బడ్జెట్‌ నిరుత్సాహపరిచింది | Uttam Kumar Reddy About Central Budget | Sakshi
Sakshi News home page

ఇది ప్రజావ్యతిరేక బడ్డెట్‌ : ఉత్తమ్‌

Published Fri, Jul 5 2019 2:43 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy About Central Budget - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నాయకులు పెదవి విరిచారు. బడ్జెట్‌ తమను నిరుత్సాహ పరిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తాము భావించడం లేదని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దగా కేటాయింపులు జరగలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ పెంపు సామాన్యులపై భారంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల ఆదాయం రెండింతలు చేస్తామనడం తప్ప అందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పలేదన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ అని సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement