
ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రజాభిమానాన్ని చూరగొని జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే అకాలమరణం పాలు కావడం మహారాష్ట్రకే కాక యావద్దేశానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. గోపీనాథ్ ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.