Gutka Trading
-
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
టీడీపీ నాయకుడే గుట్కా కింగ్!
ఒంగోలు: గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు సాగిస్తున్న టీడీపీ నాయకుడి ఉదంతాన్ని ఎస్ఈబీ అధికారులు రట్టు చేశారు. ఒంగోలు అన్నవరప్పాడు సెబ్ కార్యాలయంలో బుధవారం ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రరావు వివరాలు చెప్పారు. స్థానిక కమ్మపాలెం వాసి ముల్లూరి వెంకట నాగశివ చరణ్ కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. స్థానిక ఎస్ఈబీ అధికారులు కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా అందులో 27,375 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించగా స్థానిక బృందావన్ నగర్లోని ఒక పాడుబడిన ఇంట్లో ఉంచిన గుట్కా నిల్వల సమాచారాన్ని ఇచ్చాడు. అతని సహాయంతో సంబంధిత ప్రాంతాన్ని గుర్తించి ఇంట్లో తనిఖీ చేయగా 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో గుట్లపల్లి శ్రీమన్నారాయణ అలియాస్ చిన్నా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. శ్రీమన్నారాయణ స్థానిక 46వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు. ఇతను మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అనుచరుడిగా పేరుంది. దాడిలో 2,66,931 గుట్కా ప్యాకెట్లను సీజ్చేశారు. వాటి విలువ రూ.3,43,224గా ఉంటుందని అంచనా. -
బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి
చెన్నె: దుకాణంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాడని సమాచారం రాగా పోలీసులు దాడి చేసి దుకాణ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. పొగాకు ఉత్పత్తులతో పాటు అతడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పొగాకు ఉత్పత్తులు ఎవరూ సరఫరా చేస్తారనే వివరాలు తెలుసుకునేందుకు అతడి ఫోన్ పోలీసులు పరిశీలించగా దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియోలు తీసి తన మిత్రులకు పంచుకున్న పాపాత్ముడు అతడు. ఆ విధంగా మొత్తం 50 వీడియోలు ఉండడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. అతడిని వెంటనే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. (చదవండి: ఆన్లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక) టీపీ చత్రం పోలీస్స్టేషన్ పరిధిలో పెరుమాల్ (40) ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. పొగాకు ఉత్పత్తుల విక్రయంపై సమాచారం రాగా శనివారం దుకాణంపై దాడులు చేయగా ఆ బాలికలపై దురాఘాతం వెలుగులోకి వచ్చింది. దుకాణంలో ఆడుకోవడానికి వచ్చిన బాలికలను, దుకాణంలో బాకీ పెట్టిన మహిళల కుమార్తెలపై పెరుమాల్ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియోలు తీయించుకున్నాడు. అలా మొత్తం 50 వీడియోలు ఉన్నాయి. విచారణ చేపట్టగా ఆరు నెలల నుంచి బాలికలపై తరచూ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. అతడికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు సహకరించారు. తమ కూతుళ్లను కూడా అతడికి బలి పెట్టారు. తమ కూతుళ్లను అతడి వద్దకు పంపించడం దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. వారిద్దరూ కూడా అతడితో సంబంధం కొనసాగిస్తున్నారు. తమ కూతుళ్లపై ఆ విధంగా చేయడంతో ఆ మహిళలు దుకాణం నుంచి సామగ్రి, సరుకులు ఉచితంగా తీసుకెళ్తున్నారని డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్ తెలిపారు. ఇక మిగతా ముగ్గురు బాలికలు దుకాణంలోకి ఆడుకునేందుకు రాగా వారిని అతడు చెరబట్టాడు. ఆ ఫోన్ చూడకుండా ఉండి ఉంటే ఇంత ఘోర విషయాలు తెలియకపోయేవి అని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం బాలికలను చైల్డ్ హోమ్కు తరలించినట్లు తెలిపారు. పోక్సో చట్టం కింద పెరుమాల్ను, అతడికి సహకరించిన ఇద్దరు తల్లులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి -
గుట్కా స్థావరంపై ఎస్ఈబీ దాడులు
నెల్లూరు (క్రైమ్): నెల్లూరులో గుట్కా స్థావరంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ (ఏఈఎస్) కృష్ణకిశోర్రెడ్డి దాడుల వివరాలను శనివారం విలేకరులకు వెల్లడించారు. హరనాథపురం నాగసాయి దేవాలయం సమీపంలో ఉంటున్న సీహెచ్ రాజశేఖర్ అలియాస్ శేఖర్ బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాలను నెల్లూరుకు దిగుమతి చేసుకునేవాడు. అనంతరం తన సహాయకుడైన స్టోన్హౌస్ పేటకు చెందిన టి.ప్రసాద్ ద్వారా ఆటోలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. ఈ వ్యవహారంపై ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మికి సమాచారం అందింది. ఆమె ఆదేశాల మేరకు శనివారం ఎస్ఈబీ నెల్లూరు–1 ఇన్స్పెక్టర్ కె.పి.కిశోర్ తన సిబ్బందితో కలిసి ముత్తుకూరు రోడ్డులోని ఆకుతోట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గుట్కా వ్యాపారి రాజశేఖర్ సహాయకుడు ప్రసాద్ ఆటోలో గుట్కాలు తరలిస్తుండగా ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నెల్లూరు రూరల్ మండలం వడ్డిపాలెంలో గుట్కాలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోదాము వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్స్పెక్టర్ గోదాముపై దాడి చేసి నిషేధిత గుట్కా, ఖైనీలను, ఆటోను స్వాధీనం చేసుకుని రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ బహిరంగ మార్కెట్లో రూ.25 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ ఏఈఎస్ కృష్ణకిశోర్రెడ్డి తెలిపారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న గుట్కాలు, ఆటోను తదుపరి విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ కె.పి.కిశోర్, ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎ.శ్రీరాములు, డి.వెంకటేశ్వర్లును ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి అభినందించారు. -
‘మంత్రులు తలసాని, గంగులకు గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు తింటున్న రాష్ట్ర మంత్రులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లంఘించి గుట్కా తింటున్న బ్యాచ్తో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. గుట్కా తింటూ అడ్డంగా దొరికి పోయిన మంత్రులను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తీరుతో ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్కు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సొగాకు, గుట్కాను నిషేధించారని, మరి అవి మంత్రులకు ఎలా దొరికాయో తెలియజేయాలని ధ్వజమెత్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ వెంటనే గుట్కా తిన్న మంత్రులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎవరూ చూడకుండా రహస్యంగా చేతుల్లో ఏదో పదార్థాన్ని పంచుకుంటూ చాటుగా తినడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అది గుట్కా అని సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రులు గుట్కా తింటున్నారని ఆ వీడియోను దాసోజు శ్రవణ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా. మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’ అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. -
గుట్టుగా గుట్కా స్మగ్లింగ్
-
మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా..
సాక్షి, తానూరు(నిర్మల్): జిల్లా సరిహద్దుల్లో నిషేధిత గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోంది. లాక్డౌన్ సాకు చూపి కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు అక్రమార్కులు. సరికొత్త ఎత్తుగడలతో పోలీసులకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. అంతకుముందు గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి, చిరు వ్యాపారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం సంబంధిత వ్యాపారి సెల్ఫోన్కు మెసేజ్ చేస్తే చాలు సరుకును నేరుగా దుకా ణాల వద్దకే బైక్లపై చేరవేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ... నిషేధిత గుట్కా, ఇతరత్రా నిషేధిత ఉత్పత్తులను సరఫరా చేసే అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా తమ పంథా మార్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసినా పట్టుబడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. గతంలో హైదరా బాద్, నిజామాబాద్ నుంచి గుట్కా తెప్పించేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పోలీసులు తనిఖీలు అధికమయ్యాయి. దీంతో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిర్మల్, భైంసాతోపాటు గ్రామీణ మండలాలకు చెందిన వారు కూడా ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే సరిహద్దు ప్రాంతాలైన తానూరు, ముధోల్, కుభీర్, కుంటాల, సారంగపూర్, బాసర మండలాల మీదుగా నిషేధిత గుట్కా రవాణా సాగుతోంది. రవాణా ఇలా.. నిషేధిత గుట్కా అర్ధరాత్రి సమయంలో మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తా నూరు, ముధోల్, బాసర, కుభీర్, కుంటాల, సారంగాపూర్ మండలాల మీదుగా గుట్టుచప్పుడు కాకుండా తెప్పిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాహనం బయలుదేరిన వెంటనే వాట్సప్ మెసేజ్ ద్వారా స్థానిక వ్యాపారులకు సమాచారం అందిస్తారు. ఏ గుట్కా ఎన్ని బస్తాలు.. ఎక్కడ దించాలో అప్పుడే సమాచారం ఇస్తారు. ప్రణాళిక ప్రకారమే వాహనం నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత వ్యాపారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి సరుకు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత రోజు గ్రామాల వారీగా ద్విచక్ర వాహనాలతోపాటు ట్రాలీ ఆటోల ద్వారా చిరువ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ పేరుతో దోపిడీ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా హైదరాబాద్, నిజామాబాద్ నుంచి గుట్కా సరఫరా నిలిచిపోయింది. చిరువ్యాపారుల వద్ద కూ డా పూర్తిగా నిల్వలు అడుగంటాయి. దీంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్రకు చెందిన వ్యాపారుల సా యంతో గుట్కా దిగుమతి చేసుకుంటున్నారు. గ్రా మాల్లో గుట్కా కొరత ఉండటంతో వ్యసనపరులకు లాక్డౌన్ పేరు చెప్పి భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో అంబర్ ప్యాకెట్ రూ.180కి లభించగా.. ప్రస్తుతం రూ.నాలుగు వందల వరకు విక్రయిస్తున్నారు. అలాగే సాగర్, తోట వంటి గుట్కా ప్యాకెట్ల ధరలనూ అమాంతం పెంచి అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిహద్దులో కొనసాగుతున్న నిషేధిత గుట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. అక్రమ రవాణాకు సహకరిస్తే చర్యలు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు నిషేధిత గుట్కా అక్రమంగా సరఫరా అవుతున్నట్లు మా దృష్టికి రాలేదు. గతంలో తానూరు, ముధోల్లో దాడులు నిర్వహించి, గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నాం. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – అజయ్బాబు, సీఐ, ముధోల్ ఇటీవల పట్టుబడిన ఘటనలు.. ► ఐదు నెలల క్రితం ఎల్వత్ గ్రామానికి చెంది న వ్యాపారి కిరాణా షాపులకు గుట్కా ప్యాకె ట్లు సరఫరా చేస్తుండగా పోలీసులు సింగన్గాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ► మూడు నెలల క్రితం ఎల్వి గ్రామంలో ఓ వ్యాపారి బైక్పై వెళ్లి దుకాణాలకు గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా తానూరు పోలీసులు పట్టుకున్నారు. ► రెండు నెలల క్రితం భైంసా నుంచి తానూరుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను హిప్నెల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. -
గుట్కా స్కాం కేసులో మాజీ మంత్రి పేరు?
సాక్షి, చెన్నై: గుట్కా స్కాం కేసులో ఈడీ తన చార్జ్షీట్ను చెన్నై సెషన్స్ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి బీవీ రమణతో పాటు పలువురి పేర్లు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. గుట్కా విక్రయాలకు లంచం వ్యవహారం గతంలో పోలీసు శాఖలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో లభించిన ఓ డైరీ గుట్కా గుట్టు ను వెలుగులోకి తెచ్చింది. సీబీసీఐడీ విచారించినా, కేసు అడుగైనా ముందుకు సాగని దృష్ట్యా, చివరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ రంగంలోకి దిగి దిగగానే, దాడులు హోరెత్తాయి. అప్పటి డీజీపీ, మాజీ కమిషనర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఆరోగ్యమంత్రి అంటూ లిస్టు చాంతాడు అంతగా మారింది. మాజీ మంత్రి బీవీ రమణ, ప్రస్తుతం ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ల వద్ద విచారణ సాగించిన సీబీఐ, పోలీసు బాసులపై ఆచితూచి స్పందించే రీతిలో అడుగులు వేసింది. తొలుత సీబీఐ కోర్టులో చార్జ్షీట్ దాఖలు తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ సమయంలో విచారణకు కరోనా అడ్డుగా మారింది. ఓ వైపు సీబీఐ మళ్లీ ఫైల్ దుమ్ము దులిపిన నేపథ్యంలో ఈడీ తన చార్జ్ïÙట్ను మంగళవారం సాయంత్రం చెన్నై జిల్లా సెషన్స్ కోర్టులో దాఖలు చేసి ఉండడం గమనార్హం. ఎన్నికల వేళ చార్జ్షీట్ కలవరం... గుట్కా స్కాంలో ఈడీ విచారణ చార్జ్షీట్ అన్నాడీఎంకేను కలవరంలో పడేసింది. ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని ప్రతి పక్షాలు అస్త్రంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ చార్జ్లో 2013 –2016 మధ్య రూ.639 కోట్ల మేరకు అక్రమ గుట్కా వ్యవహారాలు సాగినట్టు తేల్చారు. అలాగే, చార్జ్షీట్లో మాజీ మంత్రి రమణ పేరు చేర్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి సహాయకుల పేర్లు సైతం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో గుట్కా విక్రయదారులు మాధవరావు, శ్రీనివాసరావు, ఉమాశంకర్ గుప్తాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడుల్లోని ఆస్తుల వివరాలు, రూ. 246 కోట్ల మేరకు చేసిన ఆస్తుల అటాచ్ వివరాలను చార్జ్ షీట్లో పొందు పరిచారు. -
యథేచ్ఛగా గుట్కా దందా
కామారెడ్డి క్రైం: ఉమ్మడి జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. లాభాలు దండిగా ఉండటంతో అక్రమార్కులు ఈ దందాను వీడటం లేదు. పోలీసుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో అడ్డదారిలో గుట్కా సరఫరా యథేచ్చగా సాగుతుందనే విమర్శలున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో పలు చోట్ల టాస్్కఫోర్సు అధికారులు లక్షల విలువైన గుట్కా, ఇతర నిషేధిత వస్తువుల నిల్వలను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో గుట్కాను ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. కానీ చుట్టు పక్కల రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో జిల్లాలోని కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి మెదక్, నిజామాబాద్, నిర్మల్, బాన్సువాడ లాంటి పట్టణాలకు గుట్కా సరఫరా చేస్తున్నారు. అక్కడ నుంచి కామారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాలకు సరఫరా జరుగుతున్నట్లు గతంలో గుట్కా పట్టుబడిన ఘటనల్లో వెల్లడైంది. మెదక్, నిజామాబాద్లకు చెందిన కొందరు బడా వ్యాపారులు ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పాలవ్యాన్లు, ఆటోలు ఇతర వస్తువుల సరఫరా రూపంలో ఎవరికీ తెలియకుండా ఉండేలా గుట్కా రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. పోలీసుల నిఘా అంతంతే.. జిల్లాలో గుట్కా సరఫరా, విక్రయాలు జరుగుతున్నా పోలీసులు నిఘా అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి కిరాణం, పాన్షాప్లలో విచ్చలవిడిగా గు ట్కా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో పలుసార్లు పోలీసులు దాడులు నిర్వహించి గుట్కా ను స్వా«దీనం చేసుకున్నప్పటికీ ఆయా కేసుల్లో ప్రధాన నిందితులు తమ పలుకుబడితో, రాజకీయ ప్రమేయంతో తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుశాఖ నిఘా పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది. మామూళ్ల మత్తులో యంత్రాంగం.. నిషేధిత గుట్కా, ఇతర పొగాకు పదార్థాలకు అలవాటు పడి ఎందరో యువత తమ విలువైన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. గుట్కా అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గుట్కా వ్యాపారంపై ఇటీవల కొందరు బడాబాబులు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్దమొత్తంలో గుట్కా వ్యాపారం చేసే వ్యాపారులు పోలీసు, ఇతర శాఖల్లోని ప్రధాన అధికారులకు మాముళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే కొందరు అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఉమ్మడి జిల్లాలో గుట్కా వ్యాపారాన్ని కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
బీదర్ నుంచి వస్తున్న ‘రాణి’
సాక్షి, సిటీబ్యూరో: ‘రాణి’ బ్రాండ్ గుట్కాను వక్కల ముసుగులో కర్ణాటకలోని బీదర్ నుంచి నగరానికి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు సిటీలో దొరికిన నిషేధిత పొగాకు ఉత్పత్తులన్నీ పాన్ మసాలా, తంబాకు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నవే కాగా.. తొలిసారిగా పూర్తి గుట్కాను పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్రావుతో కలిసి గురువారం తన కార్యాలయంలో కొత్వాల్ అంజనీకుమార్ విలేకరులకు తెలిపిన వివరాలు ప్రకారం... (చదవండి: కూకట్పల్లిలో దారుణం) ► నగరానికి చెందిన అన్నదమ్ములు మహ్మద్ హసనుద్దీన్, మహ్మద్ మజారుద్దీన్, మహ్మద్ ఆరీఫ్ వ్యవస్థీకృత గుట్కా దందా ప్రారంభించారు. తమకు సహకరించడానికి అక్తర్, యాసీన్, మక్బూల్, దస్తగిరి, మీర్జా ఫజీ హుస్సేన్ బేగ్లను ఏర్పాటు చేసుకున్నారు. ► అఫ్జల్గంజ్, బహదూర్పుర ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో ఈ ముఠాలో కొందరు గోదాముల ఇన్చార్జ్లుగా, మరికొందరు ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. బీదర్కు చెందిన రిజ్వాన్ ఈ ముఠాకు హోల్సేల్గా రాణి బ్రాండ్ గుట్కాను సరఫరా చేస్తున్నారు. ► వక్కల పేరుతో డీసీఎం వ్యాన్లలో బీదర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న గుట్కా వివిధ గోదాములకు చేరుతోంది. అక్కడ నుంచి దీన్ని చిన్న చిన్న వాహనాల్లో పాన్షాపులు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొంత మొత్తం ట్రాన్స్పోర్ట్, కొరియర్ల్లో ఆంధ్రప్రదేశ్లోని నగరాలు, పట్టణాలకు వెళ్తోంది. ► పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండటానికి బీదర్ నుంచి సిటీలో గుట్కా దిగిన తర్వాత ఒకే గోదాములో ఉంచట్లేదు. నిత్యం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇటీవలే బహదూర్పుర పరిధిలోని కిషన్బాగ్లో ఓ గోదాము అద్దెకు తీసుకుంది. ► ఈ వ్యవహారంపై నార్త్జోన్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ► మీర్జా, దస్తగిరిలను అరెస్టు చేసి వీరి నుంచి వాహనంతో పాటు రూ.63,96,000 విలువైన 31 బ్యాగుల్లో ఉన్న 639600 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ► నగరంలో ఉన్న కొరియర్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఇలాంటి నిషేధిత ఉత్పత్తుల్ని రవాణా చేయవద్దని, అలా చేస్తే వారి పైనా కేసులు పెడతామని కొత్వాల్ అంజనీకుమార్ హెచ్చరించారు. ► ఈ కార్యక్రమంలో నగర కొత్వాల్ సిటీలోని గస్తీ వాహనాల సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు పంపిణీ చేశారు. ఇళ్ల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తూ, కేసులు నమోదు చేస్తున్న వీరే పోలీసు విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. (చదవండి: 300 పోలీసు అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు) -
సచిన్ జోషిపై ‘గుట్కా’ కేసు
శంషాబాద్(హైదరాబాద్): ప్రముఖ వ్యాపారవేత్త, సినీ హీరో అయిన సచిన్ జోషిపై హైదరా బాద్లో మరో ‘గుట్కా’ కేసు నమోదైంది. ట్రేడ్మార్క్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాన్ మసాలా తయారు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సచిన్తోపాటు ఆయన తండ్రి, గోవా పాన్ మసాలా కంపెనీ యజమాని జేఎం జోషిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. గగన్పహాడ్లో వారు నిర్వహి స్తున్న గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీపై దాడులు చేసి రూ. 1.25 కోట్ల విలువజేసే సరుకును స్వాధీనం చేసుకు న్నారు. అలాగే కంపెనీని సీజ్ చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి కథనం ప్రకారం జేఎం జోషి, సచిన్ జోషిలు గగన్ పహాడ్లో గోల్డెన్ ఫింగర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. సెవెన్హిల్స్ కంపెనీకి చెందిన మాణిక్ చంద్ పాన్ మసాలాను తయారు చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నారు. అయితే ఆ ట్రేడ్మార్క్ తమదని, దాన్ని అతిక్రమించి సచిన్, ఆయన తండ్రి వాడు తూ వ్యాపారం చేస్తున్నారంటూ సురేశ్ రావు అనే వ్యక్తి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్ నేతృత్వంలోని బృందం గగన్పహడ్లోని గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీపై గురువారం దాడులు చేసింది. 60 బ్యాగుల మానిక్ చంద్ పాన్ మసాలా, వెయ్యి బ్యాగుల గోవా పాన్ మసాలా, 60 బ్యాగుల వజిర్ పాన్ మసాలాతోపాటు మడిసరుకు, ప్యాకింగ్ కవర్లు, మిక్సర్ యంత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ట్రేడ్మార్క్ యజమానులు ఎవరనే దానిపై చెన్నైలోని ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో బహదూర్పుర పోలీసు స్టేషన్లో సచిన్ జోషిపై ఓ కేసు నమోదైంది. ఈ కేసులో అతను నాలుగో నిందితుడిగా ఉన్నాడు. ఎన్వోసీ జారీ చేస్తే నాలుగు రోజుల క్రితం ముంబై నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ముంబై వెళ్లిపోయాడు. -
సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. కాగా హైదరాబాద్కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ('గుట్టు'కా దందా!) కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. (గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు) ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ('చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్కు') -
గుట్కా డాన్ కామేశ్వరరావు అరెస్టు
సాక్షి, గుంటూరు: పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను ఇటీవల గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్గా దృష్టి సారించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే గుట్కా వ్యాపారి కామేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక ధ్రువపత్రాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామేశ్వరరావు, ఆయన అనుచరుల కాల్ డేటా ఆధారంగా, వీరితో ఎవరెవరికి సంబంధాలున్నాయనే దానే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కేంద్రంగా గత కొద్ది రోజులుగా భారీస్థాయిలో నిషేధిత గుట్కాల వ్యాపారం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్లోని పలు ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కర్ణాటక నుంచి నిషేధిత గుట్కాల్ని తీసుకువచ్చి ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుండటంతో పాటు, ఈ గోడౌన్లలో సైతం నిసేధిత గుట్కాలు తయారీ చేశారు. తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. చూసీచూడనట్టు వదిలేశారా? తమ పరిధిలో గుట్కా దందా కొనసాగుతున్పటికీ మామూళ్ల మత్తులో కొందరు సీఐలు, డీఎస్పీలు చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న దర్యాప్తులో ఈ మామూళ్ల వ్యవహారం బయటపడేనా అనే చర్చ పోలీస్ శాఖలో నడుస్తోంది. గుట్కా కామేశ్వరరావు, ఆయన అనుచరుల అరెస్టుతో ఇప్పటికే కొందరు పోలీస్ సిబ్బంది, అధికారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగలకు మల్లే మారింది. పోలీస్ సిబ్బంది, అధికారులు గుట్కా దందా నడుస్తున్న వ్యవహారం తెలిసీ చూసి చూడనట్టు వదిలేశారా? నెలవారీ మామూళ్లు వసూళ్లు చేశారా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగించి అసాంఘిక కార్యకలాపాలకు సహరించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటే పోలీస్ శాఖలో సైతం ప్రక్షాళన చేసినట్టవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమేయం ఉంటే చర్యలు నిషేధిత గుట్కాల తయారీ, సరఫరా కేసులో లోతుగా దర్యాప్తు చేపడుతున్నాం. దర్యాప్తులో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. కామేశ్వరరావుపై పీడీ యాక్డు విధించడానికి సంబంధించిన ఫైల్ను జిల్లా కలెక్టర్కు పంపాం. ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు ముప్పు కలిగించేవారిని ఉపేక్షించేది లేదు. పీడీ యాక్డు ప్రయోగించడంతో పాటు, జిల్లా బహిష్కరణ వంటి చర్యలకు వెనుకాడం. – ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ -
గుట్కా డాన్పై పీడీ యాక్ట్..
సాక్షి, కర్నూలు జిల్లా: గుట్కా డాన్ నూకల మనోహర్పై కోవెలకుంట్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో మనోహర్పై 14 కేసులు నమోదయ్యాయి. బళ్లారి, రాయచూరు, హైదరాబాద్ల నుండి గుట్కా కొనుగోలు చేసి కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గుట్కా సరఫరా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన నేర ప్రవృత్తి మార్చుకోకుండా గుట్కా సరఫరా చేస్తున్న గుట్కా డాన్పై సెస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మనోహర్పై పీడీయాక్ట్ నమోదుకు కలెక్టర్కు జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపించగా.. కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్కు'
సాక్షి, నెల్లూరు(క్రైమ్): గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసులు గ్యాంగ్సభ్యులను అరెస్ట్ చేసినా మూలాల్లోకి వెళ్లకపోవడంతో అతని వ్యవహారం బయటకు పొక్కలేదు. అదేక్రమంలో కొందరు పోలీసుల అండదండలు సైతం పుష్కలంగా ఉండటంతో మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్నచందాన వ్యాపారం సాగింది. అంతర్రాష్ట్ర గుట్కా డాన్గా ఎదిగి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనమ మేరకు బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన అంజిబాబు ఉపాధి నిమిత్తం కొన్నేళ్లకిందట కటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఓ గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా చేరారు. తనకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని ఏపీలోని పలు జిల్లాలకు విస్తరింపజేశాడు. వ్యాపారంలో చురుకుగా ఉన్న వారితో గ్యాంగ్ను ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను వారికి సరఫరా చేసేవాడు. వారు వాటిని రిటైల్ వ్యాపారులకు విక్రయించేవారు. చెన్నైలో పోలీసుల దాడులు అధికమవడంతో పాటు వివిధ కారణాతో ఆయన తన మకాంను బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకు మార్చాడు. అక్కడ ఉంటూ ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏడాదికి రూ.20కోట్ల మేర గుట్కాలను గ్యాంగ్కు సరఫరాచేసి వారి ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తూ అంతర్రాష్ట్ర గుట్కా డాన్గా ఎదిగారు. కొంతకాలంగా గంజాయిని సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్భూషణ్ గుట్కా విక్రయాలను, అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని సిబ్బంది డాన్తో పాటు అతని గ్యాంగ్ కదలికలపై దృష్టిసారించారు. శనివారం నేలటూరులో అంజిబాబుతో పాటు, గ్యాంగ్లోని ఐదుగురు సభ్యులను అరెస్ట్చేశారు. వారి వద్ద నుంచి రూ.1.32కోట్లు విలువచేసే గుట్కాలు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వారిని రహస్యప్రాంతానికి తరలించి తమదైన శైలిలో విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమ వ్యాపారానికి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని నిందితులు ఆరోపించినట్లు తెలిసింది. అందుకు గాను సదరు పోలీసులకు నెలవారీ నజరానాలు ముట్టచెబుతున్నామని పేర్కొనట్లు తెలిసింది. ఈ విషయం ఎస్పీ భాస్కర్భూషణ్ దృష్టికి వెళ్లడంతో లోతైన దర్యాప్తు చేయాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆదిశగా టాస్క్ఫోర్సు పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పేర్లను సైతం ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. పరారీలో మరికొందరు గ్యాంగ్లో మరో 18మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. డాన్ను టాస్్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న గ్యాంగ్లోని సభ్యులు అండర్గ్రౌండ్కు వెళ్లిపోయినట్లు సమాచారం. పరారీలో ఉన్న వ్యక్తుల్లో కొందరు గతంలో పోలీసులకు చిక్కిజైలుపాలై ఉన్నారు. వ్యాపారుల్లో వణుకు... పోలీసుల దాడుల నేపథ్యంలో జిల్లాలో గుట్కా, ఖైనీ విక్రయ వ్యాపారుల వెన్నులో వణుకు మొదలైంది. మొత్తంమీద ఆరేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గుట్కాడాన్, అతని గ్యాంగ్లోని సభ్యులను అరెస్ట్ చేయడంతో కొంతకాలం ఈ అక్రమవిక్రయాలు, రవాణాకు అడ్డుకట్టపడనుంది. గ్యాంగ్లోని మిగిలిన సభ్యులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్భూషణ్ తెలిపారు. -
ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు
ఈ కంటెయినర్ వాహనం విలువ రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త వాహనం. గత నెల గుడిహత్నూర్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఇందులో హోల్సెల్లో రూ.25లక్షల విలువైన నిషేధిత గుట్కాను అక్రమంగా వేరే రాష్ట్ర నుంచి ఆదిలాబాద్కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఆదిలాబాద్కు చెందిన పాన్ మసాలా వ్యాపారిది. అంత ఖరీదైన వాహనంలో లక్షల విలువైన అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నా ఆ వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదు. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం అతనే నిర్వహిస్తుండటం, ఇప్పటికే కోట్లకు పడగలెత్తడంతోనే ఇలా విలువైన వాహనం, సరుకు పట్టుబడ్డా ఆయన దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సాక్షి, ఆదిలాబాద్: గుట్కా దందాలో ఆయనో డాన్. ఆదిలాబాద్కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి, అతని సోదరులతో కలిసి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిఘా కళ్లు కప్పి దందా నడుపుతున్నాడు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అతని దందాకు బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఇప్పటివరకు వంద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బెయిలబుల్ కేసులు కావడంతో ఒక కేసులో పట్టుబడ్డ తర్వాత త్వరితగతిన బయటకొస్తున్న ఈ నిందితుడు మళ్లీ తన పాత పంథాను మాత్రం కొనసాగిస్తున్నాడు. విలువైన వాహనాలు, సరుకు పట్టుబడినప్పుడు ఆయన తన నష్టాన్ని మరో రూపంలో పూడ్చుకుంటున్నట్లు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది ద్వారా తెలుస్తోంది. అదెలా అంటే.. ఇటీవల గుడిహత్నూర్లో ఓ వాహనం పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ వాహనం ఖరీదు, సరుకు విలువనే అరకోటి దాటుతుండగా, దీని తర్వాత సరుకును హోల్సెల్గా విక్రయించే దగ్గర రెట్టింపు చేసి తన నష్టాన్ని పూడ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ దందాలో విలువైన వాహనాలు, సరుకు ఎలాంటిది పట్టుబడ్డా ఆ పాన్ మసాలా వ్యాపారి లైట్ తీసుకోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు. నిత్యం దందా.. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ పాన్ మసాలా వ్యాపారి యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండేళ్లలోనే సుమారు రూ.5 కోట్ల అక్రమ సరుకును పట్టుకున్నారు. అయినా ఈ దందాను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. కాగా జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతున్న సమయంలో ఎస్పీ ఉక్కుపాదం మోపారు. అది చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది. ఇందులో కొంతమంది మట్కా నిర్వాహకులకు బెయిల్ రాకుండా పోలీసులు కేసులు పెట్టడంతోనే వారు మళ్లీ అటువైపుగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలే ఈ గుట్కా విషయంలోనూ అవలంబించాలన్న అభిప్రాయం లేకపోలేదు. కొందరికీ మామూళ్ల తంతు.. గుట్కా దందాలో కొందరు పోలీసులకు ఇప్పటికీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ గుట్కాపై ఉక్కుపాదం మోపుతూ కేసుల విషయంలో సూక్ష్మంగా దృష్టి సారించడంతో మండలాల్లో పోలీసు అధికారులు ఇందులో మామూళ్లకు వెనుకంజ వేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆయా సర్కిల్, ఎస్హెచ్ఓలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికి మామూళ్ల తంతును రుచి మరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, శివారులో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆదిలాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కచ్కంటిలో ఒక గోదామును ఏర్పాటు చేసుకొని నిషేధిత గుట్కాను నిల్వ చేసి ఉంచగా పోలీసులే దాడిచేసి వెలుగులోకి తెచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారికి సమాచారం రావడంతోనే ఇటువంటివి బయటకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసు అధికారులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. మండలాల్లో గోదాములు నిషేధిత గుట్కా వ్యాపారంలో కోట్లు గడించిన ఆదిలాబాద్కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దందాలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నాడు. మండలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని సరుకును నిల్వ ఉంచి అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఈ గుట్కాను ఎక్కడికక్కడ వాహనాలు పంపి డంపింగ్ చేయడం ద్వారా దందాను సులభతరం చేసుకున్నాడు. కోట్లు గడించిన ఈ వ్యాపారికి రాష్ట్ర రాజధానిలోనూ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో కొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ వ్యాపారితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇతన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
గట్టుగా గుట్కా దందా !
సాక్షి, కరీంనగర్ :జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండల కేంద్రానికి చెందిన షంషొద్దీన్ గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో అక్టోబర్ 28న ఎస్సై ఆరోగ్యం ఆధ్వర్యంలో పోలీసులు ఇంటిపై దాడి చేశారు. రూ.64,645 విలువైన గుట్కా సంచులను పట్టుకున్నారు. గుట్కా విక్రేతల గురించి పక్కా సమాచారం అందితేనే వారిపై పోలీసులు దాడి చేసి పట్టుకోగలుగుతున్నారు.కేశవపట్నం మండలంలో గుట్కా దందా సాగిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేష్, తిరుపతిలను కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నెల 5న అరెస్టు చేశారు. రూ.1.50లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. మారుమూల పల్లెల్లోని ఏ కిరాణ దుకాణంలో అడిగినా.. పట్టణాల్లోని ఏ పాన్షాపులో సైగ చేసినా నిషేధిత గుట్కా ప్యాకెట్ క్షణాల్లో చేతిలో పడుతోంది. కాస్త తెలిసినవారైతే చాలు.. అసలు ధరకు రెట్టింపు ధరలతో గుట్కాలు విక్రయిస్తూ కొనుగోలుదారుల జేబులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. రాష్ట్ర ఎల్లలు దాటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గుట్కా మాఫియా దందా సాగిస్తున్న తీరు పోలీస్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం, రాజకీయ అండదండలతో ఈ దందా మూడు అంబార్లు(పొగాకు ప్యాకెట్), ఆరు గుట్కాలతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో గుట్కా కింగ్లుగా పేరుపడ్డ ఇద్దరు వ్యక్తులు కేంద్రంగా ఈ దందా కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఏజెంట్ల రూపంలో విస్తరించింది. ఎక్కడ గుట్కా నిల్వలు కనుగొన్నా... వాటికి సంబంధించిన మూలాలు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనే కనిపిస్తుండడం గమనార్హం. ఈ అక్రమ దందా ద్వారా గుట్కా కింగ్లుగా పేరున్న వ్యక్తులు కోట్లకు పడగలెత్తారు. వీరిలో ఒకరు ఇటీవలే జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఏకంగా అధికార పార్టీ జెడ్పీటీసీగా గెలిచి సత్తా చాటాడు. రామగుండం కమిషనరేట్ ‘గుట్కాకింగ్’లే... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా యథేచ్ఛగానే గుట్కా ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కా, ఖైనీ, అంబర్(పొగాకు) వంటి ప్యాకేజ్డ్ పొగాకుతో కూడిన పాన్మసాలాల విక్రయాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకున్న గుట్కాకింగ్లు అక్రమ వ్యాపారం ద్వారా రూ.కోట్లు గడిస్తున్నారు. రామగుండం కమిషనరేట్లోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో అక్రమంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. గోదావరిఖనిలో ‘కింగ్’గా పిలవబడే వ్యక్తితోపాటు అతని సోదరుడు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ప్రాంతాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కేశవపట్నం నుంచి ధర్మారం దాకా దందా సాగిస్తున్నారు. పోలీసులతో కూడా మంచి సంబంధాలే నిర్వహిస్తారనే పేరుంది. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా సాగుతున్న దందా జగిత్యాల, మానకొండూరు, కరీంనగర్, కాల్వ శ్రీరాంపూర్ మొదలుకొని మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గత మూడేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాతో సదరు గుట్కా అక్రమ రవాణాదారుడు రాజకీయంగా ఎదిగిపోయాడు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని ఓ మండలం నుంచి అధికార పార్టీ జెడ్పీటీసీగా కూడా ఎన్నికయ్యాడు. అన్నీ అనుకూలిస్తే ఎమ్మెల్యే కావాలనేది అతని కోరిక. జెడ్పీటీసీ కాకముందు అతనిని అరెస్టు చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసే పరిస్థితి. ఇప్పుడు ప్రజాప్రతినిధి కావడంతో అతని అనుచరులు, సోదరుడి ద్వారా దందా నడిపిస్తున్నాడని సమాచారం. కరీంనగర్ గంజిలో శ్రీనివాస్ అనే ఓ గుట్కా వ్యాపారి గతంలో పెద్ద ఎత్తున దందా సాగించాడు. రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల సరుకు తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో విక్రయించేవాడు. అతడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన తరువాత దందా నుంచి వైదొలిగి, వరంగల్ వెళ్లిపోయినట్లు సమాచారం. శ్రీనివాస్ దగ్గర శిష్యరికం చేసినవాళ్లే ఇప్పుడు కరీంనగర్ గుట్కా రాకెట్ను సాగిస్తున్నారు. బీదర్ నుంచే ఎందుకంటే.. జిల్లాకు పొగాకు పొట్లాలు(అంబార్), గుట్కా ప్రధానంగా కర్నాటక, తెలంగాణ సరిహద్దుల్లోని బీదర్ నుంచే సరఫరా సాగుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో పొగాకు వినియోగంపై నిషేధం లేదు. ఈ మార్గంలో చెక్పోస్టులు పెద్దగా లేకపోవడం, రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోనే ఉండడంతో రవాణా సులువు కావడంతో అక్కడి నుంచే ఎక్కువగా సరఫరా అవుతోంది. ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే ధర కంటే బీదర్లో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులకు ఇక్కడి నుంచి తీసుకువస్తే మరింత ఎక్కువ గిట్టుబాటవుతోంది. అక్కడ బస్తాల చొప్పున అంబార్, గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాలోని రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. అనుమానం రాకుండా ఇళ్లలోనే బస్తాలను భద్రపర్చి తక్కువ మొత్తంలో ఆటోలు, కార్లు, బైక్ల్లో జిల్లాలోని నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. 200 గుట్కా ప్యాకెట్ల చొప్పున ఉండే ఒక్కో బస్తాకు రూ.12వేల నుంచి రూ.15 వేలకు బీదర్లో కొనుగోలు చేసి రైళ్లు, కార్ల ద్వారా జిల్లాకు తీసుకొచ్చాక ఒక్కో బస్తాను రూ.20 నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. కార్లలో పదుల సంఖ్యలో సంచులను తరలిస్తూ రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. సులువుగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తూ అందులోంచి కొంత మొత్తాన్ని స్థానికంగా పోలీసులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమర్పించడంతోనే వారు మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా సమాచారం అందితేనే దాడులు నిర్వహించి అక్రమ వ్యాపారులను పోలీసులు పట్టుకుంటున్నారు. కొందరిని కేసులు నమోదు చేయకుండానే విడిచిపెడుతుండడంతో వారు దందా కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుపడిన అక్రమార్కులకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. తెలిసినా గప్చుప్ జిల్లాలో గత కొద్దికాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారంపై పోలీస్, విజిలెన్స్ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటోంది. ఉన్నతాధికారులకు విషయాన్ని పొక్కనీయకుండా గుట్కా మాఫియా వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో నడుస్తున్న గుట్కా దందాలో కిందిస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాకు మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా అక్రమంగా రవాణా జరుగుతోంది. స్థానికంగా కార్లు, ఆటోలు, బైకుల ద్వారా పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా గుట్కా దందా సాగించేందుకు అక్రమార్కులు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తున్నారు. ప్యాసెంజర్ ఆటోలు, కార్లలో గుట్కా సంచులను తరలిస్తున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలకు పంపిణీ చేసేందుకు బైక్లను వినియోగిస్తున్నా రు. పట్టపగలే ఈ దందా సాగుతున్నా నిఘా మాత్రం కరువైంది. జిల్లాకు ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల నుంచే గుట్కా సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీదర్ కేంద్రంగా ఎక్కువ పొగాకు, గుట్కా ప్యాకెట్లు జిల్లాకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి జిల్లాకు గుట్కా చేరుకుంటోంది. అక్కడి నుంచి కార్లు, ఆటోలు, బైక్లు, అశోక్ లైలాండ్, అప్పి ఆటోల్లో పట్టపగలే ఎల్లలు దాటిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం.. జిల్లాలోని అక్రమ వ్యాపారాలపై పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలపై ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే పట్టుకుంటాం. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
గుట్కా డొంక కదిలేనా?
సాక్షి, ఒంగోలు : గుట్కా రాకెట్ కేసులో తీగ లాగుతున్న పోలీసులు ఆ డొంక కదిల్చే ప్రయత్నంలో కొంత వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మేదరమెట్ల, నెల్లూరు నగరాల్లో గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన పోలీసులు పాత్రదారులపై కేసులు నమోదు చేసి సూత్రధారులను తప్పించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా మాఫియా నోరు విప్పితే వారికి అండగా నిలిచి భారీ మొత్తంలో మామూళ్లు పుచ్చుకున్న ఇంటి దొంగల పాత్ర బయటపడుతుందనే ఆందోళనతో ముగ్గురు టీడీపీ నేతలను కేసు నుంచి బయట పడేసేందుకు ఓ అధికారి పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పకుండా తప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు నుంచి ఎన్నికల సమయం వరకూ అక్కడ పనిచేసిన ఓ ఎస్సై సదరు పోలీస్ అధికారికి దగ్గరి బంధువు కావడంతో వీరి బాగోతం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మేదరమెట్ల గ్రామంలో గుట్కా మాఫియా సూత్రధారుల గురించి ప్రస్తావిస్తే నలుగురు టీడీపీ నేతల పేర్లను చెప్పేస్తున్నారు. అయినప్పటికీ ఇంటి దొంగల గుట్టు బయట పడుతుందేమోననే భయంతో పోలీసులు మాత్రం వారి జోలికి వెళ్లడం లేదు. కేసు విచారణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న పోలీసులు ఇంటి దొంగలను రక్షంచేందుకు మాత్రం విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు పోలీసుల అండదండలు... కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ఓ పొగాకు గోడౌన్లో మూడేళ్లుగా నడుస్తున్న గుట్కా మాఫియా గుట్టును రట్టుచేసిన పోలీసులు కేంద్రం నిర్వాహకుడైన నెల్లూరుకు చెందిన బలగాని ప్రసాద్తో పాటు గోడౌన్ యజమాని హనుమంతరావు (బుల్లబ్బాయ్)పై కేసు నమోదు చేశారు. హనుమంతరావును అరెస్ట్ చేసిన పోలీసులు ప్రసాద్ కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తీగ లాగుతూ వెళ్లిన పోలీసులకు నెల్లూరు నగరంలో మరో గుట్కా తయారీ కేంద్రం కంటబడింది. నిందితుడు ప్రసాద్ మాత్రం పరారీలో ఉన్నాడు. అసలు నిందితుడు దొరికితే సూత్రధారులైన టీడీపీ నేతలు, అండగా నిలిచిన పోలీస్ అధికారుల పాత్ర బయట పడే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్), గ్రామానికి చెందిన మరో ఇద్దరు టీడీపీ నేతల భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు మరి కొందరు పోలీస్ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటైనట్లు సమాచారం. అప్పట్లో నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ వ్యాపారాన్ని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పనిచేసిన పోలీస్ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి దొంగలను రక్షించేందుకే... గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3 కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులకు తీగ లాగేకొద్దీ గతంలో కొందరు ఖాకీలు చేసిన పాపాలు బయటపడుతూ వచ్చాయి. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ అందరికీ నెలవారీ మామూళ్లు ఇచ్చారనేది బహిరంగ రహస్యమే. విచారణ అధికారులు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు ఓ పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పాన్షాప్తో జీవితం ప్రారంభించి.. గుట్కా డాన్గా..!
సాక్షి, నెల్లూరు : అతని జీవితం పాన్షాప్తో ప్రారంభమైంది. క్రమంగా గుట్కా డాన్గా ఎదిగాడు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి రూ.కోట్లు సంపాదించాడు. ప్రకాశం జిల్లా మేదరమిట్లలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం నిర్వహిస్తుండగా అక్కడి పోలీసులు ఇటీవల దాడి చేశారు. రూ.3 కోట్లు విలువచేసే తయారీ మెషిన్లు, ఖైనీ, గుట్కాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గుట్కా డాన్ కోసం రెండు జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు బాలాజీనగర్ మసీద్ సెంటర్ ప్రాంతానికి చెందిన బి.ప్రసాద్ కొన్నేళ్ల క్రితం ట్రంకురోడ్డులోని ఓ కేఫ్ వద్ద పాన్షాప్ నిర్వహించేవాడు. గుట్కాలు, ఖైనీలు విక్రయించేవాడు. అనంతరం స్నేహితుల సహకారంతో జనార్దన్రెడ్డికాలనీలో, వెంకటాచలంలో గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి వివిధ కంపెనీలకు చెందిన గుట్కా, ఖైనీలు పెద్దఎత్తున తయారుచేసి విక్రయించాడు. 2015లో వెంకటాచలం పోలీసులు బ్రిక్స్ మాటున గుట్కాతయారీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో గుట్కా తయారీ కేంద్రంపై దాడిచేశారు. పరికరాలు, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల దాడులు అధికమైన నేపథ్యంలో ప్రసాద్ కొంతకాలం వ్యాపారానికి దూరంగా ఉన్నాడు. అనంతరం తన మకాంను ప్రకాశం జిల్లాకు మార్చాడు. మేదరమిట్లలో తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన పొగాకు గోదామును అద్దెకు తీసుకుని అందులో గుట్కా, ఖైనీ తయారీ పరికరాలను ఏర్పాటు చేశాడు. పెద్దఎత్తున గుట్కా, ఖైనీలను తయారుచేసి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. పక్కా సమాచారంతో.. గతేడాది జనవరిలో ప్రసాద్ అతని స్నేహితులు నెల్లూరు బారాషహీద్ దర్గా సమీపంలో నిషేధిత గుట్కా, ఖైనీలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో చిన్నబజారు పోలీసుస్టేషన్ ఎస్సై కరిముల్లా నిందితులపై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన ప్రసాద్, మరో ఇద్దరు పరారీ కాగా శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.4 లక్షలు విలువచేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రంగా చక్రం తిప్పసాగారు. ఇటీవల ఆ జిల్లాలో పోలీసుల నిఘా పెరగడంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 24వ తేదీన ప్రకాశం జిల్లా అద్దంకి సీఐ అశోక్వర్ధన్, మేదరమిట్ల ఎస్సై బాలకృష్ణలు తమ సిబ్బందితో కలిసి తయారీ కేంద్రంపై దాడులు చేసేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారవడంతో పోలీసులు గోదాము షట్టర్ తాళాలను పగులగొట్టారు. రూ.3 కోట్ల విలువచేసే తయారీ పరికరాలు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. గోదాము యజమాని హనుమంతరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అల్లీపురంలోనూ.. నిందితుడు ప్రసాద్ నెల్లూరు రూరల్ మండల పరిధిలోని అల్లీపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో హనుమంతరావు వెల్లడించాడు. దీంతో అద్దంకి సీఐ అశోక్వర్ధన్ తన సిబ్బందితో కలిసి రెండురోజుల క్రితం నెల్లూరుకు చేరుకున్నారు. రూరల్ పోలీసుల సహకారంతో అల్లీపురంలోని తయారీ కేంద్రాన్ని çతనిఖీ చేశారు. అక్కడ గుట్కా, ఖైనీలకు సంబంధించిన ఎలాంటి పదార్థాలు లభ్యం కాలేదని తెలిసింది. స్వాస్ పేరిట పాన్మసాలా (మౌత్ రీఫ్రెషనర్) ప్యాకెట్లు, అందులో వినియోగించి కిస్మిస్, జీడిపప్పు, సోంప్ పదార్థాలు, తయారీ పరికరాన్ని గుర్తించారు. దీంతో çపోలీసులు వాటి శాంపిల్స్ను తీసుకున్నారు. సదరు గోదాముకు రూరల్ పోలీసులు తాళాలు వేశారు. గోదాము యజమాని నుంచి ప్రసాద్ వివరాలు సేకరించారు. పాన్షాపు నుంచి గుట్కాడాన్గా ఎదిగిన ప్రసాద్ కోసం ప్రకాశం జిల్లా పోలీసులుతోపాటు నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. -
తమ్ముళ్లే సూత్రధారులు..!
అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు అధికారం కోల్పోయినా తీరు మార్చుకోవడం లేదు. సహజ వనరులను కొల్లగొట్టడం, సంపదను దోచుకోవడంతో ఆగక ప్రజారోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా తయారీ కేంద్రాన్ని శుక్రవారం పోలీసులు మేదరమెట్లలో గుర్తించిన విషయం తెలిసిందే. అయితే గుట్కా మాఫియాను నడుపుతున్నది మాత్రం టీడీపీ నేతలే అనేది స్పష్టమవుతోంది. గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన బలగాని ప్రసాద్ కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులేననే చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారుల అండదండలతో స్థానిక టీడీపీ నేత హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులకు పెద్ద మొత్తంలో నెలవారీ మామూళ్లు ఇస్తూ తమ పని చక్కబెట్టుకుంటున్నారు. గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడంతో టీడీపీ నేతలు తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నాలకు తెరతీశారు. సాక్షి, ఒంగోలు : కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మూడేళ్ల క్రితం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు కలిసి గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక పరమైన అంశాలను చూసుకుంటూ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు నెల్లూరు జిల్లకు చెందిన బలగాని ప్రసాద్ అనే వ్యక్తిని నియమించారు. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు ఎస్బీ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సమాచారం. నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టచెప్పి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్), గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పని చేసిన ఎస్బీ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్కా తయారీ కేంద్రం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన టీడీపీ నేతలు గ్రామాల్లో పెద్ద పెద్ద ఇళ్లు నిర్మించడమే కాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేకు చందాలు కూడా ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నుంచి తప్పించాలంటూ భారీ ఆఫర్లు.. గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే తాను బలగాని ప్రసాద్కు గోడౌన్ను లీజకు ఇచ్చానేతప్ప తనకేమీ సంబంధం లేదని టీడీపీ నేత హనుమంతరావు తప్పించుకునే యత్నం చేస్తున్నాడు. బలగాని ప్రసాద్ ఒక్కడే గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లుగా చూపి తమ పేర్లు తొలగించాలంటూ టీడీపీ నేతలు ఓ పోలీసు అధికారికి భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో విచారణ అధికారులకు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు సదరు పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతుగా విచారణ జరిగితే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతో గతంలో గుట్కా మాఫియాకు అండదండలు అందించిన పోలీసు అధికారులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎస్పీ గ్రామంలో రహస్య విచారణ జరిపితే కళ్లు చెదిరే వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గం.. : అశోక్ వర్థన్, అద్దంకి సీఐ గుట్కా తయారీ కేంద్రం కేసు విషయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదు. ఇప్పటికే గోడౌన్ యజమాని హనుమంతరావును అరెస్టు చేశాం. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులో ముందుకు వెళ్తాం. గోడౌన్ యజమాని అరెస్ట్... కోర్టుకు తరలింపు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రానికి అద్దెకు ఇచ్చిన గోడౌన్ యజమాని పోకూరు హనుమంతరావును శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం వెలుగు చూసిన నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు అయిన సందర్భంగా గోడాన్ యజమానిపై 420, 468, 174,328,188,466,471,120బీ, 272 మరియు 59 సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని ఎస్సై తెలిపారు. -
క్షణాల్లో గుట్కా మాయం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని సరస్వతినగర్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కా పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమైంది. సుమారు రూ.5లక్షల విలువచేసే గుట్కాను ఓ మహిళ సరస్వతినగర్లో ఒక ఆస్పత్రి పక్కన రేకులషెడ్డులో దాచిపెట్టింది. కొన్ని నెలలుగా ఇక్కడి నుండి గుట్కాను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ కోడలు తన అత్త గుట్కాను తరలిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మంగళవారం గుట్కాను పట్టుకునేందుకు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లారు. పోలీసులు వెళ్లేలోపలే అక్కడి నుండి గుట్కా మాయమైంది. పోలీ సులు వెళ్లాక అక్క గుట్కా లేకపోవడంతో అవాక్కయ్యారు. సంబంధిత శాఖ నుండే సమాచారం లీక్ అయి నట్లు తెలిసింది. గుట్కా నిర్వహిస్తున్న మహిళ కోడలు పక్కా సమాచారం ఆధారాలతో పోలీసులకు సమర్పించగా పోలీసులు దానిని పట్టుకోలేకపోయారు. పోలీసులు దాడిచేస్తున్న సమాచారం తెలియడం సదరు మహిళ గుట్కాను మాయంచేసింది. ప్రస్తుతం గుట్కా మాయం కావడంపై రహస్యం గా విచారణ చేస్తున్నారు. -
గుట్కా@ బీదర్ టు హుజూరాబాద్
సాక్షి, హుజూరాబాద్ : గుట్కా ప్రాణాంతకమైంది.. ప్రాణాలను హరించే గుట్కా అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి నిషేధిక గుట్కా దందాను హుజూరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిక గుట్కాలను కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలోని బీదర్ నుంచి కొనుగోలు చేసి హుజూరాబాద్కు తెచ్చి ఇక్కడి నుంచి పరిసర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాణాంతకమైన గుట్కా అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంతో పోలీసులు గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న గుట్కా దందాను అడ్డుకునేందుకు పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తుండగా, రూ.లక్షల్లో గుట్కాలు పట్టుబడుతున్నాయి. తాజాగా హుజూరాబాద్ పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగని గుట్కా అమ్మకాలు.. గత కొన్నేళ్లుగా గుట్కా అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కొందరు అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి గుట్టుగా గుట్కా దందాను కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాడుల్లో తరచూ పట్టుబడుతున్నా.. అక్రమార్కులు మాత్రం గుట్కా అమ్మకాలను దర్జాగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే గుట్కాలు తినడానికి అలవాటు పడి ఎంతో మంది యువకులు, వృద్ధులు క్యాన్సర్ వ్యాధి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏడాది క్రితం కూడా గుట్కా ప్యాకెట్లను భారీ మొత్తంలో జీపులో తరలిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా రూ.లక్ష విలువ గల గుట్కా ప్యాకెట్లు దొరికాయి. నివాస గృహాల్లో నిల్వలు.. హుజూరాబాద్ కేంద్రంగా గుట్కా అమ్మకాల విక్రయాలు కొనసాగుతుండగా, నివాస గృహాలనే కేంద్రాలుగా ఏర్పరుచుకొని కొందరు అక్రమార్కులు భారీగా నిల్వలను ఉంచుతున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మరింత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గానికి హుజూరాబాద్ పట్టణం కేంద్రం కావడంతో ఆయా మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న గుట్కా విక్రయదారులు గ్రామాల నుంచి వచ్చే కిరాణ కొట్టు దుకాణాదారులకు అంటగడుతూ జేబులు నింపుకుంటూ సొమ్ము చేసుకొంటుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే వారు కొన్ని పాన్ షాపుల్లో, కిరాణ దుకాణాల్లో గుట్టుగా విక్రయిస్తున్న గుట్కాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సరదాగా మొదలై.. వ్యసనంగా మారి ప్రాణాంతకమైన గుట్కాకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే వ్యసనంగా మారుతున్నట్లు తెలుస్తోంది. పని ఒత్తిడిని తట్టుకునేందుకు వారు సరదాగా గుట్కా, అంబర్కు అలవాటు పడుతూ వ్యసనంగా మారి వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. అయితే నిరక్షరాస్యులతో పాటుగా, పలువురు విద్యావంతులు కూడా అంబర్, గుట్కా వ్యసనంగా మారి వ్యాధుల బారినపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు ధనార్జనే ద్వేయంగా గుట్కా అమ్మకాలను నిర్వహిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు సమాచారం. -
గుట్కాపై నిషేధమేది?
బేల(ఆదిలాబాద్): గుట్కా, ప్లాస్టిక్లపై నిషేధం ఉన్నా ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పాన్షాపులలో మరింత విరివిగా లభిస్తున్నాయి. ఓ వైపు గుట్కా దందా జోరుగా కొనసాగుతుండగా, మరోవైపు ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా మారింది. కాగా పాన్షాపులలో ఈ నిషేధత తంబాకులు, పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్లో వేసి నలిచి కర్రా పూడిలను(గుట్కా పొట్లాలు) మరీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ గుట్కా తయారీ జిల్లా కేంద్రంతోపాటు ఆదిలాబాద్రూరల్, మావల, జైనథ్, బేల, గాదిగూడ, తదితర మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. వీటిపై అధికారుల తనిఖీలు అంతంతే ఉండడంతో గుట్కా, ప్లాస్టిక్ల నిషేధం ఏమాత్రం అమలు కావడం లేదు. గుట్కా, ప్లాస్టిక్ విరివిగా లభ్యం ‘గుట్కా నమలడం కేన్సర్కు కారకం’..అని సినిమా థియేటర్లలో, అక్కడక్కడా ప్రచార మాధ్యమాల్లో, వాల్పోస్టర్లలో చూస్తుంటాం, చదువుతుంటాం. దీంతో పాటు ‘ప్లాస్టిక్తో పర్యవరణానికి ముప్పు’ అని సైతం చూస్తుంటాం. అయినా నిషేధిత గుట్కా, ప్లాస్టిక్లు కలిసి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా..నిషేధిత ఈగల్, మాజా, బాబా, రత్నా, 160, తదితర తంబాకులను పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్లో వేసి సాధారణ మిమన్ల ద్వారా నలిచి నలిచి కర్రా పూడిలను తయారు చేస్తున్నారు. ఈ గుట్కా తయారీకి కరెంటు మిషన్లను సైతం యథేచ్ఛగా వినియోగిస్తుండటంతో గుట్కా, ప్లాస్టిక్లు దందా మరింత జోరుగా సాగుతోంది. మూడు ప్యాకెట్లు..ఆరు కాటన్లుగా గుట్కా దందా.. మార్కెట్లో విమల్, సాగర్, నజర్, ఆర్ఎండీ, వంటి గుట్కాలు సాధారణంగా లభిస్తున్నాయి. ప్టాస్టిక్ ప్యాకింగ్తో ఉన్న అంబర్ తంబాకును ప్రత్యేకంగా ఫ్రీజ్లలో కూలింగ్ చేసి, రెండింతలతో మరి విక్రయిస్తున్నారు. ఇంతేకాకుండా నిషేధిత కర్రా పూడిలను ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా తయారు చేసిన కర్రాలను ముందుగా వయసు పైబడ్డవారు, వయోజనులు, యువకులు తినేవారు. గత ఒకట్రెండు ఏళ్ల నుంచి మహిళలతోపాటు బడీడు పిల్లలు సైతం తినడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా తింటుండంతో ‘మూడు ప్యాకెట్లు..ఆరు కాటన్లు’గా ఈ గుట్కా దందా రోజు లక్షల్లో కొనసాగుతోంది. ఈ గుట్కాతో ప్రతీరోజు చిన్న పాన్షాపులలో ఆరేడు వేలు పైబడి గిరాకైతే, పెద్ద పాన్షాపులలో రూ.35వేలకు పైబడి దాటుతోంది. ఈ గుట్కాకు అలవాటు పడ్డవారు దాన్ని మానలేక ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని మరి నములుతున్నారు. వీళ్ల అలవాటును పసిగట్టిన కొందరు మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ నిల్వలు ఉంచి, అవసరాన్ని బట్టి పాన్షాపులకు సరఫరా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవగాహన లోపం.. రాష్ట్రంలో గుట్కాను నిషేధించినా అలవాటు పడ్డవారు మానలేకపోతున్నారు. ఇక్కడి ప్రజల్లో అవగాహన లేకపోవడం, గుట్కాతో కలిగే దుష్పరిణామాలను మామూలుగానే తీసుకుంటూ నమిలేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం గుళ్ల అవుతోంది. గుట్కా నమిలే వాళ్ల వద్ధ పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. బహిరంగా ప్రదేశాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడంతో అపరిశుభ్రత నెలకొంటోంది. దీంతో తోటి వారు ఇబ్బందులు పడుతున్నారు. గుట్కా నమిలితే కాలేయం, నోటి కేన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, పోలీసులు ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిషేధించినా గుట్కా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘గుట్కా’ గుట్టుపై గుజరాత్కు సమాచారం!
సాక్షి, సిటీబ్యూరో: పాన్ మసాలా పేరుతో నిషేధిత ‘గుట్కా’ దందా చేస్తున్న ముఠా సూత్రధారి అవల అభిషేక్ వ్యవహారాన్ని నగర పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇతడు గుజరాత్ కేంద్రంగా సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు తెలపాలని నిర్ణయించారు. మరోపక్క ఫ్రాంచైజీల పేరుతో ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది హైదరాబాద్కు క్యూ కడుతుండటంతో అభిషేక్ ఆర్థిక లావాదేవీల పైనా పోలీసు విభాగం కన్నేసింది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన అవల అభిషేక్ 2015లో బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ‘7 హిల్స్ మాణిక్చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దా ఉత్పత్తి చేసే సంస్థను ఏర్పాటు చేశాడు. గత ఏడాది దీనిపై దాడి చేసిన బీబీ నగర్ పోలీసు అవినాష్తో పాటు అతడి తండ్రి ఏవీ సురేష్, మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో అతను తన అడ్డాను గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్లకు మార్చి అక్కడ యూనిట్స్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనూ గుట్కాపై నిషేధం విధించడంతో అభిషేక్ తన యూనిట్స్లో గుట్కాను అదే రూపంలో ఉత్పత్తి చేయలేదు. పోలీసుల కన్నుగప్పేందుకు ‘7 ఎంసీ టుబాకో’ పేరుతో ఒకటి, ‘7 హిల్స్ మాణిక్చంద్ పాన్ మసాల’ పేరిట మరోటి తయారు చేస్తున్నాడు. ఈ రెంటినీ వేర్వేరుగా ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో సోమవారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. గుజరాత్ పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా సాగుతున్న ఈ దందాను వారి దృష్టికి తీసుకువెళ్ళాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఇందుకుగాను అక్కడి పోలీసులకు లేఖ రాయనున్నారు. తద్వారా గుజరాత్లో ఉన్న అభిషేక్కు చెందిన యూనిట్స్ను సీజ్ చేయించాలని, దీంతో అతడి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అవినాష్ ముఠాను టాస్క్ఫోర్స్ అధికారులు గోపాలపురం పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారే సంబంధిత అధికారుల ద్వారా లేఖ రాసే అవకాశం ఉంది. అవినాష్ ఓ పక్క నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే మరోపక్క అనేక మందిని మోసం చేశాడు. ‘7 హిల్స్ మాణిక్చంద్ పాన్ మసాల’ ఉత్పత్తులకు సంబధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. పాన్ మసాలాల విక్రయంపై నిషేధం లేకపోవడంతో ఎవరి వారు వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా, కోల్కతా, ఢిల్లీ తదితర నగరాలకు చెందిన పలువురు అతడిని సంప్రదించారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో రూ.లక్షలు, రూ.కోట్లలో వసూలు చేసి మోసం చేశాడు. దీనిపై ఇప్పటికే ముషీరాబాద్, ఏపీలోని విశాఖపట్నం ప్రాంతాల్లో ఇతడిపై కేసులు నమోదు కాగా మంగళవారం బీహార్లోని పట్నా, ఢిల్లీలకు చెందిన దీలీప్ చౌదరి, మోహన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అభిషేక్ తమ నుంచి దాదాపు రూ.3.5 కోట్ల మేర తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిన్నింటితో పాటు అభిషేక్ మాణిక్చంద్ పేరును వినియోగించడం అక్రమమని భావిస్తున్న పోలీసులు దీనిపై లోతుగా ఆరా తీయాలని నిర్ణయించారు. సైదాబాద్లో ఇల్లు, బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు కార్యాలయాలు నిర్వహిస్తున్న అభిషేక్ వద్ద దాదాపు 15 మంది పని చేస్తున్నారు. దీంతో ఇతను ప్రతి నెలా అద్దెలు, జీతభత్యాలు, ఇతర ఖర్చులకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోపక్క నగరం కేంద్రంగా అభిషేక్ నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నుంచి సేకరించారు. దీని ప్రకారం అందులో అభిషేక్తో పాటు మరో మహిళ సైతం డైరెక్టర్గా ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. -
గుట్కా ఫ్రమ్ గుజరాత్!
