
ముంబై : పెద్ద శబ్ధంతో గురకపెడుతూ తమ నిద్ర లేకుండా చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు జాగారం చేయించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. గత గురువారం జబల్పూర్ వద్ద ఎల్టీటీ–దర్భంగ పవన్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది. నంబర్–3 ఏసీ కోచ్లో రామచంద్ర అనే ప్రయాణికుడు పెద్దగా గురకపెడుతూ నిద్రపోతున్నాడు. ఆ శబ్దంతో తోటి వారికి నిద్రాభంగమైంది. దీంతో వారంతా కలిసి ఆయనతో వాదులాటకు దిగారు. చివరికి రామచంద్ర మెలకువతో ఉండాలని అంగీకారానికి వచ్చారు. దీంతో తోటి వారంతా నిద్రపోతుండగా పాపం రామచంద్ర.. ఆరు గంటలపాటు కునికిపాట్లతో కూర్చోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment