత్త రైలును ప్రకటించడంతో సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్తమార్గాలు... రాష్ట్రంలో కొత్త మార్గాల సర్వేలు చేయనున్నట్టు కూడా ఈ రైల్వేబడ్జెట్లో ప్రకటించారు. ముఖ్యంగా వీటిలో ఔరంగాబాద్-చాలిస్గావ్, షోలాపూర్ తుల్జాపూర్లున్నాయి. అదేవిధంగా డబ్లింగ్, మూడవ, నాల్గవ ట్రాక్ల పనులకు కూడా ప్రాధాన్యమిచ్చారు. వీటిలో కసారా-ఇగత్పురి, కర్జత్-లోనవాలాల మధ్య నాల్గవ ట్రాక్, భూసవల్-బడ్నేరా-వర్దా, భూసవల్-ఇటరసీల మధ్య మూడవ ట్రాక్ల నిర్మాణాలున్నాయి. రాష్ర్టం మీదుగా వెళ్లే కొత్త రైళ్లు ఇవే.. జనసాధారణ్ రైళ్లు .. ముంబై-జయంగర్ ముంబై-గోరఖ్పూర్ ప్రీమియం రైళ్లు: ముంబెసైంట్రల్ - న్యూఢిల్లీ ఏసీ రైళ్లు: లోకమాన్యతిలక్ టెర్మినస్ (కుర్లా)-లక్నో (వీక్లీ) నాగ పూర్-పుణే (వారానికి ఒకసారి) పుణే-నిజాముద్దీన్ (వారానికి ఒకసారి) నాగపూర్-అమృతసర్ (వారానికి ఒకసారి) ఎక్స్ప్రెస్ రైళ్లు: ముంబై-కాజీపేట వయా మంచిర్యాల (వీక్లీ) ముంబై-పలితనా (వారానికి ఒకసారి) ముంబై-బీదర్ (వీక్లీ) కుర్లా-ముంబై)-అజమ్గడ్ (వీక్లీ) బాంద్రా-జైపూర్ వయా నగ్డా, కోట (వీక్లీ) అహ్మదాబాద్-చెన్నై వయా వసాయిరోడ్డు (వారానికి రెండు సార్లు) -
మాటపై నిలబడేనా?
సాక్షి, న్యూఢిల్లీ:నగరవాసులకు శుభవార్త. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్యుత్ చార్జీలను 30 శాతం మేర తగ్గించే అవకాశముందని అంటున్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగగా అవతరించినప్పటికీ తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మెజారిటీ లేకపోయిన్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ... విద్యుత్చార్జీలను 50 శాతం తగ్గించింది. అయితే ఈ సబ్సిడీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులకుమునుపే గద్దె దిగడంతో ఆప్ ప్రకటించిన తగ్గింపు మూడు నెలల ముచ్చటే అయింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతోపాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించి, తద్వారా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామనే పేరు తెచ్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులోభాగంగానే రానున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించడం కోసం రూ. 600 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని అరుణ్ జైట్లీ యోచిస్తున్నారని అంటున్నారు. 200 యూనిట్లు, 400 యూనిట్లు స్లాబ్లకు చార్జీలను 30 శాతం తగ్గించాలని కేంద్రం యోచిస్తోందని చెబుతున్నారు. ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం రూ. 600 కోట్లను కేటాయించాలనే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఢిల్లీ ఆర్థిక విభాగం పంపిన ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిం చాల్సి ఉంది. -
బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్!
-
సంస్కరణల కూత
-
రైల్వే బడ్జెట్ మార్కెట్లను నష్టాల్లో పడేసింది
-
రైల్వే బడ్జెట్ : కూతెవరికి.. కోతెవరికి?!
-
సదానంద గౌడ కేంద్ర మంత్రా ? రాష్ట్ర మంత్రా ?
-
ఈసారీ తెలు'గోడు' వినలేదు!!