గుజరాత్లో ఏర్పాటు చేసిన యూనిట్స్లో వేర్వేరు ఉత్పత్తులుగా గుట్కా తయారు చేసి.. రైళ్లలో హైదరాబాద్కు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి ప్రధాన సూత్రధారి అవల అభిషేక్ సహా నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.4 కోట్ల విలువైన నిషే ధిత ఉత్పత్తులు స్వాధీనం చేసు కున్న ట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించా రు. సమావేశంలో డీసీపీ పి.రాధాకిషన్ రావు పాల్గొన్నారు. –సాక్షి, హైదరాబాద్ ఇక్కడ చిక్కడంతో.. సైదాబాద్కు చెందిన అవల అభిషేక్.. 2008 నుంచి బేగంబజార్ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్మసాలా వ్యాపారం చేస్తూ మాణిక్చంద్ సంస్థకు ప్రధాన ఏజెంట్గా ఉన్నాడు. 2015లో సెవెన్హిల్స్ మార్కెట్ ప్రాంతంలో సొంతంగా సంస్థ ఏర్పాటు చేశాడు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్చంద్’పేరుతో పాన్ మసాలా, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించాడు. మాణిక్చంద్ పేరును వినియోగించడంపై పోలీసులు లోతుగా ఆరాతీశారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో గతేడాది బీబీనగర్ పోలీసులు యూనిట్పై దాడి జరిపి కేసు నమోదు చేసి అభిషేక్, అతడి తండ్రి ఏవీ సురేశ్ తదితరులను అరెస్టు చేశారు. దీంతో అభిషేక్ తన దందాను గుజరాత్కు మార్చాడు. అక్కడ ఉన్న తన ఏజెంట్ శైలేష్ జైన్ ద్వారా అహ్మదాబాద్, రాజ్కోట్లో యూనిట్లు ఏర్పాటు చేశాడు. రైల్వేస్టేషన్ నుంచే సరఫరా పోలీసుల కన్నుకప్పేందుకు గుజరాత్లో ‘7 ఎంసీ టొబాకో’పేరుతో ఒకటి, ‘7 హిల్స్ మాణిక్చంద్ పాన్ మసాలా’పేరిట మరొకటి తయారు చేస్తున్నాడు. ఈ రెండింటినీ వేర్వేరుగా ప్యాక్ చేసి అహ్మదాబాద్ నుంచి రైల్వేలో వివిధ రకాల పేర్లతో సికింద్రాబాద్కు పంపిస్తున్నాడు. ఇలా వచ్చిన ఉత్పత్తులను హైదరాబాద్లో నిల్వ చేసేందుకు గోడౌన్ నిర్వహించట్లేదు. రైల్వేస్టేషన్లో ఉండే ఏజెంట్లు షబ్బీర్ మొయినుద్దీన్, సయ్యద్ జబ్బార్ అహ్మద్లు ఈ ఉత్పత్తులను తీసుకుని అభిషేక్ ఆదేశాల ప్రకారం నేరుగా డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు సయ్యద్ మహ్మద్కు చెందిన వాహనం వాడుతున్నారు. షబ్బీర్, జబ్బార్లు ఉత్తరప్రదేశ్, ఢిల్లీల నుంచి వచ్చే పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటూ గోషామహల్కు చెందిన తబ్రేజ్, బేగంబజార్ వాసి మనీష్లకు సరఫరా చేసి అమ్మిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా సాగుతున్న ఈ దందాపై నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్ రావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, పి.పరమేశ్వర్, జి.రాజశేఖర్రెడ్డి వల పన్నారు. గోపాలపురం ప్రాంతంలో రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషిద్ధ ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో అభిషేక్, షబ్బీర్, జబీర్, మొహ్మద్లను అరెస్టు చేశారు. ఫ్రాంచైజీల పేరుతో మోసం కాగా, నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే అనేక మందిని అభిషేక్ మోసం చేశాడు. ‘7 హిల్స్ మాణిక్చంద్ పాన్ మసాలా’ఉత్పత్తులకు సంబంధిం చిన ఫ్రాంచైజీలు, డిస్ట్రి బ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజె న్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అనేక మంది అభిషేక్ను సంప్రదిం చారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. వారితో అక్కడ దుకా ణాలు ఏర్పాటు చేయించి ముందు కొంత సరుకు సరఫరా చేసి తర్వాత అదీ వెనక్కు తీసుకున్నాడు. నగదు ఇచ్చేయాలని అడిగిన వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ముషీరాబాద్, ఏపీలోని విశాఖ పట్నంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. -
రూ. 1.50 కోట్ల గుట్కా స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా నగరానికి గుట్కా తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘దాదాపు రూ. కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను సీజ్ చేశాము. గుట్కాను వేరే పేర్లతో ప్యాక్ చేసి అక్రమంగా రైల్లో తరలిస్తుండగా పట్టుకున్నాం. హైదరాబాద్కు చెందిన అభిషేక్, షబ్బీర్ మొయినుద్దీన్, సయ్యద్ జబీర్ మహ్మద్, సయ్యద్ మహ్మద్లు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నార’ని తెలిపారు. ‘ఈ ముఠా రెండు వాహనాల్లో ఆరు రకాల గుట్కా పదార్థాలను తరలించే ప్రయత్న చేశారు. వీరిని అరెస్ట్ చేసి.. గుట్కా పదార్థాలను సీజ్ చేశాము. అయితే ఈ గ్యాంగ్కు అవాల అభిషేక్ లీడర్గా వ్యవహరిస్తున్నాడు. 2004 నుంచి అతను ఈ వ్యాపారం చేస్తున్నాడు. గతంలోనే అభిషేక్ మీద బీబీ నగర్, చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి’ని అంజనీ కుమార్ తెలిపారు. -
గుట్కా తరలిస్తున్న ముఠా అరెస్ట్
-
బిగుస్తున్న ఉచ్చు
గుట్కా మాఫియా నుంచి మామూళ్లు దండుకున్న పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు ఉచ్చుబిగిస్తున్నారు. టాస్క్ఫోర్స్ విచారణలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు మామూళ్లు దండుకున్న వ్యవహారంలో పక్కా ఆధారాలు వెలుగుచూశాయి. నెలవారీగా ఏ అధికారికి ఎంత మొత్తంలో మామూళ్లు ముట్టజెప్పిందీ లిఖితపూర్వకంగా గుట్కామాఫియా ఆధారాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో మామూళ్లు దండుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: అవినీతి పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. గుట్కా మాఫియా నుంచి నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటున్న పోలీసు అధికారుల గుట్టు రట్టయింది. అటు గుట్కామాఫియా కీలక సభ్యులు, ఇటు అధికారులకు డబ్బులు వసూలు చేసిపెట్టిన సిబ్బంది ఎవరికి వారు అక్రమ వసూళ్ల వ్యవహారంపై లిఖిత పూర్వకంగా టాస్క్ఫోర్స్ అధికారులకు ఆధారాలు అందజేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా జరగడంలో ఇద్దరు డీఎస్పీలతోపాటు, పలువురు సీఐలు, ఎస్ఐల పాత్రపై స్పష్టమైన ఆధారాలు దొరకడంతో ఉన్నతాధికారులు సైతం వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా అధికారులకు డబ్బులు వసూలు చేసిన హెచ్సీలు, పీసీలపై సస్పెన్షన్వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల వద్ద డ్రైవర్లుగా, సహాయకులుగాపనిచేస్తున్న కొందరు హోంగార్డులు సైతం పోలీసు అధికారులకు డబ్బులు వసూలు చేసి పెట్టినట్లు స్వయంగా అంగీకరించడంతో వారిని మూడు నెలలపాటు విధులనుంచి తప్పించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి గుట్కా మాఫియాపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించడంతో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గుంటూరు రూరల్ జిల్లాలోని రెండు సబ్ డివిజన్లలో గుట్కా మాఫియా రెండు నెలలుగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న వ్యవహారం బయటపడింది. పోలీసు ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో సందట్లో సడేమియాలా కొందరు అవినీతి అధికారులు గుట్కామాఫియా నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ గుట్కా అక్రమ రవాణా నుంచి అమ్మకాల వరకు యథేచ్ఛగా సాగేలా సహకారం అందిస్తున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారుల పేర్లను సైతం వాడడంతో గుట్కా మాఫియాపై గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు కన్నెర్ర చేశారు. ఈ వ్యవహారంలో డివిజన్స్థాయి పోలీసు అధికారుల నుంచి ఎస్ఐల వరకు అందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ ఇలా వదిలేస్తే పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందనే తలంపుతో గాడిలో పెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. ఇందులో భాగంగా జిల్లాలో గుట్కా, మట్కా, సింగిల్ నంబర్ లాటరీలు, క్రికెట్ బెట్టింగ్లు, రేషన్, ఇసుక మాఫియాల నుంచి పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు వసూలు చేసి పెడుతున్న పోలీసు సిబ్బందిని గుర్తించి జిల్లా వ్యాప్తంగా 44 మందిని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. రోజూ వారికి కౌన్సిలింగ్ ఇస్తూ పరేడ్ చేయిస్తూ సత్ప్రవర్తన పొందేలా శిక్షణ ఇస్తున్నారు. వారిలో గుట్కా మాఫియా నుంచి అధికారులకు డబ్బులు వసూలు చేసిపెట్టిన సిబ్బందిని గుర్తించి, వారిని విచారించి గుట్కా మాఫియా నుంచి డబ్బులు దండుకున్న పోలీసు అధికారుల జాబితాను తయా రు చేసినట్లు తెలిసింది. గుట్కా మాఫియాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకుని ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారనే దానిపై పూర్తి ఆధారాలు లిఖిత పూర్వకంగా తీసుకున్నట్లు సమాచారం. గుట్కా మాఫియా వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందో తెలి యక అవినీతి పోలీసు అధికారులు హడలి పోతున్నారు. ఎన్నికల్లో వసూళ్లపైనా ఆరా గుట్కా మాఫియా నుంచే కాకుండా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతల నుంచి పోలీసు అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై సైతం విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు ఎవరి నుంచి ఎంతెంత తీసుకున్నారనే జాబితాను ఎస్పీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే జిల్లాలో దాదాపు 90 శాతం మంది పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతల నుంచి డబ్బులు తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే. మరి అలాంటప్పుడు ఈ వ్యవహారాన్ని కదిలిస్తే అందరిపై వేటు వేయాల్సి ఉంటుందని, అది సాధ్యమా అనేదానిపై పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ఎస్పీ ఏవిధంగా ముందుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.మొత్తానికి జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి భాగోతంపై విచారణ నడుస్తుండటం హాట్ టాపిక్గా మారింది. రెండు మూడు రోజుల్లోనే అవినీతి పోలీసు అధికారులపై నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు ఎస్పీ సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. -
భారీగా గుట్కా నిల్వల సీజ్
సాక్షి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తారని భావించి రెండు నెలలకుపైగా అవసరమని భావించి గుట్కా ప్యాకెట్లను ముందుగానే సిద్ధం చేసుకున్న ఓ వ్యాపారి ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అదనపు ఎస్పీ ఎం.రజని ఆదేశాల మేరకు డీఎస్పీ ఎల్.అంకయ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లాయరుపేట సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న హరేరామ బజార్లోని అమరా బాలకృష్ణ నివాసంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐలు బీటీ నాయక్, కేవీ రాఘవేంద్ర ఎస్ఐ అహ్మద్ జానీ, ఆడిటర్ శ్యామ్పాల్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ప్రసాద్, వెంకట్, లక్ష్మణ్, ఒన్టౌన్ ఎస్ఐ సుమన్, హెడ్కానిస్టేబుల్ సీతారామయ్యలు దాడులకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఇంటిపైన ఉన్న మూడో అంతస్తులో స్టాకు నిల్వలు గుర్తించారు. పెద్ద పెద్ద బస్తాల్లో నిల్వ ఉన్న గుట్కా ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.9,37,700 ఉంటుందని భావించారు. ఈ సందర్భంగా వ్యాపారి అమరా బాలకృష్ణను ప్రాథమికంగా విచారించారు. అనంతపురం నుంచి నరేష్ అనే వ్యక్తి తనకు బుధవారం రాత్రి స్టాకు పంపినట్లు వివరించాడు. ఈ నేపథ్యంలో స్టాకును, నిందితుడైన బాలకృష్ణను ఒన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఒన్టౌన్ ఎస్ఐ సుమన్ తెలిపారు. బాలకృష్ణ స్థానిక నూతన కూరగాయల మార్కెట్లో ఓ షాపు నిర్వహిస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇతడిపై గుట్కాలకు సంబంధించి కేసు కూడా నమోదై ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రెండో దఫా కూడా పెద్ద ఎత్తున స్టాకు నిల్వ ఉంచడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
గుట్కా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి
భీమవరం టౌన్, ఉండి : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎన్ఆర్పీ అగ్రహారంలో నిషేదిత గుట్కా తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం భీమవరం వన్టౌన్ సీఐ పి.చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఎంసీ బ్రాండ్ పేరుతో ముద్రించిన రేపర్స్లో గుట్కాను ప్యాక్ చేసి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 15 లక్షలు విలువైన 60 బస్తాల సరుకు, రెండు గుట్కా తయారీ యంత్రాలు, 20 పెట్టెల్లోని 8 లక్షల ఎంసీ బ్రాండ్ రేపర్స్, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీఐ పి.చంద్రశేఖరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. స్పెషల్ బ్రాంచి ఇచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్ నుంచి వచ్చిన ఆదేశాలతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాత్రి గస్తీలో ఉన్న భీమవరం వన్టౌన్ ఎస్సై డి.హరికృష్ణ, కానిస్టేబుల్ డి.బాలసురేష్కుమార్ అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరానికి గుట్కా బస్తాలను తరలిస్తున్న ఆటోను భీమవరం » స్టాండ్ సెంటర్లో పట్టుకున్నారు. తణుకు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కేరు అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో పోలీ సులు ఎన్ఆర్పీ అగ్రహారంలోని శివాలయం సమీపంలో ఉన్న ఒక షెడ్డు వద్దకు చేరుకోవడంతో గుట్కా గుట్టు రట్టయింది. ఈ కేంద్రాన్ని రహస్యంగా నడుపుతున్న ఉండి ప్రాంతానికి చెందిన కెల్లా రామారావును అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై గతంలో కూడా వీరవాసరంలో గుట్కా రవాణా చేస్తూ పట్టుబడడంతో కేసు నమోదైంది. పట్టుబడిన సరుకు, యంత్రాలతో పాటు నిందితులను భీమవరం వన్ టౌన్ పోలీసుస్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఇక్కడ కేవలం పొ గాకు, పాన్ మసాలా తయారీకి మాత్రమే అనుమ తి ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకుని వాటితో గుట్కాను తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక్కడ గు ట్కాను ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారో పో లీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిలో భీమవరం రూరల్ సీఐ సునీల్కుమార్, ఉండి పోలీసులతో పాటు ప్రత్యేక సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
గుట్కా ఘాటు
గద్వాల క్రైం: మన రాష్ట్రంలో మత్తునిచ్చే గుట్కా ప్యాకెట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో వివిధ కంపెనీలు మూతబడ్డాయి. అయితే వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలనుంచి పోలీసుల నిఘా నేత్రాల దృష్టిలో పడకుండా సరిహద్దులు దాట్టి వేలాది ప్యాకెట్లను దొంగచాటున తీసుకొస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంగా తోడేళ్లలాంటి జాదూగాళ్ల సాయంతో వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. షాలో మునిగిన యువత ఆ దురలవాటును మానుకోకపోవడంతో వీరి వ్యాపారం గుట్టుగా జోరుగా సాగుతోంది. పాన్ మాసాల, జర్దా, ఖైనీ, తంబాకు, గుట్కాలతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలను నిషేధించారు. అయినప్పటికీ సరఫరా పొరుగు రాష్ట్రాలనుంచి అవుతూనే ఉంది. జిల్లాలో జనవరి ఒక్క నెలలోనే సుమారు రూ.3లక్షల విలువ గల గుట్కాలను పోలీసులు పట్టుకుని 7 కేసులు, 11 మందిని అరెస్ట్ చేశారంటే విక్రయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూడింతలు లాభం మత్తెక్కించే గుట్కాలో దందాలో లాభం కూడా అదేస్థాయిలో ఉంటుంది. ఒక్క గుక్కా ప్యాకెట్ ధర రూ.5 ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. అంటే సగటున రోజుకు ఓ చిరు వ్యాపారి 100 ప్యాకెట్లు అమ్మితే కనీసం రూ.1500ల సంపాదన. ఇలా రోజుకు, వారానికి, నెలకు లెక్కేస్తే వారి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నమోదైన కేసులు జనవరి 5న కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాయచూర్ నుంచి రూ.27 వేల విలువ గల నిషేధిత గుట్కాలను రహ్యసంగా బైక్పై అయిజ మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని సరుకును సీజ్ చేశారు. 17వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు రాయచూర్ నుంచి గద్వాల మీదుగా రూ.30 వేలు విలువగల గుట్కాలను తరలిస్తుండగా జమ్మిచెడ్ శివారులో పట్టుకున్నారు. అదే రోజున గద్వాల పట్టణ పోలీసులు సైతం పలువురిని అదుపులోకి తీసుకోగా వారినుంచి వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. సరుకును సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. 18వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాయచూర్ నుంయి కారులో ఎవరికీ అనుమానం రాకుండా రూ.1, 80 లక్షల విలువ గల గుట్కాలను తరలిస్తున్నట్లు కేటీదొడ్డి పోలీసులకు సమాచారం వచ్చింది. నందిన్నె చెక్పోస్టు వద్ద పోలీసులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. గుట్కా.. కేరాఫ్ కర్ణాటక! నిషేధిత పాన్ మాసాల, జర్దా, తంబాకు, కైనీ, గుట్కా విక్రయాలకు కర్ణాటకలో నిషేధం లేదు. అందులోనూ రెండు రాష్ట్రాలకు సరిహద్దు గల ప్రాంతం కావడంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూల్ జిల్లా వాసులు అలంపూర్ చౌరస్తా నుంచి శాంతినగర్, అయిజ, బల్గెర మీదుగా రాయచూర్కు చేరుకుంటారు. అక్కడ సరుకును కొనుగోలు చేసి రహ్యసంగా బస్సుల్లో బైక్, కారు వంటి వాహనాల్లో తరలిస్తుంటారు. బల్గెర వద్ద పోలీసుశాఖ చెక్పోస్టును ఏర్పాటు చేయగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు చేపడితేనే ఇలా పట్టుబడుతుంటే సరిగ్గా ప్రతి వాహనాన్ని పరిశీలించి తనికీ చేస్తే ఇంకెంత సరుకు పట్టుబడుతుందో. ఇలా తరలిస్తుంటారు.. వనపర్తి జిల్లాకు చెందిన వ్యాపారులు గద్వాల జిల్లా మీదుగా సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వనపర్తి నుంచి గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, దేవరకద్ర, మక్తల్ తదితర ప్రాంతల మీదుగా అనువుగా ఉండడం అక్రమార్కులకు అనువుగా ఉంది. అయితే ఇక్కడే తప్పించుకునేందుకు సులువైన మార్గాలు కూడా ఉన్నాయి. కేటీదొడ్డి మండలం నందిన్నె సరిహద్దు వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఇక మక్తల్ వద్ద మాగనూర్ దగ్గర మరో చెక్పోస్టును పోలీసు శాఖ ఏర్పాటు చేసినప్పటికి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి గుట్కా ప్యాకెట్లు చేరాల్సిన ప్రాంతాలకు సునాయాసంగా చేరిపోతున్నాయి. ఇక రాయచూర్ నుంచి నిత్యం గుట్కాలను తరలిచడం, తనిఖీలు చేస్తున్న తరుణంలో కర్నాటక డిపోకు చెందిన బస్సుల్లో సైతం రవాణా చేయడం వ్యాపారులకు కలిసి వస్తోంది. ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ కీలక వ్యక్తులు ఎవరు? నిషేధిత గుట్కా తరలింపు చేస్తున్నది ఎవరన్నది పోలీసులు బయటపెట్టాలి. పలుకుబడి ఉన్న వ్యక్తులు, పెద్దల అండదండలతో ఈ వ్యవహారం కొన్నసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల సహాయంతో ముందుగానే పోలీసులను మచ్చిక చేసుకోవడంతో ఎలాంటి తనిఖీలు లేకుండా సరుకు గ్రామాలకు చేరుతోందనే ఆరోపణలు సైతం లేకపోలేదు. పక్కా ప్లాన్తో కర్నాటక వ్యాపారులకు, అక్కడి పెద్దలతో నిత్యం టాచ్లో ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి ఏ సమయంలో తరలించాలో ముందుగానే చెప్పడంతో లక్షల కొద్దీ సరుకులు సరిహద్దులు దాటిపోతోంది. గొలుసు కట్టు దుకాణాలే టార్గెట్.. వ్యాపారంలో నిర్ధేశించిన వ్యక్తులు మాత్రమే ప్రణాళిక ప్రకారం గుట్కాలను అమ్మే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా వీధి సైడ్, శివారు ప్రాంతం, పాన్ డబ్బాల నిర్వహకులు, టీ స్టాల్స్ తదితర వ్యాపారుల నుంచి పక్కా ప్రణాళికలతో గొలుసు కట్టుగా అమ్మకాలు ఉంటాయి. విక్రయాల్లో ఒక్కో దుకాణదారుని వద్ద గుట్కాలకు ఓ రేటు ఉంటుంది. అమ్మిన వ్యాపారి కొత్త వ్యక్తులకు ఎట్టి పరిస్థితిలో విక్రయాలు చేయరు. మరికొంత మందైతే కోడ్ భాషలో మాట్లాడితేనే అమ్ముతారు. ఈ వ్యాపారంలో మూడింతల లాభాలు ఉండ డంతో సామాన్యులు సైతం అమ్మకాలు చేయడానికి వెనకాడటంలేదు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెరవెనుక ఉన్న కేటుగాళ్లను పట్టుకుంటే తప్ప ఈ నిషేధిత గుట్కా వ్యాపారానికి చెక్పడదు. గుట్కా ప్యాకెట్ల పట్టివేత గద్వాల క్రైం: జిల్లాకేంద్రానికి గుట్కా ప్యాకెట్లను తీసుకొస్తుండగా పట్టుకున్నట్టు పట్టణ ఏఎస్ఐ జిక్కిబాబు తెలిపారు. గద్వాల పట్టణం రెండో రైల్వే గేటు కాలనీకి చెందిన మాణిక్యం ఆదివారం రాయచూర్ నుంచి గుట్కాలను బైక్పై గద్వాలకు తీసుకువస్తున్నట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం ధరూర్ మెట్టు ప్రాంతంలో కాపుకాసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనివద్దనుంచి గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు పెడతాం నిషేధిత గుట్కాలను కొనుగోలు చేసినా, అమ్మినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రాష్ట్రంలో అనుమతినిస్తాం. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు. గుట్కా వ్యాపారంలో భాగస్వాములుగా మారి తరలించేవారు పద్ధతి మార్చుకోవాలి. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల -
అగ్గిపెట్టెల్లో ఉంచి గుట్కా విక్రయం
చెన్నై, తిరువొత్తియూరు: అగ్గిపెట్టెలలో హాన్స్, పాన్పరాగ్ వంటి ప్రభుత్వ నిషేధించిన మత్తు పదార్థాలను ఉంచి విక్రయిస్తున్న దుకాణం యజమానిని పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై, సెయింట్ థామస్ మౌంట్ మేట్టువీధిలో ఉన్న ఓ ప్రొవిజన్ దుకాణంలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు పోలీసు డిప్యూటీ కమిషనర్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ వలర్మతి, ఎస్ఐ సెల్వమణి తదితరులతో కూడిన బృందం ఆ ప్రాంతంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో మధ్యస్థనగర్లో ఉన్న ఓ ప్రొవిజన్ దుకాణానికి యువకులు ఎక్కువమంది వచ్చి వెళుతున్నట్టు తెలిసింది. పోలీసులు ఆ దుకాణానికి వెళ్లి తనిఖీ చేశారు. దుకాణంలో పేర్చి ఉన్న అగ్గిపెట్టెలలో ప్రభుత్వం నిషేధించిన మత్తుపదార్థాలు ఉన్నట్టు తెలిసింది. వాటిలో హాన్స్, పాన్పరాగ్ తదితర మత్తు పదార్థాలు ఉంచి రహస్యంగా విక్రయిస్తున్నట్టు తెలిసింది. దుకాణం యజమాని అబ్బాస్ (28)ని పోలీసులు అరెస్టు చేశారు. -
చెన్నై: గుట్కా స్కాంపై ఆరా తీస్తున్న సీబీఐ
-
గుట్కా మాఫియాపై సీబీఐ పంజా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం. మాజీ మంత్రి, ఐఆర్ఎస్ నివాసాల్లోనూ గుట్కా మాఫియాపై ఆధారాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే అనుమాని తుల నివాసాలపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నై గ్రీన్వేస్రోడ్డులోని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐదుగురు, ముగప్పేరీలోని డీజీపీ రాజేంద్రన్ ఇంట్లో పది మంది అధికారులు సోదాలు జరిపారు. నొళంబూరులో నివసిస్తున్న మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇంట్లో ఐదుగురు అధికారులు తనిఖీలు చేశారు. వీరుగాక విజయభాస్కర్ అనుచరులు, సహాయకులు, తిరువళ్లూరులో నివసిస్తున్న మాజీ మంత్రి రమణ, 2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి గుల్జార్ బేగం తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అన్ని చోట్ల నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్, రాజేంద్రన్ను వారివారి పదవుల నుంచి తొలగించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నిషేధాన్ని నీరుగార్చిన మంత్రి గుట్కా, పాన్ మసాలా తదితర మత్తుపదార్థాల అమ్మకాలపై 2013లో తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా హోల్సేల్ వ్యాపారి మాధవరావుకు చెందిన గిడ్డంగిపై ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ ఎత్తున సరుకును, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.ఆ డైరీలో కార్పొరేషన్లోని కిందిస్థాయి అధికారి మొదలుకుని ఐపీఎస్ అధికారులు, ఒక మంత్రి వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు, ఏయే తేదీల్లో ముట్టజెప్పిన వివరాలు ఉన్నాయి. గుట్కాపై నిషేధాన్ని మంత్రి, అధికారులే నీరుగార్చేశారని తెలుసుకుని ఐటీ అధికారులు విస్తుపోయారు. డైరీలో ఉన్న లెక్కల ప్రకారం మంత్రి, 23 మంది అధికారులకు సగటున రూ.60 లక్షల చొప్పున మొత్తం రూ.40 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తేలింది. శశికళకూ సంబంధాలు? జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే గుట్కా అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ రాసిన లేఖ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, డీజీపీ అశోక్కుమార్లకు చేరింది. అయితే వారు ఈ విషయాన్ని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆమె చనిపోయిన తరువాత గుట్కా కేసు దాదాపుగా అటకెక్కింది. ఆ తరువాత జయలలిత నివాసంలో సోదాలు జరిపినప్పుడు శశికళ గదిలో ఐటీ శాఖ రాసిన ఉత్తరం దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగడంలో శశికళ ప్రమేయం ఉందన్న అనుమానంతో, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధకశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత దురైమురుగన్ విజ్ఞప్తి మేరకు గత ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. చెన్నైలో రాజేంద్రన్ ఇల్లు -
గుట్కా స్కాం: మంత్రి, డీజీపీకి సీబీఐ భారీ షాక్
చెన్నై: తమిళనాడులో గుట్కా స్కాంకు సంబంధించి సీబీఐ భారీ సోదాలు నిర్వహించింది. గుట్కా కుంభకోణంలో విచారణలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని 40ప్రాంతాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు దాడులు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి విజయబాస్కర్, డీజీపి టికె రాజేంద్రన్తోపాటు మాజీ పోలీసు కమిషనర్ జార్జ్, ఇతర పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన దాడులు సంచలనంగా మారాయి. కోట్లాది రూపాయల గుట్కా కుంభకోణంలో రాష్ట్ర మంత్రి, రాష్ట్ర పోలీసు అధికారులతోపాటు ఇతర ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మాధవరావు అనే వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, రహస్య నోటు ఆధారంగా విచారణ చేపట్టాల్సిందిగా డీఎంకే ఎమ్మెల్యే జే అన్బజగన్ దాఖలు చేసారు. దీంతో మద్రాస్ హైకోర్టు ఏప్రిల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017జులైలో రూ.250 కోట్ల గుట్కా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డీఎంకే ఎమ్మెల్యే జే అన్బజగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రావడంతో ఐటీ శాఖ కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం పొయెస్గార్డెన్లోని వీకే శశికళ గదిలో గుట్కా కుంభకోణానికి సంబంధించిన రహస్య నోటు తమ తనిఖీల్లో దొరికిందని ఇటీవల ఐటీ శాఖ తెలిపింది. ఐటీ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ సూయిజ్ బాబు వర్గీస్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. 2017 నవంబర్లో పొయెస్ గార్డెన్లోని శశికళ నివాసం ఉన్న గదులను తనిఖీ చేసినప్పుడు ఈ నోటు దొరికిందన్నారు. 2016 ఆగస్టు 11న గుట్కా కుంభకోణంలో జప్తు చేసిన వస్తువులు, పత్రాలకు సంబంధించిన రహస్యనోట్ కూడా అప్పటి సీఎంకు పంపినట్లు అందులో ఉంని తెలిపారు. 2016 సెప్టెంబర్ రెండో తేదీన నాటి డీజీపీ సంతకం చేసి, అప్పటి సీఎం జయలలితకు పంపినట్లు ఉన్నదని పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 16 వరకు ఆరోగ్యశాఖ మంత్రికి రూ.56 లక్షల ముడుపులు చెల్లించారని, మంత్రి, పోలీస్ కమిషనర్లకు ముడుపులు చెల్లించినట్లు డైరీలో రాసుకున్న వివరాలు ఉన్నాయని పేర్కొనడం సంచలనం రేపింది. -
చైన్నైలో పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు
-
డీజీపీ, ఆరోగ్యశాఖ మంత్రి ఇళ్లలో సీబీఐ సోదాలు
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన గుట్కా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు బుధవారం దాదాపు 40 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దాడుల్లో 150 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్తోపాటు, డీజీపీ రాజేంద్రన్, మాజీ డీజీపీ జార్జ్ ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా పలువురు పోలీసు అధికారులు, వ్యాపార వేత్తలు నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. కాగా 2017లో తమిళనాడు ఆదాయపన్ను శాఖ అధికారులు నిషేధిత గుట్కా తయారీ కేంద్రాలపై వరుస దాడులు నిర్వహించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గుట్కా వ్యాపారుల నుంచి మంత్రి విజయభాస్కర్తో పాటు డీజీపీ ర్యాంకు అధికారులకు, కిందిస్థాయిలో పనిచేస్తున్న పలుశాఖలకు చెందిన అధికారులకు దాదాపు 40 కోట్ల వరకు ముడుపులు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు 2018 మే 30వ తేదీన తమిళనాడు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ఫుడ్ సెప్టీ అధికారులతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 2013 నుంచి తమిళనాడులో క్యాన్సర్ కారకాలైన గుట్కా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం కొనసాగుతోంది. -
గుట్కా.. ఉండరిక!
రాజంపేట రూరల్: ‘ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం’అనే ప్రకటనలను సినిమా థియేటర్లలో, టీవీల్లో నిత్యం చూస్తేనే ఉన్నా యువత వాటికి బానిసలవుతూనే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించినా అధిక మొత్తంలో బహిరంగంగానే వాటి విక్రయాలు సాగుతున్నాయని తల్లదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిషేధించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వ్యాపారులు అధిక లాభాలు గడిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం పొగాకు ఉత్పత్తుల, విక్రయాలపై నిషేధం విధించారు. అయినప్పటికీ జిల్లాలో వ్యాపారులు, విక్రయదారులు యథేచ్చగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తూ యువత ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో చిత్తూరు, అనంతపురం జిల్లాల మీదుగా మన జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా గుట్కా, ఖైనీలు వచ్చి పడుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటి, పట్టణం, మండల హెడ్ క్వార్టర్స్తో పాటు ప్రతి గ్రామంలో వీటి విక్రయాలు జోరుగాసాగుతున్నాయి. నిండు జీవితం బలి విచ్చలవిడిగా గుట్కా, చైనీఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. చిన్న వయసులోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్, గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులను, మత్తు మందులను వినియోగించే వారు 17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. తాము వద్దని వారించినా అలవాటు పడిన వారు పెడచెవిన పెట్టి యథేచ్చగా వాటిని వినియోగిస్తూ రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. రకరకాల పేరులతో, అధిక రేట్లతో... పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎంఆర్పీ ధర లేకుండా అధికరేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మిరాజ్, విమల్ వంటివాటికి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినప్పటికీ దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. నిషేధం ఏదీ? నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని నిబంధనలు ఉన్నా కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వాటిని యథేచ్చగా విక్రయిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు తప్ప దాడులు చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేసినా అవి కొంత మేరకే పరిమితమవుతున్నాయి. అదుపులోకి తీసుకున్నా వారికి పెద్దగా శిక్షలు లేకపోవడంతో తిరిగి విక్రయిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిషేధం విధించేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా స్థాయిలో పోలీసులు విఫలమవుతూ ఉన్నారని బాధితుల తల్లిదండ్రులు మివర్శిస్తున్నారు. లాభసాటి వ్యాపారాన్ని జిల్లాలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారులు, విక్రయదారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు వీటి విక్రయాలపై నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. అధికారుల కళ్లుగప్పి అధిక శాతం రైల్వేశాఖ ద్వారా రవాణా చేస్తున్నప్పటికి అక్కడ నిఘా కొరవడిందని జిల్లా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
సరిహద్దులు దాటొస్తున్న గుట్కా
హుస్నాబాద్ : అక్రమంగా తరలిస్తున్న అంబర్ ప్యాకెట్ బస్తాలను పట్టుకున్నట్టు ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈమేరకు బుధవారం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచారం మేరకు మంగళవారం రాత్రి పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేపట్టగా..ఇన్నోవా కారులో అంబర్ ప్యాకెట్ల సంచులను గుర్తించారు. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ దుర్గం కిరణ్ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. బీదర్ నుంచి హుస్నాబాద్ మీదుగా ఏన్టీపీసీకి ఈ గుట్కాలను తరలిస్తున్నట్టు గుర్తించారు. వాహనంలో ఉన్న 18 బస్తాల్లో ఒక్కో బస్తాలో 100 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్లో 25 అంబర్ ప్యాకెట్లు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. బీదర్లో రూ.2.60 లక్షలతో ఈ సరుకుని కొనుగొలు చేయగా, బయటి మార్కెట్ విలువ రూ.6.75 లక్షలు ఉంటుందని తెలిపారు. ఏన్టీపీసీకి మండలంలోని మల్కాపూర్కు చెందిన డ్రైవర్ దుర్గం కిరణ్తో పాటుగా వ్యాపారి ఉత్తూరు శ్రీకాంత్ చాలాకాలంగా అంబర్, గుట్కా ప్యాకెట్లను అక్రమ రవాణాతో పాటు జిల్లాలోనూ విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. ఇప్పటికే వీరిపై మూడు కేసులు నమో దు అయ్యాయని చెప్పారు. మరోవైపు గుట్కాలు, వ్యసనాలకు బానిసలు కావొద్దని ఏసీపీ మహేం దర్.. ప్రజలుకు సూచించారు. ఎవరైన ఇలాంటి వ్యసనాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. చాకచక్యంగా అంబర్ బస్తాలను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ సంపత్ను ఏసీపీ సన్మానించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్జీ, ఎస్సై సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.50 లక్షల విలువైన గుట్కా పట్టివేత
బాలాపూర్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధి ఉస్మాన్ నగర్ కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత గుట్కా తయారు చేస్తోన్న కేంద్రంపై బాలాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తయారీకి ఉపయోగించే మెషిన్తో పాటు సామగ్రి సీజ్ చేశారు. పోలీసుల రాక గమనించి నిందితుడు తౌఫీక్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. -
గుట్కా ఇవ్వలేదని ఘోరం..!
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. గుట్కా ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కిరోసిన్ పోసి అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన మధుర జిల్లాలోని సపోహ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుని సోదరుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్దేసీ (32) సరుకులు కొనుగోలు చేద్దామని స్థానికంగా ఉండే దుకాణం వద్దకు వెళ్లాడు. అతని వద్ద ఉన్న గుట్కా ఇవ్వుమని రాజు, రాహుక్ టాకూర్ దురుసుగా ప్రవర్తించారు. వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో తన తమ్ముడిపై కిరోసిన్ పోసి రాజు, టాకూర్ నిప్పటించారని తెలిపాడు. కాగా, ఈ ఉదంతంపై మరో వాదన వినిపిస్తోంది. గుట్కా విషయంలో వాగ్వాదం జరిగింది నిజమేననీ నిందితులు తెలిపారు. అయితే, పార్దేసీపై తామెలాంటి దుశ్చర్యకు పాల్పడలేదని వెల్లడించారు. గొడవ అనంతరం ఇంటికి వెళ్లిన పార్దేసీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని వచ్చాడనీ, తమ ముందే నిప్పంటిచుకున్నాడని తెలిపారు. బాధితుడి కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ పోలీసులు వెల్లడించారు. కాగా, పార్దేసీ జిల్లా ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. అతని ఒంటిపై 20 శాతం కాలిన గాయాలయ్యాయనీ, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
తునిలో గుట్క అక్రమ రవాణా గ్యాంగ్ అరెస్ట్
-
ఉస్మానియాలో గుట్కా, సిగరెట్లపై నిషేధం
అఫ్జల్గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్మాసాలలను నిషేధిస్తూ ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ నాగేందర్ బుధవారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. అటెండెంట్లు ఆస్పత్రిలో వచ్చి సిగరెట్ తాగడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే వీటిపై నిషేధం అమలు చేయాలని అన్ని శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటి మేనేజర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రోగులు వారి అటెండర్లకు చెందిన లగేజీలు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిషేధం అమలెక్కడ?
ఆరోగ్యానికి హానికరంగా పరిణమించిన గుట్కాలను ప్రభుత్వం నిషేధించినా జిల్లాలో అమలు కావడం లేదు. గడిచిన ఆరు నెలల కాలంలో 31కి పైగా కేసులు నమోదవడం, రూ.కోట్లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుబడడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం నిఘా ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా గుట్కా వ్యాపారం జోరందుకోవడానికి కారణమని తెలుస్తోంది. భువనగిరి : నిషేధిత గుట్కా వ్యాపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. నిషేధించిన కొంతకాలం పాటు గుట్టుగా సాగిన వ్యాపారం మళ్లీ రెక్కలు విప్పుకుంది. జిల్లాలో పోలీసులు ఇటీవల భారీగా గుట్కాలను పట్టుకు న్న విషయం తెలిసిందే. పట్టుబడిన గుట్కాలకు సంబంధించి సరఫరా చేస్తున్న వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాలు గుట్కా వ్యాపారానికి అడ్డాలుగా మారాయి. పట్టపగలే సరఫరా జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెద్ద మొత్తంలో గుట్కాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జిల్లాలో గుట్కాల వ్యాపారం జోరుగా జరుగుతుందని చెప్పడానికి ఈసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 31కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ కేంద్రంగా.. ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, జర్దా మాఫియా మళ్లీ పుంజుకుంటోంది. హైదరాబాద్లోని ఉప్పల్, రామంతాపూర్, పాతబస్తీ, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గుట్కాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం అధికారుల నిఘా కొరవడటంతో రోజూ లక్షల రూపాయల వ్యాపారం కొనసాగుతోంది. బస్సుల్లో సరఫరా.. భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి కేంద్రాల నుంచి ప్రతి రోజూ సుమారు 70 నుంచి 120 మంది అక్రమార్కులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి గుట్కాలను జిల్లాకు తీసుకువస్తున్నారు. అక్రమార్కులు తాము కొనుగోలు చేసిన గుట్కాలను ఎవరికీ అనుమానం రాకుండా బట్టల బ్యాగుల్లో బిగించుకుని ఆర్టీసీ బస్సులో ఎక్కుతున్నారు. ఇలా బస్సుల్లో వచ్చి బస్టాండ్కు కొంత దూరంలో ఉన్న స్టేజీల వద్దనే దిగుతున్నారు. అనంతరం వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారుల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. గుట్కాలను ప్రధానంగా టీస్టాల్స్, పాన్షాపులు, కిరాణం, దాబాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం.. జిల్లాలో 7,39,448జనాభా ఉంది. ఇందులో గుట్కాలు తినే అలవాటు సుమారు 5శాతం మందికి ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 36,972మంది గుట్కాలు అమ్ముడవుతుండగా సగటున ఒక్క వ్యక్తి రోజుకు రెండు గుట్కాల చొప్పున తినేస్తున్నాడు. రూ.5 ఉన్న గుట్కాను రూ.10కి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 73,944 గుట్కా ప్యాకెట్లను తీసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.దీని ప్రకారం రోజూ రూ.7,39,440 విలువ చే సే వ్యాపారం జరుగుతుంది. ఒక్క నెలలో రూ. 22,18,3200 వ్యాపారం జరగగా ఏటా 26.61కోట్ల బిజినెస్ నడుస్తుంది. జిల్లాలో పట్టుబడిన గుట్కాల వివరాలు కొన్ని.. ఈనెల 20వ తేదీన భువనగిరి పట్టణంలో రూ.1.72లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 18న భువనగిరిలోని అర్బన్కానీలో రూ.18వేలు విలువ చేసే గుట్కాలను విక్రయిస్తుండగా పట్టుకున్నారు. బీబీనగర్ మండలం నెమురగోములలో ఫిబ్రవరిలో రూ.2లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈనెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలో రూ.20విలువ చేసే గుట్కాలను పట్టుకున్నారు. వీటితోపాటు జిల్లాలో మొత్తం 31కేసులు నమోదు చేయగా 31మందిని అరెస్టు చేశారు. కేసులు నమోదు చేస్తాం జిల్లాలో నిషేధిత గుట్కాలు విక్రయించిన, కొనుగోలు చేసిన గుట్కాలను సరఫరా చేయడంలో మధ్యవర్తిత్వం వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో గుట్కాలు విక్రయించే వారి దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాం. అవసరమైతే ప్రత్యేక దాడులు నిర్వహిస్తాం. – భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి -
‘పొగాకు’ నిషేధంపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పొగాకుతో తయారు చేసే గుట్కా, పాన్ మసాలాలు తదితర ఉత్పత్తుల నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. గుట్కా, పాన్ మసాలాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాన్మసాలా ఉత్పత్తుల తయారీ, భద్రపర్చడం, పంపిణీ, రవాణాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ యూనిక్ టుబాకో ప్రొడక్ట్స్ సంస్థ అధిపతి సయ్యద్ ఇర్ఫానుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆహార భద్రత కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీచేశారని, అసలు పొగాకు ఆహారం కాదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. బండ్లగూడలోని తమ పరిశ్రమలోకి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే తనిఖీలకు వస్తున్నారన్నారు. రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, గుంటూరులోని టుబాకో చైర్మన్, ఆహార భద్రత శాఖ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. -
ప్రత్యేక నిఘాతోనే గుట్కాపై ఉక్కుపాదం
ఆదిలాబాద్: జిల్లాలో గుట్కా మహమ్మారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ డాల్డా కంపెనీ కాలనీలో గల దేశ్ముక్ గోదాములో బయటపడ్డ గుట్కాదందాను శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో కొందరు వ్యాపారులు గుట్కా అమ్మడమే ప్రధాన వ్యాపారం సాగిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 229 మందిపై కేసులు నమోదు చేసి రూ.కోటి 70 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనపర్చుకున్నామన్నారు. సమాచార వ్యవస్థతో నిల్వలను తెలుసుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిన్నింగ్ పరిశ్రమల్లోని గిడ్డంగి యజమాని దేవదర్ దేశ్ముఖ్ ఖాళీగా ఉన్న గోదాంను రూ.9 వేలకు అద్దెకు ఇచ్చి పరోక్షంగా గుట్కా వ్యాపారులకు సహాయపడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అన్నదమ్ములు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని దర్యాప్తులో తేలిందన్నారు. మొదటి నిందితుడు సైవుల్లాఖాన్(45), షమిఉల్లాఖాన్(44), ఫసిఉల్లాఖాన్(43), సాజిదుల్లాఖాన్(42), ఖలీముల్లాఖాన్(40)తోపాటు జిన్నింగ్ యజమాని జయదర్ దేశ్ముఖ్ (62)ను సైతం నిందితునిగా చేర్చినట్లు తెలిపారు. వీరిపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ రోజు నాల్గవ ముద్దాయి సాజిదుల్లాఖాన్ (42) జయదర్ దేశ్ముక్ (62)ను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రధాన ముద్దాయిలు పరారీలో ఉన్నారన్నారు. వారికోసం పట్టణ సీఐ, సీపీఎస్ పోలీసులతో పాటు రెండు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. నిరంతర దాడులు కొనసాగుతాయన్నారు. గుట్కా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో అన్ని చోట్ల సోదాలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ వ్యాపారం కోసం అద్దెకు ఇచ్చిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమానులు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
మూటల ముసుగులో వ్యాపారం..?
