పీవీని స్మరించుకున్న మోదీ | PM Narendra Modi Remembers Ex PM PV Narasimha Rao On His Birth Anniversary | Sakshi
Sakshi News home page

పీవీ నరసింహారావును స్మరించుకున్న మోదీ

Published Thu, Jun 28 2018 11:14 AM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

PM  Narendra Modi Remembers Ex PM PV Narasimha Rao On His Birth Anniversary - Sakshi

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ‘మన మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక రాజనీతిఙ్ఞుడు. విలువైన నాయకత్వంతో దేశాన్ని విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా చేశారు. లోతైన పరిఙ్ఞానం, విఙ్ఞత కలిగిన గొప్ప మేధావి ఆయన’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ కూడా...
‘భారత తొమ్మిదవ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. చాణక్యుడిగా పేరొందిన పీవీ తన మేధస్సుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించారు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. గతేడాది కాంగ్రెస్‌ పార్టీ పీవీ జయంతిని గుర్తుపెట్టుకోలేదు గానీ ఇప్పుడు ప్రధాని మోదీ ట్వీట్‌ చూసిన అనంతరం.. ఈవిధంగా తమ సొంత పార్టీకి చెందిన గొప్ప మేధావి, ప్రభావశీలిని స్మరించుకోవాలనే స్పృహ రావడం చూస్తుంటే అచ్చేదిన్‌ వచ్చినట్లుగానే కన్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement