ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.8 శాతం పోలింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.8 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్య ఎన్నికల అధికారి చంద్ర భూషణ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం జరిగిన పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.