జలుమూరు: జిల్లాలోని టెక్కలి, తిలారు, శ్రీకాకుళం, పొందూరు తదితర రైల్వే స్టేషన్ల కేంద్రంగా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మూటల ముసుగులో గుట్కాలు, ఖైనీలు, బట్టలు, కంచు, ఇత్తడి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. గత నెలలో నరసన్నపేట మండలం జమ్ముకూడలిలో పోలీసులు సుమారు రూ.3 లక్షల విలువ చేసే గుట్కాలు పట్టుకున్నారు. అలాగే శ్రీకాకుళం(ఆముదాలవలస) స్టేషన్, టెక్కలి, రాజాం, టెక్కలి రైల్వే స్టేషన్, పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు రూ.5 లక్షల విలువల చేసే గుట్కాలు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణపై విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పడు తనిఖీలు నిర్వహిస్తున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. టెక్కలి రైల్వేస్టేషన్ గుణుపూర్, ఒడిశా ప్రాంతాల నుంచి రవాణాకు అనుకూలంగా ఉండడంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయలను సుకాన్ని చెల్లించకుండా వ్యాపారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎనెన్నో రాయితీలు పొందుతూ చెల్లించాల్సిన పన్నులు దిగమింగి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వాస్తవానికి వీరు విలువ ఆధారిత ఎక్స్జ్ సుంకం(వ్యాట్), కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్డీటీ), జీఎస్టీ తదితర పన్నులు, సుంకాలు చెల్లించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి వీటిలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. పలాస, టెక్కలి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు, అధికారుల తాకిడి ఎక్కువగా ఉండడంతో గుట్కాల అక్రమ వ్యాపారదారులు తిలారు స్టేషన్ అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో బుడితి, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి వ్యాపారులు సిండికేటుగా మారి దేశంలో వివిధ ప్రాంతాలు నుంచి ఈ అక్రమ దిగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. తిలారు స్టేష్న్ నుంచి ఆగే రైలు నుంచి చడీచప్పుడు కాకుండా సరుకులు ఆయా ప్రాంతాలకు తరలించడం అక్రమ లావాదేవీలపై అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఎక్కడికైనా రవాణా! ఈ ఆక్రమ వ్యాపారం వెనుక భారీ నెట్ వర్క్ నడుస్తోంది. ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కలకత్తా, ఒడిశాలో ఉన్న దళారులు నుంచి అక్రమంగా మన రాష్ట్రలోకి చేరుతుందని నరసన్నపేటకు చెందిన ఓ మాజీ వ్యాపారి తెలిపాడు. ఇలా తిలారుకు చేరిన కంచు, ఇత్తడి, గుట్కాలు, బట్టల మూటలు వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ ఉంచుతారు. స్టాక్ పాయింట్లకు చేరిన సరుకులను ఇక్కడి వ్యాపారులు వారికి అనుకూలంగా ఉన్న వివిధ వాహనాలు ద్వారా గమ్య స్థానాలకు చేర్చుకుంటారు. దీనికి మాత్రం ఆయా వ్యాపారులు సరుకులు తెచ్చేందుకు పెట్టిన పెట్టుబడులు ప్రకారం తీసుక వెళ్తారు. ఇక తిలారు స్టేషన్లో రాత్రి సమయంలో 7 నుంచి 10 వరకూ ఆటోల వరకు వీటి తరలింపులకు సిద్ధంగా ఉంచుతారు. భారీ నెట్వర్క్ రైలు నుంచి సరుకులు ఆటోలో చేర్చేందుకు బుడితి, సారవకోట వెళ్లాలంటే జోనంకి, కృష్ణాపురం మీదుగా అడ్డదారిలో చేర వేస్తారు. అలాగే తిలారు స్టేషన్ వెనుక భాగం వైపుగా ఎఫ్సీ గొడౌన్ నుంచి రావిపాడు, ఏనేటి కొత్తూరు మీదుగా నరసన్నపేట తరలిస్తారు. ఇక టెక్కలి, కోటబొమ్మాళి ప్రాంతాలకు రావిపాడు, తుంబయ్యపేట, రామినాయడుపేట, నిమ్మాడ మీదుగా రవాణా చేస్తారు. దీనికి ముందుగా ద్విచక్ర వాహనాలపై వెళ్లి జన సంచారం, తనిఖీలు లేవని నిర్ధారించిన తరువాత మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకున్న తరువాతే ఈ తతంగం పూర్తి చేస్తారు. ఈ విషయమై రైల్వే సిబ్బందిని ప్రశ్నించగా.. రైలు బండిని నుంచి వచ్చిన సరుకులకు ఉన్న రశీదులు మాత్రమే చూస్తామని, తరువాత వారికి పార్శిల్ అప్పచెబుతామని, ఈ అక్రమ రవాణా విషయం తమ పరిధిలోకి రాదని తేల్చి చెబుతున్నారు. దీనిపై నరసన్నపేట డిప్యూటీ సీటీఓ అనసూయ వివరణ కోరగా.. గుట్కాలు విక్రయాలు తమ పరిధిలోకి రావని తెలిపారు. అవి దొరికినా ఫుడ్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని స్పష్టంచేశారు. బట్టలు, ఇతర వ్యాపార సామగ్రిపై తినిఖీలు నిర్వహించి పట్టుబడితే అపరాధ రుసుం విధిస్తామని పేర్కొన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తనిఖీలు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. -
బ్రాందీ అటు.. గుట్కా ఇటు
పెద్దపల్లి: చంద్రాపూర్లో బ్రాందీ దొరకడం కష్టం.. అక్కడి ప్రభుత్వం మద్యంపై మూడు జిల్లాల్లో నిషేధం విధించింది. తెలంగాణ ప్రభుత్వం బ్రాందీ వ్యాపారానికి అనుమతించింది. కాని గుట్కాపై మాత్రం సీరియస్గా వ్యవహరిస్తోంది. మహారాష్ట్రలో ఎక్కడైనా గుట్కా పాకెట్లు సంచుల కొద్ది అమ్ముకోవచ్చు. ఇక్కడ కఠినం.. అక్కడ సులభతరం.. జిల్లాకు చెందిన కొందరికి ఇదో వ్యాపార సూత్రం. అనువైన చోట వ్యాపారాన్ని చేసుకునేందుకు వీలుగా జిల్లాలోని పెద్దపల్లి, కొత్తపల్లి, రామగుండం రైల్వేస్టేషన్ల నుంచి బ్రాందీని రాత్రివేళ వెళ్లే ప్యాసింజర్ రైలులో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఉదయం 6గంటలకు జిల్లాలో ప్రవేశించే ప్యాసింజర్ రైలులో గుట్కా సంచులను చాలా సులభంగా తీసుకొస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ యంత్రాంగం పలు చోట్ల దాడులు చేపట్టి, సుమారు రూ. 50లక్షలకు పైగా విలువైన గుట్కా పాకెట్లను పట్టుకున్నా ఇంకా దందా కొనసాగుతుందంటే మహారాష్ట్రలో సులభంగా దొరుకుతున్న సంచులను ఇక్కడికి తరలించడమే ప్రధాన కారణం. మహిళలే కీలకం.. మహిళలను సోదా చేయడం ఇబ్బందికరమైన విషయం. అందుకే గుట్కా తరలింపు, బ్రాందీ తరలింపు వ్యవహారాల్లో మహిళలే తమ ఉపాధి మార్గంగా ఈ దందాను ఎంచుకున్నారు. రెండు సూట్కేసుల్లో బ్రాందీ బాటిళ్లను తీసుకెళ్లి.. అదే సమయంలో అక్కడ సిద్ధంగా ఉన్న వారి నుంచి గుట్కా పాకెట్లను బ్రీఫ్కేసుల్లో ఇక్కడికి తరలిస్తూ స్థానిక వ్యాపారులకు అందిస్తున్నారు. దీంతో మహిళలు చేస్తున్న ఈ దందాపై పోలీసులు పెద్దగా దృష్టి సారించక పోవడం వల్ల వ్యాపారం సజావుగా కొనసాగిస్తున్నారు. కేరాఫ్ ఖానాపూర్ పెద్దపల్లి జిల్లాకు వస్తున్న గుట్కా బ్యాగుల్లో సగానికి పైగా ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్కు చెందిన ఓ వ్యాపారి ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. పెద్దపల్లికి చెందిన పలువురు వ్యాపారులు ఐదారుసార్లు అరెస్టయి జైలుకు వెళ్లినప్పటికి ఇదే దందాను కొనసాగిస్తున్నారంటే వారికి లభిస్తున్న లాభం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. జైలు నుంచి విడుదలైన ఓ వ్యాపారి మాట్లాడుతూ అందరి ఖర్చులు పోగా తమకు ఇంకా లాభాసాటిగానే ఈ వ్యాపారం ఉందని, అందుకే అరెస్టులకు కూడా భయపడకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాదేదీ దాపరికానికి చోటు గుట్కా బ్యాగులను శనివారం పెద్దపల్లిలో పట్టుకున్న పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. సుమారు రూ. 3లక్షలకు పైగా గుట్కా బ్యాగులు ఏకంగా సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టిన వ్యాపారి ఎత్తుగడను గమనించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో సదరు వ్యాపారి ఐదారు సార్లు జైలుకెళ్లి తిరిగి వచ్చారు. తిరిగి అతనే ఈ దందా నిర్వహించడం పోలీసులు సైతం జీర్ణించుకోలేక పోయారు. వ్యాపారి బొడ్ల రమేశ్పై గతంలో రౌడీషీట్ సైతం ఓపెన్ చేశారు. అయినా దందా మారకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాత నేరస్తులపై నిఘా.. మహారాష్ట్ర, బీదర్ ప్రాంతాల నుంచి గుట్కా దిగుమతి అవుతున్నట్లు సమాచారం ఉంది. పాత నేరస్థులపై నిఘా పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో పెద్ద ఎత్తున గుట్కా బ్యాగులను పట్టుకున్నాం. కొత్తగా దందాలో ప్రవేశించే వారిపైనా దృష్టి పెడుతున్నాం. – విజయసారథి,టాస్క్ఫోర్స్ ఏసీపీ -
పదిమంది గుట్కా వ్యాపారుల అరెస్టు
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్) : విజయవాడ ప్రాంతాన్ని గుట్కా రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఇన్చార్జి అడిషనల్ డీసీపీ షేక్ నవాబ్ జాన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధించిన గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ప్యాకెట్లను నగరంలో విక్రయిస్తున్న 10 మంది వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యూఆర్ఆర్పేటలోని సింగ్నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నవాబ్ ఖాన్ వివరాలను వెల్లడించారు. గతంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేసిన దాడులతోపాటుగా చేపట్టిన నిఘా చర్యల్లో భాగంగా పది మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కొందరు వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుట్కా రహిత నగరాన్ని నిర్మించడమే తమ ధ్యేయమని చెప్పారు. నిషేధిత గుట్కా, ఖైనీ వంటి వాటిని విక్రయించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి, సింగ్నగర్ స్టేషన్ సీఐ ఎంవీవీ జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న గుట్కా మాఫియా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో గుట్కా మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఓ ముఠాగా ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎక్కువ ధరకు విక్రయించి రూ.లక్షలు సంపాదిస్తోంది. పోలీసులు, సంబంధిత అధికారులకు రోజు వారి మామూళ్లతో మేనేజ్ చేస్తోంది. రోజుకు జిల్లా వ్యాప్తంగా రూ.అరకోటికిపైగా వ్యాపారం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ప్రజలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను (పాన్పరాగ్, హీరా, స్టార్, చైనీ ఖైనీ, రాజా, గోవాతోపాటు పలు రకాల గుట్కా బ్రాండ్లపై) ప్రభుత్వం నిషేధం విధించింది. అవి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రంగంలోకి దిగారు. గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సరుకు తెప్పిస్తున్నారు. చిల్లర దుకాణం, ఇతర వ్యాపారాల ముసుగులో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తమ ఏజెంట్లను నియమించుకుని మరీ సరఫరా చేస్తున్నారు. కొంతమంది గుట్కాకు బానిక కావడం, అవి మార్కెట్లో లభించకపోవడంతో ఎంత ధరైనా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. కొన్న ధర కంటే అధికంగా విక్రయించి రూ.లక్షలు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే ఏదో ఒక రాజకీయ నాయకుడితో సిఫార్సు చేయించుకుని రెండు రోజులకే తిరిగి వ్యాపారం మొదలు పెడుతున్నారు. హానికర పొగాకు ఉత్పత్తులు తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. బందరులో ఆర్పేట కేంద్రంగాఅక్రమ దందా ఆర్పేట కేంద్రంగా గుట్కా దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఏలూరు నుంచి గుట్ట చప్పుడు కాకుండా ఆర్పేటకు తరలిస్తున్నారు. మంత్రి అనుచరుడని చెప్పుకుంటూ రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. పోలీసులు అమ్యామ్యాలు తీసుకుని ఈ విషయం తెలిసినా మిన్నకుండి పోతున్నారు. ఎంత దారుణమంటే ఆర్పేట పోలీస్ స్టేషన్కు సమీపంలోనే గోడౌన్ ఏర్పాటు చేసుకుని పట్టణంలో పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నా అరికట్టే నాథుడే కరువయ్యాడు. ఇటీవల ఓ ప్రాంతంలో సరుకు పట్టుబడితే మంత్రి విడిపించారే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తనకు ఓ మంత్రి అండ ఉందని చెప్పుకుంటూ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. పోలీసులు సైతం ఎందుకొచ్చిన తంటాల్లే అని మామూళ్లు పుచ్చుకుని మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. ఇతను బందరుతో చుట్టపక్కల ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.లక్షల్లో అక్రమార్కన గడిస్తున్నాడు. గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా నడుస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో నేర వార్తలు..
దొంగా..దొంగా ఇది మణిరత్నం సినిమా కాదు. నేడు రాజధానిలో ప్రతి వీధిలోనూ ఈ పిలుపు వినని వారు లేరు. ఒకవైపు దోపిడీలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. మరోవైపు హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్నో వృత్తిగా, ప్రవృత్తిగా భావిస్తూ డబ్బును దోచేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పొగ తాగిన వాడు దున్నపోతై పుట్టున్.. భాద్యతలు మరిచి, వ్యసనాలకు బానిసై పూటుగా మద్యం సేవిస్తున్నారు. ఆపై గంజాయి సేవిస్తూ, గుట్కాను తీసుకుంటూ ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఇళ్లు గుల్ల చేస్తున్నారు. చివరకు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. చిన్న వయసులోనే అసువులు భాస్తున్నారు. తెలంగాణలో.. సాక్షి, తిరుమలగిరి : దోపిడీ దొంగలు మరో మారు రాజధానిపై తమ పంజా విసిరారు. తిరుమలగిరిలోని దారుంము మిడ్ మైట్లోని అపార్ట్మెంట్లో సీనియర్ సిటిజన్ సులోచన ఇంట్లో దొంగలు భీబత్సం సృష్టించారు. నగలు, డబ్బును దోచుకోవడమే కాకుండా అడ్డువచ్చిన ఆమెను పాశవికంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీపుటేజీలను పరిశీలించి, దొంగల కోసం తనిఖీలు చేపట్టారు. సాక్షి, మంచిర్యాల : దండేపల్లి మండల కేంద్రానికి చెందిన బూసిరాజుల నగేష్ (27) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్నిపంచనామాకు తరలించారు. సాక్షి, సూర్యాపేట : చివ్వేంల మండలం దూరాజ్పల్లి గ్రామంలో ఇంట్లో అక్రమంగా గుట్కా పాకెట్లను నిల్వ ఉంచారు. వీటి విలువ దాదాపు 12 లక్షల రుపాయాలు ఉంటుంది. వీటిని ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా ఆటోను పట్టుకున్నారు. అందులోని గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాక్షి, పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి యాదవనగర్ వద్ద వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ వ్యక్తి వివరాల కోసం అన్వేషించారు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనేది విచారణలో నిగ్గు తేలుస్తామని తెలిపారు. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో.. సాక్షి, వైఎస్సార్ : సుండుపల్లి మండలం పెద్దబలిజపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో మద్యం సేవించి ఇద్దరు యువకులు మృతి చెందారు.వారి కుటుంబ సభ్యులు భోరున విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. కల్తీ మద్యం త్రాగడం వల్లే చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటి ఆసుపత్రికి తరలించారు. సాక్షి, వైఎస్సార్ : కమలాపురం మండలం పెద్దచెప్పలిలో గుట్కా అమ్మకాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు ఒక లక్షా యాభై వేలరూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
గుట్కా స్కామ్లో సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
-
గుట్టుగా గుట్కా..!
గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జిల్లాకు గుట్కాలు చేరుతున్నాయి. అడ్డుకోవాల్సిన పోలీసు శాఖ.. ఆ వ్యాపారులు ఇచ్చిన మామూళ్ల మత్తుతో గుర్రు పెట్టి నిద్దరోతోంది. కొందరు రాజకీయ (వి)నాయకులు కూడా ఈ వ్యాపారం గుంభనంగా సాగేందుకు యథాశక్తి సహకరిస్తున్నారు... అవసరమైనప్పుడు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ సామెత మాదిరిగా, ఈ గుట్కా పాపాన్ని అటు పోలీసు శాఖ, ఇటు రాజకీయ (వి)నాయకులు పంచుకుంటున్నారు. ఖమ్మంక్రైం:ఉమ్మడి జిల్లాలో గుట్కా మాఫియా భారీగా విస్తరించింది. పోలీసులు దాడులు చేస్తున్నా ఈ వ్యాపారం మాత్రం నిరాటంకంగా సాగుతోంది. పోలీసులు అప్పుడప్పుడు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు. ఈ గుట్కాకు యువత బానిసగా మారుతోంది. వారి ఆరోగ్యం, భవిత దెబ్బతింటున్నాయి. ఉమ్మడి జిల్లాలో గడిచిన నాలుగు నెలల్లో 800కిì పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖ చూసీచూడనట్టుగా వదిలేసినవి ఇంకెన్నో..! ఖమ్మంతోపాటు కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో కాలంగా గుట్కా మాఫియా సాగుతోంది. వ్యాపారులు గతంలో సరుకును లారీలలో తెచ్చేవారు. ఇప్పుడు అందరి కళ్లు గప్పి ట్రావెల్స్ నుంచి ఒకేసారి పది కార్లను బాడుగకు తీసుకుని కర్ణాటకలోని బీదర్కు వెళ్లి అక్కడి నుంచి గుట్కా ప్యాకెట్లను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకు తీసుకొస్తున్నారు. రెండు కార్లలో ఎటువంటి గుట్కా ప్యాకెట్లను పెట్టరు. మిగతా వాటిలో పెడతారు. అర్థరాత్రి, తెల్లవారుజామున ‘అడ్డా’లలో ఏజెంట్లకు/చిల్లర దుకాణాదారులకు చేరవేస్తున్నారు. వారు ఆటోలు, ట్రాలీలో సరుకును తీసుకెళుతున్నారు. ఇప్పుడు గుట్కా వ్యాపారం సాగిస్తున్నవారు గతంలో ఖమ్మంలో పలుమార్లు పోలీసులకు పట్టుబడిన వారే కావడం గమనార్హం. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాకు వెళ్లే ఏసీ బస్సుల్లో కూడా గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్ నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లు ఖమ్మం, కొత్తగూడెం మీదుగా హైదరాబాద్కు చేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా ఈ గుట్కాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వస్తున్నాయి. పక్కనున్న మహబూబాబాద్ నుంచి కొందరు ఇక్కడకు వచ్చి గుట్కా వ్యాపారులుగా అవతారమెత్తారు. లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. గుట్కాలను నిషేధించిన తర్వాత గుట్కా మాఫియా పెరిగింది. ప్రస్తుతం ఎక్కడో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లోని దుకాణాల్లో కూడా గుట్కాలను రహస్యంగా అమ్ముతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న గుట్కా ప్యాకెట్లను వ్యాపారులు ఒకట్రెండు రూపాయలకు కొంటున్నారు. గుట్కా తినే వారి వద్దకు వచ్చేసరికి ఈ రేటు ప్యాకెట్ను, డిమాండునుబట్టి ఒక్కోట ?ఐదు నుంచి పది రూపాయల వరకు ఉంటోంది. పోలీస్ స్టేషన్లకు నెలనెలా మామూళ్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని పోలీస్ స్టేషన్లకు నెలవారీగా 10 నుంచి 30వేల రూపాయల వరకు మామూళ్లు ముడుతున్నట్టు తెలిసింది. ఈ గుట్కా దందా వెనుక కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని సమాచారం. -
గుట్కాలు అమ్మితే చర్యలు తప్పవు
వరంగల్ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్మితే జైలు శిక్ష తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథరవీందర్ హెచ్చరించారు. ఆదివారం టాస్క్ఫోర్స్ అధికారులు.. గుట్కా వ్యాపారులను అరెస్ట్ చేయగా, నిందితుల వివరాలను సీపీ విశ్వనాథరవీందర్ వెల్లడించారు. గుట్కా లు విక్రయిస్తున్న వరంగల్ పోచమ్మమైదాన్కు చెందిన తిరుమల రమేష్, హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన శ్యాకురావ్ రఘు, మునుగు వేణు, ప్రసాద్, వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావికి చెందిన దేవులపల్లి రవి, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన అందె నాగరాజు, కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన కందగట్ల ప్రసాద్ అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల్లో ఒకడైన కందగట్ల ప్రసాద్.. కరీమాబాద్లో ద్విచక్రవాహనంపై గుట్కా బ్యాగులను తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిని విచారించగా గిర్నిబావికి చెందిన రవి నుంచి గుట్కాలు కోనుగోలు చేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు. రవి స్నేహితుడు నాగరాజును విచారించగా నిందితుడు రమేష్ పేరును తెలిపాడని, రమేష్ గీసుకొండ మండలం కొమ్మలలో గుట్కాలను డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరిని విచారించగా 12 బ్యాగుల గుట్కాలను గుర్తించినట్లు సీపీ వివరించారు. వాహనాలు స్వాధీనం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా, పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5.97 లక్షల విలువైన గుట్కాలు, ఒక కారు, నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ.11,400 నగదు, మొత్తం రూ.11.97 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గుట్కా ప్యాకెట్లు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకటరమణారెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేష్కుమార్, మహేందర్రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనాథ్, మంగీలాల్ను ఆయన అభినందించారు. -
క్యాన్సర్ కబళిస్తున్నా.. భయపడరే..!∙
పార్వతీపురం: ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నా.. అధికారులు వరుస దాడులు చేస్తున్నా.. గుట్కా వ్యాపారం ఆగడం లేదు. పైపెచ్చు విచ్చలవిడిగా గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో సైతం నిషేధిక ఖైనీ, గుట్కాలు లభిస్తున్నాయంటే వ్యాపారం ఏ రేంజ్లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2013 జనవరి పదో తేదీన ఖైనీ, గుట్కాలను ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ నిషేధమే అక్రమార్కులకు వరంగా మారింది. తక్కువ సరుకుకు ఎక్కువ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో చట్ట వ్యతిరేకమని తెలిసినా లాభాలకు అలవాటు పడిన వ్యాపారులు ఖైనా, గుట్కా వ్యాపారాలను మానుకోలేకపోతున్నారు. అడపా దడపా పోలీసులకు చిక్కినా కొద్ది రోజుల్లో మళ్లీ పాత బాణినే పాడుతున్నారు. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత మొదట్లో పార్వతీపురం పట్టణానికి చెందిన ముగ్గురు, నలుగురు గుట్టుగా ఈ వ్యా పారం చేస్తున్నారు. అయితే పోలీసుల దాడుల నేపథ్యంల వారు వ్యాపారం మానేసినా.. ఇతరులు ఈ వ్యాపారంపై దృష్టి సారించడంతో చాపకింద నీరులా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. పార్వతీపురం పట్టణంతో పాటు మక్కువ, సాలూరు, బొబ్బిలి, చినమేరంగి, వీరఘట్టం, తదితర ప్రాంతాలకు సరుకును సరఫరా చేస్తున్నారు. మదుపు తక్కువ...మిగులు ఎక్కువ పార్వతీపురం పట్టణానికి పక్కనే ఒడిశా రాష్ట్రం ఉండడం.. అక్కడకు వెళ్లేందుకు రైలు, బస్సు సదుపాయాలు పుష్కలంగా ఉండడం వ్యాపారులకు బాగా కలసివస్తోంది. ఒడిశాలో సరుకు కొనుగోలు చేసి సాయంత్రం సమయంలో రైల్లో తిరిగి పార్వతీపురం చేరుకుంటున్నారు. తెచ్చిన సరుకును రహస్యంగా ఒక చోట ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా లైన్ వ్యాపారుల(సైకిల్పై అమ్మేవారు)తో మార్కెట్లోని పాన్షాపులు, కిరాణా షాపులకు చేరవేస్తున్నారు. గతంలో రూపాయికి దొరికే 5000, సఫారీ, డీలక్స్ గుట్కాలు నేడు రూ. 4 నుంచి ఐదు రూపాయలు పలుకుతున్నాయి. నాలుగు రూపాయలుండే మానిక్చంద్ గుట్కా ప్రస్తుతం 12 రూపాయలు.. రెండు రూపాయలకు దొరికే ఖైనీ రూ. 12కు విక్రయిస్తున్నారంటే వ్యాపారులకు లాభాలు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. -
గుట్కా గుట్టురట్టు
నల్లగొండ క్రైం :నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.54,67,800 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు సబంధించిన వివరాలను ఎస్పీ ఏవీ.రంగనాథ్ మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఓ ముఠా ఢిల్లీ, గుజరాత్, సూరత్, హైదరాబాద్ కేంద్రాలుగా చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నిషేధిక గుట్కాలు సరఫరా చేస్తోంది. ఈ ముఠాలో 8 మంది సభ్యులు ఉండగా.. ఆరుగురిని అరెస్టు చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముఠా సభ్యులు వీరే.. రాజస్థాన్కు చెందిన సంజయ్బాటియా రంగారెడ్డి జిల్లాలోని రాటోరికూవనగర్లో నివాసం ఉంటున్నాడు. ఢిల్లీకి చెందిన రంజన్గుప్త, సూరత్కు చెందిన అశోక్, హైదరాబాద్ రామాంతాపూర్కు చెందిన విసంశెట్టి సాంభశివ, హైదరాబాద్కు చెందిన దొంతం రాజశేఖర్రెడ్డి, గోల్కొండకు చెందిన వాసీం పాట్ని, రాజేంద్రనగర్కు చెందిన ఎండీ జుబ్బార్మహ్మద్, మిర్యాలగూడ సీతారాంపురానికి చెందిన కందుకూరి శ్రీనివాస్ ముఠాగా ఏర్పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కా ప్యాకెట్లు తెచ్చి హైదారాబాద్లోని కాటేదాస్లోని మావైష్ణవి గోదాము, మదీనాలోని బాటో గోదాములో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాం తాలకు వాటిని సరఫరా చేసేవారు. ఈ ముఠా సభ్యులకు వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్లు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. పట్టుబడింది ఇలా..! జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద మిర్యాలగూడెం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన కందుకూరి శ్రీనివాస్ తన కిరాణ షాపులోకి సామాను తెచ్చే సంచులను తనిఖీ చేయగా çగుట్కా ప్యాకెట్లతో పట్టుబడ్డాడు. శ్రీనివాస్ను విచారించగా హైదరాబాద్లోని కాటేదాన్లో విసంశెట్టి సాంభశివ, దొంతం రాజశేఖర్రెడ్డి నడిపిస్తున్న మా వైష్ణవి గోదాము నుంచి తెచ్చినట్లు వెల్లడించాడు. గోదాము వారిని విచారించగా.. బాటో గోదాము వివరాలు కూడా వెల్లడయ్యాయి. దీంతో ఈ దందాతో సంబంధం ఉన్నవారిని గోదాముల వద్దనే అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారంతో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన రంజన్ గుప్త, సూరత్కు చెందిన అశోక్ పరారీలో ఉన్నారు. జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలపైన çఉక్కుపాదం పెడతామని ఎస్పీ వెల్లడించారు. అక్రమవ్యాపారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కేసును పరిశోధించిన మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రమేష్బాబు, ఎస్ఐలు సైదాబాబు, విజయ్కుమార్, హెడ్కానిస్టేబుల్ రమణారెడ్డి, పీసీలు రబ్బాని, భాస్కర్, ముత్తిలింగం, లింగరాజును ఎస్పీ అభినందించారు. -
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల సీజ్
కొల్లూరు : గుట్టుచప్పుడు కాకుండా గుట్కా అక్రమ తరలింపు వ్యవహారం బట్టబయలైంది. గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో కొల్లూరు ఎస్ఐ బి. అశోక్కుమార్ కొల్లూరు మీదుగా వెళుతున్న కారును పోలీసు స్టేషన్ వద్ద ఆపి తనిఖీ చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతం నుంచి గుంటూరు వెళుతున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తరలిస్తున్న రేపల్లెకు చెందిన తుమ్మలపెంట ప్రదీప్, కొలుసు గోపీకృష్ణను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు. గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తెనాలి డీఎస్సీ స్నేహిత హుటాహుటిన కొల్లూరు స్టేషన్కు చేరుకుని గుట్కా ప్యాకెట్లను పరిశీలించారు. నిందితుల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒరిస్సా నుంచి వచ్చినట్లు అనుమానాలు గుట్కా ప్యాకెట్లు ఒరిస్సా నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ నుంచి గుంటూరుకు రొయ్యలు సరఫరా చేసే కంటైనర్లో రవాణా అయినట్లు భావిస్తున్నారు. నిందితులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. పెద్ద తలకాయల పేర్లు బయట పడకుండా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న అక్రమ వ్యాపారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించాలనే పట్టుదలతో ఉన్నారు. -
సిగరెట్ ప్యాకెట్లపై భయానక చిత్రాలు
న్యూఢిల్లీ : సిగరెట్లు, గుట్కా, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రజల్లో ఎలాగైనా మాన్పించాలనే ఉద్దేశ్యంతో, ఆ ఉత్పత్తులపై ముద్రించే చిత్రాలను కేంద్రం మరింత భయానకంగా రూపొందించింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ నిబంధనలను మారుస్తూ, భయానకమైన ఆరోగ్య హెచ్చరికల చిత్రాలను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రెండు సెట్ల ఇమేజ్లను విడుదల చేసింది. తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్పై ముద్రించాలని కూడా ఆదేశించింది. ఈ హెల్ప్ లైన్నెంబర్ పొగాకు వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తోంది. పొగాకు ఉత్పత్తులను మానడానికి వారికి కౌన్సిలింగ్ సర్వీసులను కూడా అందించనుంది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. బీడీ స్పోకర్లు 53.8 శాతం, స్మోక్ చేయని పొగాకు వినియోగదారులు 46.2 శాతం మంది ఉన్నట్టు సర్వే తెలిపింది. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్(www.mohfw.gov.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను అన్ని స్థానిక భాషల్లో త్వరలోనే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 2018 నుంచి ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను ముద్రించాల్సి ఉంది. -
గుట్కాప్యాకెట్ల స్వాధీనం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ డివిజన్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని ఇస్లాంపుర వద్ద టూటౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ పోలీసులకు తారసపడ్డారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.1.60లక్షలు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మాడుగులపల్లి స్టేషన్ పరిధిలో తనిఖీలు చేయగా గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వీటివిలువ రూ.3లక్షలు ఉంటుందన్నారు. ఈ ఘటనలో మిర్యాలగూడకు చెందిన ఎండి.ఫరూక్, గంధం వెంకటేశ్వర్లు, గంగవరం శేఖర్, గుండా కృష్ణ, మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పుచ్చకాయలగూడెంనకు చెందిన రాపాక శ్రీను, బుర్ల లింగయ్యలను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ టూటౌన్, రూరల్ సిఐ లు సాయి ఈశ్వర్గౌడ్, రమేష్బాబు, ఎస్ఐలు సురేష్గౌడ్, శేఖర్ పాల్గొన్నారు. -
గుట్కా.. ఖైనీ వ్యాపారుల అరెస్టు
కందుకూరు:ప్రభుత్వం నిషేధించిన, గుట్కా, ఖైనీ ప్యాకెట్లను విక్రయించడంతో పాటు, అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న 14 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో విలేకర్లకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న అక్రమ గుట్కా, ఖైనీ వ్యాపారంపై ఎస్పీ ఏసుబాబు ఆదేశాల మేరకు గత కొంతకాలంగా నిఘా ఉంచారు. దీనిలో భాగంగా రూరల్ ఎస్సై సి.హెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. పాత నేరస్తులైన షేక్ చిన్నాన్యామతుల్లా, వేముల శ్రీనివాసరావు, నవ్యా శ్రీను కదలికలపై నిఘా ఉంచారు. అలాగే కందుకూరు, కావలి, నెల్లూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పర్యటించి పలువురు వ్యాపారులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శుక్రవారం కందుకూరు సమీపంలోని సి.టి.ఆర్.ఐ సమీపంలో గూట్కా, ఖైనీ ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో అక్కడ రెండు పోలీసు బృందాలను నిఘా ఉంచారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన గుట్కా వ్యాపారులు పోలీసులు మీదుగా తమ కార్లు పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తప్పించుకున్న పోలీస్ సిబ్బంది, మరో బృందం సాయంతో కారులో ఉడాయిస్తున్న వ్యాపారులను వెంబడించి పట్టుకున్నారు. 14 మంది నిందితులతో పాటు, రూ. 9.44 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, రూ. 6760 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
రాయదుర్గం: కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్కు భారీగా తరలి స్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు డీసీపీ విశ్వప్రసాద్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండటంతో కొంతమంది బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి పాన్డబ్బాలు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సమాచారమందుకున్న ఎస్వోటీ, చందానగర్, ఆర్సీపురం పోలీసులు దాడులు చేశారు. 11 వాహనాల్లో తరలిస్తున్న గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 21 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 202 బ్యాగుల గుట్కా, పాన్ మసాలాను సీజ్ చేశామన్నారు. బీదర్కు చెందిన నాధ్ఖాన్, మాలిక్ దినేశ్, జావీద్, ఫారుఖ్, సాల్మన్, భరత్, పాష , షెమ్మి, బాబిర్ పటేల్, అసాన్పటేల్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుట్కా స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర వహిం చిన ఎస్వోటీ అడిషనల్ డీసీపీ దయానంద్రెడ్డి, చందానగర్, ఆర్సీపురం సీఐలు తిరుపతిరావు, రాంచందర్రావు, ఎస్ఓటీ సీఐలు పురుషోత్తం, ప్రవీణ్రెడ్డి, కానిస్టేబుల్, సిబ్బందిని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. -
యాభై లక్షల విలువైన గుట్కా పట్టివేత
సాక్షి, హైదరాబాద్: గుట్కాను నిషేధించినా అక్రమార్కుల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఎక్కడో ఓ చోట గుట్కా విక్రేతలు పట్టుబడుతూనే ఉన్నారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. లారీలో గుట్కాప్యాకెట్లు రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటున్నారని కారులో రవాణా చేస్తున్నారు. శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గుట్కా ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ రూ. 50 లక్షలుంటుందని అంచనా. కర్ణాటక నుంచి 12 వాహనాల్లో గుట్కాను రవాణా చేస్తుండగా పోలీసులు వాహనాల్ని వెంబడించి సీజ్ చేసి, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీసీ బస్సులో గుట్కా రవాణా
జమ్మలమడుగు రూరల్: బెంగళూరు నుంచి జమ్మలమడుగుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తులు గుట్కా రవాణా చేస్తున్న విషయం వెలుగు చూసింది. అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బెంగళూరు నుంచి కదిరి, పులివెందుల, వేంపల్లె, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మీదుగా తిరుగుతుంది. అయితే బుధవారం రాత్రి ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులు బెంగళూరులో మూడు బస్తాల్లో గుట్కా, చైనీ ఖైనీ, తదితర మత్తు పదర్థాలను బస్సులో వేసుకొని బయలుదేరారు. మార్గమాధ్యంలో పులి వెందులకు రాగానే ఆర్టీసీ బస్సు తనిఖీ సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేశారు. సంబంధిత వ్యక్తులు బస్సులో నుంచి దిగి వెళ్లిపోయారు. బస్సు తెల్లవారుజామున 6 గంటలకు జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చేరుకొంది. దీంతో ప్రయాణికులందరూ తమ లగేజిని తీసుకోని వెళ్లిపోగా బస్సులో మూడు బస్తాలు మిగిలిపోయాయి. ఆర్టీసీ డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం ఇచ్చి లగేజి రూంలో బస్తాలను దించివేశారు. అనుమానం వచ్చిన అధికారులు బస్తాలను తెరిచిచూడగా అందులో మత్తుకు సంబంధించిన గుట్కా, చైనీ తదితర ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే అర్బన్ సీఐ కి డిపో అధికారులు సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని గుట్కా ప్యాకెట్లను స్టేషన్కు తరలించారు. వాటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. గుట్కా బస్తాలను కడప ఫుడ్ కంట్రోల్ అధికారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. -
భారీగా గుట్కా పట్టివేత
కరీంనగర్, హుజూరాబాద్: హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న గుట్కాదందాను టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిషేధిత గుట్కా విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యాపారులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 1.50 లక్షల విలువైన గుట్కాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడు చెందిన దేవునూరి భాస్కర్, ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన భూపతి రాజు హుజూరాబాద్లో కిరాణా దుకాణం నడిపిస్తూ ఉపాధి పొందుతున్నారు. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో నిషేధిత గుట్కాదందా సాగిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ఎక్కటి సంతోష్, కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన నరేష్ వద్దనుంచి గుట్కాను తీసుకొస్తూ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో.. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా దేవునూరి భాస్కర్, రాజు రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డారు. వారిని విచారించగా.. హుజూరాబాద్ పట్టణ శివారులో టీఎస్ 07యూఏ 0310 కారులో గుట్కాలు సరఫరా చేస్తూ ఎక్కటి సంతోష్, భాషబోయిన అశోక్ పట్టుపడ్డారు. పరారీలో మరో ఇద్దరు పట్టుబడిన వారిని విచారించగా తమకు జమ్మికుంటకు చెం దిన యాద సురేశ్ సరఫరా చేస్తాడని తెలిపారు. ఇతడూ, మరో వ్యాపారి ఉప్పల్కు చెందిన నరేశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే వీరిపై గతంలో కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. దందా అంతా వీరి చేతుల్లోనే.. హుజూరాబాద్ ఏరియాలో గుట్కా దందా అంతా వీరి చేతుల్లోనే నడుస్తుందని సమాచారం. పెద్దమొత్తంలో డీసీఎం, కార్లలో తీసుకొచ్చి స్థానికంగా చిన్నచిన్న దుకాణాల్లో సరఫరా చేస్తున్నారు. ఈ తతంగం అంతా రాత్రివేళలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు జమ్మికుంట, కమలాపూర్, ఉప్పల్, ఎల్కతుర్తి, హుజూరాబాద్ మండలాల్లోని పలువురు దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుట్కాదందాపై ఉక్కుపాదం కమిషనరేట్ పరిధిలో గుట్కాదందాపై ఉక్కుపాదం మోపు తామని టాస్క్ఫోర్స్ సీఐలు శ్రీనివాస్రావు, మాధవి, కిరణ్ తెలిపారు. హుజూరాబాద్కు గుట్కా సరఫరా చేసే వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో టౌన్ సీఐ వీవీ. రమణమూర్తి, టాస్క్ఫోర్స్ ఎస్సై రమేష్ ఉన్నారు. -
మాణిక్రాజాలు
జిల్లాలో మాణిక్రాజాలు అవినీతి పునాదులపై అక్రమాల పీఠం వేసుకుని గుట్కా సామ్రాజ్యానికి కింగ్ల అవతారమెత్తారు. అమ్మడానికే అనుమతిలేని గుట్కాలను ఏకంగా మెషీన్లు తెచ్చి మరీ తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ బస్తాలకొద్దీ మాణిక్చంద్, రాజాఖైనీ ప్యాకెట్లను జిల్లాలో సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆదివారం గుంటూరులో అధికారుల సోదాలు చేసిన గుట్కా తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తే ఏళ్ల తరబడి ఈ దందా కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. ప్రజల ప్రాణాలను హరించే ఈ అక్రమాలకు మామూళ్ల మత్తు ఆవరించిన అధికారుల అండ ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు(పట్నంబజారు): గుట్కా మాఫియా మరోసారి మార్క్ దందాకు తెరదీసింది. ఇన్నాళ్లూ వేరే రాష్ట్రాల నుంచి గుట్కాలను తీసుకుని వ్యాపారాలు చేస్తున్న మాఫియా ఒక్కసారి మిషనరీలనే దిగుమతి చేసుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి, ఇంజినీరింగ్ చదువుతున్న అతని కుమారుడు ఇటువంటి వ్యాపారాలు చేయటం విస్మయానికి గురి చేస్తోంది. వీరు ప్రాంతాల వారీగా గుట్కా వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారం గుంటూరు శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని నిషేధిత గుట్కా తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. నగరంలోని కొండా వెంకటప్పయ్యకాలనీ చివర ఆదివారం సీతయ్య కాటన్ మిల్లులో అధికారులు సోదాలు చేశారు. అమరావతి రోడ్డుకు చెందిన పాలెం శివకుమార్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి గుట్కాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాఫీ గింజల తయారీ కేంద్రం పెట్టుకుంటున్నట్లు మిల్లు యజమానికి చెప్పారు. తన తండ్రి రామ్మోహనరావు హైదారాబాద్లో పోలీసు కానిస్టేబుల్ అని, ప్రమాదం జరగటంతో మెడికల్ లీవ్లో ఉన్నాడని శివ వెల్లడించాడు. అయితే రామ్మోహనరావు ప్రమాదం జరిగిన రెండు సంవత్సరాల నుంచి గుట్కా వ్యాపారం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సమయంలో నేరుగా రామ్మోహనరావు దొరికారని, అతనిని తప్పించి శివను చూపించారనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో కొంత మంది పెద్ద గుట్కా వ్యాపారులతో కలిసి గుంటూరు శివారు ప్రాంతాలైన ఏటూకూరు రోడ్డు, నల్లపాడు రోడ్డుతోపాటు పట్నంబజారు, లాలాపేట, కాకానిరోడ్డు, ఆర్టీసీ కాలనీ, జిల్లాలోని నర్సరావుపేట, వినుకొండలలో మెషీన్ల ద్వారా గుట్కా తయారు చేస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ నుంచి మిషన్లు గుట్కా తయారీకి అనుమతి ఉన్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి మిషన్లను తీసుకొస్తున్నారు. ఈ మిషన్లు చిన్న సైజులో ఉండటం, విడిభాగాలను మాత్రమే పార్శిల్ చేస్తుండడంతో రవాణా తేలికవుతోంది. ఏదైనా చెకింగ్లు జరిగినప్పటీకీ కాఫీ తయారీ మిషన్లుగా చెబుతామని శివ తెలిపాడు. మిషన్ విలువ రూ 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. సుమారు గుంటూరులో ఐదు ప్రాంతాల్లో మిషన్లు ఉన్నట్లు సమాచారం. రెండు కోట్లకుపైగా వ్యాపారం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన మిషన్ల ద్వారా గంటకు ఆరు బస్తాల గుట్కాలు తయారు చేస్తున్నారు. బస్తాకు 50 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్లో 70 నుంచి 80 పొట్లాలు, ఒక్క ప్యాకెట్ను సిటిలో అయితే రూ 200 నుంచి 250, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 300కుపైగా అమ్ముతున్నారు. నిత్యం జిల్లాతోపాటు అనేక ప్రాంతాలకు 500 నుంచి 800 బస్తాల వరకు బయటకు వెళతాయని సమాచారం. ఒక్కొ బస్తా విలువ రూ 13 వేల నుంచి 15 వేల వరకు అమ్ముతున్నారు. కేవలం జిల్లాలో నెలకు రూ 4 కోట్ల వరకు ఎంసీ, గరుడ, ఖలేజాలను నకిలీ ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు. ముందుగానే సమాచారం.. నమిలే పొగాకు ఉత్పత్తులు నిషేధిస్తూ నాలుగేళ్ల క్రితం హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి కొంత మంది గుట్కా వ్యాపారానికి తెరదీశారు. ఈ క్రమంలో కొంత మంది విజిలెన్స్, పోలీసు అధికారులు కూడా హస్త లాఘవాన్ని ప్రదర్శించటంతో గుట్కా వ్యాపారం మూడు మాణిక్చంద్లు..ఆరు రాజా ఖైనీలుగా సాగిపోతోంది. తయారీ కేంద్రాలు, గుట్కా నిలువలు ఉన్నట్లు తెలిసిన అధికారులు దాడులు నిర్వహించేందుకు బయలుదేరిన క్షణాల్లోనే వ్యాపారులకు తెలిసిపోతుంది. పూర్తిగా సరుకు బయటకు వెళ్లిన తరువాతే దాడులు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనం ఆదివారం కేవీపీ కాలనీ చివర మిల్లులో దొరికిన శివకుమార్ ఇప్పుడేంటని మీడియా ఎదుటే వ్యాఖ్యలు చేయటమే నిలుస్తోంది. -
గుంటూరులో గుట్కా తయారీ ముఠా అరెస్ట్
-
భారీగా గుట్కాల స్వాధీనం
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ఒక కిరాణ దుకాణంపై దాడిచేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రూ. లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకున్నారు. తను సిబ్బందితో కలిసి ఎనిశెట్టి రాములు కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్ సీఐ బాల్రెడ్డి చెప్పారు. సదరు వ్యాపారి దుకాణం వెనుకభాగంలో ఉన్న గోదాంలో దాచి ఉంచిన నిషేధిత గుట్కా, జర్ధా, సాగర్, షైనీ గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకుని గోదాంకు సీల్వేసి వెళ్లిపోయామన్నారు. శుక్రవారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి రవీందర్రావు, మరో అధికారి విద్యాకర్రెడ్డి, తాను గోదాంను తెరిచి తనిఖీ చేసి 30 బ్యాగుల్లో దాచి ఉంచిన ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. ఈమేరకు పంచనామా నిర్వహించి దుకాణం యజమాని సంతోష్పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
నిషేధం ఉన్నా లెక్క లేదు
గుంటూరు: పోలీసులు కళ్లుగప్పి జిల్లా నుంచి గుట్కాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూరు నుంచి మినీ లారీ అడుగు భాగాన బస్తాల్ని అమర్చి విశాఖపట్నం తరలిస్తుండగా గత ఏడాది నవంబరు 5న ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వాహనంలో రూ. కోటి విలువ చేస్తే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ మూమూలే.. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు ఏకకాలంలో పోలీసులు దాడులు చేసి 1275 గుట్కా బస్తాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవేమీ లెక్క చేయని వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం అక్రమ రవాణా జరుగుతుందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీరుగారిన నిషేధం గుట్కా ప్రాణాంతకమన్న ఉద్దేశంతో 2013లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఎక్కడా అమలు కావడం లేదు. గుంటూరు నగర శివారుల్లో ముఖ్యంగా వట్టిచెరుకూరు, వింజనంపాడు, ఏటుకూరు రోడ్లలో అక్రమార్కులు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి పాన్మసాలా తయారీ పేరుతో లైసెన్స్లు పొందుతున్నారు. వీటి లోపల మాత్రం పొగాకుతో నిషేధిత ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు సమాచారం. చిన్నచిన్న బడ్డీల్లో సైతం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ దాడులకు యత్నిస్తే అధికార పార్టీ నాయకులతో ఒత్తిళ్లు చేయించి వారి వైపు తిరిగి చూడకుండా చేసి రాత్రి వేళల్లో వాహనాల ద్వారా గుట్కా బస్తాల్ని తరలిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. రెట్టింపు ధరలకు విక్రయాలు నిషేధం లేని సమయంలో ఎమ్మార్పీకే విక్రయించేవారు. నేడు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్పై ఎమ్మార్పీ రూ.2 ఉంటే రూ. 6కు అమ్ముతున్నారు. గతంలో ఖైనీ ప్యాకెట్ రూ. 5 ఉంటే ప్రస్తుతం రూ 15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో విషయానికి వస్తే చెప్పాల్సిన పనిలేదు. ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ అక్రమ రవాణాదారులు కోట్లు గడిస్తున్నారు. మామూళ్ల వసూలు అవాస్తవం జిల్లాలో అనేకసార్లు దాడులు నిర్వహించి ఇప్పటి వరకు దాదాపుగా రూ.6 కోట్ల విలువ చేసే గుట్కాల్ని సీజ్ చేశాం. సమాచారం ఉంటే 9440379755 నంబర్కు ఫోన్ చేయాలి. వివరాలను గోప్యంగా వుంచుతాం. నెలవారీ మామూళ్ల మాట అవాస్తవం. – గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
ఆగని గుట్కా దందా..
సాక్షి,ఆసిపాబాద్: కాగజ్నగర్ పట్టణం నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. నిత్యం ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాలు, ఖైనీలు, పొగాకు ఉత్పత్తులను కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిషేధించినా కాగజ్నగర్లో మాత్రం ఆ నిబంధనలేవీ అమలవడం లేదు. ఇప్పటికే జిల్లాలో పొగాకు నమలడం ద్వారా అనేక మంది నోటి క్యాన్సర్ వ్యాధి బారిన పడి నరకం అనుభవిస్తుంటే మార్కెట్లో విచ్చలవిడిగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యం అవుతుండం ఆందోళన కలిగిస్తోంది. పట్టణానికి చెందిన ముగ్గురు బడా వ్యాపారులు పథకం ప్రకారం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ మీదుగా పెద్ద ఎత్తున అంబర్ ఖైనీ, గుట్కా, పాన్ మసాల వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. పల్లెలకు రవాణా.. కాగజ్నగర్ నుంచి జిల్లాలోని అన్ని మారుమూల గ్రామాలకు అక్రమార్కులు రవాణా చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిషేధిత ఖైనీలపై రూ.3 ధర ఉండగా ఏకంగా రూ.10కి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటితోపాటు మాధవి ఖైని, పుల్చాప్, ఘన్శ్యాం పొగాకుతో పాటు ఎంసీ గుట్కాలను ట్రాన్స్పోర్టుల ద్వారా ఇక్కడికి దిగుమతి చేసుకుని పల్లె పల్లెకూ రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పాన్ టేలాలు, చిన్న షాపులకు సరఫరా చేయడమే కాకుండా సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, పెంచికల్పేట, చింతలమానెపల్లి, మండలాల్లోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తూ అమాయక ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కొంత మంది నిరుద్యోగ యువకులను పావుగా వాడుకుంటూ వారికి కమిషన్ ఆశ చూపి వారి ద్వారా రైళ్లలో అంబర్, మాధవి ఖైనీ, పుల్చాప్, ఘన్శ్యాం, ఎంసీ గుట్కాలు రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారులు పెద్ద ఎత్తున నిషేధిత వ్యాపారం చేస్తున్నట్లు కొంత మంది అధికారులకు తెలిసినా వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిరు వ్యాపారులు, పాన్ టేలాల నిర్వాహకులపై అడపాదడపా చర్యలు తీసుకుంటున్న అధికారులు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే బడా వ్యాపారుల జోలికి ఎందుకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. నిత్యం దిగుమతి.. ప్రతీ రోజు వివిధ ట్రాన్స్పోర్టుల ద్వారా హైద్రాబాద్, నాగ్పూర్, బెంగళూరు, గుజరాత్ నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులు కాగజ్నగర్కు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. అనేక సార్లు పోలీసులు ఆయా ట్రాన్స్పోర్టులపై దాడి చేశారు. పెద్ద ఎత్తున పొగాకు ఉత్పత్తులు బయటపడినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఒక ట్రాన్స్పోర్టు నిర్వాహకుడు కేవలం ఈ రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ భారీగా పోగాకు ఉత్పత్తులు తరలిస్తున్నాడని సమాచారం. రూ. కోట్లలో దందా.. పోగాకు ఉత్పత్తుల చీకటి వ్యాపారం ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ నుంచి రూ.13,500 రూపాయలకు ఒక్కో అంబర్ ఖైరీ కార్టన్ (బాక్స్)లను దిగుమతి చేస్తున్న వ్యాపారులు దాన్ని స్థానిక మార్కెట్లో రూ.18,500 రూపాయలకు వరకు విక్రయిస్తున్నారు. 100 ప్యాకెట్లు ఉన్న ఒక్క బాక్స్ విక్రయించి రూ. 5వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా ప్రతీ రోజు 40 నుంచి 50 కార్టన్ల అంబర్ ఖైనీ జిల్లాలో మారుమూల గ్రామాలన్నింటికీ చేరుతోంది. రోజుకు సగటున 40 నుంచి 60 కార్టన్ల నిషేధిత పొగాకు ఉత్పత్తులను కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, చంద్రాపూర్, ఆదిలాబాద్, రాజురా, వంటి నగరాలకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే ప్రతీ రోజు 80 కార్టన్ల అంబర్ ఖైనీ విక్రయాలు జరిగినా బాక్సుకు ఐదు వేల చొప్పున అంటే సుమారుగా రూ.4 లక్షల రూపాయల వరకు దండుకుంటున్నారు. ఈ విక్రయాలను నెలసరి లెక్కిస్తే ఇక్కడ ఉన్న ముగ్గురు బడా వ్యాపారులు అర్జన కోట్లలోనే ఉంటోంది. వేకువ జామునే రవాణా! పలు ట్రాన్స్పోర్టుల ద్వారా హైద్రాబాద్, నాగ్పూర్ వంటి ప్రాంతాల నుంచి కాగజ్నగర్లో దిగుమతి చేసుకున్న పొగాకు ఉత్పత్తులను సదరు వ్యాపారులు రహస్య గోదాంలలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి ఆర్డర్ను బట్టి పక్క జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో తెల్లవారు జామున సమయాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు బులేరో, టాటా 207, అశోక్ లేలాండ్ దోస్త్, మినీ ఆటోలు తదితర వాహనాల్లో కింది భాగంలో పొగాకు ఉత్పత్తులను భద్రపర్చి పై భాగంలో అటకుల సంచులు, కుర్కురే సంచులు నింపి దర్జాగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉదయం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడం, అధికారుల తనిఖీలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ఆరోగ్యానికి హానికరం అంబర్ ఖైనీ, గుట్కాలు నమలడం ఆరోగ్యానికి హానికరం. ఎవరైనా దీర్ఘకాలంగా ఇవి వాడితే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. నోటి క్యాన్సర్ బారినపడి ఆరోగ్యం దెబ్బతినక ముందే అంబర్, గుట్కా నమిలే అలవాట్లను వెంటనే మానుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. – డాక్టర్ రమేశ్, సీనియర్ వైద్యులు, కాగజ్నగర్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి ఈ ప్రాంతంలో అంబర్ ఖైనీ, ఎంసీ గుట్కా వంటి నిషేధిత ఉత్పత్తులను దిగుమతి చేస్తూ వందలాది మంది చావుకు కారణమవుతున్న బడా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యుల చితిపై రొట్టెలు కాల్చి తింటున్న వారిని గుర్తించి ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుట్కాలు, ఖైనీలు నమిలే వారికి కౌన్సెలింగ్ ఇస్తాం. – గజ్జెల లక్ష్మణ్, స్వర్ణకమలం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, కాగజ్నగర్ -
జోరుగా గుట్కా వ్యాపారం
వరంగల్ క్రైం : కమాలాపూర్ మండలం ఉప్పల్ కేంద్రంగా కొనసాగుతున్న గుట్కా అక్రమ దందాలో దాగి ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వ్యాపారులు అవలంభిస్తున్న విధానాలు ఆది నుంచి అక్రమాలే. ప్రభుత్వం అధికారంగా గుట్కా ఉత్పత్తులను నిషేందించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో విచ్చల విడిగా లభ్యం అవుతున్నాయి. సాధారణంగా నిషేదం ఉన్న వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దీనిని అదనుగా చేసుకున్న గుట్కా వ్యాపారులు తన దైన శైలిలో ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ గా నడిపిస్తున్నారు. గుట్కా అక్రమ వ్యాపారం ఉప్పల్తో పాటు కమలాపూర్ మండల కేంద్రం కేరాఫ్ అడ్రస్గా మారింది. మొదట మండలానికే పరిమితమైన ఈ వ్యాపారం ప్రస్తుతం జిల్లా సరిహద్దులు దాటింది. కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుంది. బెల్లం నుంచి గుట్కా వైపు.. బెల్లం వ్యాపారంలో ఆరి తేరిన ఇద్దరు వ్యాపారులు, బెల్లంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంలో గుట్కా దందాలోకి అడుగుపెట్టారు. వీరు గతంలో బెల్లంపై నిషేదం లేని సమయంలో మండలంలోని పలు గ్రామాలకు గుడుంబా బెల్లంను సరఫరా చేసేవారు. ఉప్పల్లో గుట్కా డాన్గా పిలువబడుతున్న ఓ వ్యాపారి తన స్లైల్లోనే వ్యాపారం చేస్తున్నారు. వీరు మొదలు పెట్టిన గుట్కా అక్రమ దందా ప్రస్తుతం ‘మూడు గుట్కాలు..ఆరు అంబార్ ప్యాకెట్లు’గా విరజిల్లుతుంది. గుట్కాకు పైలెట్ ప్రధానం.. కమాలాపూర్, ఉప్పల్ కేంద్రంగా సాగుతున్న వ్యాపారంకు పైలెట్ ప్రధానం అని తెలుస్తోంది. గతంలో రాత్రి పూట నిర్వహించే ఈ వ్యాపారాన్ని కొద్ది రోజులుగా పోలీసుల అండదండలతో పగలు కూడా నిర్వహిస్తున్నారు. ఉప్పల్ వ్యాపారికి గుట్కాను సరఫరా చేసే మూడు వాహనాలు, కమాలాపూర్ వ్యాపారులకు రెండు వాహనాలున్నాయి. ఈ ఐదు వాహనాలకు వాటి ముందు వేళ్లే పైలెట్ వాహనాలే ప్రధానం. జిల్లా సరిహద్దులు దాటే క్రమంలో ఒక్కో వాహనానికి రెండు లేదా మూడు ద్విచక్ర వాహనాలు పైలెట్గా ముందు ఉంటాయి. రోడ్డు లైన్ క్లీయర్ అనే సమాచారం వస్తేనే గుట్కా సరఫరా చేసే వాహనాలు ముందుకు పోయి టార్గెట్ను పూర్తి చేస్తాయి. అంతా బహిరంగమే... ప్రస్తుతం మార్కెట్లో గుట్కాలు ఓపెన్గా దొరుకుతున్నాయి. పాన్ షాపులు, కిరణా షాపులు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం ఓపెన్గా దొరుకుతున్నప్పటికీ బహిరంగంగా వ్యాపారులు వాటిని ప్రదర్శించటం లేదు. నగరంలో పాన్ షాపు యజమానులు ఒక చిన్న డబ్బాలో పెట్టి ఆ డబ్బాను కింద పెడుతున్నారు. అందరికీ కనిపించేలా సొంపు ప్యాకెట్లను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో గుట్కాపై హోల్సెల్ వ్యాపారులు 50 శాతం, రిటైల్ వ్యాపారులు 70 శాతం లాభాలు పొందుతున్నారు. తనిఖీలు నిల్.. మామూళ్లు ఫుల్.. అక్రమంగా సాగే గుట్కా వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యాపారులు పోలీస్స్టేషన్ల వారీగా మామూళ్లు ఫిక్స్ చేసి నెలలో మొదటి వారంలోనే అధికారులకు అందేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో పాటు పండుగ సమయాల్లో, ఎవరైన బదిలీ అయిన సమయంలో స్టేషన్లో అయ్యే ఖర్చులను సహితం వీరే సంతోషంగా బరిస్తున్నారు. అధికారులకు అప్పుడప్పుడు బహుమతులను అందజేసి వారి ప్రేమను చాటుకుంటున్నారు. దీంతో పోలీసులే చీకటి వ్యాపారానికి ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్గా సాగుతున్న అక్రమ దందాను అధికారులు ఎందుకు అదుపు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చిన్నమ్మ గదిలో ‘గుట్కా’
సాక్షి, చెన్నై : అత్యంత రహస్యంగా పంపిణీ గుట్కా లేఖలు చిన్నమ్మ శశికళ గదిలో బయట పడడం ఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసింది. తమ దాడుల్లో బయట పడ్డ ఆ లేఖల్ని కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో గుట్కా, హాన్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలకు నిషేధం విధించిన చాప కింద నీరులా మార్కెట్లో లభిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెడ్హిల్స్ సమీపంలో మాదక ద్రవ్యాల నిరోధక విభాగం జరిపిన దాడులు చర్చకు దారి తీశాయి. మాధవరావు అనే వ్యక్తి వద్ద లభించిన డైరీ ఆధారంగా ఈ గుట్టుకు సహకరిస్తున్న వారి జాబితా బయట పడడం కలకలం రేపింది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఓ మంత్రి, ఐపీఎస్ బాసులు ఉండడంతో ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలోపడ్డాయి. అలాగే గుట్కా గుట్టు వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగుతూ వస్తున్నది. పిటిషన్ విచారణలో భాగంగా సెంట్రల్ ఎక్సైజ్ వర్గాలు తమ తరఫు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ పరిస్థితుల్లో ఆదాయపన్ను శాఖ తరఫున సైతం కోర్టుకు ఓ నివేదిక సమర్పించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ కొత్త సమాచారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసు బాసుల్లో ఆందోళన బయలుదేరి ఉండడం గమనార్హం. ఇందుకు నిదర్శనం, గతంలో రహస్యంగా ఆదాయపన్ను శాఖ పంపిన లేఖలు పోయెస్గార్డెన్లోని చిన్నమ్మ శశికళ గదిలో లభించి ఉండడమే. ఆ లేఖలు ఇక్కడికి ఎలా వచ్చాయో..? 2016 ప్రారంభంలో తాము పంపిన లేఖలు, కొన్ని నెలల అనంతరం మాయం కావడాన్ని ఆదాయ పన్ను శాఖ తీవ్రంగానే పరిగణించింది. ప్రభుత్వ అధికారులు ఈ లేఖలు అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత దృష్టిలో పడకుండా జాగ్రత్తలే తీసుకున్నట్టున్నాయి. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా వెలుగులోకి రావడం చర్చకు దారి తీసింది. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తరచూ పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసంలో తనిఖీలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేదా నిలయంలోనే చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గది ఉంది. ఇందులో తాము పంపిన రహస్య లేఖలు బయట పడడంఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసినట్టు సమాచారం. ఈ లేఖలు ఇక్కడకు ఎలా వచ్చాయో, గుట్కా గుట్టు పూర్తిగా రట్టు చేయడానికి ఆ విభాగం వర్గాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈనెల 17వ తేదీన హైకోర్టులో గుట్కా కేసు విచారణకు రానున్న సమయంలో తమ తరఫున ఓ నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు ఐటీ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పలువురు పోలీసు బాసులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఆందోళన బయలు దేరింది. గుట్కాపై లేఖలు గుట్కా వ్యవహారం చిలికి చిలికి అతి పెద్ద స్కాంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది రూ. 250 కోట్ల మేరకు టర్నోవర్ రహస్యంగా సాగి ఉండడం ఇందుకు నిదర్శనం. ఆదాయ పన్ను శాఖ వర్గాలు ఈ గుట్కా గుట్టును 2016 ప్రారంభంలోనే తేల్చి ఉన్నారు. ఇందులో ఉన్న అధికారులు ఎవ్వరెవ్వరో వివరిస్తూ, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని రహస్య లేఖల్ని పంపారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మెహన్ రావు, అప్పటి డీజీపీలకు ఈ రహస్య లేఖలు పంపినట్టు సమాచారం. ఈ లేఖల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది. ఢిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి సైతం కొన్ని రహస్య సమాచారాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, ఈ లేఖలపై ఎలాంటి చర్యలు లేవని చెప్పవచ్చు. ఈ సమయంలో అమ్మ అనారోగ్యం బారిన పడడంతో ఆ లేఖ వ్యవహారం కాస్త తెర మరుగు అయిందని చెప్పవచ్చు. ఈ కాలంలో పలుమార్లు ఆదాయ పన్ను శాఖ నుంచి ప్రభుత్వ అధికారులకు సంకేతాలు వచ్చినా, లేఖలు కన్పించడం లేదన్నట్టు సమాధానాలు వెళ్లి ఉన్నాయి. ఆ తదుపరి పరిణామాలతో ఈలేఖలు పూర్తిగా తెర మరుగు అయినా, 2017లో రెడ్ హిల్స్లో సాగిన తనిఖీల పర్వంతో గుట్కా బండారం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే, ప్రభుత్వ అధికారులకు పంపిణీ లేఖలు అప్పట్లో మాయమైనా, ప్రస్తుతం అవి మళ్లీ ఆదాయ పన్ను శాఖకు చేరడం గమనార్హం. -
గుట్కా.. ‘మహా’ జోరు
ఆదిలాబాద్ : జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. ప్రతి ఏడాది లక్షల విలువ చేసే గుట్కా మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా అవుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నా వ్యాపారుల దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఏడాది పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. 2013 నుంచి రాష్ట్రంలో గుట్కాపై నిషేధం విధిస్తూ గతేడాది విధించిన ఉత్తర్వుల గడువు బుధవారంతో ముగిసింది. దీంతో మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది రాష్ట్రంలోని పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశంలో మట్కా, గుట్కాలపై ప్రభుత్వ నిషేధం ఉందని, దీనిపై పోలీసులు నిఘా పెట్టి నిరోధించాలని సూచించిన విషయం తెలిసిందే. గుట్కాపై పోలీసులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా గుట్కా దందా సాగిస్తున్నారు. సరైన నిఘా లేకపోవడం.. నిరంతరం దాడులు నిర్వహించకపోవడంతో అక్రమదారులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పలుమార్లు దాడులు నిర్వహించి అరెస్టు చేసినప్పటికీ అసలు సూత్రధారులను పట్టుకోకపోవడంతో అక్రమార్కులు షరామామూలుగా తీసుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి రవాణా.. జిల్లాలో గుట్కా వ్యాపారం గుప్పుమంటోంది. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండడంతో మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం గుట్కా, పాన్మసాలా, ఖైనీ, జర్దాలు పొగాకు రా ఉత్పత్తులపై నిషేధం విధించినా జిల్లాలో అది అమలు కావడం లేదు. జిల్లా కేంద్రంలో గోదాముల్లో, ఇతర ప్రాంతాల్లో ట్రేడర్స్, కిరాణాషాపులు, పాన్షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. గోదాములను అద్దెకు తీసుకొని పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుతున్నారు. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రతోపాటు కర్ణాటక, హైదరాబాద్ నుంచి గుట్కాలు దిగుమతులు అవుతున్నట్లు తెలుస్తోంది. డీలర్లు, సబ్డీలర్లు, పట్టణాలు, మారుమూల గ్రామాలకు వీటిని చేరవేస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ ప్రాంతాలకు గుట్కా రవాణా అవుతోంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్చౌక్, నేతాజీచౌక్, వినాయక్చౌక్లోనే గుట్కా దందా ఎక్కువగా సాగుతోంది. అంబేద్కర్చౌక్లో ఓ బడా వ్యాపారి గుట్కా దందాకు ఫేమస్. ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు గుట్కా సరఫరా అవుతోంది. అంబేద్కర్ చౌక్లోని మసీదు ఏరియా ప్రాంతంలో ఈ దందా సాగుతుందని తెలిసినప్పటికీ పోలీసులు అటు వైపు నిఘా పెట్టకపోవడం గమనార్హం. దీంతో రూపాయికి దొరికే గుట్కా ప్యాకెట్ను రూ.3 నుంచి రూ.5 వరకు అమ్ముకొని లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ఇది ఆయా ప్రాంతాల నుంచి చిన్న షాపులకు వెళ్లే వరకు ధర రూ.10కి చేరుతోంది. గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లాలో గుట్కా కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దాడులు సైతం నిర్వహిస్తున్నాం. గుట్కా విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. నిషేధిత గుట్కా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు సైతం ఇందుకు సహకరించాలి. – నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
గుట్కాపై నిషేధం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా అమ్మకంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కమిషనర్ శాంతికుమారి ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శంకర్ ఈ ప్రకటన విడుదల చేశారు. నికొటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి, నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. గుట్కా, పాన్మసాలా అమ్మకాలపై 2013 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ప్రతిఏటా కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. గత ఏడాది జారీచేసిన ఉత్తర్వు గడువు బుధవారంతో ముగిసింది. కాగా, నిషేధం కొనసాగింపుపై పునరాలోచించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత నెలలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. గురువారం జారీచేసిన ఉత్తర్వులతో ఈ అస్పష్టతకు తెరపడింది. -
గుట్కా నిషేధం కొనసాగేనా?
సాక్షి, హైదరాబాద్ : గుట్కా, పాన్ మసాలా నిషేధం కొత్త మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుట్కా నిషేధం రాజకీయ రంగు పులుముకుంటోంది. గుట్కాలపై రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరిలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తోంది. అయితే నిషేధం ముగిసే సమయం దగ్గర పడుతున్న తరుణంలో గుట్కా విక్రయాలపై నిషేధం ఎత్తేయాలని కోరుతూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితి తెలపాలంటూ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ (వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అందులో గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులతో కేన్సర్ రోగులు బాగా పెరుగుతున్నారని, నిషేధం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ నివేదిక ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పొగాకు ఉత్పత్తులపైనా నిషేధం.. నోటి కేన్సర్ బాధితులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగు ణంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013 జనవరి 9న గుట్కా ఉత్పత్తులను నిషేధించింది. ఏటా నిషేధం కొనసాగించేలా గెజిట్ జారీ చేసింది. అయితే గుట్కాను మాత్రమే నిషేధించడంతో పొగాకుతో తయారయ్యే పాన్మసాలా ఉత్పత్తులు మార్కెట్లో బాగా పెరిగాయి. ఆ తర్వాత 2014 జనవరి 9న ప్రభుత్వం సమగ్రంగా ఆదేశాలు ఇచ్చింది. నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. చాప్ టొబాకో, ప్యూర్ టొబాకో, ఖైనీ, ఖారా, పొగాకు ముక్కలు, పొగాకు ఆనవాళ్లు ఉండేవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయని వివరణ ఇచ్చింది. ఏటా జనవరి 9న నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలోనూ ప్రభుత్వం ఇవే ఆదేశాలను అమలు చేస్తోంది. గతేడాది జనవరి 10న నోటి ద్వారా తీసుకునే అన్ని రకాల నికోటిన్, పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. అప్పటి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ రాజేశ్వర్ తివారీ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా నిషేధం ఎత్తివేత విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి రావడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో రాజేశ్వర్ తివారీ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదిలీ కావడం మరో మలుపు. 48 శాతం మంది నమిలేస్తున్నారు.. పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల వినియోగంతో అధిక శాతం మంది నోటి కేన్సర్ బారినపడుతున్నారు. 2009–10 ప్రపంచ పొగాకు ఉత్పత్తుల సర్వే ప్రకారం 53.5 శాతం మంది పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు తేలింది. గుట్కా, పాన్ మసాలాను నమిలే వారు 48.07 శాతం మంది ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో పిల్లలు 16 శాతం వరకు ఉన్నారని అంచనా. నోటి కేన్సర్ బాధితులు ఏటా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలాను నిషేధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2011 ప్రకారం ఈ ఉత్పత్తులపై 2012 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రాలు నిషేధించడం మొదలుపెట్టాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంది. -
నెల్లూరులో రూ.45లక్షల గుట్కా స్వాధీనం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో పోలీసులు దాడిచేసి రూ.45లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం కాపుకాసిన టూ టౌన్ పోలీసులు వాహనాలను ఆపి గుట్కా ప్యాకెట్లున్న 65 బస్తాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగురిని అదుపులోకి తీసుకుని ఒక కారు, నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
గుట్కా కింగ్ పిన్ అరెస్ట్
సాక్షి, చిత్తూరు : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలని ఆశపడి అడ్డదారులు తొక్కిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఎస్పీ రాజశేఖబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరులోని గాంధీ రోడ్డులో నివాసం ఉండే హరనాథ్ సిగరెట్ల వ్యాపారం చేస్తుండేవాడు. సిగరెట్లలో ఎక్కువ పెట్టుబడి అవసరం కావటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే నిషేధిత గుట్కా వ్యాపారం మొదలుపెట్టాడు. దీనికోసం కోలార్, ములబగల్, పలమనేరు, చిత్తూరు కేంద్రాలుగా లావాదేవీలు సాగిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు నెల క్రితం చిత్తూరు బైపాస్ రోడ్ లోని ఒక ఇంట్లో భారీగా ఉంచిన గుట్కా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలమనేరులోనూ తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీ మొత్తాల్లో నిల్వ ఉంచిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ములబగల్, కోలార్ తో పాటు రాయవెల్లూర్లోనూ ఇతని గోదాముల్లోనూ గుట్కా నిల్వలున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో హరనాథ్పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన పోలీసులపై కూడా చర్యలుంటాయని ఎస్పీ తెలిపారు. -
గుట్టుగా గుట్కా దందా
కృష్ణా, గుంటూరు జిల్లాలు కేంద్రంగా గుట్కా దందా గుట్టుగా సాగిపోతోంది. తయారీ నుంచి మార్కెటింగ్ వరకూ ఇక్కడి నుంచే యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు స్పందించడంలేదు. అప్పుడప్పుడు వ్యాపారులపై దాడులు చేయడం మినహా, తయారీ కేంద్రాలపై దృష్టి సారించడంలేదు. సాక్షి, అమరావతిబ్యూరో: ‘నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. ఇప్పుడు నా నోటి క్యాన్సర్కు ఆపరేషన్ జరుగుతోంది. బహుశా ఇక నేను మాట్లాడలేకపోవచ్చు’.. ‘దురదృష్టంకొద్దీ ముఖేష్ను కాపాడలేకపోయాం. అతని వయసు 24 ఏళ్లే..’ అంటూ సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్ తరువాత వచ్చే ఒక ప్రచార చిత్రంలోని మాటలు ఇవీ... గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ప్రచార చిత్రంలో ముఖేష్ పరిస్థితి చూసినవారి మనసు కకావికలమవుతుంది. అయితే ప్రభుత్వ యంత్రాం గాన్ని మాత్రం ఆ చిత్రం కదిలించలేకపోతోంది. అంతా పక్కాగా.. నిషేధిత గుట్కా రాకెట్కు రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు అడ్డాగా మారాయి. తయారీ నుంచి మార్కెటింగ్ వరకు అంతా పక్కాగా సాగిపోతోంది. నెలకు రూ.15 కోట్ల మేర వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడమే లేదు. ఎందుకంటే ఈ గుట్కా రాకెట్కు సూత్రధారులూ టీడీపీ ప్రజాప్రతినిధుల సన్నిహితులు, పాత్రధారులు అనుచరులే కాబట్టి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండ రాజధాని గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున గుట్కాను తయారు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడలోని టీడీపీ ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరులే ఈ రాకెట్ను నిర్వహిస్తున్నారు. విజయవాడలో అనైతికంగా టీడీపీలో కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధి ఈ రాకెట్కు కొమ్ముకాస్తున్నారు. ఆయన వర్గీయులే విజయవాడ, గుంటూరులోని ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. పట్టున్న గ్రామాల్లో యూనిట్లు గుంటూరు జిల్లాలోని కొందరు టీడీపీ నేతలతో కలసి గుట్కా యూనిట్లు నెలకొల్పారు. టీడీపీకి ఏకపక్షంగా బలమైన గ్రామాల్లో యూని ట్లను ఏర్పాటు చేశారని నిఘావర్గాలకు గుర్తిం చాయి. స్థానికంగా లభించే పొగాకు, బెంగళూరు నుంచి పౌడర్, రసాయనాలు తెప్పిస్తున్నారు. ఒడిశా, జార్ఖండ్ నుంచి పనివారిని రప్పిస్తూ మరీ గుట్టుచప్పుడు కాకుండా గుట్కా తయారు చేస్తున్నారు. భారీస్థాయిలో తయారు చేస్తున్న గుట్కా ప్యాకెట్లను గుంటూరు, విజయవాడతోపాటు రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. అందుకు విజయవాడ వన్టౌన్, గుడివాడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తదితర కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజధాని గ్రామాల్లో యూనిట్లలో తయారు చేసిన గుట్కా ప్యాకెట్లను ఆ కేంద్రాలకు రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి చిల్లర వర్తకులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో చిలకలూరిపేట, గన్నవరం తదితర చోట్ల అధికారులు దాడులు చేసి పెద్ద సంఖ్యలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నెలకు రూ.15కోట్ల అక్రమ వ్యాపారం ఏదో గుట్కా వ్యాపారమే కదా అని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే రాజధాని గ్రామాల కేంద్రంగా నెలకు రూ.15 కోట్ల వ్యాపారం సాగుతోంది. ఒక్కో ప్యాకెట్ను రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రోజుకు లక్ష ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. అంటే రోజుకు రూ.10లక్షల వ్యాపారం సాగుతోంది. ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకు రోజుకు రూ.40 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అంటే రోజుకు రూ.50 లక్షల టర్నోవర్. ఆ లెక్కన నెలకు రూ.15 కోట్ల వరకు గుట్కా అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. అధికార యంత్రాంగం ఉదాసీనం రాజధాని కేంద్రంగా వ్యవస్థీకృతమైన గుట్కా రాకెట్పై అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు గుట్కా అక్రమంగా నిల్వ చేసిన చిరువ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే సిండికేట్ మీద ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. రాజధాని గ్రామాల్లోనే గుట్కా యూనిట్లు ఉన్నాయని తెలిసినప్పటికీ దాడలు చేయనేలేదు. ప్రధానంగా విజయవాడ వన్టౌన్, గుంటూరులోని గుట్కా సిండికేట్ మీద దాడులకు అధికారులు వెనుకాడుతున్నారు. ఈ సిండికేట్కు విజయవాడలోని వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలు కూడా ఉండటమే అధికారుల ఉదాసీనతకు కారణమని సమాచారం. -
నెట్టివేసి.. పరారయ్యేందుకు ప్రయత్నించి
నెల్లూరు(క్రైమ్): అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు గుట్కావ్యాపారులు. అతికష్టంపై పోలీసులు వారిని అరెస్టు చేసి రూ.5 లక్షలు విలువచేసే గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నెల్లూరులోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన కొందరు హోల్సేల్ వ్యాపారులు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున గుట్కాలను దిగుమతి చేసుకుని జిల్లాలోని పలు ప్రాంతాల వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వీరి కదలికలపై పోలీసులు కొద్దిరోజులుగా నిఘా ఉంచారు. రెండురోజులుగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చెంచురామారావు, ఎస్కే బాజీజాన్సైదా నేతృత్వంలో సీసీఎస్ సిబ్బంది నగరంలో విస్తృత దాడులు చేశారు. రెండోనగర పోలీసు స్టేషన్ పరిధిలోని నవాబుపేటకు చెందిన సరాబు కిషోర్కుమార్, జూటూరు సుధాకర్, నరుకూరురోడ్డు సెంటర్కు చెందిన గుర్రం మల్లికార్జున, మూడోనగర పోలీసు స్టేషన్ పరిధిలో కఠారిపాలెంకు చెందిన కలుపూరి రాజశేఖర్, పాశం మోహన్లు, నాలుగోనగర పోలీసు స్టేషన్ పరిధిలో వేమాలశెట్టిబావి వీధికి చెందిన జి.వెంకట శేషాద్రి అలియాస్ శేషు, హరనాథపురానికి చెందిన చందా వెంకట రాజశేఖర్ అలియాస్ శేఖర్, బోయపాటి సు«ధాకర్లను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసులను నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు స్పందించి అతికష్టంపై నిందితులను అదుపులోకి తీసుకుని నాన్బెయిల్బుల్ కేసు నమోదు చేశారు. గుట్కా విక్రయాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించామని త్వరలోనే బడా వ్యాపారులను అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. హోల్సేల్ వ్యాపారులను అరెస్టు చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు కె.చెంచురామారావు, ఎస్కే బాజాజీన్సైదా, ఎస్సై షేక్ షరీఫ్, హెడ్కానిస్టేబుల్స్ ఎస్డీ వారీస్ అహ్మద్, వై శ్రీహరి, కానిస్టేబుల్స్ జి.నరేష్, షేక్ దిలీప్, అరుణ్ తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
గుట్కా కింగ్ మాణిక్చంద్ మృతి
పుణె: గుట్కా కింగ్, మాణిక్ చంద్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రసిక్లాల్ మాణిక్ చంద్ ధరివాల్(79) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. బహుళ అవయవ వైఫల్యంతో బాధపడుతూ స్థానిక వైద్యశాలలో ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. మాణిక్చంద్కు భార్య, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సెప్టెంబర్ 4న ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ఆయన కేన్సర్తో బాధపడ్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మొదట బీడీ ఫ్యాక్టరీతో వ్యాపారం ప్రారంభించిన మాణిక్ చంద్ అంచలంచలుగా వివిధ పొగాకు ఉత్పత్తుల వ్యాపారాలను ప్రారంభించారు. -
120 సంచుల గుట్కా స్వాధీనం
హైదరాబాద్: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 120 సంచుల సాగర్ గుట్కాను అల్వాల్ పోలీసులు పట్టుకున్నారు. బొల్లారం నుంచి కొంపల్లి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. ఆ గుట్కాను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.25 లక్షలు ఉంటుందని ఆల్వాల్ ఎస్సై రమేశ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా తరలిస్తున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్నీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
తిరుమలలో భారీగా గుట్కా
తిరుమల: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో భారీగా గుట్కా పట్టుకున్నారు. తిరుమలలోని ప్రతివాది భయంకర్ మఠంలో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో గుట్కాప్యాకెట్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి మఠం మేనేజర్ కైలాస్ అగర్వాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
విచారణకు పోలీస్బాస్ !
