పాన్, గుట్కాలపై యోగి నిషేధం
ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటన చేశారు. పాన్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే యోగి ప్రకటించారు.