రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లీం విభాగతమైనముస్లిం రాష్ట్ర్రీయ మంచ్(ఎమ్ఆర్ఎమ్) దేశ రాజధానిలో ఇస్తున్న ఇఫ్తార్ విందుకు పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను ఆహ్వానించకూడదని నిర్ణయించింది.
పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత జవాన్లపై పాక్ ఉగ్రవాద సంస్థ దాడి నేపథ్యంలో ఖండించనందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్ఆర్ఎమ్ కన్వీనర్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఈ నెల 25న జమ్ముకశ్మీర్ లోని పంపొరాలో సీఆర్పీఫ్ పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా మరో22 మంది తీవ్రంగా గాయపడ్డారు.