♦ గుట్కా కేసులో మదురై హైకోర్టు స్పష్టీకరణ ♦ విచారణ కమిషన్కు పూర్తి అధికారాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, నేరాలను అదుపుచేయాల్సిన డీజీపీ రాజేంద్రనే నిందితుడుగా మారిపోయాడు. నిషేధిత గుట్కా అమ్మకాలను గుట్టుగా కానిచ్చేశారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు మదురై హైకోర్టు అనుమతించింది. అవినీతి నిరోధకశాఖకు పూర్తి అధికారాలు కల్పిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. రాజేంద్రన్ చెన్నై నగర్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో 2015లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత డీజీపీగా పదోన్నతి కల్పించారు. డీజీపీ రాజేంద్రన్ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీకాలాన్ని సీఎం ఎడపాడి మరో రెండేళ్లు పొడిగించారు. నిషేధిత గుట్కా, పాన్ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్ కూడా ఒక నిందితుడని, నగర కమిషనర్గా ఉన్న కాలంలో సైతం గుట్కా అమ్మకాలు సాగాయని ఇంగ్లిషు టీవీ చానల్ ఆధారాలు సహా బైటపెట్టింది. గుట్కా గోల్మాల్ నుంచి రాజేంద్రన్ను రక్షించేందుకే ఆయన పదవీకాలాన్ని పొడిగించారని తప్పుపడుతూ మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్ ఈనెల 7వ తేదీన హైకోర్టు మదురై శాఖలో పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక శాఖ నుంచి విచారణ ఎదుర్కొంటున్న డీజీపీకి కల్పించిన పదవీకాల పొడిగింపుపై స్టే విధించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరాడు. తనకు బెదిరింపులు వస్తున్నందున సాయుధ పోలీసును బందోబస్తుకు కేటాయించాలని కోరుతో మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్ల ముందుకు ఈనెల 6వ తేదీన విచారణకు వచ్చింది. పిటిషన్ తరఫు వాదనపై వివరాలు అందజేయాల్సిందిగా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆనాడు ఆదేశించారు. ఈనెల 17వ తేదీ వాయిదా నాటికి ప్రభుత్వ అధికారులు పత్రాలను దాఖలు చేసి తమ వాదనను వినిపించారు. అత్యున్నత స్థానంలోని అధికారులపై చేసే ఫిర్యాదులకు ఆధారాలు కూడా సమర్పించాలని న్యాయమూర్తులు పిటిషనర్ను ఆదేశించారు. శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్ మాట్లాడుతూ డీజీపీ పదవీకాలం పొడిగింపుపై తాము స్టే మంజూరు చేయలేం, అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలపై 20 రోజుల్లోగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అవినీతి నిరోధకశాఖ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరగాలని వారు తీర్పు చెప్పారు. డీజీపీ, ప్రభుత్వం, రాజకీయ జోక్యం లేకుండా ఈ విచారణ కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పిటిషన్పై సాహసోపేతంగా విచారణ జరపాలని వారు సూచించారు. విచారణ సమయంలో రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ, మరే ఇతర శాఖల నుంచి అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. -
గుట్కాయ స్వాçహాపై చర్యలేవీ?
♦ నిందితుల రాజీనామాకు విపక్షాల పట్టు ♦ సీబీఐ విచారణకు డీఎంకే డిమాండ్ ♦ అసెంబ్లీ సమావేశాలు రసాభాస సాక్షి ప్రతినిధి, చెన్నై: గుట్కా విక్రయాల కోసం అడ్డదారిలో కోట్లాది రూపాయలు గుటుక్కున మింగేసిన అంశంపై గురువారం నాటి అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. నిందితులకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని ప్రతిపక్షాల కేకలు, వాకౌట్, అధికారపక్షం ఎదురుదాడితో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గుట్కా అమ్మకాలకు లంచం వ్యవహారం గురువారం కూడా అసెంబ్లీని కుదిపేసింది. సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్పీకర్నుద్దేశించి ప్రతిపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ, ఒక ప్రధాన అంశంపై మాట్లాడేందుకు బుధవారం నాటి సమావేశాల్లో కోరగా ఆ అంశంపై విచారణలో ఉందని తోసిపుచ్చారని, అయితే ఈనాటి సమావేశాల సందర్భంగా సదరు అంశంపై ఆధారాలను సమర్పించినందున మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. విపక్షాలు కోరుతున్న అంశంపై సీఎం మాట్లాడతారని స్పీకర్ చెప్పగానే ఎడపాడి లేచి నిలు చుని ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతిపక్షాల ప్రశ్నలు వినకుండానే సమాధానం ఎలా చెబుతారని ఆక్షేపిస్తూ డీఎంకే సభ్యులంతా అభ్యంతరం వ్యక్తంచేశారు. బుధవారం సమావేశాల్లో డీఎంకే సభ్యుల కోర్కె మేరకే సీఎం ప్రసంగిస్తున్నారని స్పీకర్ ఇచ్చిన వివరణను డీఎంకే సభ్యులు అంగీకరించకుండా తమ నేత మాట్లేందుకు అవకాశం ఇవ్వాలని కేకలు వేయడంతో స్పీకర్ అనుమతించారు. తరువాత స్టాలిన్ మాట్లాడుతూ, గుట్కా, పాన్మసాలా తదితర మత్తు పదార్థాల అమ్మకాలను 2013 మే 9వ తేదీన ప్రభుత్వం నిషేధించిందని గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో మత్తుపదారాల అమ్మకాలు సాగుతూ రూ.250 కోట్లు పన్ను ఎగవేస్తున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు దాడులు చేశారని ఆయన చెప్పారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డైరీల ఆధారంగా ఒక మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు, వారికి రూ.40 కోట్ల ముడుపులు ముట్టినట్లు తేలిందని చెబుతుండగా స్పీకర్ అడ్డుతగిలి మీడియాలో వస్తున్న కథనాలను అసెంబ్లీలో మాట్లాడరాదని అన్నారు. అంతేగాక స్టాలిన్ మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు. ఐటీ అధికారుల ఉత్తరం ఆధారంగా మంత్రి, పోలీసు ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించాని డిమాండ్చేయగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత రామస్వామి సైతం మద్దతు పలికారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన జారీచేసిన ఆదేశాల మేరకు అవినీతి నిరోధక పోలీసు శాఖ విచారణ జరుపుతున్నట్లు సీఎం తెలిపారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విన్సెంట్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశాడని ఆయన చెప్పారు. పోలీసు శాఖే ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేయవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించి పిటీషన్ను కొట్టివేసినట్లు సీఎం తెలిపారు. గుట్కా అవినీతి అంశాన్ని సీఎం దాటవేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే సభ్యులు లేచి నిలబడి కేకలు వేశారు. సీఎం సమాధానం ఇచ్చినందున, విచారణ కొనసాగుతున్నందున డీఎంకే సభ్యులు కూర్చోవాలని స్పీకర్ కోరారు. మంత్రి చేత రాజీనామా చేయించాలనీ.. సీబీఐ విచారణకు ఆదేశించాలన్న అంశంపై సీఎం సమాధానం తమకు సంతృప్తి ఇవ్వనందున వాకౌట్ చేస్తున్నామని స్టాలిన్ ప్రకటించి సభ్యులతో సహా బయటకు వెళ్లిపోయారు. రాజీనామా.. ఆపై సీబీఐ విచారణ : స్టాలిన్ వాకౌట్ చేసిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, గుట్కా బాగోతంపై రాష్ట్రంలోని అన్ని మీడియాలు కోడై కూస్తుండగా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి అంటూ అసెంబ్లీలో ప్రస్తావించేందుకు స్పీకర్ అనుమతించలేదని అన్నారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆధారాలను సమర్పించినా కేవలం కొద్దిసేపు మాత్రమే అనుమతించారని అన్నారు. పైగా తాను అడిగిన ప్రశ్నలను సీఎం దాటవేసి వేరేదో అంశాన్ని మాట్లాడారని విమర్శించారు. విచారణకు అనుమతించాలని ఐటీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తరం కోరినా పట్టించుకోలేదని అన్నారు. అలాగే నిందితుల్లో ఒకరైన అప్పటి నగర కమిషనర్ జార్జే విచారణ చేపట్టాలని డీజీపీకి ఉత్తరం రాయడం విచిత్రమని వ్యాఖ్యానించారు. గుట్కా ముడుపుల వ్యవహారంలో మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఒక నాటకాన్ని నడిపించారని దుయ్యబట్టారు. గుట్కా అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తాము కోరుతున్నామని తెలిపారు. అయితే విచారణ నిజాయితీగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, ఇతర పోలీసు అధికారుల చేత రాజీనామా చేయించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం ఎడపాడిని అసెంబ్లీలో డిమాండ్ చేసినట్లు స్టాలిన్ తెలిపారు. దానిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశామని వివరించారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్టాలిన్ స్పష్టంచేశారు. పోలీసుశాఖలో భయం.. భయం గుట్కా వ్యవహరం రాష్ట్రమంతా సంచలనం కావడం.. నివేదిక పంపాల్సిందిగా కేంద్రం కోరడంతో పోలీసు అధికారుల్లో భయం నెలకొంది. 2014–16 మధ్యకాలంలో గుట్కా అమ్మకాలకు అండగా నిలిచి రూ.40 కోట్ల లంచం పుచ్చుకున్న అవినీతి భాగోతం ఇటీవలి వరకు తమిళనాడు ఎల్లలు దాటి వెళ్లలేదు. అయితే ఐటీ అధికారులు నాలుగురోజుల కిందట బట్టబయలు చేయడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. అమ్మ మరణించిన నాటి నుంచి రాష్ట్రంపై తెరవెనుక నుంచి పెత్తనం సాగిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు కేంద్రం గుట్కా వ్యవహారాన్ని ఒక మంచి అవకాశంగా అందిపుచ్చుకుంది. గుట్కా అవినీతిలో భాగస్వామ్యులైన వారిలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్ సర్వీసులు కేంద్రం గుప్పిట్లో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందో, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ఐపీఎస్ అధికారులు హడలిపోతున్నారు. -
అసెంబ్లీకి ‘గుట్కా’
నిషేధిత మత్తు పదార్థాలు (గుట్కా) అమ్మకాలకు లంచం వ్యవహారం బుధవారం అసెంబ్లీని కుదిపేసింది. చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఒత్తిడి తెచ్చినా, స్పీకర్ ఏమాత్రం తలొగ్గలేదు. ప్రతిపక్ష సభ్యులు, స్పీకర్ మధ్య తీవ్ర వాగ్వాదం సాగినా, స్పందన శూన్యం. స్పీకర్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయి.. ♦ చర్చకు పట్టు ♦ ప్రతిపక్షాల ఒత్తిడి ♦ తగ్గని స్పీకర్.. వాగ్వాదం ♦ వాకౌట్లతో నిరసన సాక్షి, చెన్నై : మంత్రి, అధికారుల అండతో గుట్కా వ్యవహారంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. మూడురోజుల సెలవుల అనంతరం బుధవారం అసెంబ్లీ సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఆమేరకు బాణసంచా ధరల తగ్గింపు విషయంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని మంత్రి జయకుమార్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు కోసం అడిగిన ప్రశ్నకు మంత్రి వీరమణి సమాధానం దాటవేస్తూ ప్రసంగించారు. ప్రశ్నోత్తరాలు ముగియగానే, సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. వాగ్వాదం.. వాకౌట్ డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అసెంబ్లీ ముందుకు ‘గుట్కా’ లంచం వ్యవహారాన్ని తీసుకొచ్చారు. స్పీకర్ ధనపాల్ అడ్డు పడుతూ,ఇది సమయం కాదని వారించారు. డీఎంకే తరపున పది గంటల సమయంలో తనకు ఈ విషయంగా లేఖ అందిందని, అది పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంటూ స్టాలిన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇందుకు డీఎంకే సభ్యులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేస్తూ నినాదాల్ని హోరెత్తించారు. పత్రికల్లో వచ్చిన గుట్కా వ్యవహారాన్ని ప్రదర్శిస్తూ, చర్చకు పట్టుబట్టారు. మంత్రి విజయభాస్కర్, ఇద్దరు డీజీపీలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. దీంతో సభలో పరిస్థితి గందరగోళంగా మారింది. తమ గళాన్ని నొక్కవద్దని, మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్టాలిన్తో పాటు డీఎంకే శాసన సభా పక్ష ఉపనేత దురై మురుగన్ స్పీకర్కు విన్నవించారు. అయితే, స్పీకర్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇంతలో దురై మురుగన్ స్పీకర్ పోడియం ముందుకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఆగ్రహంతో డీఎంకే సభ్యుల్ని ఉద్దేశించి స్పందించడంతో సభలో వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. స్పీకర్, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం హోరెత్తింది. చివరకు గుట్కా వ్యవహారం అసెంబ్లీ ముందుంచే విధంగా స్టాలిన్ ప్రసంగాన్ని సాగించడం, క్షణాల్లో స్పీకర్ అడ్డుపడడంతో డీఎంకే సభ్యుల్లో ఆగ్రహం రేగింది. స్పీకర్కు వ్యతిరేకంగా నినదిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. తదుపరి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రామస్వామి తన ప్రసంగంలో స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రసంగాన్ని కూడా స్పీకర్ అడ్డుకోవడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే అబుబక్కర్ సైతం సభ నుంచి వాకౌట్ చేశారు. స్టాలిన్ ఆగ్రహం ప్రజా సమస్యలే కాదు, కీలక వ్యవహారాల్ని సభ దృష్టికి తీసుకెళ్లినా, చర్చించే సమయం స్పీకర్ లేదని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, ఇద్దరు డీజీపీల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి ఉంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. ఐటీ దాడులు హోరెత్తినా, అవినీతి ఆరోపణలు ఆధారాలతో బయటపడ్డా, ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినా, ఈ పాలకులు చోద్యం చూస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా లంచం పుచ్చుకుని గుట్కా విక్రయాలకు అనుమతిచ్చిన వ్యవహారంలో మంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్చేశారు. డీజీపీలు జార్జ్, రాజేంద్రన్పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రామస్వామి మాట్లాడుతూ, స్పీకర్ ప్ర«తిపక్షాల గళాన్ని నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీకి నివేదిక తమకు లభించిన డైరీలోని అంశాల ఆధారంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి గుట్కా లంచం వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు పంపించాయి. ఇందులో గుట్కా అనుమతి వ్యవహారంతో పాటు కౌన్సిలర్ మొదలు మంత్రి వరకు, ఏసీ నుంచి కమిషనర్, డీజీపీ వరకు సంబంధింత సంస్థ పండుగ మాముళ్ల ఇచ్చి ఉండడాన్ని ప్రస్తావించి ఉన్నారు. అమ్మకు స్మారక మందిరం దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో స్మారక మందిరం నిర్మించనున్నామని అసెంబ్లీలో సీఎం పళనిస్వామి ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అసెంబ్లీ సమావేశం సాగగా, తన పరిధిలోని ప్రజా పనుల శాఖలో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల గురించి సాయంత్రం సీఎం ప్రసంగించారు. ఇందులో దివంగత సీఎం జయలలిత సమాధి ఉన్న ప్రాంతంలో స్మారక మందిరం నిర్మించనున్నామని తెలిపారు. అలాగే, దివంగత ఎంజీయార్ శత జయంతి స్మారకంగా చెన్నైలోని ఓ ప్రధాన మార్గంలో భారీ ఆర్చ్ నిర్మించనున్నామని ప్రకటించారు. -
గుట్టుగా గుట్కా దందా
► కాగజ్నగర్లో నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయం ► అంబర్ ఖైనీతో క్యాన్సర్ బారిన పడుతున్న యువత ► రహస్య గోదాముల్లో కోట్ల రూపాయల గుట్కా నిల్వలు? ► ట్రాన్స్పోర్టుల ద్వారా దిగుమతి ► ఇతర జిల్లాలకు రవాణా, కోట్లలో టర్నోవర్ ► ఎస్పీ ఆదేశాలతో వారం రోజులుగా కొనసాగుతున్న పోలీసుల దాడులు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కాగజ్నగర్ ప్రాంతం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. గుట్కా, మట్కా, మద్యం, బియ్యం.. ఇలా ప్రతీది ఇక్కడి నుంచే రవాణా అవుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇలాంటి అక్రమ దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఎక్కడా గుట్కాలు పట్టుబడినా దాని మూలాలు కాగజ్నగర్లో ఉండడంతో గుట్కా మాఫియాపై ఎస్పీ సన్ప్రీత్సింగ్ దృష్టి సారించారు. దీంతో వారం రోజులుగా కాగజ్నగర్లో నిర్వహిస్తున్న పోలీసుల దాడుల్లో గుట్టలు గుట్టలుగా గుట్కాలు బయటపడుతున్నాయి. – కాగజ్నగర్ కాగజ్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన గుట్కా, ఖైనీ, పొగాకు, ఫుల్ఛాప్, రసాయన పాన్ మెటేరియల్ దందా కాగజ్నగర్ పట్టణంలో జోరుగా సాగుతోంది. పట్టణానికి చెందిన కొంత మంది బడా వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి నిషేధిత పొగాకు ఉత్పత్తులను కాగజ్నగర్కు దిగుమతి చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, వరంగల్ ఇలా అనేక జిల్లాల్లో పోలీసులు పట్టుకుంటున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల లింక్ కాగజ్నగర్తో ఉండటంతో ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు. కాగజ్నగర్ ప్రాంతంలోని కొన్ని రహస్య గోదాంలలో కోట్ల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ, కివాం, పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆయా వార్డుల్లో ఉన్న గోదాంల నుంచి వ్యాపారులు గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తులను ప్రత్యేక వాహనాల ద్వారా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రాణాంతక పొగాకు ఉత్పత్తి అంబర్ ఖైనీ అంబర్.. ఈ పేరు వింటే చాలు. పొగాకు ప్రియులు పోటీపడి కొనుగోలు చేసే ఏకైక ఖైనీ ఇదే. ఒక్క సారి అంబర్ ఖైనీకి అలవాటు పడిన వ్యక్తి మరణించేంత వరకు ఆ వ్యసనాన్ని వదలడని చెబుతున్నారు. అంబర్ ఖైనీ తిని ఇప్పటివరకు అనేక మంది నోటీ క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. పలువు రు వార్ధా సేవాగ్రాం సేవా హాస్పిటల్, చంద్రపూర్ క్రైస్ ఆస్పత్రుల్లో నోటి క్యాన్సర్ చికిత్సలు పొందుతున్నట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్ర్రం నుంచి దొంగదారిన ఈ ప్రాంతానికి దిగుమతి అవుతున్న అంబర్ ఖైనీ ప్యాకెట్పై కేవలం మూడు రూపాయల ప్రింట్ రేట్ ఉంటే దాన్ని కాగజ్నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గవర్గాల్లో 8 నుంచి 10 రూపాయలకు విక్రయిస్తుండగా, కరీంగనర్, మంచిర్యాల, గోదావరిఖని, మంథని, వరంగల్ వంటి ప్రాంతాల్లో రూ.20 నుంచి 50కి విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాన్స్పోర్టుల ద్వారా దిగుమతి కాగజ్నగర్ కేంద్రంగా కొనసాగుతున్న గుట్కా, అంబర్ ఖైనీ, పొగాకు ఉత్పత్తుల వ్యాపారం గణనీయంగా పెరిగిపోవడానికి కొందరు ట్రాన్స్పోర్టు యజమానుల సహకారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పట్టణంలో కొంత మంది ట్రాన్స్పోర్టు నిర్వాహకులు కేవలం నిషేధిత వస్తువులను మాత్రమే దిగుమతి చేయడానికి పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, గుల్బర్గా, నాగ్పూర్, అకోలా, వంటి నగరాల నుంచి పట్టణానికి నిషేధిత గుట్కా, అంబర్ ఖైనీ, ఫుల్ఛాప్, ఇతర పొగాకు ఉత్పత్తులు రవాణా అవుతున్నట్లు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే ట్రాన్స్పోర్టు లారీల్లో వచ్చే నిషేధిత మాల్ను ఉదయం పూట గుట్టు చప్పుడూ కాకుండా దిగుమతి చేస్తూ రహస్య గోదాంలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఇతర జిల్లాలకు ఈ సరుకు రవాణా అవుతోంది. రూ.కోట్లలో టర్నోవర్ కాగజ్నగర్లో కొనసాగుతున్న గుట్కా, ఖైనీ దందా అంతా ఇంతా కాదు. కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన వ్యాపారం. ఒక వైపు వాణిజ్య పన్ను ఎగ్గొడుతూ మరో వైపు నిషేధాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు వ్యాపారులు భారీగా పొగాకు ఉత్పత్తులను కాగజ్నగర్కు దిగుమతి చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంతోపాటు శివారు ప్రాంతంలో అనేక అడ్డాలు ఏర్పాటు చేసి వ్యాపారులు పొగాకు ఉత్పత్తులను దాచి జనాన్ని దోచేస్తున్నారు. ఎస్పీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులు బయటపడ్డాయి. పలువురు వ్యాపారుల రహస్య గోదాంలలో పోలీసులు సోదాలు నిర్వహించి అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు కాగజ్నగర్ ప్రాంతంలో నిషేధిత గుట్కా, అంబర్ ఖైనీ, ఫుల్ఛాప్ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్పీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు ఇప్పటికే కాగజ్నగర్ పట్టణంతోపాటు డివిజన్లో పోలీసు దాడులను ముమ్మరం చేశాం. అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం పర్చుకున్నాం. గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ విషయాన్ని వ్యాపారులు గ్రహించి నిషేధిత వ్యాపారాన్ని పూర్తిగా మానుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. నిషేధిత వస్తువుల గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. – హబీబ్ఖాన్, కాగజ్నగర్ డీఎస్పీ -
నిషేధం మాటున విక్రయం
► యథేచ్ఛగా గుట్కా, ఖైనీల విక్రయాలు ► ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్నా అరికట్టని వైనం ► అధికారులకు భారీగా మామూళ్లు ముట్ట చెబుతున్న వ్యాపారులు ► స్టౌన్హౌస్పేట కేంద్రంగా జిల్లా అంతట సరఫరా నెల్లూరు సిటీ : పొగాకు ఉత్పత్తులు అయిన ఖైనీ, గుట్కాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ఆ పేరుతో వ్యాపారులు నిర్భయంగా విక్రయిస్తూ దోచుకుంటున్నారు. సమీప రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల నుంచి ప్రతి రోజు పార్సిల్ సర్వీసులు, ఇతర రవాణా మార్గాల ద్వారా బేళ్లకు బేళ్లు జిల్లాలోని రహస్య ప్రాంతాల్లో దిగుమతి అవుతున్నాయి. ఈ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా నిషేధించినా.. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా రహస్యంగా గుట్కాలు, ఖైనీలు తయారువుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో కూడా పలుచోట్ల రహస్య ప్రదేశాల్లో ఖైనీలు, గుట్కాలు తయారు చేస్తున్నారు. సరుకుల కింద.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా, ఖైనీ ప్కాకెట్లను నెల్లూరుకు తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాల నుంచి లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తరలి వస్తున్నాయి. పేరుకు లారీల్లో వస్త్రాలు, నిత్యావసర వస్తువులు కందులు, మినప పప్పు తరలిస్తున్నట్లు వే బిల్లులు తీసుకుని, పైన అసలు సరుకులు, కింద గుట్కా, ఖైనీలు రవాణా చేస్తున్నారు. వీటితో పాటు వివిధ ట్రావెల్స్, ట్రాన్స్పోర్టుల ద్వారా వీటిని తరలిస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్లే లారీల్లో కూడా వీటిని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని స్టౌన్హౌస్పేట కేంద్రంగా నిల్వలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం నగరం, రూరల్ ప్రాంతాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఆటోల్లో తరలించి విక్రయిస్తుంటారు. గతంలో స్టౌన్హౌస్పేట, నర్తకీ సెంటర్ కేంద్రంగా దిగుమతి జరిగేది. అయితే గతంలో నర్తకీ సెంటర్లో పోలీసులు, విజిలెన్స్ అధికారులు వరుస దాడులతో ప్రస్తుతం అక్కడ విక్రయాలు నిలిపివేశారని సమాచారం. ఈ క్రమంలో స్టౌన్హౌస్పేటలో కొందరు మాఫియాగా తయారై రూ.కోట్ల అక్రమ వ్యాపారం చేస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు నిషేధిత గుట్కా, ఖైనీలు టీ, సిగరెట్, కేఫ్లతో ప్రొవిజన్స్ దుకాణాల్లో కూడా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయితే అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు భారీగా మామూళ్లు అందడంతోనే అక్రమ వ్యాపారం జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారని తెలుస్తుంది. అయితే అప్పుడప్పుడు దాడులు చేసినా పూర్తి స్థాయిలో నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగట్లో దొరికేవి ఇవే గుట్కాల్లో ఎండీఎం, సీఎం గుట్కా, ఆర్ఆర్ గుట్కా, మామ్లు ఉంటాయి. ఖైనీల్లో రాజా ఖైనీ, హాన్స్, దూడా ఖైనీలు ఉన్నాయి. కొత్తగా 24 కంపెనీ పేరుతో ఒక్కపొడి, నిషేధిత మసాల ప్యాకెట్లు రెండు ఇస్తారు. అవి రెండింటిని కలుపుకుని నోటిలో వేసుకోవాలి. ఇలా వీటిని దుకాణ యజమానులు బహిరంగంగా విక్రయాలు చేస్తున్నారు. ప్రతి టీ దుకాణంలో బల్ల కింద పెట్టుకుని అడిగిన వారికి అందజేస్తున్నారు. ఏటా రూ.50 కోట్ల వ్యాపారం ప్రతి నెలా నిషేధిత గుట్కాలతో ఏటా జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. అధికారికంగా వీటనిఇ నిషేధించడంతో వీటి అసలు ధరపై రెండు మూడు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో నిషేధాన్ని అడ్డుకునే కొన్ని శాఖల అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి, తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. గతంలో ఎంతో మంది చేతుల్లో ఉండే ఈ వ్యాపారం నిషేధంతో కొందరి చేతుల్లోకి చేరడంతో సునాయాసంగా నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. 7 శాఖల్లో సమన్వయలోపం నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు నియంత్రణ బాధ్యత ప్రభుత్వం ఆరోగ్యం, పోలీస్, విజిలెన్స్, కుటుంబ సంక్షేమం, రవాణా, పంచాయతీరాజ్, కార్పొరేషన్లపై ఉంది. అయితే ఆయా శాఖలు సమన్వయంతో పనిచేస్తే నిషేధిత పదార్థాలు అరికట్టడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు తప్పితే ఇతర శాఖలు సరిగా తమ విధులు నిర్వహించట్లేదని ఆరోపణలు ఉన్నాయి. -
భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైన గుట్కా, పొగాకు ప్కాకెట్లతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రూ. 2 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఈరోజు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
గుట్కాలు దొరికితే ఎస్ఐలదే బాధ్యత
► నేర సమీక్షలో ఎస్పీ బ్రహ్మారెడ్డి శ్రీకాకుళం సిటీ : జిల్లాలో ఏ దుకాణంలోనైనా గుట్కాలు, ఖైనీలు అమ్మితే ఆ పరిధిలోని ఎస్ఐను బాధ్యునిగా చేస్తూ చర్యలు తీసుకుంటామని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుట్కా, ఖైనీలు అమ్మిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని సీఐలను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ఎన్హెచ్ఏ1 అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్హెచ్–16లో రోడ్లపై నిలిపివేసిన వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగితే అందుకు ఎన్హెచ్ఏ1 అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శ్రీకాకుళం, రాజాం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ తదితర ముఖ్య పట్టణాల్లో కార్డెన్సెర్చ్లు, ఏరియా డామినేషన్లను వారానికోసారైనా జరపాలని ఆదేశించారు. అసాంఘిక చర్యలను, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవాలన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు షేక్ షరీనా బేగం, కె.వరప్రసాదరావు, డీఎస్పీలు కె.భార్గవరావునాయుడు, వివేకానంద, ఆదినారాయణ, టి.మోహనరావు వి.సుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
నమిలే పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించరేం?
న్యూఢిల్లీ: గుట్కా, పాన్ మసాలా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించేందుకు చర్యలెందుకు తీసుకోరని ఆహార భద్రత ప్రమాణాల శాఖను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రంగానీ లేదా ఏదేని రాష్ట్రాలు గానీ నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాయా అని కోర్టు ప్రశ్నించింది. గుట్కాపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ పొగాకు ఉత్పత్తి సంస్థ వేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోక చెక్క, పొగాకు, మరికొన్ని విషపదార్థాలను తమలపాకులో చుట్టి పాన్ మసాలా తయారు చేస్తున్నారని.. ఇది ఆరోగ్యానికి హానికరమైనదని తెలిసి కూడా సంబంధిత అధికారులు నిషేధం ఎందుకు విధించడంలేదని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నమిలే పొగాకు ఉత్పత్తులమీద నిషేధం విధిస్తే అసలు సమస్యే లేకుండా పోతుంది కదా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఆహార భద్రత ప్రమాణాల శాఖ తరఫున న్యాయవాది ఎం. ప్రచా సమాధానమిస్తూ.. నమిలే పొగాకు ఉత్పత్తుల నిషేధానికి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని.. గుట్కాపై విధించిన నిషేధం వీటికి వర్తిస్తుందన్నారు. అయితే, గుట్కాపై విధించిన నిషేధం చట్టాలు బలంగా అమలు కావడంలేదని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
రూ.62.50 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
చిల్లకూరు: చీరల మాటున తరలిస్తున్న రూ.62.50 లక్షల గుట్కా ప్యాకెట్లను నెల్లూరు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీకంఠనాథ్రెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది మంగళవారం బూదనం టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి కలకత్తా వెళుతున్న ఓ కంటైనర్ను నిలిపి తనిఖీలు చేపట్టారు. అందులో చీరల మూటలు కన్పించాయి. వదిలేయాలనుకుంటున్న సమయంలో గుట్కా వాసన గుప్పుమంది. దీంతో వాహనంలోకి ఎక్కి చీరల మూటలను పక్కకు తొలగించి చూడగా భారీస్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు దర్శనమిచ్చాయి. వాహనాన్ని స్వాధీనం చేసుకొని నెల్లూరులోని విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. కంటైనర్లో 50కిలోల వంతున 50బస్తాల గుట్కాను గుర్తించారు. వాటివిలువ బ హిరంగ మార్కెట్లో సుమారు రూ. 62.50లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలాఉండగా ఓవర్లోడ్, బిల్లులు లేకుండా వెళుతున్న సిలికా, బొగ్గు, రోడ్ మెటల్, టాక్స్ ఎగవేసిన 12లారీలను పట్టుకొని రూ.1,32,500 జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీకంఠనాథ్రెడ్డి చెప్పారు. మైనింగ్ రవాణాకు సంబంధించిన లారీలను జరిమానా విధించేందుకు సంబంధిత అ«ధికారులకు అప్పగించామని చెప్పారు. అక్రమాలపై ప్రజలు నేరుగా తమకు సమాచారం అందిస్తే తగిన రీతిలో స్పందిస్తామన్నారు. మంగళవారం నాటి దాడుల్లో డీఎస్పీ వెంకటనాథ్రెడ్డి, ఇన్స్పెక్టర్లు కట్టా శ్రీనివాసరావు, ఆంజనేయరెడ్డి, డీసీటీవో రవికుమార్, విష్ణు, ఏజీ రాము, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కారు డ్రైవర్కు జరిమానా
లక్నో: నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా జరిమానా కట్టాల్సింది. అది స్వయానా ముఖ్యమంత్రి డ్రైవర్ అయినా సరే. విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారు డ్రైవర్ రూ.500 జరిమానా చెల్లించాడు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో అతడు పాన్ మసాలా నమలడంతో అతడు ఈ ఫైన్ కట్టాడు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ పాన్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం కారు డ్రైవరే పాన్ మసాలా నములుతూ దొరికిపోయాడు. సీఎం పీఠం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ...అధికారులను పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. యూపీ సచివాలయాన్ని సందర్శించిన ఆయన ఆ గోడలపై పాన్ మరకలు ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పాన్ మసాలా వంటివాటిని నమల వద్దని, ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. -
పాన్, గుట్కాలపై యోగి నిషేధం
ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటన చేశారు. పాన్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే యోగి ప్రకటించారు. -
రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత
కూసుమంచి: ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, అంబర్ ప్యాకెట్లను కూసుమంచి పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఓ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్కా స్థావరాలపై విజిలెన్స్ దాడులు
– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ కర్నూలు / కల్లూరు (రూరల్) : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం.. కర్నూలు మార్కెట్ యార్డులోని ఓ ఫ్యాన్సీ స్టోర్పై దాడులు చేశారు. అలాగే ఎన్టీఆర్ బిల్డింగ్లోని గోడౌన్లపై కూడా దాడులు జరిపారు. గుట్టుచప్పుడు కాకుండా గుట్కా బాక్సులను కిరాణం అంగళ్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5.40 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిరజ్ సరిజి 80 బాక్సులు, ఆర్ఆర్ గుట్కా ప్యాకెట్లు 34, వావి గుట్కా ప్యాకెట్లు 37, హిందుస్థాన్ ఖైనీ 11 బాక్సులు, బ్లూ టొబాకో 10 ప్యాకెట్లు, ఖైనీ టొబాకో 21 ప్యాకెట్లు, హన్స్ టొబాకో 3 ప్యాకెట్లు మొత్తం రూ.5.40 లక్షల విలువ చేసే టొబాకో ఉత్పత్తులను సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారి కె. శంకర్కు అప్పగించారు. ప్రధాన సూత్రధారి వెంకటేష్ పరారయ్యాడు. దాడుల్లో ఎస్ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు నాగభూషణ్రావు, ఈశ్వర్రెడ్డి, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
-
రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ మండలం హయాత్సాగర్లో శనివారం వేకువజామున హైదరాబాద్ రూరర్ విజిలెన్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీలతో పాటు డ్రైవర్లను స్టేషన్కు తరలించారు. -
చంద్రన్న కానుకలో గుట్కా ప్యాకెట్లు
-
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
సూర్యాపేట: సూర్యాపేటలో ఇందిరా పార్కు వద్ద వాహనంలో అ క్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. -
విశాఖలో భారీగా గుట్కా పట్టివేత
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో నిషేధిత గుట్కా పెద్ద మొత్తంలో బయట పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పెందుర్తి పోలీసులు మంగళవారం అర్థరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వైపు వెళ్తున్న కంటెయినర్ను తనిఖీ చేయగా 43 బస్తాల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గుట్కా వ్యాపారులపై బైండోవర్ కేసులు
అనంతపురం సెంట్రల్ : నగరంలో గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం పాతూరుకు చెందిన మురళీ, ప్రసాద్, కుమార్, మంజునాథ్పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కోదాడ(సూర్యాపేట): గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచిన గొడౌన్పై దాడి చేసిన పోలీసులు భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ఓ వ్యాపారి వద్ద గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. కోదాడలోని గొడౌన్లో నిల్వ ఉంచినట్లు తెలిపాడు. దీంతో బుధవారం ఉదయం గొడౌన్పై దాడి చేసిన పోలీసులు రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ప్యాపిలి: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి నంద్యాలకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ ప్రసాద్, ఎస్ఐ సురేష్ జలదుర్గం గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మినీ లారీలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని గుర్తించారు. అందులో రూ. 3 లక్షలు విలువ చేసే 52 గుట్కా ప్యాకెట్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి నంద్యాలకు చెందిన మోయిన్ సాహెబ్కు చైనీ గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మోయిన్ సాహెబ్తో పాటు లారీ డ్రైవర్ రియాజ్, లారీలో ఉన్న సుబహాన్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం
అనంతపురం సెంట్రల్ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో మబ్బుకొట్టాలలో రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను మంగళవారం రాత్రి టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా నిల్వ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఒక షెడ్డుపై దాడి చేయగా అందులో నిల్వ చేసిన గుట్కా పాకెట్లు బయటపడ్డాయి. అయితే నిందితులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడుల్లో సీఐ శుభకుమార్, ఎస్ఐ శివగంగాధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
గుట్కా ప్యాకెట్లతో ఇద్దరి అరెస్టు
మెళియాపుట్టి: పలాస నుంచి పర్లాకిమిడికి అక్రమంగా రూ.25 వేల విలువల గల గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వి.రాము, ఎస్.యోగేశ్వరరావులను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్ఐ ఎస్.లక్ష్మణరావు తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా వీరు పట్టుబడ్డారన్నారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
గోదావరిఖనిలో కార్డన్సెర్చ్
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): గోదావరిఖనిలోని 5 ఇంక్లైన్, విఠల్నగర్, చంద్రశేఖర్ నగర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను, నిల్వ చేసిన బొగ్గు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఓ డీసీపీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
రూ.18లక్షల విలువైన గుట్కాలు దహనం
రెవెన్యూకు రూ. 2.83 లక్షల యంత్రాల అప్పగిత తుని రూరల్ : తుని మండలం కేఓ మల్లవరంలో పట్టబడ్డ రూ.18లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును దహనం చేశారు. గురువారం విజిలెన్సు సీఐ రామ్మోహనరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్న సమక్షంలో ముడిసరుకు, గుట్కాలను దహనం చేసి రూ.2.83లక్షలు విలువ చేసే యంత్రాలను రెవెన్యూశాఖ అధికారులకు అప్పగించారు. నకిలీ గుట్కాలు అక్రమంగా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆగస్టు ఆరో తేదీన విజిలెన్సు ఎస్పీ టి.రాంప్రసాద్ ఆదేశాల మేరకు డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ వి.భాస్కరరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేఓ మల్లవరంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.20లక్షల విలువైన ముడిసరుకు, గుట్కా ప్యాకెట్లు, యంత్రాలను సీజ్ చేశారు. ఆ ముడి సరుకు, గుట్కాలను దహనం చేసి, యంత్రాలను వేలం వేయాలని రెవెన్యూశాఖకు అప్పగించారు. వర్షం కారణంగా యంత్రాలను కార్యాలయానికి తరలించలేదని, వాతావరణం అనుకూలించిన వెంటనే యంత్రాలను తుని తరలిస్తామన్నారు. అప్పటి వరకు వీఆర్వో ఆధ్వర్యంలో రక్షణ కల్పించామని తెలిపారు. -
గుట్కా గుట్టురట్టు
రూ.50 లక్షల విలువైన గుట్కా, సామగ్రి పట్టివేత - బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో విజిలెన్స్ దాడులు - నిర్వాహకులతో సహా 13 మంది కూలీల అరెస్ట్ - వాహనాలు, యంత్రాలు స్వాధీనం - రెండు రాష్ట్రాలకు సరఫరా: విజిలెన్స్ విభాగం అదనపు ఎస్పీ సురేందర్రెడ్డి ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్: జిల్లా కేంద్రంలో అంతర్భాగంగా ఉన్న బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో రూ.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకు, యంత్రాలను మంగళవారం అర్ధరాత్రి వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశాఖ అదనపు ఎస్పీ సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బల్లేపల్లికి చెందిన మలీదు జగన్ మామిడి తోటలో పాత కోళ్ల ఫారం షెడ్ ఉంది. దీనిలో విజయవాడకు చెందిన బంటి అలియాస్ కుల్దీప్శర్మ, అతని మిత్రుడు జమలాపురం శ్రీనివాస్, ఎస్డీ ఆరిప్, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గుట్కా తయారీ యూనిట్ను నెలకొల్పారు. జగన్కు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని షెడ్ను అద్దెకు తీసుకొని సుమారు నెలరోజులుగా ఈ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది కూలీలను తీసుకొచ్చి గుట్కా ప్యాకెట్లు తయారు చేయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ముడిసరుకు, దానిలో కలిపే లిక్విడ్ను తీసుకొచ్చి షెడ్లో ఉన్న మిషన్ ద్వారా మిక్సింగ్ చేస్తున్నారు. గుట్కా తయారు అయ్యాక ప్యాకింగ్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంగళవారం సాయంత్రం నుంచి మామిడితోట సమీపంలో మాటు వేసి అర్ధరాత్రి దాడులు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అప్పుడే అక్కడికి తెచ్చిన గుట్కా తయారీకి ఉపయోగించే లిక్విడ్ను, ఒక సఫారీ కారు, ట్ర్యాలీ వ్యాన్, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వాహనాల ద్వారా నిత్యం ముడి సరుకు తీసుకొచ్చి.. తయారైన ప్యాకెట్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. షెడ్డులో 5 ప్యాకింగ్ యంత్రాలతో పాటు సీఎం 1000 బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న సుమారు 5 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్యాకెట్లను చిన్నచిన్న బస్తాలలో నింపి రెండు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు లక్షల గుట్కా ప్యాకెట్ల విలువ రూ.25,29,800 ఉంటుందని వివరించారు. యంత్రాలు, వాహనాలు, ముడిసరుకు మొత్తం కలిసి రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో అదనపు ఎస్పీతో పాటు వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎన్.వెంకారెడ్డి, సీఐ ఎన్. వెంకటేష్, ఏఓ జి. సారయ్య, కానిస్టేబుల్ పి.సురేష్ పాల్గొన్నారు. -
గుట్కా తయారీ కేంద్రంపై విజిలెన్స్ దాడులు
ఖమ్మం : ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బల్లెపల్లి సమీపంలోని గుట్కా తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.13 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే రూ. 50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.26 వేల గుట్కా, ఖైనీ పట్టివేత
తిలారు జంక్షన్ (జలుమూరు) : తిలారు రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీలు పట్టుకొని సారవకోట మండలం జమ్మచక్రం గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.నరసింహామూర్తి తెలిపారు. తిలారు రైల్వేస్టేషన్ నుంచి ఖైనీలు, గుట్కాలు మూటలు దిగి అక్రమంగా రవాణా జరుగుతున్నాయన్న సమాచారంపై సిబ్బందితో తిలారు జంక్షన్లో దాడి చేసి పట్టుకొన్నామని ఎస్ఐ తెలిపారు. వీటి విలువ రూ 25,985 ఉంటుందన్నారు. ఇందులో ఖైనీలు, గుట్కాలు ఉన్నాయన్నారు. అరెస్ట్ చేసి సొంత పూచికత్తులపై విడిచిపెట్టామన్నారు. ఈయనతో పాటు ఏఎస్ఐ తులసీరావు, హెచ్సీ గణపతి సిబ్బంది ఉన్నారు. తిలారు స్టేషన్ అడ్డాగా అక్రమ రవాణ జరుగుతోందన్నడానికి రెండు రోజులుగా పట్టుబడుతున్న అక్రమ రవాణ గుట్కాలు, ఖైనీలు మూటలే నిదర్శనం. -
రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
పేరేచర్ల: మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్లో సోమవారం ప్రత్యేక పోలీసు విభాగం నిర్వహించిన దాడులలో రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఇటీవల కాలంలో గుట్కాల విక్రయం జోరుగా కొనసాగుతోంది. దీనిపై ప్రజలు పలుమార్లు పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదన కోనం గుట్కా వ్యాపారాన్ని కొంతమంది అక్రమార్కులు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ ప్రత్యేక పోలీసు విభాగం పక్కా సమాచారంతో సోమవారం పేరేచర్లలో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాలలో సోదాలు నిర్వహించగా స్థానిక పేరేచర్ల జంక్షన్లోని బైరపనేని సాంబశివరావు కాంప్లెక్స్లోని ఒక గౌడౌన్లో 68 బస్తాలు, సుమారు రూ.5 లక్షల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను దాడులలో స్వాధీనం చేసుకున్నారు. దాడులలో పట్టుబడిన గుట్కాలను మేడికొండూరు సీఐ బాలాజీ పర్యవేక్షణలో మేడికొండూరు పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న పేరేచర్లకు చెందిన నాదెండ్ల రవి, గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న గుంటూరుకు చెందిన బూస వెంకటేశ్వర్లు, ఉడత రాజశేఖర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ తెలిపారు. దాడులలో గుంటూరు అర్బన్ ప్రత్యేక విభాగం ఏఎస్ఐ శ్రీహరి, పీసీలు కృపారత్నం, విజయ్, మేడికొండూరు ఎస్ఐ బాబురావు, సిబ్బంది ఉన్నారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
వరంగల్ : వరంగల్ నగరవ్యాప్తంగా నిషేధిత గుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.43 వేలు విలువైన గుట్కా పట్టివేత
పలాస : పలాస రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.43 వేల విలువైన గుట్కాను కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పలాస–కాశీబుగ్గ పట్టణంలో పలువురు వ్యాపారులు బరంపురం నుంచి వివిధ రైళ్లు, బస్సు మార్గాల ద్వారా అక్రమంగా గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే విషయమై ‘అక్రమంగా గుట్కా వ్యాపారం’ పేరుతో ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు గుట్కా వ్యాపారులపై నిఘా పెట్టారు. నెహ్రూనగర్లోని అంబికా టింబర్ సమీపంలో ఒక గొడౌన్లో అక్రమంగా గుట్కాను నిల్వ చేసి ఉంచుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దృష్టి సారించారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి వస్తున్న సరుకులపైనా నిఘా ఉంచారు. బుధవారం కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద పోలీసులు సరుకులను పరిశీలిస్తుండగా గుట్కా బస్తాలు బయటపడ్డాయి. వ్యాపారి పెద్దిన హరీష్ను అరెస్టు చేయడంతో పాటు గుట్కాను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.43 వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గుట్కాను పట్టుకున్న వారిలో కాశీబుగ్గ సీఐ కె.అశోక్కుమార్, ఎస్ఐ బి.శ్రీరామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు. -
‘గుట్కా’ చీకటి వ్యాపారులు అప్రమత్తం
నగరంలో ఉత్పత్తి, సరఫరా నిలిపివేత పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తూ గుట్కా, పాన్మసాలా తయారీ, పంపిణీ, నిల్వలపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలపై అప్రమత్తమైన వ్యాపారులు, హోల్సేల్ డీలర్లు నగరంలో రిటైల్ పాయింట్లకు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. దీంతో గుట్కా ధర అమాంతం పెరిగిపోయింది. కాగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో నగరంలో గుట్కా సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించిన వ్యాపారులు తమ లాభాల్లో అందరికీ వాటాలు ఇస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆయా పార్టీల పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 రోజుల పాటు గుట్కా తయారీ, హోల్సేల్ సరఫరాను నిలిపేసి, ఈ లోగా అన్ని పరిస్థితులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో వీరు ఉన్నట్టు సమాచారం. -
అందరూ.. ‘గుట్కా’య స్వాహా!
-
అందరూ.. ‘గుట్కా’య స్వాహా!
దందాకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలు సాక్షి, హైదరాబాద్: కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో గుట్కా, పాన్మసాలాల అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా నిషేధిత గుట్కా, పాన్మసాలాలను జనావాసాల మధ్యే అక్రమార్కులు తయారుచేసి నిల్వ చేస్తున్నారు. అఫ్జల్గంజ్, ఉస్మాన్గంజ్ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా పట్టపగలే ఎగుమతి చేస్తున్నారు. గుట్కా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఓ వ్యాపారికి ప్రధాన డీలర్గా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నాయకుడు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. మరో 2 ప్రధాన పార్టీల నాయకులు అక్రమదందాకు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. నగరంలో జరిగే పార్టీల సభలు, సమావేశాలు, ఆయా మతాల ధార్మిక సంస్థలు, ఉత్సవాలకు గుట్కా తయారీ సంస్థలు భారీగా విరాళాలిస్తుండటంతో నాయకులె వరూ నోరు మెదపని స్థితి నెలకొంది. అఫ్జల్, ఉస్మాన్గంజ్లు కేంద్రంగా అక్రమ రవాణా నగరంలో భారీ ఎత్తున తయారీ అవుతోన్న నిషేధిత గుట్కా ఉత్పత్తుల రవాణాకు అఫ్జల్గంజ్, ఉస్మాన్గంజ్, ఫీల్ఖానా, గోషామహల్, మంగళ్ హాట్లోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు కేంద్రంగా మారుతున్నాయి. వివిధ బ్రాండ్ల గుట్కా పాన్మసాలాలు, జర్దాలు ట్రాన్స్పోర్ట్ల ద్వారా తెలంగాణలోని పలు జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు సరఫరా చేస్తున్నారు. గుట్కా వ్యాపారుల మంత్రాంగం బుధవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గుట్కా’య స్వాహా శీర్షికన వచ్చిన కథనం గుట్కా తయారీ, పంపిణీదారుల్లో కలవరం రేపింది. ఈ నేపథ్యంలో వారంతా మెహదీపట్నంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశమై అధికారులెవరూ తమ అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకుండా ఏం చేయాలన్న అంశంపై ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇటీవలే గుట్కా వ్యాపారులంతా అధికార పార్టీకి చెందిన ‘నేత’ను కలసి తమకు సహకరించాలని, అందుకు తమ సహాయ సహకారులుంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో అధికార పార్టీ నేతను కలసి మరోసారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించినట్లు సమాచారం. -
భారీగా గుట్కా స్వాధీనం
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసులు రూ.లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం స్థానికంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి నర్సన్నపేటకు తీసుకువస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గుట్టుగా.. గుట్కా రాకెట్
విచ్చలవిడిగా విక్రయాలు విజిలెన్స్ దాడితో ఉలికిపాటు పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు తుని రూరల్ : గుట్టుచప్పుడు కాకుండా తుని మండలం కేఓ మల్లవరంలో నిర్వహిస్తున్న గుట్కా త యారీ కేంద్రం వెలుగులోకి రావడం జిల్లాలో కలకలం రేపింది. ఇటీవల నకిలీ గుట్కాలు మార్కెట్ను ముంచెత్తాయని తేలడంతో, గుట్కా కు బానిసలైన వారు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. శనివారం విజిలె¯Œæ్స డీఎస్సీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ ఎన్వీ భాస్కరరావు ఆధ్వర్యంలో కేఓ మల్లవరంలో నిషేధిత గుట్కా తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు సుర్ల గంగాధర్ కనుసన్నల్లోనే ఇక్కడ గుట్కాలు తయారు చేస్తున్నట్టు వెలుగుచూసింది. రూ.రెండు లక్షల విలువైన యంత్రాలు, రూ.18 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలతో పాటు పట్టణంలో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తయారీ ఇలా.. కొందరు అక్రమార్కులు నకిలీ గుట్కాలను తయారు చేస్తుండగా, కమీషన్లకు కక్కుర్తిపడే వ్యాపారులు చిల్లరగా విక్రయిస్తున్నారు. స్థానికంగా లభించే మసాలా దినుసులను మిశ్రమంగా చేసి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసినట్టుగా వ్యాపారులను నమ్మిస్తున్నారు. ఒరియా భాషలో ముద్రించిన కవర్లలో గుట్కాను నిర్ణీత మోతాదులో ప్యాకింగ్ చేస్తున్నారు. యాలకులు, పుగాకు, సున్నం, సోంఫ్, పెప్పర్, వక్కలు, ఇతర రసాయనాలను తునిలోనే కొనుగోలు చేస్తున్నారు. కేఓ మల్లవరంలో పూర్వం జీడిపప్పు తయారీ కేంద్రంగా ఉన్న భవనాలు, ప్రాంగణాన్ని అక్రమ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ గుట్కాలు ఘాటుగా ఉంటాయని, అధిక మోతాదు పెప్పర్ ఉండడం వల్ల స్వల్పకాలంలోనే అస్వస్థతకు గురవుతారని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. వివిధ కంపెనీల పేర్లతో.. సఫారీ–2000, గోకుల్ డీలక్స్ మిక్స్, మిరాజ్ తదితర కంపెనీల పేర్లతో గుట్కాలను తయారు చేస్తున్నారు. ఇందుకు మూడు యంత్రాలు, రెండు మిక్సర్లు, ఒక బాయిలర్ను ఏర్పాటు చేశారు. గోడౌ¯Œæలో బాయిలర్, ముడి సరుకును నిల్వ ఉంచగా, మరో భవనంలో తయారీ, ప్యాకింగ్ యంత్రాలు, తయారైన ప్యాకెట్లు ఉన్నాయి. దాడుల్లో ఏఓ జి.శ్రీనివాస్, పుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, కానిస్టేబుల్ స్వామి పాల్గొన్నారు. -
గుట్కాపై ఉక్కుపాదం మోపాలి
పలు శాఖలతో కలెక్టర్ కరుణ సమీక్ష ఏటూరునాగారం : ఏజెన్సీలో పెట్రేగిపోతున్న గుట్కాపై ఉక్కుపాదం మోపాలని, గుడుంబాను పూర్తిగా లేకుండా చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు శాఖలతో ఐటీడీఏ సమావేశపు గదిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు చాలా వరకు నిర్మూలించాలని అన్నారు. గుట్కాల వల్ల టీబీ వస్తుందని ఇటీవల చేసిన పరీక్షల్లో తేలిందని, వాటికి కారణమైన మత్తు పదార్థాల నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీసు శాఖ చొరవ చూపే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఐకేపీ పనితీరు బాగలేదు.. ఐటీడీఏ పరిధిలోని టీఎస్పీ మండలాల్లో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్పై మండిపడ్డారు. మూడు మండలాల్లోని మహిళా గ్రూపుల ద్వారా చేపట్టిన గుప్పేడు బియ్యం 155 వీఓ సంఘాలకు గాను ఏడు వీఓలు మాత్రమే చేస్తున్నట్లు ఏసీ గోవింద్చౌహన్ కలెక్టర్కు వివరించారు. నిరుపేదల కోసం చేపట్టిన గుప్పేడు బియ్యం సేకరణపై నిర్లక్ష్యం చూపినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసి ఐకేపీ సిబ్బంది పనితీరుపై బాగలేదని, ఇలా చేస్తే పేదలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. 267 గ్రూపులకు 67 గ్రూపులు బాగా ఉండడం ఏమిటని, మిగతావి ఎలా డిపాల్ట్ అయ్యాయన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ వడ్డీ రుణాలకు మహిళా సంఘాలు అలవాటు పడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగూడ ఏసీ వరలక్ష్మి పనితీరు బాగా ఉందని, గ్రూపులు కూడా మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఈఎస్ఎస్ కింద ఇచ్చిన మేకలను లబ్ధిదారులు కోసుకొని తింటున్నారా... లేక చనిపోతున్నాయని అబద్దాలు చెబుతున్నారా... ఐకేపీ వాళ్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం వారం రివ్వూ్య పెట్టాలని పీఓను ఆదేశించారు. భాగస్వాములను చేయాలి గోదావరి పరివాహాక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పారిశుధ్యంపై చొరవ చూపే విధంగా మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో మహిళా సంఘాల చొరవ చూపాలన్నారు. సంయుక్తంగా పక్కా భవనాలు ఐటీ డీఏ కింద రూ.3 లక్షలు, ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో కలిపి రూ. 8 లక్షలతో ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించే విధంగా చూడాలని ఐటీడీఏ పీఓ అమయ్కుమార్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్ కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో మునిగ, నిమ్మకాయ, కరివేపాకు, బచ్చల కూర, పాలకూర, గోంగూర నాటే విధంగా హార్టికల్చర్ అధికారులు ఉచితంగా విత్తనాలను అందించాలన్నారు. ఐఏపీ నిధులు వస్తే ఏజెన్సీలో అభివృద్ధి ఏజెన్సీలోని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వచ్చే ఐఏపీ నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. 59 భవనాల్లో 20 పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. మండల సమాఖ్య భవనాలు 13లో ఎనిమిది నిర్మించామని, మిగతా ఐదింటికి స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సమీక్షలో ఆర్డీఓ మహేందర్జీ, ఏపీఓ వసందరావు, డీఈఈ మల్లయ్య, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఎంఐ ఈఈ రాంప్రసాద్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, పీహెచ్ఓ సంజీవరావు, ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ నరేందర్, పాల్గొన్నారు. బాధితుల వేడుకోలు... మండలంలోని మారుమూల గ్రామాలకు బస్సులు రావడం లేదని, ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాంబాయి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేడారం పూజారి ఆనందరావు చనిపోయిన తీరు అనుమానంగా ఉందని భార్య ఉషారాణి కలెక్టర్కు విన్నవించారు. బయ్యక్కపేటకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని స్థానిక విలేకరులు కలెక్టర్కు వినతి అందజేశారు. కార్యక్రమంలో నూక ప్రభాకర్, అలువాల శ్రీను, వెంకన్న, అఫ్జల్, గంపల శివ, కృష్ణ, లాలయ్య, భిక్షపతి, శ్రీను, గంగాధర్, సత్యం, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
గుట్కాపై ఉక్కుపాదం మోపాలి
పలు శాఖలతో కలెక్టర్ కరుణ సమీక్ష ఏటూరునాగారం : ఏజెన్సీలో పెట్రేగిపోతున్న గుట్కాపై ఉక్కుపాదం మోపాలని, గుడుంబాను పూర్తిగా లేకుండా చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు శాఖలతో ఐటీడీఏ సమావేశపు గదిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు చాలా వరకు నిర్మూలించాలని అన్నారు. గుట్కాల వల్ల టీబీ వస్తుందని ఇటీవల చేసిన పరీక్షల్లో తేలిందని, వాటికి కారణమైన మత్తు పదార్థాల నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీసు శాఖ చొరవ చూపే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఐకేపీ పనితీరు బాగలేదు.. ఐటీడీఏ పరిధిలోని టీఎస్పీ మండలాల్లో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్పై మండిపడ్డారు. మూడు మండలాల్లోని మహిళా గ్రూపుల ద్వారా చేపట్టిన గుప్పేడు బియ్యం 155 వీఓ సంఘాలకు గాను ఏడు వీఓలు మాత్రమే చేస్తున్నట్లు ఏసీ గోవింద్చౌహన్ కలెక్టర్కు వివరించారు. నిరుపేదల కోసం చేపట్టిన గుప్పేడు బియ్యం సేకరణపై నిర్లక్ష్యం చూపినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసి ఐకేపీ సిబ్బంది పనితీరుపై బాగలేదని, ఇలా చేస్తే పేదలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. 267 గ్రూపులకు 67 గ్రూపులు బాగా ఉండడం ఏమిటని, మిగతావి ఎలా డిపాల్ట్ అయ్యాయన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ వడ్డీ రుణాలకు మహిళా సంఘాలు అలవాటు పడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగూడ ఏసీ వరలక్ష్మి పనితీరు బాగా ఉందని, గ్రూపులు కూడా మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఈఎస్ఎస్ కింద ఇచ్చిన మేకలను లబ్ధిదారులు కోసుకొని తింటున్నారా... లేక చనిపోతున్నాయని అబద్దాలు చెబుతున్నారా... ఐకేపీ వాళ్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం వారం రివ్వూ్య పెట్టాలని పీఓను ఆదేశించారు. భాగస్వాములను చేయాలి గోదావరి పరివాహాక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పారిశుధ్యంపై చొరవ చూపే విధంగా మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో మహిళా సంఘాల చొరవ చూపాలన్నారు. సంయుక్తంగా పక్కా భవనాలు ఐటీ డీఏ కింద రూ.3 లక్షలు, ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో కలిపి రూ. 8 లక్షలతో ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించే విధంగా చూడాలని ఐటీడీఏ పీఓ అమయ్కుమార్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్ కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో మునిగ, నిమ్మకాయ, కరివేపాకు, బచ్చల కూర, పాలకూర, గోంగూర నాటే విధంగా హార్టికల్చర్ అధికారులు ఉచితంగా విత్తనాలను అందించాలన్నారు. ఐఏపీ నిధులు వస్తే ఏజెన్సీలో అభివృద్ధి ఏజెన్సీలోని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వచ్చే ఐఏపీ నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. 59 భవనాల్లో 20 పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. మండల సమాఖ్య భవనాలు 13లో ఎనిమిది నిర్మించామని, మిగతా ఐదింటికి స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సమీక్షలో ఆర్డీఓ మహేందర్జీ, ఏపీఓ వసందరావు, డీఈఈ మల్లయ్య, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఎంఐ ఈఈ రాంప్రసాద్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, పీహెచ్ఓ సంజీవరావు, ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ నరేందర్, పాల్గొన్నారు. బాధితుల వేడుకోలు... మండలంలోని మారుమూల గ్రామాలకు బస్సులు రావడం లేదని, ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాంబాయి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేడారం పూజారి ఆనందరావు చనిపోయిన తీరు అనుమానంగా ఉందని భార్య ఉషారాణి కలెక్టర్కు విన్నవించారు. బయ్యక్కపేటకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని స్థానిక విలేకరులు కలెక్టర్కు వినతి అందజేశారు. కార్యక్రమంలో నూక ప్రభాకర్, అలువాల శ్రీను, వెంకన్న, అఫ్జల్, గంపల శివ, కృష్ణ, లాలయ్య, భిక్షపతి, శ్రీను, గంగాధర్, సత్యం, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
గుట్కా బస్తాల స్వాధీనం
వీరఘట్టం: మండల కేంద్రంలో ఎస్సై బి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు రూ. లక్ష విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారులపై నిఘా వేసిన పోలీసులు సోమవారం తనిఖీలు చేశారు. వ్యాపారస్తుడు పి.సురేష్ ఈ గుట్కా బస్తాలతో పట్టుపడడంతో స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిషేధిత గుట్కాలు ఎవరు అమ్మినా చర్యలు తప్పవని ఎస్సై వ్యాపారస్తులను హెచ్చరించారు. -
రూ.70 వేలు విలువైన గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
సోంపేట: సోంపేటలోని జలంత్ర జాలరివీధిలో పట్టణానికి చెందిన ఎన్.శ్రీనివాసరావు అక్రమంగా నిల్వ చేసి ఉంచిన రూ.70 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను ఎస్ఐ భాస్కరరావు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా ఈ మేరకు గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయని ఎస్ఐ తెలిపారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
‘స్వీట్’గా గుట్కా వ్యాపారం
నిజామాబాద్ క్రైం : గుట్కా అక్రమ వ్యాపారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండడంతో స్వీట్ సుఫారీల మాటున దందా సాగిస్తున్నారు. ఇలా గుట్కాపై నిషేధం అపహాస్యపం పాలవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పొగాకు సంబంధిత ఉత్పత్తి అయిన గుట్కా నమలడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. పొగాకు ఉత్పత్తులతో తయారైన గుట్కాలను అమ్మడం చట్టరీత్యా నేరం. పొగాకు కలపకుండా కేవలం వక్క పలుకులు, సుగంధ పరిమళం ఉండే పాన్ మసాలా, స్వీట్ సుపారీ, వక్క పొట్లాల అమ్మకంపై ఎటువంటి నిషేధం లేదు. దీనిని గుట్కా దందా చేస్తున్నవారు తమ వ్యాపారానికి అండగా చేసుకున్నారు. నిషేధం లేని పాన్ మసాలా, స్వీట్ సుపారీలను అడ్డం పెట్టుకుని గుట్కాను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. పాన్ మసాలా, స్వీట్ సుపారీలను బహిరంగంగా విక్రయిస్తూ వీటికి అనుబంధంగా పొగాకు పొడిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. గుట్కాలు కావాల్సిన వారు పాన్ మసాలా, పొగాకు పొడిని మార్కెట్లో ఒకే షాపులో వేర్వేరు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండింటీనీ కలిపితే గుట్కా తయారవుతుంది. ప్రత్య„ý ంగా పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలనూ బహిరగంగానే విక్రయిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి.. గుట్కాపై నిషేధం ఉండడంతో రాష్ట్రంలో వాటి తయారీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గుట్కాలను దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల్లోని కర్ణాటక ప్రాంతంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పినట్లు తెలుస్తోంది. అక్కడ తయారు చేసిన గుట్కాను మద్నూర్ మీదుగా జిల్లాలోకి రవాణా చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి బోధన్ మీదుగా జిల్లాలోకి చేరవేస్తున్నారు. వీటిని నిషేధం లేని వస్తువుల మధ్యలో ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టు కంపెనీల ద్వారా రహస్య స్థావరాలకు తీసుకువస్తున్నారు. అనువైన సమయం చూసి జిల్లాలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గుట్కా వ్యాపారం జిల్లా అంతటా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయం తెలిసినా పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యాపారాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. -
గుట్కా స్వాధీనం
సీతమ్మధార: దువ్వాడ పోలీస్సేష్టన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు రూ.2లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు ను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ పోలీస్స్టేషన్ పరిధిఆలోని యాదవ జగ్గారావు పేట వద్ద ఇద్దరు వ్యక్తులు గుట్కాప్యాకెట్లు ఆటోలో తరలిస్తున్నరని స్థానికుల సమాచారంతో ఆదివారం టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆటోతో పాటు సుమారు రెండులక్షల రూపాయలు విలువ గల గుట్కాప్యాకెట్లు స్వాధీనపరుచుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు గణేష్, సతీష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
గుట్కా ప్యాకెట్ల లారీ పట్టివేత
కామేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి సమీపంలో గుట్కా ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఖమ్మం నుంచి ఇల్లందు వైపు వెళ్తున్న లారీలో సోదాలు జరిపగా గుట్కా ప్యాకెట్ల గుట్టురట్టయింది. మొత్తం సరుకు విలువ, రవాణాదారుల వివరాలు తెలియాల్సి ఉంది. -
సరుకుల రవాణాకు రాచబాట!
