గత విద్యాసంవత్సరం (2016–17) వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్సీసీ కోటాలో అర్హులైనప్పటికీ ప్రవేశం దక్కని ఐదుగురు
సాక్షి, న్యూఢిల్లీ: గత విద్యాసంవత్సరం (2016–17) వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్సీసీ కోటాలో అర్హులైనప్పటికీ ప్రవేశం దక్కని ఐదుగురు విద్యార్థులకు 2017– 18లో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము అర్హులమైనా ప్రవేశం కల్పించలేదని శ్రేష్టారెడ్డి సహా ఐదుగురు విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ దీపక్మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.
విద్యార్థుల తరఫు న్యాయవాది జీఎన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు గతేడాది ఎన్సీసీ కోటాలో ప్రవేశం పొందే అర్హత సాధించినప్పటికీ కల్పించలేదని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవిం చిందని, హైకోర్టులో ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నందున సుప్రీం ఉత్తర్వు ప్రతులతో అభ్యర్థన దాఖలు చేస్తామని జీఎన్ రెడ్డి తెలిపారు.