న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం లోక్ సభలో వివరణ ఇచ్చారు. అత్యాచార ఘటనలు సమాజానికి సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు. జీరో అవర్ లో రాజ్నాథ్ సింగ్ ఈ సంఘటనపై ప్రకటన చేశారు.
అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా గత శుక్రవారం ఢిల్లీలో ఓ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఢిల్లీ రేప్ ఘటనపై లోక్ సభలో హోంమంత్రి వివరణ
Published Mon, Dec 8 2014 12:24 PM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM
Advertisement
Advertisement