– తిలారు రైల్వేస్టేషన్ కేంద్రంగా పేట్రేగిపోతున్న వ్యాపారులు – విచ్చలవిడిగా గుట్కాలు, బట్టలు దిగుమతి – భారీ మొత్తంలో పన్ను ఎగవేత –వాణిజ్య శాఖాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తిలారు రైల్వే స్టేషన్ కేంద్రంగా సరుకుల రవాణా దర్జాగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. మూటల ముసుగులో గుట్కాలు, ఖైనీలు, బట్టలు, కంచు, ఇత్తడి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. ప్రభుత్వ ఖజనాకు రూపాయి కూడా చెల్లించకుండా వ్యాపారులు ఈ స్టేషన్ నుంచి దర్జాగా సరుకులను దిగిమతి చేసుకొని దొంగమార్గాన కావాల్సిన చోటుకు చేర్చుకుంటున్నారు. అక్రమంగా సరుకుల రవాణా ఎంతలా జరుగుతోందో బుధవారం రాత్రి పోలీసులకు పట్టుబడిన ఖైనీలు, గుట్కాలు, నరసన్నపేటలోఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారీగా.. వేళాపాళా లేకుండా చీకటి వ్యవహారం జరుగుతున్నా వాణిజ్య పన్నులశాఖాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జలుమూరు: జిల్లా కేంద్రం శ్రీకాకుళం తరువాత భారీగా వ్యాపారం జరిగేది నరసన్నపేట ప్రాంతంలోనే. బంగారం నుంచి స్టీల్, సిమెంట్, గ్రానైట్, బట్టలు, నిషేధిత గుట్కాల వ్యాపారం ఇక్కడ కోట్లాది రూపాయల్లో జరుగుతోంది. ఇక్కడకు సరుకులు చేరేందుకు తిలారు రైల్వేస్టేషన్ అతి సమీపంలో ఉండడంతో వ్యాపారులకు కలిసి వస్తోంది. ఎలాంటి పన్నులను చెల్లించకుండానే సరుకులను దర్జాగా ఇక్కడకు చేర్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా దిగుమతులు వ్యాపారులు దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి అనేక వస్తువులను రైళ్ల ద్వారా తీసుకొని వస్తుంటారు. విలువ ఆధారిత,(వ్యాట్) ఎక్సైజ్ సుంకం, కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్డీటీ) తదితర పన్నులు, సుంకాలు చెల్లించాల్సి ఉండగా.. వ్యాపారులు వీటిని దర్జాగా ఎగ్గొట్టేస్తున్నారు. ఎక్కువగా ఒడిశా వైపు నుంచి వచ్చే రైళ్ల ద్వారా తిలారు స్టేషన్కు సరుకులను వ్యాపారులు దిగిమతి చేసుకుంటుంటారు. ఈ స్టేషన్ వద్ద ఎలాంటి తనిఖీలు అధికారులు చేపట్టకపోవడం వ్యాపారులకు కలిసి వస్తోంది. సరుకుల తరలింపు ఇలా సరుకుల రవాణా వెనుక భారీ నెట్ వర్క్ నడుస్తోంది. తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కోల్కత్తా, ఒడిశాలో ఉన్న దళారుల నుంచి తిలారు స్టేషన్ వరకు సరుకులు చేరేలా కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. తిలారుకు చేరిన కంచు, ఇత్తడి, గుట్కాలు, బట్టలు, ఇతర విలువై సరుకులను వేర్వేరు ప్రాంతాల్లోని స్టాక్ పాయింట్లకు ముందుగా వ్యాపారులు చేర్చుతారు. బుడితి, సారవకోట వెళ్లాలంటే జోనంకి, కృష్ణాపురం మీదుగా అడ్డదారిలో సరుకులను చేర వేస్తారు. నరసన్నపేటకు తరలించేందుకు తిలారు స్టేషన్ వెనుక భాగంలో.. ఎఫ్సీ గొడౌన్ నుంచి రావిపాడు, ఏనేటి కొత్తూరు మీదుగా తరలిస్తారు. టెక్కలి, కోటబొమ్మాళి తీసుకెళ్లేందుకు రావిపాడు, తుంబయ్యపేట, రామినాయడుపేట గ్రామాలు మీదుగా కొందరు, నిమ్మాడ మీదుగా మరికొంత మంది సరుకులను అధికారుల కంట పడకుండా ఆటోల్లో తరలించుకుపోతున్నారు. సరుకులను తరలించే ముందు కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఎవరూ లేరని నిర్థారించుకుంటారు. ఈ విషయాన్ని సెల్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేసి సరుకులను గమ్యస్థానానికి చేర్చుతారు. పట్టించుకోని రైల్వే సిబ్బంది రైళ్ల నుంచి సరుకులు దిగితున్నా స్టేషభ్ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. సరుకులకు ఉన్న రశీదులు మాత్రమే చూస్తామని, అందులో ఏం ఉన్నాయో చూసే బాధ్యత తమది కాదని సంబంధిత సిబ్బంది చెప్పి తప్పించుకుంటున్నారు. డీసీటీవో ఏమన్నారంటే.. అక్రమంగా సరుకులు దిగిమతి చేసుకుంటున్న విషయాన్ని నరసన్నపేట డిప్యూటీ సీటీవో యూ.కేశవరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ఎప్పకప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా పట్టుబడితే కేసులు నమోదు చేయడంతోపాటు, అపరాధ రుసుం విధిస్తున్నామన్నారు. -
గుట్కా విక్రయాలపై దాడులు
రూ.5 లక్షల నిషేధిత గుట్కాలు, ఖైనీలు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నగరంలో నిషేధిత ఖైనీ, గుట్కాలను విక్రయిస్తున్న దుకాణాలు, నిల్వ కేంద్రాలపై నగర పోలీసులు గురువారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో నిషేధిత ఖైనీలు, గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు అటువైపుగా దృష్టిసారించ లేదు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ విశాల్గున్నీ నగరంలో గుట్కా విక్రయాలపై దాడులు చేసి విక్రయదారులు, సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీ వెంకటరాముడును ఆదేశించారు. దీంతో నగర డీఎస్పీ నేతృత్వంలో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో నగర పోలీసులు ఆయా స్టేషన్ల పరిధిలో గుట్కాలు విక్రయిస్తోన్న దుకాణాలు, నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.5లక్షల విలువ చేసే నిషేధిత ఖైనీలు, గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. 35 మంది విక్రయదారులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసుల దాడుల విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారులు దుకాణాలకు తాళంవేసి పరుగులు తీశారు. మరికొందరు దుకాణాల్లో ఉంచిన గుట్కా, ఖైనీలను హుటాహుటిన రహస్య ప్రాంతాలకు తరలించారు. కాగా పోలీసుల దాడుల ముందస్తు సమాచారం అందుకున్న గుట్కా విక్రయ డాన్లు అప్రమత్తమయ్యారు. దీంతో చిన్నచిన్న వ్యాపారులు మాత్రమే పోలీసులకు చిక్కారు. పోలీసుల అదుపులో ఉన్న చిన్నవ్యాపారులు అసలు వ్యక్తులను వదిలివేసి తమను అరెస్ట్చేయడం ఎంతవరకు సబబని వాపోతున్నారు. ఈ దాడుల్లో నాల్గో, ఐదో నగర ఇన్స్పెక్టర్లు సీహెచ్ సీతారామయ్య, జీ మంగారావు, ఎస్సైలు గిరిబాబు, వీ శ్రీహరి, రామకృష్ణ, సుధాకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
లక్సెట్టిపేట : అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్హెచ్వో భూమేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని బీట్ బజార్లో ద్విచక్రవాహనంపై గుట్కాలు అమ్ముతుండగా వాహనాన్ని, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కాల విలువ సుమారు రూ.10 వేలు ఉంటుంది. కేసు నమోదు చేశారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ పాల్గొన్నారు. -
'గుట్కా'య.. స్వాహా
* నిషేధిత పొగాకు ఉత్పత్తులు యథేచ్ఛగా విక్రయం * పాన్పరాగ్, ఖైనీ, డీలక్స్ ప్యాకెట్లు రెట్టింపు ధరలకు విక్రయం * నిత్యం రూ.కోట్లలో వ్యాపారం మామూళ్ల మత్తులో అధికారులు రాజాం: జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఏ పాన్ షాపులో చూసినా గుట్కాల తోరణాలే దర్శనమిస్తున్నాయి. ఒడిశా నుంచి నిత్యం కోట్లాది రూపాయల సరుకు జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పొందూరు, రాజాం వంటి పట్టణాలకు చెందిన హోల్సేల్ వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రామీణ రిటైల్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక్క రాజాం పట్టణంలోనే హోల్సేల్ వ్యాపారులు 20 మంది వరకు ఉన్నారు. వీరంతా సుమారు 500 మంది రిటైల్ వ్యాపారులకు సరుకును తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క రాజాం పట్టణంలోనే రోజుకి సుమారు రూ.10 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో ఇంకెంత వ్యాపారం జరుగుతుందో ఇట్టే అర్ధమవుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో నష్టాలు పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, పాన్మసాలా, గుట్కా, పాన్పరాగ్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పళ్లు పుచ్చిపోవడం, రంగు మారిపోవడం వంటి వ్యాధులు సోకుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీటి విక్రయాలను నిషేధించింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మార్కెట్లో దొరికిన సరుకే విక్రయిస్తున్నాం ఇంట్లో అమ్మ, భార్య ఖాళీగా ఉన్నారని పట్టణంలో రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నాం. మార్కెట్లో దొరికిన సరుకే విక్రయిస్తున్నాం. ఇందులో లాభనష్టాలు ఏమిటో మాకు తెలియదు. అధికారులు వద్దంటే మానేస్తాం. కేవీ పార్వతీశం, డోలపేట, రాజాం నగర పంచాయతీ వ్యసనంగా మారింది ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచక పాన్పరాగ్ తినేవాడిని. అది ఇప్పుడు వ్యసనంగా మారింది. రోజుకి 4 నుంచి 5 ప్యాకెట్లు తింటా. ఇవి తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో నాకు తెలియదు. - ఇనుమల సత్యనారాయణ, పొనుగుటివలస, రాజాం నగర పంచాయతీ అలవాటు మార్చుకుంటాం మార్కెట్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేస్తే అలవాటు మార్చుకుంటాం. మార్కెట్లో లభించినంత వరకు వాటిపైనే దృష్టి మరలుతోంది. - కెంబూరు వెంకటరమణ, రాజాం ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారుల తూట్లు ప్రజారోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక అధికారులకు అప్పగిస్తూ జీఓ నంబర్ను 6 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. అప్పుడప్పుడు రాజాం, పొందూరు, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాల్లో దాడులు జరిపి, వ్యాపారులపై పెట్టీ కేసులు నమోదు చేసి, విడిచిపెడుతున్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల ఒడిశా నుంచి లారీల్లో తరలిస్తున్న పాన్పరాగ్, ఖైనీ, డీలక్స్ వంటి సరుకును ఇచ్ఛాపురంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఈ సరుకు మద్రాస్ రవాణా చేస్తున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లను సైతం అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. రెట్టింపు ధరలకు విక్రయం ఇటీవల అధికారులు వరుస దాడులు చేయడంతో ఒడిశా ప్రాంతం నుంచి సరుకు దిగుమతి తగ్గిపోయింది. కొంతమంది చాటుమాటుగా సరుకుతెచ్చి విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ప్రజల వ్యసనాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. -
గుట్టుగా గుట్కా.. జోరుగా వ్యాపారం
- అపహాస్యం పాలవుతున్న నిషేధం - వరంగల్ కేంద్రంగా జిల్లావ్యాప్తంగా సరఫరా - పట్టించుకోని పోలీసు, ఎక్సైజ్ శాఖలు ‘పైన పటారం లోన లోటారం’ అన్నట్లుగా ఉంది జిల్లాలో గుట్కాలపై నిషేధం అమలు. గుట్కా అమ్మకాలపై నజర్ ఉందని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలోని ప్రతి గల్లీలో, చిన్న చిన్న షాపుల్లో కూడా గుట్కాలు విరివిగా లభిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచే అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నా అడ్డుకునే నాథుడే లేడు. సాక్షి, హన్మకొండ : పొగాకు సంబంధిత ఉత్పత్తి అయిన గుట్కాలు నమలడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. పొగాకు ఉత్పత్తులతో తయారైన గుట్కాలను అమ్మడం చట్టరీత్యా నేరం. పొగాకు కలపకుండా కేవలం వక్క పలుకులు, సుగంధ పరిమళం ఉండే పాన్ మసాలా, స్వీట్ సుపారీ, వక్క పొట్లాల అమ్మకంపై ఎటువంటి నిషేధం లేదు. దీంతో గుట్కా తయారీ కంపెనీలు, వ్యాపారులు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. నిషేధం లేని పాన్ మసాలా, స్వీట్ సుపారీలను బహిరంగగా, వీటికి అనుబంధంగా పొగాకు పొడిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. ఈ పొగాకు ఉత్పత్తిపై నిషేధం ఉండటంతో దీన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారు. గుట్కాలు కావాల్సిన వారు పాన్ మసాలా, పొగాకు పొడిని మార్కెట్లో ఒకే వ్యక్తి దగ్గర వేర్వేరు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఈ రెండింటినీ కలిపితే గుట్కాగా మారుతుంది. నిషేధం విధించిన తొలిరోజుల్లో గుట్కా వ్యాపారులు అమలు చేసిన ఈ వ్యూహం ఫలించడంతో ప్రభుత్వ నిర్ణయూన్ని అపహాస్యం పాలు చేశారు. ప్రత్యక్ష పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలను బహిరంగగానే అమ్ముతున్నారు. వరంగల్ నుంచే జిల్లా మొత్తానికి.. గుట్కాపై నిషేధం ఉండటంతో రాష్ట్రంలో వాటి తయారీ నిలిచిపోయింది. దీంతో కర్నాటక, మహారాష్ట్రల నుంచి గుట్కాలు వరంగల్కు వస్తున్నాయి. నిషేధం లేని సాధారణ వస్తువుల మధ్య పైకి కనిపించకుండా ప్యాక్ చేసి కొరియర్, ట్రాన్స్పోర్టు కంపెనీల ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు. నగరానికి చేరిన గుట్కాలను పిన్నావారి వీధి, పాత బీటుబజారు, కొత్తవాడ, కాశిబుగ్గ, శివనగర్, లక్ష్మీపురం, హన్మకొండ తదితర ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అనువైన సమయం చూసి పాన్ మసాలా, సిగరేట్ ప్యాకెట్లు పంపిణీ చేసే వ్యక్తుల ద్వారా గుట్కాలను జిల్లా నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా బడ్డీ కొట్టు, పాన్షాప్, కిరాణా షాపులలో గుట్కాల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పట్టించుకోని అధికారులు.. నిషేధం విధించిన పొగాకు ఉత్పత్తులను యథేచ్ఛగా విక్రరుుస్తున్నా పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అరకొరగా దాడులు నిర్వహించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఆకస్మిక తనిఖీలు చేస్తే ప్రతీ గల్లీలో గుట్కాలు బయటపడతాయి. కానీ ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని, గుట్కా వ్యాపారుల నుంచి వారికి మామూళ్లు అందుతున్నాయని పలువరు ఆరోపిస్తున్నారు. అందుకే గుట్కా అక్రమ వ్యాపారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గుట్టుగా గుట్కా దందా?
‘పెదబాబు’ కనుసన్నల్లోనే అంతా? అధికార యంత్రాంగం తీరుపై అనుమానాలు ఇచ్ఛాపురం(కంచిలి): ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతంలో నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల గొడౌన్లను అద్దెకు తీసుకొని గుట్కాను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీలతో జిల్లావ్యాప్తంగా రవాణా చేసి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక్కడ తయారైన సరుకే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలస, నరసన్నపేట, పలాస పట్టణాల్లో స్వాధీనం చేసుకున్న సరుకుకు ఇక్కడి వ్యాపారానికి సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇచ్ఛాపురం సరిహద్దులో గొడౌన్లను అద్దెకు తీసుకొని ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం స్వాధీనం చేసుకున్న సరుకుకు సంబంధించి అస్సాం బెంగాల్ రోడ్ ట్రాన్స్పోర్టు గొడౌన్లో గుట్కా తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒడిషా భూభాగమైన సుమాడి జంక్షన్ సమీపంలో గొడౌన్లో సైతం *70లక్షల విలువైన గుట్కా, ముడిసరుకు నిల్వలను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ రెండు స్థావరాలు ‘పెదబాబు’కు చెందినవిగా చర్చ సాగుతోంది. ఈయన ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉంటూ వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఒడిషా పోలీసులు సరిహద్దు ప్రాంతంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీపై దాడిచేసి సరకు, తయారీ యంత్రాలను సీజ్చేశారు. అప్పట్లో ఒడిషా పోలీసులు స్థానిక పోలీసుల సాయంతోనే ఆ దాడులు చేశారు. తాజాగా జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డికి ఆదేశాల మేరకు స్థానిక పోలీసు యంత్రాంగం దాడి చేయడం గమనార్హం. -
గుట్కా స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి
హైదరాబాద్ : రాజేంద్రనగర్ మండలం కిస్మత్పూర్లోని ఓ గుట్కా స్థావరంపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్కా, పాన్ మసాలాపై ఢిల్లీ సర్కార్ బ్యాన్
న్యూఢిల్లీ : ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే గుట్కా, పాన్ మసాలా, పొగాకు సంబంధిత పదార్థాల ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుట్కా, పాన్ మసాలాలతో పాటు ఖైనీ, జర్దా పాన్లపై కూడా నిషేధం కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాగా ఫుడ్సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం గుట్కాలు, పాన మసాలాలతోపాటు చాప్టొబాకో, ఖైనీ, ఖరా, టొబాకో ఫ్లేవర్డ్ మసాలాల తయారీ, అమ్మకాలు, నిల్వ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. -
అక్రమాలకు ‘తూర్పు’ అడ్డా
► కలప అక్రమ రవాణా.. నకిలీ నోట్ల చలామణి ఇక్కడి నుంచే ► సరిహద్దులు దాటుతున్న గుడుంబా గుట్కాల స్మగ్లింగ్కు కేంద్రం ► కోట్లు సంపాదిస్తున్న స్మగ్లర్లు కొరవడిన నిఘా ఒకప్పుడు నక్సలిజానికి.. తర్వాత మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న జిల్లా తూర్పు పల్లెలు ఇప్పుడు అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్నారుు. మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలవుతున్నారుు. టేకు కలప, గోదావరి ఇసుక అక్రమ రవాణా మొదలుకుని గంజాయి సాగు, గుట్కా అమ్మకాలు, దొంగ నోట్ల చలామణి, గుడుంబా తయారీ, పేకాట, కోడి పందేలకు స్థావరాలుగా మారారుు. పల్లెల్లో పాగావేసిన స్మగ్లర్లు కోట్లు సంపాదిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నిద్రపోతున్నారు. - కాళేశ్వరం ఆగని గంజాయి సాగు..? మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గంజాయిని రైతులు యథేచ్ఛగా సాగుచేస్తున్నారు. రెండు నెలల క్రితం సూరారం గ్రామంలో కొంత మంది రైతులు పత్తి, మిర్చి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేశారు. గుర్తించిన పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. అరుునా మండలంలోని చాలా గ్రామాల్లో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారు. స్థానిక యువత కూడా క్రమంగా గంజాయికి బానిసవుతోంది. జిల్లాలు దాటుతున్న టేకు కలప...! మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని టేకు కలపను మహదేవపూర్ మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో డంప్ చేసుకుని స్మగ్లర్లు జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర పట్టణాలకు కలప ఇక్కడినుంచే తరలిపోతోంది. మహదేవపూర్ ప్రాంతం ఒకప్పుడు దండకారణ్యం ఉండేది. ప్రస్తుతం ఇక్కడి అటవీప్రాంతంలో టేకు కలప దొరికే పరిస్థితి లేదు. దీంతో స్మగ్లర్లు మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా కలపను గోదావరి మీదుగా దిగుమతి చేస్తున్నారు. స్మగర్ల మాట వినని ఫారెస్టు అధికారులపై దాడులు కూడా జరుగుతున్నాయి. కొందరు అటవీశాఖ అధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా వన్యప్రాణి మాసం అమ్మకాలు.. మహదేవాపూర్ మండలంలో వన్యప్రాణుల మాంసం విక్రయూలు విచ్చలవిడిగా జరుగుతున్నారుు. అటవీ జంతువులను వేటగాళ్లు చంపి వాటి మాంసాన్ని జిల్లాలు దాటిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అమాయకులపై దాడులు చేస్తున్నారు. వేటగాళ్ల జోలికి మాత్రం వెళ్లడంలేదు. అందుబాటులో నిషేధిత గుట్కా తూర్పున గుట్కా వ్యాపారం వర్ధిల్లుతోంది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నుంచి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర గడ్చిరోలి మీదుగా నిషేదిత గుట్కా, తంబాకు వ్యాపారం జోరుగ సాగుతోంది. ఇక్కడి నుంచి కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మంథని గ్రామాలకు అక్రమ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు వ్యాపారులు. యథేచ్ఛగా నకిలీ నోట్ల చలామణి మహదేవపూర్,కాటారం తదితర ప్రాంతాల్లో నకిలీనోట్ల చలామణి యథేచ్ఛగా సాగుతోంది. బ్యాంకులు, కిరాణ దుకాణాలు, హోటళ్లు, మద్యం దుకాణాల్లో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నారుు. కాళేశ్వరం బ్యాంకుకు ఓ ఖాతాదారుడు నకీలీ నోట్లు తీసుకురావడంతో బాంకు సిబ్బంది గుర్తించారు. మరో మారు కాళేశ్వరం దేవస్థానంలో భక్తుడి ద్వార పూజా టికెట్లకు రాగా, బ్యాంకులో ఫేక్ నోట్గా గుర్తించి చించేశారు. మహారాష్ట్ర,తెలంగాణ కేంద్రంగా నకిలీనోట్ల ముఠా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో మండలానికి చెందిన ఓ వ్యక్తి మంచిర్యాలలో నకిలీనోట్ల కేసులో పట్టుబడ్డాడు. గుప్పుమంటున్న గుడుంబా పచ్చని పల్లెల్లో గుడుంబా చిచ్చుతో సంసారాలు చీలిపోతున్నాయి. మండలంలోని పలుగ్రామాల్లో ఇతర జిల్లాల నుంచి పటిక,బెల్లం అక్రమంగా దిగుమతి చేసుకుని ఇక్కడ గుడుంబా తయారు చేస్తున్నారు. కొంతమంది సారా వ్యాపారులు పల్లెల్లో గుడుంబా తయారి కేంద్రాలు ఏర్పాటు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెబుతుండడంతో ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదావరి ఇసుక అక్రమ రవాణా.. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ గోదావరి ఇసుకను స్మగ్లర్లు అక్రమంగా తరలించుకుపోతున్నారు. నిత్యం వందల ట్రాక్టర్ల ద్వార కాళేశ్వరం, పలుగుల, అన్నారం, కుదురుపల్లి, బీరసాగర్ నుంచి ఇసుక తరలిపోతోంది. వీరిపై స్థానిక రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబోయ్...దొంగలు..! మహదేవపూర్ మండలంలో దొంగలు వణుకు పుట్టిస్తున్నారు. ఏడాదిన్నరగా తాళం వేసిన ఇంటికి కన్నం వేసి దొరికింది దోచుకుపోతున్నారు. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మండలంలో సుమారుగా 15 దొంగతనాలు జరిగినా ఒక్క కేసును కూడా పోలీసులు ఛేదించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేసుకోలేదని తెలిసింది. -
గుట్టుగా గుట్కా దందా
► జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా విక్రయాలు ► రోజుకు లక్షల్లో వ్యాపారం ► నకిలీ సరుకు సరఫర ► క్యాన్సర్తో పాటు వివిధ రోగాలు తప్పవంటున్న వైద్యులు గుట్కాదందా జిల్లా కేంద్రంలో గుట్టుగా సాగుతోంది. గుట్కాను ప్రభుత్వం నిషేధించినా జిల్లా కేంద్రంలో మాత్రం విచ్ఛలవిడిగా విక్రయిస్తున్నారు. ఇవి నమిలితే క్యాన్సర్తోపాటు వివిధ రోగాల బారినపడటం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో గుట్కా విక్రయాలపై నిషేధం ఉన్నా ఎక్కడా ఆగడంలేదు. ఇప్పటి వరకు పట్టణంలో మూడు, నాలుగు సార్లు మాత్రమే అధికారులు దాడులు చేశారు. - మహబూబ్నగర్ క్రైం నకిలీవి మరింత ప్రమాదకరం గుట్కాలు అనారోగ్యం ఖాయమని తెలిసిం దే. కానీ వీటిలో కూడా నకిలీ సరుకు విచ్ఛలవిడిగా విక్రయిస్తున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. జిల్లా కేంద్రానికి హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి గుట్కా, తంబాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పాన్షాపులు, కిరాణషాపులు, టీకొట్టు వద్ద వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో గుట్కా రూ.3లకు విక్రయిస్తున్నారు. నిత్యం దాదాపు రూ.200వరకు బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. కొన్నిరకాల సాదా గుట్కా(పాన్ మసాలా)తో తంబాకు ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నారు. ఇవి రెండు కలిపితే అది గుట్కాగా మారుతోంది. హోల్సేల్ వ్యాపారులు కూడా తంబాకు, పాన్ మాసాల ఒకేసారి విక్రయిస్తున్నారు. వినియోగదారుల నుంచి ధరపై రెండు, మూడింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో గుట్కాలు తినే వారు రెండు రకాలుగా నష్టపోతున్నారు. మాములుగా ఒక వ్యక్తి రోజులో పది నుంచి 20గుట్కాల వరకు తింటున్నారు. ఉన్న ధర కంటే రెండుమూడింతలు ఎక్కువ ధరకు అమ్మకాలు చేయడం వల్ల ఈవ్యాపారం రోజూ లక్షల్లో సాగుతోంది. కనిపించని తనిఖీలు.. నిషేధిత గుట్కాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులతోపాటు పురపాలక, పంచాయతీ శాఖ, ఆహార తనిఖీ అధికారి, ఆర్టీఓ, కార్మికశాఖ, విజిలెన్స్ అధికారులు ఈ విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించవచ్చు. కానీ ఎక్కడా ఆశించిన స్థాయిలో దాడులు జరగడం లేదు. నామమాత్రంగా అప్పుడుప్పడు పోలీ సులు మాత్రమే ఈ గుట్కా విక్రయాలను పట్టుకుంటున్నారు. పలుచోట్ల దర్జాగా దుకాణాల్లో నిల్వ ఉంచి సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా వీరన్నపేట, వన్టౌన్, భగిరథకాలనీ, ఆకుల చౌరస్తా, క్లాక్టవర్, మార్కెట్ రోడ్, పాత బస్టాండ్, న్యూటౌన్లోని మున్సిపాల్ కాంప్లెక్స్, జిల్లాసుపత్రి ఎదురుగా ఉన్న హోటళ్లలో, పద్మావతికాలనీ, శ్రీనివాసకాలనీ, రాజేంద్రగనర్ ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో జోరుగా ఈ వ్యాపారం సాగుతుంది. జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం గుట్కాలు తినే వారిలో మొదట జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీంతోపాటు అల్సర్కు దారి తీస్తుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్ వస్తుంది. దానివల్ల ప్రాణహాని కూడా ఉంటుంది. దానితో పాటు కడుపులో ఉన్న పేగులకు చిన్నచిన్న పుండ్లు అవుతాయి. ముఖ్యంగా నోటిలో చిగుర్ల వాపు, దంతాలు చెడిపోవడం ఇతర రకాల సమస్యలు వస్తాయి. ఇలాంటి చెడు అలవాట్లకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండటం మంచిది. - డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ -
రూ. 4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్గేట్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహించారు. బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీరో కమాల్
►చక్కర, సబ్బులు, నూనెసహా నిత్యావసర వస్తువుల అక్రమ దందా ►రోజూ రూ.10 లక్షల పన్నుఎగవేస్తూ ఒకే బ్రాండ్ సబ్బుల దిగుమతి ►చక్కెర, నూనెలదిగుమతిలోనూ రోజుకు రూ.లక్షల్లో పన్ను ఎగవేత ►సర్కారు ఆదాయానికి ప్రతినెలా రూ.100 కోట్లకుపైగా గండి ►జోరుగా కల్తీనూనె వ్యాపారం.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ►కరీంనగర్ టవర్సర్కిల్, గంజ్ ప్రాంతాలు అడ్డాగా వ్యాపారం ►కార్పొరేషన్కు చెందిన ముఖ్య నేత అండతో చెలరేగుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ అక్రమాలకు అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి తయారైంది. ఒకవైపు కల్తీ, మరోవైపు జీరో దందాతో సరుకులు దిగుమతి అవుతున్నాయి. చక్కెర, సబ్బులు, సర్ఫ్ వంటి వస్తువులు పన్నులు చెల్లించకుండా లారీల కొద్దీ దిగుమతి అవుతుండగా... పామాయిల్, పల్లీ, సన్ఫ్లవర్ నూనెల పేరుతో తయారు చేసిన కల్తీ నూనెల వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతిరోజూ రూ.కోట్లలో పన్నును ఎగవేస్తూ కొందరు వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. జీరో దందా ఫలితంగా ప్రతినెలా పన్నుల రూపంలో సర్కారు ఖజానాకు చేరాల్సిన దాదాపు రూ.100 కోట్లు జీరో దందా కేటుగాళ్ల జేబుల్లోకి వెళుతోంది. మరోవైపు ఈ కేటుగాళ్లకు నగర పాలక సంస్థకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో చెలరేగుతున్నారు. ఒకే బ్రాండ్ సబ్బుతో సర్కారుకు రూ.కోటిన్నర గండి కరీంనగర్ జిల్లాలో బట్టల సబ్బుల్లో ఓ బ్రాండ్కు సంబంధించిన సబ్బుల విక్రయాలు విరివిగా అమ్ముడుపోతున్నారుు. తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఈ బ్రాండ్ సబ్బు తయారవుతోంది. జిల్లాలో ప్రతిరోజు ఎన్ని బట్టల సబ్బులు అమ్ముడుపోతాయో అందులో సగం వాటా ఈ బ్రాండ్దే. ప్రతిరోజూ ఈ సబ్బుల కాటన్లతో జిల్లాకు లారీలు వస్తుంటారుు. నెలకు సగటున 40కిపైగా లారీలు జిల్లాకు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి సుమారు రూ.5 లక్షల వరకు టాక్స్ చెల్లించాలి. ఆ మేరకు ట్యాక్స్ చెల్లించినప్పటికీ సదరు సబ్బుల డీలర్కు ఒక్కో లారీలోని కాటన్లను అమ్మడం ద్వారా రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. కానీ సదరు డీలర్ టాక్స్ చెల్లించకుండా తెలివిగా ఎత్తులు వేస్తున్నాడు. నెలలో 5 నుంచి 10 లారీలకు మాత్రమే టాక్స్ కట్టి మిగతా వాటిని అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఒక్కోలారీకి రూ.5 లక్షల టాక్స్ మిగలడమే కాకుండా మరో రూ.5 లక్షల లాభం చేకూరుతుందని తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, లక్షెట్టిపేటతోపాటు పలు ప్రాంతాలకు నగరం నుంచే ఈ సబ్బులను సరఫరా చేస్తున్నారు. టవర్సర్కిల్ అడ్డాగా నగరానికి చెందిన ఓ వ్యాపారి ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారి జీరో దందాకు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఈ వ్యాపారి జీరో దందా విషయం తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధి మద్దతు ఉండటంతో కిమ్మనలేకపోతున్నారు. దీనికితోడు సదరు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో తమకెందుకులే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. చక్కెర దందాతో రూ.కోటి గండి చక్కెర విషయంలోనూ ఇదే తంతు. ప్రతినెలా వందల కొద్దీ చక్కెర లారీలు జిల్లాకు వస్తుంటాయి. ఒక్క జిల్లా కేంద్రానికే ప్రతిరోజు సుమారు 5 లారీల చక్కెర దిగుమతి అవుతుంది. నిబంధనల ప్రకారం ఒక్కో లారీ లోడ్కు రూ.50 వేల మేరకు పన్ను చెల్లించాలి. ఆ పన్నులతో కలిపి అమ్మకాలు నిర్వహించాలి. కానీ టాక్స్లు చెల్లించకుండా రిటైల్ వ్యాపారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. తద్వారా ప్రతినెలా ప్రభుత్వ ఖజానాకు రూ.కోటికి పైగా గండికొడుతున్నారు. ప్రతినెలా మామూళ్లు వచ్చి చేరుతుండడంతోనే అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పుసహా పలు రకాల పప్పుల విషయంలోనూ ఇదే తంతు. నగరంలోని గంజ్ కేంద్రంగా కొందరు వ్యాపారులు రశీదులు, ట్యాక్స్లు లేకుండానే జీరో దందా కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పప్పు, చక్కెర వంటి వాటిని శివారు ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కల్తీ నూనె దందా... జిల్లాలో కల్తీ నూనె వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోరుుంది. నిబంధనల ప్రకారం లూజ్ నూనె అమ్మకాలు చేయరాదు. కాని నగరంలోని పలు వ్యాపార ప్రాంతాల్లో వందలాదిడ్రమ్ముల్లో నూనె అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పామాయిల్, పల్లీ, సన్ఫ్లవర్ పేరుతో శుద్ధి చేయకుండా కల్తీ నూనె విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటితోపాటు కొందరు అక్రమార్కులు కరీంనగర్ శివారు ప్రాంతాలు, సమీప గ్రామాల్లో డ్రమ్ముల కొద్దీ నూనెను నిల్వ చేస్తున్నారు. అక్కడే క్యాన్లు, టిన్లు, ప్యాకెట్లలో నూనెను నింపి కొత్త కొత్త పేర్లతో ప్యాకింగ్ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతి రోజు నకిలీ బ్రాండ్ల నూనె ప్యాకెట్లు, క్యాన్ల వ్యాపారం సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటున్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న నూనెల్లో ప్రమాదకరమైన రసాయాలను కలపడమే కాకుండా శుద్ధి చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గుట్కా రూటే సపరేటు ఒకప్పుడు జిల్లాలో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గుట్కా అక్రమార్కులకు కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల అండ పుష్కలంగా ఉంది. ఇందులో ఒకరు గుట్కా దందాలో కీలక భాగస్వామి కాగా... మరొక ముఖ్యనేత అందడండలున్నారుు. ఇటీవల కరీంనగర్ మండలంలో సుమారు రూ.2.5 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. రంగంలోకి దిగిన ముఖ్యనేత తన అధికారిన్ని అడ్డుపెట్టి గుట్కా బయటకు రాకుండా దొరికి చోటనే తాళలు వేయిం చారు. ఈ కే సులో ప్రమేయమున్న తన నమ్మకస్తున్ని చాకచక్యంగా తప్పించారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా!
* నెలకు రూ.3 కోట్లకు పైగా అమ్మకాలు * ‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు * సిద్దిపేటలో నిల్వ కేంద్రం * నేతలే పెట్టుబడిదారులు కరీంనగర్ క్రైం : జిల్లాలో గోదావరిఖని కేంద్రంగా గుట్కా దందా జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన పోలీసులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్లో గుట్కాదందాకు స్థానిక పోలీసులు బ్రేక్ వేసినా.. ‘ఖని’లో మాత్రం అక్కడి పోలీసులు గుట్కా వ్యాపారులకే వంతపాడుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ‘ఖని’కి .. గతంలో జిల్లాకేంద్రంలో గుట్కా దందా జోరుగా కొనసాగేది. వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచే రవాణా చేసేవారు. ఎస్పీ జోయల్డేవిస్ గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపడంతో కిందిస్థాయి సిబ్బందిలో చలనం వచ్చింది. జిల్లాకేంద్రంలోని వివిధ పోలీస్స్టేషన్ సీఐలు ఎప్పటికప్పుడు దాడులు చేసి పెద్దఎత్తున గుట్కాలను పట్టుకుని అమ్మకాలు, రవాణాకు బ్రేక్ వేశారు. దీంతో 95 శాతం అమ్మకాలు నిలిచిపోయాయి. ఇక్కడి గుట్కా వ్యాపారులు ఇతర వ్యాపకాలకు మళ్లారు. అదే సమయంలో గోదావరిఖనిలో గుట్కా అమ్మకాలు, వ్యాపా రం జోరుగా సాగుతుండడం చర్చనీయూంశమైంది. నెలకు రూ.కోట్లలో దందా గోదావరిఖని ప్రాంతంలో ప్రతినెలా గుట్కాల దందా రూ.మూడు నుంచి రూ.నాలుగు కోట్ల వరకు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడినుంచే పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర సరిహద్దు, ధర్మపురి వరకూ దందాను విస్తరించారని తెలిసింది. మహారాష్ట్ర, మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి గుట్కా లోడ్తో పదుల సంఖ్యలో లారీలు గోదావరిఖ నికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వ్యాపారులు సిద్దిపేటకు చెందిన కొందరు బడా నేతలతో సత్సంబంధాలు పెట్టుకుని ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలొస్తున్నారుు. కంపెనీల నుంచి తెప్పించి సిద్దిపేటలో నిల్వ చేసి అనంతరం ఖనికి తరలిస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ గుట్కా దందాపై గోదావరిఖని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫిర్యాదు చేసినా పట్టుకోవాల్సిన పోలీసులే.. వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ‘లక్షల్లో మామూళ్లు ఇస్తున్నాం.. ఫలానా నాయకుడి అనుచరులు ఈ దందాల్లో భాగస్వాములు..’ అంటూ కొందరు గుట్కా వ్యాపారులు బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి వ్యాపారం ఎలా ఎదుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలో ఆర్నెల్ల కాలంలో సుమారు రూ.కోటిన్నర విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదే గోదావరిఖనిలో ఒక్కకేసూ నమోదు కాలేదు. ఎల్ఎండీ పోలీసులు కూడా రెండు నెలల క్రితం గోదావరిఖనికి రవాణా అవుతున్న రూ.50 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా దందాను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. భారీగా గుట్కాల పట్టివేత * ఒకరిపై కేసు నమోదు కరీంనగర్ క్రైం : జిల్లాకేంద్రం శివారులో నిల్వ చేసిన గుట్కాప్యాకెట్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ కరీంనగర్ మండలంలోని రజిచమన్కాలనీలో ఓ రెండు గదులను అద్దెకు తీసుకుని వాటిలో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వచేశాడు. విశ్వసనీయ సమాచారంతో కరీంనగర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడి చేశారు. షట్టర్లు ఓపెన్ చేసి చూడగా.. గుట్కాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.రెండున్నర లక్షలకుపైగా ఉంటుందని గుర్తించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
రూ.1.50 లక్షల గుట్కా స్వాధీనం
మిర్యాలగూడ : అక్రమంగా నిల్వ ఉంచిన భారీ గుట్కా ప్యాకెట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కుండలబజారుకు చెందిన గోకరాజు రాజు అనే వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. పది బస్తాల్లో నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని, రాజును అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ బిక్షపతి తెలిపారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 60 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు. -
రూ.1.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను శనివారం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.40 లక్షల రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వన్టౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ నగేష్బాబు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు. సుధాకర్గుప్తా, సుగయ్యా అనే ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి దుకాణాల్లో ఉన్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. -
గుట్కా, పాన్ మసాలలపై నిషేధం పొడిగింపు
విజయవాడ: ప్రజల ఆరోగ్యానికి చేటుచేసే పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ మసాలలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయా ఉత్పత్తుల వినియోగం, తయారీలపై ఉన్న నిషేధం జనవరి 10 నాటికి ముగుస్తుండటంతో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు ఆహార భద్రతా,ప్రమాణాల చట్టం ప్రకారం ..పొగాకు ఉత్పత్తులు, నిల్వలు, పంపిణీ, సరఫరాలు వంటి వాటిపై ఉన్న నిషేధాన్ని 10 జనవరి 2016 నుంచి 9 జనవరి 2017వరకు సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు ఆహార పరిరక్షణా విభాగం కమిషనర్ కె.వి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రూ.4.20 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
కైకలూరు: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో రూ.4.20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కైకలూరు పట్టణం దానె గూడెం ప్రాంతంలో కాశీ విశ్వనాథం అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదేవిధంగా మండలంలోని ఆటపాకలో నాయుడు అనే వ్యక్తి ఇంటిపై సోదాలు జరిపి రూ.20 వేల విలువైన గుట్కాలను పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి వైటీ నాయుడు తెలిపారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో కిరాణా, పాన్ షాపులపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం సదరు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో పోలీసులు మంగళవారం పెద్ద మొత్తంలో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఖాదర్ కిరాణా దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష విలువ చేసే గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత
వైరా: ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో రూ.7 లక్షల విలువైన గుట్కాలను పోలీసులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నుపాటి ట్రాన్స్పోర్ట్లో వచ్చిన బ్యాగుల్లో గుట్కాలు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తల్లాడకు చెందిన బ్రహ్మం, వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన దారా మల్లికార్జున్ పేరిట ఈ పార్సిల్స్ రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
గుట్కా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం స్టేజీ వద్ద గుట్కాలోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. డీసీఎం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. -
రూ.లక్ష విలువైన గుట్కా స్వాధీనం
రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కొత్తపల్లి ప్రాంతంలో మహ్మద్పాషా అనే వ్యక్తి గుట్కా హోల్సేల్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన గుట్కాను బెంగళూరు నుంచి తెస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అర్బన్ సీఐ శ్యామారావు ఆధ్వర్యంలో పోలీసులు గోదాముపై దాడి చేసి రూ.లక్ష విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్పాషాను అదుపులోకి తీసుకున్నారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
సాలూరు: విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాలూరులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ట్రాన్స్పోర్టు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల గుట్కా, జర్దా, ఖైనీ ప్యాకెట్లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకన్న ప్యాకెట్ల విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.5 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో పాన్ దుకాణాలపై సోమవారం సాయంత్రం పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్లోని రెండు దుకాణాల్లో సోదాలు జరిపి రూ.5 లక్షల విలువైన గుట్కా, పాన్పరాగ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
రూ. 20వేల విలువైన గుట్కా పట్టివేత
ఇల్లందుకుంట: అక్రమంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచిన మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికంగా కిరాణ వ్యాపారం నిర్వహిస్తున్న అశోక్ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 20 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.