రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు! | Bengaluru Raids Reveal 5 Crores, Mostly In New Notes | Sakshi
Sakshi News home page

రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!

Published Thu, Dec 1 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!

రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పట్టుమని పది వేలు కూడా దొరకని పరిస్థితి. అలాంటిది ఏకంగా రూ.5కోట్లు కొత్త రూ.2000 నోట్లలో ఐటీ అధికారులు గుర్తించారు.

బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పట్టుమని పది వేలు కూడా దొరకని పరిస్థితి. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే ఏ బ్యాంకుల్లో ఎంత ఇస్తారో కూడా తెలియదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.ఐదు కోట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కిందటే విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లలోనే దాదాపు ఈ డబ్బంతా ఉంది. ఈ సొమ్మంతా కూడా ఇద్దరు సీనియర్‌ అధికారులదంట.

అంతేకాదు, ఆ ఇద్దరు అధికారుల ఇళ్లలో ఐదు కేజీల బంగారం, ఐదు కేజీల ఆభరణాలు, స్పోర్ట్స్‌ కార్లు, లాంబార్గినివంటివి కూడా లభ్యమయ్యాయి. బెంగళూరులోని ఓ ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించగా ఇవన్నీ బయటపడ్డాయి. జనాలకు డబ్బుల్లేక అల్లాడుతుంటే ఇంత పెద్ద మొత్తంలో కొత్త డబ్బు ఎలా చేతికొచ్చిందని ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ అధికారుల వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement