క్యాంపస్‌లో కలకలం : వివేకానంద విగ్రహం ధ్వంసం | Swami Vivekananda Statue Vandalised At JNU | Sakshi
Sakshi News home page

వర్సిటీ క్యాంపస్‌లో వివేకానంద విగ్రహం ధ్వంసం

Published Thu, Nov 14 2019 4:28 PM | Last Updated on Thu, Nov 14 2019 4:28 PM

Swami Vivekananda Statue Vandalised At JNU - Sakshi

జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో కలకలం రేగింది.

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహాన్నిదుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మిన్‌ బ్లాక్‌లోకి బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి వర్సిటీ వీసీ మామిడాల జగదీష్‌ కుమార్‌పై అభ్యంతరకర మెసేజ్‌లు రాసిన మరుసటి రోజు వివేకానంద విగ్రహం ధ్వంసం చేయడం గమనార్హం. విద్యార్ధుల ఆందోళనతో పెంచిన ఫీజులను జేఎన్‌యూ అధికారులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. హాస్టల్‌ ఫీజు పెంపు, డ్రెస్‌ కోడ్‌ వంటి పలు సమస్యలపై జేఎన్‌యూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చి పెంచిన ఫీజులను ఉపసంహరించినట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement